తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నేతను కోల్పోయింది. టిడిపి సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ కొద్దిసేపటి క్రిందట కన్నుమూశారు. అయన గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నరు. గత కొద్ది రోజులుగా ఆరోగ్యం విషమించటంటి ఆయనకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన, ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. 24 గంటల తరువాత కూడా ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదు. శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించి, ఈ రోజు తుది శ్వాస విదిచారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించింది అని తెలుసుకున్న, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చెన్నై వెళ్లి పరామర్శించారు.

sivaprasad 20092019 2

శివప్రసాద్ కొద్దిరోజులుగా మూత్ర పిండాల సమస్యతో బాధ పడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నైలో చికిత్స చేయించారు. సుమారు 10 రోజుల నుంచి ఆయనకు చెన్నై ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తాజాగా మరోసారి మూత్ర పిండాల్లో సమస్యలు రావటంతో, కుటుంబ సభ్యులు ఆయనను గురువారం ఉదయం మరోసారి చెన్నై ఆసుపత్రికే తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించిందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు శివప్రసాద్ కుటుంబీకులకు ఫోన్ చేశారు. అధైర్య పడొద్దని అన్నారు. శివప్రసాద్ ను పరామర్శించడానికి తాను వస్తానని భరోసా ఇచ్చారు. నిన్న చెన్నై వెళ్లి పరామర్శించారు.

sivaprasad 20092019 3

చంద్రబాబుకు శివప్రసాద్ అత్యంత ఆప్తుడు. ఇద్దరిదీ ఒకే జిల్లా. మంచి స్నేహితులు కూడా. చంద్రబాబు ప్రోత్సాహంతోనే శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో శివప్రసాద్ ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డెప్ప రెడ్డిపై పోటీ చేసిన శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. అయితే శివప్రసాద్ డాక్టర్‌ కూడా... పార్లమెంటు సభ్యుడు... అంతకన్నా మించి ఆయన కళాకారుడు... అదే, ఆయనను రాజకీయాల్లోకి నడిపించింది... ఎంపీని చేసింది... ఢిల్లీకి పంపింది... విభిన్నమైన నాయకుడిగా దేశంలో ఆయనకు ప్రత్యేకమైన పేరు తెచ్చింది... లీడర్‌గా ఆయన పార్టీ గీత దాటరు. ఆయనలోని యాక్టర్‌ మాత్రం ఏ ఆంక్షలకూ బద్ధుడై ఉండడు... ప్రజా సమస్యలను వినిపించడానికి ఆయన పార్లమెంటునే రంగస్థలంగా మార్చేసుకున్నారు. సమస్య తీవ్రతను బట్టీ, సందర్భానుసారం వేషాలతో పార్లమెంటుకు హాజరవుతూ వచ్చే వారు. పద్యం, పాట, హరికథ, బుర్రకథ, బుడబుక్కల గలగల మాటలు.. తెలుగు కళారూపాలను ఢిల్లీలో పట్టంగట్టి చూపిన విలక్షణ నాయకుడు, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్‌.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధిస్తూ.

రాష్ట్ర ప్రణాళికా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు అంటే తెలియని వారు ఉండరు. గతంలో బీజేపీ పార్టీ జీవీఎల్ లాంటి వాళ్ళు చెప్పే అబద్ధాలకు ధీటుగా బదులు ఇస్తూ, జీవీఎల్ లాంటి వారి వాదన తప్పు అంటూ అనేక సార్లు నిరూపించారు. అలాగే వైసీపీ చేస్తున్న ప్రాపగాండాను కూడా ధీటుగా ఎదుర్కునే వారు. విజయసాయి రెడ్డి లాంటి వారిని కూడా ధీటుగా ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటంతో, అందరి ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తూ వస్తున్నట్టే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కుటుంబరావుని కూడా టార్గెట్ చేసారు. ఆయన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో, ఆయన వైపు నుంచి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అనే విషయం పై ఆరా తీసి రంగంలోకి దిగారు. విజయవాడ మాచవరంపరిధిలో ఆయనకు చెందిన భూమి ప్రభుత్వ భూమి అని చెప్తూ, కుటుంబరావు కబ్జా చేసారు అని చెప్పి, అక్కడకు వచ్చి అధికారులు హంగామా చేసి, స్వాధీనం చేసుకున్నారు.

kutumbrao 20092019 2

దీని పై కుటుంబరావు న్యాయ పోరాటం చెయ్యటానికి సిద్ధం అయ్యారు. తమ పేరున ఉన్న 5.10 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని కుటుంబరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటీషన్ వేసారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి ఈ పిటీషన్ పై నిన్న విచారణ జరిపారు. అలాగే అనుబంధ పిటిషన్లో ఆదేశాలు ఇవ్వటం పై నిర్ణయాన్ని వాయిదా వేశారు. కుటుంబరావు తరుపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ కింద పిటిషనర్లను సర్‌ ప్లస్‌ ల్యాండ్‌ హోల్డర్స్‌ కింద పేర్కొంటూ నిబంధనలకు విరుద్ధంగా [ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్నారని కోర్ట్ కు తెలిపారు.

kutumbrao 20092019 3

అలాగే ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని, తమ వివరణ కూడా తీసుకోకుండా నేరుగా అధికారులు వచ్చి భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. మేము కట్టుకున్న ప్రహరీగోడను రాత్రికి రాత్రి కూల్చారని కోర్ట్ కు తెలిపారు. అయితే ఈ వాదన పై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలువినిపించారు. ఈ భూమి వ్యవహారం మొదటి నుంచి మోసపూరితంగా జరిగిందని, ఆ భూమిని తమ వసం చేసుకోవటానికి పిటిషనర్లు పలు ప్రయత్నాలు చేశారని వివరించారు. ఇరువురి వాదనలను విన్న న్యాయమూర్తి, ప్రతివాదులగా ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసి దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని చెప్పారు. అందుకు కుటుంబరావు తరుపున లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, ఈలోపు ఆ భూమి పై మూడో వ్యక్తికి హక్కులు కల్పించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు. మొత్తానికి జగన్ ప్రభుత్వ వేధింపుల పై ఇలా అందరూ కోర్ట్ కు వెళ్లి పోరాడాలని, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అంటున్నారు..

అన్ని రాష్ట్రాల్లో కాషాయం ఎగరు వెయ్యటానికి వ్యూహం పన్నిన బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తమ ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చెయ్యటానికి సరైన ఆయుధం కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ రీ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల సమీక్షలో జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం చుక్కలు చూపిస్తుంది. చివరకు స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని కూడా, డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపించటానికి ఒప్పుకోలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ మీద ఉన్న కేసులతో కాకుండా, రాజకీయంగా దెబ్బ కొట్టటానికి వ్యూహం పన్నింది బీజేపీ. అవకాసం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి, ఇప్పుడు కోడెల ఆత్మహత్య రూపంలో ఒక ఆయుధం దొరికింది. కోడెల ఆత్మహత్య చేసుకున్న రోజున, కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

governor 19092019 2

సహజంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పై విమర్శలు చెయ్యదు. కాని కిషన్ రెడ్డి మాత్రం, రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారుల వైఖరి పై విమర్శలు చేసారు. కోడెల మృతి పై, కేంద్రం సంస్థలతో దర్యాప్తు చేపిస్తాం అని చెప్పి, రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం అని చెప్పారు. అయితే ఈ రోజు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలవటం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ, రాజ్‌భవన్‌లో గవర్నర్ హరించందన్ బిశ్వభూషణ్‌ ను కలిసారు. చంద్రబాబు 13 పేజీల లేఖ ఇచ్చి, జరిగిన విషయాలు అన్నీ గవర్నర్ కు చెప్పారు. సాక్షి మీడియా, వైసీపీ నాయకులు, డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా, ఎలా ఇబ్బంది పెట్టింది వివరాలు, ఆధారలు ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి..కోడెల ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. కిషన్ రెడ్డి మాటాలు, గవర్నర్ మాటలు, చంద్రబాబు సిబిఐ ఎంక్వయిరీ డిమాండ్, ఇవన్నీ చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం పై గట్టిగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.

governor 19092019 3

ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఇరుక్కోవటం ఖాయంగా భావిస్తున్నారు. ఎందుకంటే కోడెల ఓడిపోగానే లెటర్ రాసారు. మే 23 న ఫలితాలు వస్తే, జూన్ 2 న అసెంబ్లీ అధికారులుకు లెటర్ రాసి, ఫర్నిచర్ తీసుకు వెళ్ళమన్నారు. తరువాత కూడా రెండు సార్లు లెటర్ రాసారు. అయినా ప్రభుత్వం స్పందించక పోగా, ఎదురు దొంగతం కేసు పెట్టింది. నిజానికి, ఒక వేళ కోడెల ఇవ్వకపోతే, అక్కడకు వెళ్లి తీసుకునే బాధ్యత ప్రభుత్వానిది, అంతే కాని ఇలా కేసు పెట్టటం పై అనుమానాలు వస్తున్నాయి. కేంద్ర సంస్థలతో ఎంక్వయిరీ వేస్తె, ఈ ప్రాసెస్ మొత్తంలో ఉన్న అధికారులు, ఎందుకు అలా చేసింది, ఎవరి ఒత్తిడితో అలా చేసింది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసును ఉపయోగించుకుని బీజేపీ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఇలా చెయ్యటం వల్ల, ఒక సామాజికవర్గానికి, మేము అండగా ఉన్నాం అనే సంకేతాలు పంపించి, వారిని తమ వైపు తిప్పుకునే ఆలోచనలో ఉంది. అలాగే, ఇప్పటికే శాంతి బధ్రతలు లేవు అంటూ, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న పోరాటానికి బలం వస్తుందని నమ్ముతున్నారు. చూద్దాం మరి కేంద్రం ఏమి చేస్తుందో ?

అసలు రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా, అని ప్రజలు అవాక్కయ్యే నిర్ణయం తీసుకున్నరు జగన మోహన్ రెడ్డి. అప్పట్లో నోట్లు రద్దు సమయంలో, శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కట్టలు కట్టలు కొత్త నోట్లు దొరికిన విషయం గుర్తుందా ? ప్రజలు ఒక్క రెండు వేల రూపాయల కాగితం దొరికితే చాలు అనుకున్న టైంలో, ఏకంగా 34 కోట్ల రూపాయలు, కొత్త 2 వేల కాగితాలు ఆయన ఇంట్లో దొరికి అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే తరువాత ఆ కేసు అంతా ఫైన్ అని కొట్టేసారు అనుకోండి. అయితే అప్పట్లో ఆ శేఖర్ రెడ్డిని, జయలలిత సియంగా ఉండగా, చంద్రబాబుతొ సిఫార్సు చేసి, టిటిడి మెంబెర్ ని చేసారు. అయితే ఈయన ఐటి రైడ్ లో దొరకటంతో, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ మొహన్ రెడ్డి అండ్ కో, ఈ శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని, ఆ డబ్బు అంతా లోకేష్ పంపించాడు అంటూ విష ప్రచారం చేసారు.

ttd 19092019 2

చంద్రబాబు, లోకేష్, శేఖర్ రెడ్డి పై, ఎన్ని కధనాలు అల్లారో అంతే లేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, చంద్రబాబు 100 కోట్లకి, అతనికి టిటిడి మెంబెర్ పోస్ట్ ఇచ్చారని చెప్పారు. అయితే, అప్పట్లో కొంత మంది ఇది నమ్మారు కూడా. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. శేఖర్ రెడ్డి రెండు నెలల క్రిందట జగన్ ను కలిసారు అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదే శేఖర్ రెడ్డిని, టిటిడి బోర్డు లో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమిస్తూ జీవో ఇచ్చింది. అయితే ఆ జీవో లో శేఖర్ రెడ్డి అని రాయకుండా, శేఖర్ ఏజె అంటూ పెట్టారు. కాని విషయం బయటకు పొక్కింది. దీంతో టీవీ ఛానెల్స్ తో పాటుగా, సోషల్ మీడియాలో కూడా, ఈ విషయం వైరల్ అయ్యింది. అప్పట్లో జగన్ చేసిన విష ప్రచారం ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

ttd 19092019 3

అప్పట్లో సాక్షిలో వచ్చిన కధనాలు, జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో రాసిన పోస్ట్ లు, శేఖర్ రెడ్డికి చంద్రబాబుకి లింక్ చేస్తూ పెట్టిన కధనాలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. అప్పుడు ఆరోపించినట్టు, చంద్రబాబు బినామీకి ఇప్పుడు జగన్ పదవి ఇచ్చారా అని పోస్ట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు అప్పట్లో విమర్శించినట్టు, ఎన్ని కోట్లు ఇచ్చి, ఇప్పుడు పదవి ఇచ్చారు అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. మొత్తానికి రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఈ న్యూస్ తో, సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి అప్పట్లో అన్ని ఆరోపణలు చేసి, ఇప్పుడు పదవి ఇచ్చి, ఇతను మా మనిషే అని చెప్పకనే చెప్తున్నారు. ఇది నేటి రాజకీయం. ప్రజలే విజ్ఞతతో ఉండాలి.

Advertisements

Latest Articles

Most Read