అసలు రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా, అని ప్రజలు అవాక్కయ్యే నిర్ణయం తీసుకున్నరు జగన మోహన్ రెడ్డి. అప్పట్లో నోట్లు రద్దు సమయంలో, శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కట్టలు కట్టలు కొత్త నోట్లు దొరికిన విషయం గుర్తుందా ? ప్రజలు ఒక్క రెండు వేల రూపాయల కాగితం దొరికితే చాలు అనుకున్న టైంలో, ఏకంగా 34 కోట్ల రూపాయలు, కొత్త 2 వేల కాగితాలు ఆయన ఇంట్లో దొరికి అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే తరువాత ఆ కేసు అంతా ఫైన్ అని కొట్టేసారు అనుకోండి. అయితే అప్పట్లో ఆ శేఖర్ రెడ్డిని, జయలలిత సియంగా ఉండగా, చంద్రబాబుతొ సిఫార్సు చేసి, టిటిడి మెంబెర్ ని చేసారు. అయితే ఈయన ఐటి రైడ్ లో దొరకటంతో, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ మొహన్ రెడ్డి అండ్ కో, ఈ శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని, ఆ డబ్బు అంతా లోకేష్ పంపించాడు అంటూ విష ప్రచారం చేసారు.

ttd 19092019 2

చంద్రబాబు, లోకేష్, శేఖర్ రెడ్డి పై, ఎన్ని కధనాలు అల్లారో అంతే లేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, చంద్రబాబు 100 కోట్లకి, అతనికి టిటిడి మెంబెర్ పోస్ట్ ఇచ్చారని చెప్పారు. అయితే, అప్పట్లో కొంత మంది ఇది నమ్మారు కూడా. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. శేఖర్ రెడ్డి రెండు నెలల క్రిందట జగన్ ను కలిసారు అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదే శేఖర్ రెడ్డిని, టిటిడి బోర్డు లో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమిస్తూ జీవో ఇచ్చింది. అయితే ఆ జీవో లో శేఖర్ రెడ్డి అని రాయకుండా, శేఖర్ ఏజె అంటూ పెట్టారు. కాని విషయం బయటకు పొక్కింది. దీంతో టీవీ ఛానెల్స్ తో పాటుగా, సోషల్ మీడియాలో కూడా, ఈ విషయం వైరల్ అయ్యింది. అప్పట్లో జగన్ చేసిన విష ప్రచారం ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

ttd 19092019 3

అప్పట్లో సాక్షిలో వచ్చిన కధనాలు, జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో రాసిన పోస్ట్ లు, శేఖర్ రెడ్డికి చంద్రబాబుకి లింక్ చేస్తూ పెట్టిన కధనాలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. అప్పుడు ఆరోపించినట్టు, చంద్రబాబు బినామీకి ఇప్పుడు జగన్ పదవి ఇచ్చారా అని పోస్ట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు అప్పట్లో విమర్శించినట్టు, ఎన్ని కోట్లు ఇచ్చి, ఇప్పుడు పదవి ఇచ్చారు అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. మొత్తానికి రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఈ న్యూస్ తో, సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి అప్పట్లో అన్ని ఆరోపణలు చేసి, ఇప్పుడు పదవి ఇచ్చి, ఇతను మా మనిషే అని చెప్పకనే చెప్తున్నారు. ఇది నేటి రాజకీయం. ప్రజలే విజ్ఞతతో ఉండాలి.

అన్ని రాష్ట్రాల్లో కాషాయం ఎగరు వెయ్యటానికి వ్యూహం పన్నిన బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తమ ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చెయ్యటానికి సరైన ఆయుధం కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ రీ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల సమీక్షలో జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం చుక్కలు చూపిస్తుంది. చివరకు స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని కూడా, డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపించటానికి ఒప్పుకోలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ మీద ఉన్న కేసులతో కాకుండా, రాజకీయంగా దెబ్బ కొట్టటానికి వ్యూహం పన్నింది బీజేపీ. అవకాసం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి, ఇప్పుడు కోడెల ఆత్మహత్య రూపంలో ఒక ఆయుధం దొరికింది. కోడెల ఆత్మహత్య చేసుకున్న రోజున, కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

governor 19092019 2

సహజంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పై విమర్శలు చెయ్యదు. కాని కిషన్ రెడ్డి మాత్రం, రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారుల వైఖరి పై విమర్శలు చేసారు. కోడెల మృతి పై, కేంద్రం సంస్థలతో దర్యాప్తు చేపిస్తాం అని చెప్పి, రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం అని చెప్పారు. అయితే ఈ రోజు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలవటం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ, రాజ్‌భవన్‌లో గవర్నర్ హరించందన్ బిశ్వభూషణ్‌ ను కలిసారు. చంద్రబాబు 13 పేజీల లేఖ ఇచ్చి, జరిగిన విషయాలు అన్నీ గవర్నర్ కు చెప్పారు. సాక్షి మీడియా, వైసీపీ నాయకులు, డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా, ఎలా ఇబ్బంది పెట్టింది వివరాలు, ఆధారలు ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ, గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి..కోడెల ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. కిషన్ రెడ్డి మాటాలు, గవర్నర్ మాటలు, చంద్రబాబు సిబిఐ ఎంక్వయిరీ డిమాండ్, ఇవన్నీ చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం పై గట్టిగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.

governor 19092019 3

ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఇరుక్కోవటం ఖాయంగా భావిస్తున్నారు. ఎందుకంటే కోడెల ఓడిపోగానే లెటర్ రాసారు. మే 23 న ఫలితాలు వస్తే, జూన్ 2 న అసెంబ్లీ అధికారులుకు లెటర్ రాసి, ఫర్నిచర్ తీసుకు వెళ్ళమన్నారు. తరువాత కూడా రెండు సార్లు లెటర్ రాసారు. అయినా ప్రభుత్వం స్పందించక పోగా, ఎదురు దొంగతం కేసు పెట్టింది. నిజానికి, ఒక వేళ కోడెల ఇవ్వకపోతే, అక్కడకు వెళ్లి తీసుకునే బాధ్యత ప్రభుత్వానిది, అంతే కాని ఇలా కేసు పెట్టటం పై అనుమానాలు వస్తున్నాయి. కేంద్ర సంస్థలతో ఎంక్వయిరీ వేస్తె, ఈ ప్రాసెస్ మొత్తంలో ఉన్న అధికారులు, ఎందుకు అలా చేసింది, ఎవరి ఒత్తిడితో అలా చేసింది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసును ఉపయోగించుకుని బీజేపీ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఇలా చెయ్యటం వల్ల, ఒక సామాజికవర్గానికి, మేము అండగా ఉన్నాం అనే సంకేతాలు పంపించి, వారిని తమ వైపు తిప్పుకునే ఆలోచనలో ఉంది. అలాగే, ఇప్పటికే శాంతి బధ్రతలు లేవు అంటూ, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న పోరాటానికి బలం వస్తుందని నమ్ముతున్నారు. చూద్దాం మరి కేంద్రం ఏమి చేస్తుందో ?

తమ వాదన కరెక్ట్ అని ప్రజలకు చెప్పటానికి, జగన్ ప్రభుత్వం గత మూడు నెలలుగా నానా తంటాలు పడుతుంది. ఎలాగైనా చంద్రబాబు పై అవినీతి ముద్రలు వెయ్యాలని, గత మూడు నెలలుగా తవ్వుతూనే ఉన్నారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి, సచివాలయానికి మొదటి సారి వెళ్ళిన సందర్భంలో, గతప్రభుత్వంలో మీకు తెలిసిన అవినీతి ఏమైనా ఉంటే చెప్పండి, మీకు బహుమతులు ఇస్తాను అంటూ ఉద్యోగస్తులకు ఆఫర్ కూడా ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఏమి లేదు. ఇక విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా ఇదే తంతు. ఎదో జరిగి పోయింది అంటూ, కేంద్రం ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా వినకుండా, చివరకు ఏమి దొరక్క, కేంద్రం మాటే వినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా అదే తీరు. ఇప్పుడు అమరావతి టార్గెట్ గా జగన్ పావులు కదపుతున్నారు. రాజధానిలో ఏదో స్కాం జరిగింది అని జగన్ నమ్మకం.

sujana 19092019 2

అందుకే ఇప్పుడు దాని పై ఫోకస్ చేస్తూ, సుజనా చౌదరిని టార్గెట్ చేసారు. సుజనా చౌదరి బీజేపీలో చేరిన దగ్గర నుంచి, జగన్ పై దూకుడుగా మాట్లాడుతున్నారు. ఆయన బీజేపీ కావటంతో, సుజనాను అంతే ధీటుగా సమాధానం ఇవ్వటానికి వైసీపీ ఆలోచిస్తుంది. అందుకే సుజనా పై అవినీతి మరకలు వేసి, సుజనాను సైలెంట్ చెయ్యాలని ప్లాన్ చేసారు. అందుకే సుజనా పై ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. సుజనాకు కాని, అయన బంధువులకు కాని, అమరావతి ప్రాతంలో భూములు ఉన్నాయా, లేక వారి బినామీలతో ఉన్నాయా అన్న కోణంలో జగన్ ప్రభుత్వం రహస్య విచారణ మొదలు పెట్టింది. గత వారం రోజులుగా దీని పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందు కోసం, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అయిన రెవెన్యూ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులను రంగంలోకి దించారు.

sujana 19092019 3

వీరు గత వారం రోజులుగా గుట్టుగా విచారణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మోగులూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు గ్రామాల పరిధిలో ఒక దర్యప్తు బృందం పర్యటించింది. బుధవారం ఈ బృందాలు అక్కడ గ్రామాల్లో తిరిగి స్థానిక రైతులను, సుజనా భూములు బినామీలు ఏమైనా ఉన్నాయా అనే విషయం ఆరా తీసారు. అలాగే గతంలో జరిగిన భూముల క్రయవిక్రయాల పై సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కంచికచర్ల తహసీల్దార్‌ వి.రాజకుమారిని వివరణ కోరగా, అధికార బృందం వచ్చి విచారణ చేసిన విషయం వాస్తవమే అని చెప్పారు. అయితే, సుజనా చౌదరి పై రాష్ట్ర ప్రభుత్వం, కావాలని నిఘా పెట్టి, ఇబ్బందుల్లోకి నేట్టటానికి ట్రై చేస్తుంటే, బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా ? తరువాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది వేచి చూడాలి.

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం ఘటన జరిగి అయుదు రోజులు అవుతున్నా, ఇంకా మృతదేహాలు తియ్యలేక పోతుంది, మన అధికార యంత్రాంగం. అయితే ఈ బోటు ప్రమాదం పై, ప్రభుత్వం పై పలు విమర్శలు వస్తున్న వేళ, మాజీ మంత్రి హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటన పై ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రకటనలు ఇస్తుందని అన్నారు. బోటు ప్రమాద బాధితులను తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. నిన్న ఒక్క రోజే మరో అయిదు కుటుంబాలు, తమ వారి జాడ కనిపించటం లేదని ఇక్కడకు వచ్చారని, అంటే మరో అయుదుగురు ఉన్నారు కదా, ఆ విషయం ఎందుకు ప్రభుత్వం చెప్పటం లేదని అన్నారు. తన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, బోటులో మొత్తం 93 మంది ప్రయాణికులు ఉన్నారని, హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేసారు. ప్రభుత్వం మాత్రం 73 మంది మాత్రమే ఉన్నారని చెప్తుందని అన్నారు.

harsha 19092019 2

కావాలని మృతుల సంఖ్యను తక్కువగా చూపించి, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి మునిగిపోయిన బోటు జాడ సోమవారం మధ్యాహ్నానికే తెలిసిందని, అయితే బోటు లోపల ఏసి రూమ్స్ లో లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయనే భయంతో ప్రభుత్వం బోటును వెలికి తీయడం లేదని ఘాటు విమర్శలు చేసారు. సంచలనం కోసమో, లేకపోతే మీడియాలో పేరు సంపాదించడం కోసమో తాను ఈ విషయాలను వెల్లడించడం లేదని, ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాల బాధ, ఇన్ని రోజులు అయినా శవాలు దొరక్క ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాల బాధ చూసి స్పందిస్తున్నానని హర్ష కుమార్ అన్నారు. అంతే కాకుండా, ఈ బోటుల మాటున, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని హర్షకుమార్ ఆరోపించారు.

harsha 19092019 3

ఈ బోటుల వెనుక, ఫారెస్ట్, టూరిజం, ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారని, అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. ఈ బోటు ప్రమాదం విషయానికి వస్తే, ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై ముందుగా అనుమతి ఇవ్వలేదని, అయితే అప్పుడు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి బోటుకు పర్మిషన్ ఇప్పించేలా చేశారని ఆరోపించారు. అయితే తనపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజున బోటు అనుమతి కోసం ఏ అధికారినీ తాను ఒత్తిడి చేయలేదని, అది పచ్చి అబద్ధం అని, తన పై లేనిపోని ఆరోపణలు చేసిన హర్షకుమార్ పై పరువునష్టం దావా వేస్తానని అవంతి హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read