గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో, భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఘటన జరిగి రెండు రోజులు అయినా, ఇంకా అందరినీ కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు జగన మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి, బాధితులను హాస్పిటల్ లో పరామర్శించారు. తరువాత అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. అయితే ఈ సందర్భంలో అక్కడ అధికారులు ప్రవర్తించిన తీరుతో జగన్ అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనే గౌరవం కూడా అధికారులకు లేనట్టు ఉంది. అందుకే అక్కడ జగన్ ఉన్నా, ఆయన ముందే, తప్పు నీది అంటే నీతి అంటూ, అధికారులు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, తప్పు నెట్టేసే ప్రయత్నం చేసుకున్నారు. ఈ తతంగం అంతా చూస్తున్న జగన్, ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో అవాక్కయి, తేరుకుని, అక్కడ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

jagan 17092019 2

కాకినాడ పోర్టు అధికారులు మాట్లాడుతూ, తాము బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ మాత్రమే చూసుకుంటూ ఉంటామని చెప్పారు. అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే, పాపికొండల పర్యాటకానికి బోట్లు వెళ్లకుండా, వారం రోజుల నాడే అనుమతులు రద్దు చేశామని పర్యాటక శాఖ చెప్పింది. పర్యాటక శాఖ అధికారులు చెప్తూ ఉండగానే, నీటి పారుదల శాఖ అధికారులు స్పందిస్తూ, తమ అధికారాలను కత్తిరించారని ఆరోపించారు. ఇలా బోటు ప్రమాదానికి తాము కారణం కాదంటే, తాము కారణం కాదంటూ అధికారులు వాదులాడుకోగా, అసలు ఎవరూ అనుమతి ఇవ్వకుండా, బోటు ఎలా కదిలిందని జగన్ నిలదీశారు. బోట్లను ఎందుకు తనిఖీ చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

jagan 17092019 3

మరో పక్క, ప్రమాదానికి గురైన బోటు కచ్చులూరు వద్ద 200 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పడవ ప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 24 మృతదేహాలు వెలికితీశారు. ఇంకా 23 మంది గల్లంతు అయ్యారు. వారి కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దొరికిన మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించారు. అయితే మిగతా 23 మంది బోటులోనే ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఆ బోటుని బయటకు తియ్యాలి అంటే, మరో 2-3 రోజులు పైనే పట్టచ్చు. ఎందుకంటే 200 అడుగులో బోటు ఉంటే, వీళ్ళు 60 అడగులకు కూడా వెళ్ళలేక పోతున్నారు. సుడిగుండాలు ఎక్కువగా ఉండటం కారణంగా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిలో బోటు ఎప్పటికి బయటకు తీస్తారో చూడాలి.

నవ్యాంధ్ర మొదటి స్పీకర్, మాజీ హోం మంత్రి, అలాగే ఇరిగేషన్, హెల్త్, సివిల్ సప్లైస్ లాంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేసిన కోడెల శివప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తప్ప, అన్ని కీలక శాఖలు చేసి, ఎంతో సేవ చేసిన కోడెల బలవంతంగా చనిపోవటం అందరినీ కలిచి వేసింది. నేటి రాజకీయంలో, సిగ్గు, మానం, అభిమానం లాంటి పదాలకు అడ్డ్రెస్ లేదు అనుకుంటున్న టైంలో, తనకు జరిగిన అవమానానికి ఆయాన చనిపోయారు అంటే ఎంతో బాధాకరం. ఒకప్పుడు పెత్తందారి వ్యవస్థకు తాను ఒక్కడే ఎదురు వెళ్లి, వాళ్లకి గుండె చూపించిన కోడెల, ఈ రోజు కావాలని వెంటాడి, వేటాడి, అవమానాలు చేసినందుకు, ఇంత జీవితంలో నాకు లభించే గౌరవం ఇంతేనా ? ఈ వేధింపులతో ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను, కనీసం మరణంలో అయినా ప్రశాంతత చూసుకుంటాను అంటూ, తనకు ఇష్టమైన ఆ శివయ్య దగ్గరకే వెళ్ళిపోయారు.

cbn 17092019 2

అయితే కోడెల మరణం పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 72 ఏళ్ళ వయసులో, ఆయన పై వ్యక్తిగత కక్ష తీర్చుకుని, ఆయన్ను మానసికంగా క్షోభ పెట్టి, గుచ్చి గుచ్చి, అవమానాల పాలు చేసి, తమ మీడియాలో ఆయాన ప్రతిష్ట దిగజారేలా, ఆయనే చనిపోయేలా చేసారని అన్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆయన ఈ రోజు కేసులకు సంబంధించి ఒక పోస్ట్, అలాగే ఆయన పై నమోదైన ఫర్నిచర్ కేసు గురించి వివరాలు ఇచ్చారు. రెండు నెలల్లో కోడెల పై 19 కేసులు పెట్టారని, ఇవన్నీ గత మూడేళ్ళలో జరిగాయని అంటున్నారని, కాని వేటిలోను అవి, ఎప్పుడూ జరిగాయో కనీసం తేదీ కూడా చెప్పలదని అన్నారు. కోడెల పై వ్యతిరేకంగా కేసులు వేయాలని ట్విట్టర్‌లో, పేపర్‌లో ప్రకటనలు చేసి, సాక్షి పేపర్‌లో పదేపదే కోడెలను విమర్శిస్తూ కథనాలను రాయించారని చంద్రబాబు అన్నారు.

cbn 17092019 3

అలాగే ఫర్నిచర్ కేసు పై చంద్రబాబు స్పందిస్తూ, ఇలా ట్వీట్ చేసారు "రూ.43వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ అభియోగాలున్న వ్యక్తి,11 చార్జిషీట్లలో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తి... కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ విషయంలో కోడెల శివప్రసాదరావుపై కేసులు పెట్టడం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయం. పల్నాటి పులి అని పిలువబడ్డ ఒక సీనియర్ రాజకీయ నేతకే ఇలాంటి పరిస్థితి తెచ్చారంటే ఇలాంటి ఉన్మాదంతో కూడుకున్న పాలనలో రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఎంతమందిని చంపుకుంటూ పోతారు? కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారు. ఈ ప్రభుత్వ హత్యమీద సీబీఐ విచారణ జరగాలి." అని ట్వీట్ చేసారు.

గోదావరిలో జరిగిన పెను విషాదం పై, మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ప్రభుత్వం చెప్తుంది. రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నారని, ఆయన కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి అని ప్రభుత్వ వరాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఎలాంటి బోటు అయినా, దేవీపట్నం దగ్గర పోలీసులు చెక్ చేస్తారు. ఇక్కడ కూడా అక్కడ పోలీసులు చెక్ చేసి పంపించారని వార్తల్లో చెప్తున్నారు. మరి ఎలాంటి అనుమతులు లేని బోటుకు, అక్కడ పోలీసులు ఎందుకు వదిలి పెట్టారు ? కేవలం సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు మాత్రమే చూస్తారా ? అనుమతులు ఉన్నాయా లేవా అనేది చూడరా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మరోసారి, ఇలాంటి ఘటనలలో, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం బయట పడింది.

boat 15092019 2

మరో పక్క ఉదయం 10:30 కు సంఘటన జరిగితే, ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు చేపట్టలేదని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళటానికి తీవ్రమైన ఇబ్బందులు ఉండటంతో, నేవీ సహాయం తీసుకోవాలని చూస్తున్నారు. హెలికాప్టర్ వచ్చినా, వాళ్ళు సహాయక చర్యలు చేసేది ఏమీ ఉండదు. ఏజెన్సీ ప్రాంతం కావటంతో, అక్కడకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ, స్థానికులు మాత్రమే గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళటానికి, ఇంకా సమయం పట్టే అవకాసం ఉంది.

boat 15092019 3

మరో పక్క, దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురికావడం బాధాకరం అన్నారు. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. అలాగే బోటు ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాన్ స్పందించారు. బోటు ప్రమాదంలో సుమారు 50 మంది గల్లంతయ్యారనే విషయం బాధ కలిగించిందన్న పవన్.. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో పక్క తాడేపల్లి నుంచి జగన్ మోహన్ రెడ్డి కూడా పరిస్థితిని ఎప్పటికపుడు అడిగి తెలుసుకుంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో దాదపుగా 50 మంది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం కావడంతో విహారానికి వెళ్లిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాష్ట్ర ప్రజల్లో ఈ ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న కూడా ఇలాగే ఒక పెద్ద బొట్ లో, 50 మందిని గోదావరి పర్యటకానికి తీసుకువెళ్ళారు. గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో, ఇలా బొట్ లో వెళ్ళటంతో, నిన్నే అందరూ హెచ్చరించారు. ఈ విషయానికి సంబంధించి ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ లో, కూడా వార్త వచ్చింది. పాపికొండల విహారానికి ప్రమాదకర పరిస్థితుల నడుమ బోట్లు వెళ్తున్నాయని, నదీ విహారానికి ఈ సమయంలో వెళ్తే ప్రమాదం అని ఆ కధనంలో రాసింది.

paper 15092019 1

అధికారులు అక్కడ ఉన్నా సరే, ఆ బోట్‌ను అడ్డుకోకుండా, ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదని ఆ కధనం సారాంశం. ఇప్పటికీ, గోదావరి వరదలతో, దేవీపట్నం మండలంలో ఇంకా 36 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పాపి కొండల విహారానికి వెళ్తే, ప్రమాదం అని ఆంధ్రజ్యోతి తన కధనంలో రాసింది. ఇంత వరద ఉన్నా కూడా, 50 మందితో బోటు వెళ్తే, అధికారులు ఎవరు పట్టించుకోలేదని, ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే, అధికారులు మేల్కునాలి అంటూ ఆంధ్రజ్యోతి కధనం రాసింది. అయితే ఈ కధనం రాసిన 24 గంటల్లోనే, అతి పెద్ద విషాద ఘటన జరిగింది. ఇప్పిటికీ 50 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే ఇంతటి విషాద ఘటన చూసిన ప్రజలు, ఆంధ్రజ్యోతి కధనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

paper 15092019 1

ఆంధ్రజ్యోతి ముందే హెచ్చరించినా, ఎవరూ పట్టించుకోలేదని, ఈ కధనాన్ని ఏ ఒక్క అధికారి చూసినా, ఈ రోజు ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ పత్రికను, ఛానల్ ను కనపడకూడదు అని అప్రకటిత నిషేధం విధించటంతో.. పాలకపక్షం నాయకులు / అధికారులు బహుశా దీన్ని చూసిఉండరేమో అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే జగన్ గారు, మీడియా లేదా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, అధికారంలో ఉన్నవారు తమ పనితీరుని మెరుగుపరుచుకోవటం లేదా సరిదిద్దుకోవటం కోసం వాడాలి తప్పితే, విమర్శలు వచ్చాయి అని కనపడకూడదు / వినపడకూడదు అంటూ, అది స్వయంగా / సొంతంగా మీడియా అధిపతి అయినా జగన్ గారే ఇలా చేయటంతో, జరిగే తప్పులు ప్రభుత్వానికి తెలిసే అవకాసం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read