ప్రతి రెండు మూడు రోజులకు, ఏదో ఒక విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పడుతూనే ఉంది. తాజగా, గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష విషయంలో రచ్చ రచ్చ జరుగుతంది. 20 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే, అందులో అతి తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, అందులో ర్యాంకులు వచ్చిన వారిని చూస్తే, అసలు విషయం అర్ధమై పోతుంది. ఇదే విషయంతో ఆంధ్రజ్యోతి ఇచ్చిన కధనంతో, రాష్ట్రమంతా సంచలనం అయ్యింది. ఏపీపీఎస్సీ ఈ పరీక్షలు నిర్వహిస్తే, అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పని చేసిన వారికి టాప్ ర్యాంక్ రావటం, అందరినీ ఆశ్చర్యపరిచింది. వారికి ముందే పేపర్ వచ్చిందని, వారు వారి చుట్టాలకు ఈ పేపర్ ఇవ్వటంతో, వారు కూడా టాప్ లో నిలిచారు. ఈ విషయం ఇంత రచ్చ జరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించలేదు. ప్రతిష్టాత్మిక సంస్థగా ఉన్న ఏపీపీఎస్సీకి కూడా మచ్చ వచ్చింది.

vsreddy 22092019 2

ఒక పక్క ప్రభుత్వం ఇంత ఇబ్బంది పడుతుంటే, ఈ ఇబ్బందులు తగ్గించాల్సింది పోయి, మరింత ఆజ్యం పోశారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి లాంటి నేత, ఈ సందర్భంలో, ఇలా జగన్ ను ఇబ్బంది పెట్టె పని చెయ్యటంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిన్న వైజాగ్ లోని వైసీపీ పార్టీ ఆఫీస్ లో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ‘ గ్రామ వలంటీర్లుగా 90 శాతం మంది మన వైసీపీ కార్యకర్తలనే తీసుకున్నాం. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగాల్లో కూడా మన కార్యకర్తలు చాలా మంది సెలక్ట్‌ అయ్యారు’ అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ అవాక్కయ్యారు. ఒక పక్క ప్రభుత్వం అది తప్పు అని ఎదురు దాడి చేస్తుంటే, కాదు మేమే తీసుకున్నాం, అక్కడ అందరూ మా వాళ్ళే ఉన్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చెయ్యటం ఆశ్చర్యపరిచింది.

vsreddy 22092019 3

‘‘ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఇంచుమించుగా ఇప్పటికి 2.65 లక్షలు ఉద్యోగాలు, అంటే మూడు లక్షల మంది వాలంటీర్లని మనం నియమించి, ప్రభుత్వంలోకి తీసుకున్నాం. అయితే నేను కచ్చితంగా చెప్పగలను, నా దగ్గర ఫిగర్స్‌ ఉన్నాయి కాబట్టి, గ్రామ వాలంటీర్లు 90 శాతం వరకు మన కార్యకర్తలకే ఆ వలంటీర్‌ ఉద్యోగాలు వచ్చాయి. ఇవి రాని వారు అసంతృప్తి చెందొద్దు. ఎవరికైతే ఇప్పటి వరకూ న్యాయం జరగలేదో, వారికి కూడా మరింత కాలం ముందుంది. తప్పకుండా న్యాయం చేస్తారు జగన్మోహన్‌ రెడ్డిగారు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. గ్రామ సెక్రటేరియట్‌ జాబ్‌ల విషయానికి వస్తే మనకున్నటువంటి పొలిటికల్‌ కంపల్షన్స్‌ కాదు, లీగల్‌ కంపల్షన్స్‌ వల్ల ఎవరికైతే క్వాలిఫికేషన్స్‌ ఉండి, మంచి మార్కులు వచ్చాయో వారిని మాత్రమే సెలక్ట్‌ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. దానిలో కూడా మన కార్యకర్తలు చాలా మంది సెలక్ట్‌ అయ్యారు’’ అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రభుత్వం మారి మూడు నెలలు దాటింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తాను సియం పదవి కోసం ఎంతో కష్టపడ్డాను అని, ఇక భారత దేశం మొత్తం, మన వైపు చూసేలా చేస్తానని జగన్ చెప్తూ, 30 ఏళ్ళు నేనే సియంగా ఉంటానని చెప్పారు. ఆయన కాన్ఫిడెన్సు చూసి, ఈయన ఎంత బాగా పని చేస్తాడో, ఎంత అద్భుతంగా పరిపాలన ఉంటుందో అని అందరూ అనుకున్నారు. కాని రాష్ట్రంలో జరుగుతున్న రివర్స్ పనులు లాగే, ఈ సీన్ కూడా రివర్స్ అయ్యింది. జగన్ మార్క్ పాలన సంగతి తరువాత, ఉన్న పనులు కూడా ఆపేసారని, జనాలు గోల పెడుతున్నారు. ఎవరైనా కొత్తగా అధికారంలోకి వస్తే, ముందుగా అయినా మంచి పనులు చేస్తారని, అందులో యువకుడు లాంటి జగన్ నుంచి ఎంతో ఆశించామని, కాని ఇక్కడ ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రజల అభిప్రాయాన్ని పసిగట్టిన వైసీపీ నాయకులు, ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రాను రాను పరిస్థితి ఏంటో అని తలుచుకుని వణికిపోతున్నారు.

vs 22092019 2

ఇదే అభిప్రాయన్ని, పార్టీలోని నెంబర్ 2 అయిన విజయసాయి దగ్గర కుండ బద్దులు కొట్టేసారు. ఏకంగా విజయసాయి రెడ్డికే, ఇలా చెప్పారు అంటే, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. నిన్న విజయసాయి రెడ్డి వైజాగ్ లో పర్యటించారు. విశాఖ కల్లెక్టరేట్ లో వైసిపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులతో విజయసాయి రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో నేతలు తమ ఆవేదనను, విజయసాయి రెడ్డి దగ్గర వెళ్లగక్కారు. గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పటంతో, విజయసాయి రెడ్డి కూడా షాక్ అయ్యారు. అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని, ఇవి కనుక చక్కదిద్దక పొతే, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందని, స్థానిక ఎన్నికలు వస్తున్నాయని, గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు ఉన్నాయని, వెంటనే అన్నీ చక్కదిద్దాలని, నేతలు విజయసాయి రెడ్డికి తమ అభిప్రాయలు చెప్పారు.

vs 22092019 3

ఇసుక సరఫరా లేదు, ఇది ఒక పెద్ద తుఫాన్ లా మారే అవకాసం ఉంది, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగటం లేదు , అన్ని అంశాల్లో వెనకబడుతున్నాం. రహదారులు దెబ్బతింటే, అవి పునరుద్ధరించే పరిస్థితి లేదు. రెవిన్యూ కార్యాలయాల్లో పనులు కావడం లేదు. పోలీసు శాఖ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోంది. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లోనూ మందుల కొరత ఉంది. మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయి’ అని వారు ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తెచ్చారు. చంద్రబాబు హయంలో లారీ ఇసుక 20 వేలు ఉంటే, ఇప్పుడు 80 వేలు దాకా ఉందని, ప్రజలు తిడుతున్నారని చెప్పారు. అయితే ఇవన్నీ విన్న విజయసాయి రెడ్డి, తొందరలోనే మార్పులు చూస్తారని, అన్నీ సెట్ అయిపోతాయని చెప్పినట్టు తెలుస్తుంది.

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో, 50 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా 13 మృతదేహాల దాక ఇంకా వెతకాల్సి ఉంది. అయితే బోటు ఎక్కడో 300 అడుగుల దూరంలో ఉందని, అది బయటకు తియ్యటం కష్టం అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే బోటును గోదావరి నదిలో గుర్తించిన వెంకటశివ మాత్రం ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజే మేము బోటును గుర్తించామని, రన్నింగ్ పంటు ఒకటి , రోప్ ఇస్తే 2 గంటల్లో బోటు తీస్తానని ప్రభుత్వానికి చెప్పానన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనకు ముందుకు రాలేదని, మేము బోటుని గుర్తించాం, బయటకు తీస్తాం, రెండు గంటలు చాలు అని చెప్పినా, ప్రభుత్వం మాత్రం ముందుకు రాలేదని అన్నారు. అయితే, బోటు బయటకు తీయడం అధికారులకు, ప్రభుత్వానికి ఇష్టం లేదని అర్ధమవుతుందని అన్నారు.

boat 20092019 1

పర్యాటక అధికారులు, బోటు యజమానులు అక్కడ జరుగుతున్నవి కాకుండా, వేరేవి చెప్పి, తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బోటును గుర్తించడానికి, ఎక్కడో ఉత్తరాఖండ్‌ నుంచి నిపుణులు అవసరం మనకు లేదని కొట్టిపారేశారు. ఆ బృందం తీసుకొచ్చిన కెమెరాలు గోదావరి నదిలో సరిగా పనిచేయడం లేదని వెంకటశివ చెప్పారు. నదుల్లో చిక్కుకున్న బోట్లను బయటకు తీయడంలో వెంకటశివ ఎక్స్‌పర్ట్‌ అని, ఆయన్ను అధికారులు సంప్రదించటంతో ఆయన వచ్చి బోటుని బయటకు తీసే విషయం పై అంచనాకు వచ్చారని చెప్తున్నారు. అయితే వెంకటశివ ప్రతిపాదనను ప్రభుత్వం ఎందుకు తిరస్కరించింది ? వెంటక శివ ఆరోపణలు నిజామా కాదా అనేది, ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదు.

boat 20092019 1

మరో పక్క రెండు రోజుల నుంచి, బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి అవంతి శ్రీనివాస్‌ ని టార్గెట్ చేస్తూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదన్నారు. అలాగే బోటులో 73 మంది కాదని, 93 మంది ఉన్నారని, బోటు బయటకు తీస్తే, ఎక్కువ మంది మృతదేహాలు ఉంటాయనే, ప్రభుత్వం బోటుని బయటకు తియ్యటం లేదని అన్నారు. టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బోటు జాడ సోమవారమే తెలిసిందని హర్ష కుమార్ ఆరోపించారు. అయితే ఇప్పుడు హర్ష కుమార్ మాటలకు బలం చేకూరుస్తూ, వెంకట శివ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

 

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, ప్రధాని మోడీకి కంప్లైంట్ లు వెళ్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రిందట, విద్యుత్ ఒప్పందాల విషయంలో, జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్ల, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి అని, ఇలా అయితే, జపాన్ నుంచి ఎవరూ మీ దేశంలో పెట్టుబడులు పెట్టరు అంటూ జపాన్ ప్రభుత్వం నుంచి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే విద్యుత్ ఒప్పందాల విషయంలో, అనేక ప్రముఖ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసాయి. ఇప్పుడు తాజాగా "ది అసోసియేషన్ అఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ", జగన్ మోహన్ రెడ్డి పై, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. వైజాగ్ మెడ్ టెక్ జోన్ విషయంలో జరిగిన విషయం ప్రస్తావిస్తూ, ఇలా అయితే మీరు తీసుకున్న మేక్ ఇన్ ఇండియా స్పూర్తి దెబ్బ తింటుంది అని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాజీవ్ నాథ్ ఆధ్వర్యంలో మోడీని కలిసి ఫిర్యాదు చేసారు.

medtech 21092019 2

చంద్రబాబు హయంలో, విశాఖను మెడికల్‌ హబ్‌గా తీర్చి దిద్దాలి అనే లక్ష్యంతో, దేశంలోనే మొదటి మెడ్‌టెక్ జోన్‌ను చంద్రబాబు ఏర్పాటు చేసారు. దీనికి కేంద్ర సహకారం కూడా ఇచ్చింది. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చిన్న సూది నుంచి పెద్ద వైద్య పరికరాలు దాకా ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ 80 పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉత్పత్తి మొదలు పెట్టాయి. వైద్య పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, ఈ మెడ్ టెక్ జోన్ ఉపగాయోగ పడనుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, ఇది మెడ్ టెక్ జోన్ కాదు, ఇది ఒక మయసభ అంటూ, దీని పై విచారణకు ఆదేశించారు. అంతే కాదు, ఈ మెడ్ టెక్ జోన్ కు అన్నీ తానై నడిపించిన, మ్యానేజింగ్ డైరెక్టర్ జితేందర్ శర్మను, జగన్ ప్రభుత్వం తొలగించింది.

medtech 21092019 3

అయితే, ఈ నిర్ణయంతో అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే, డాక్టర్ జితేందర్ శర్మకు మరెక్ట్ లో మంచి పేరు ఉంది. డాక్టర్ జితేందర్ శర్మను ఐక్యరాజ్యసమితితో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఇచ్చింది. అయితే కేవలం చంద్రబాబు పెట్టారు, ఈయన సహకరించారు అనే కక్షతో, డాక్టర్ జితేందర్ శర్మని జగన్ ప్రభుత్వం తప్పించింది అని, మెడ్ టెక్ జోన్ ఏర్పాటులో, అయన సేవలు ఎనలేనివి అని, వెంటనే దీని పై ఆక్షన్ తీసుకోకపోతే, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రధానికి ఫిర్యాదు చేసారు. నిజానికి మెడ్ టెక్ జోన్ అద్భుతంగా పని చేస్తుందని, నెల క్రిందట గడ్కరీ కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం, ఈ మెడ్ టెక్ జోన్ ను మయసభ అంటూ, చంద్రబాబుకి అవినీతిని అంటగట్టె ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read