ఈ రోజుల్లో, సహజంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్న సంఘటన జరిగినా, వారిని ట్రాప్ చేసి, అల్లరి అల్లరి చేసి, వారిని రాజకీయంగా దెబ్బ వేసి, తీవ్రంగా వేధిస్తారు. ఇందుకు ఉదాహరణే కోడెల ఉదంతం. ఒక చిన్న ఫర్నిచర్ కేసు, అదీ కోడెల అధికారంలో ఉండగా, తనకు హక్కుగా వచ్చింది వాడుకున్నారు. అధికారం దిగిపోగానే, రెండు ఉత్తారాలు రాసారు. దాన్ని ఇప్పటి స్పీకర్ కార్యాలయం అక్నాలేడ్జ్ కూడా చేసింది. అయినా తరువాత ఆయన పై కేసు పెట్టారు. కోడెల కోరినట్టు ఫర్నిచర్ తీసుకు వెళ్ళకుండా, ఆయన పై ఎదురు కేసు పెట్టారు. సహజంగా ఇలాంటివి, ఏ రాజకీయ నాయకుడు దగ్గర నుంచి అయినా రికవర్ చేసుకుంటారు, లేకపోతే డబ్బులు కట్టించుకుంటారు. కాని, ఇక్కడ అది ఏమి చెయ్యకుండా, దొంగ దొంగ అంటూ కేసులు పెట్టి అవమానించారు.

kodela vs 18092019 2

అయితే ఈ సందర్భంలోనే, కోడెల, వైసీపీ నేతల మధ్య ఇది వరకు జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, కోడెల మధ్య జరిగిన సంఘటన. కోడెల స్పీకర్ గా ఉండగా, వైసిపీ నేతలకు కావాల్సిన పనులు చేసి పెట్టారు. కాని కోడెల ను టార్గెట్ చేస్తున్న సమయంలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. వ్యతిగత ఇమేజ్ దెబ్బ తీస్తున్నారని, ఇది మంచిది కాదని, వారికి వర్తమానం పంపినా, వారి నుంచి సమాధానం లేదు. ఇక విజయసాయి రెడ్డి విషయానికి వస్తే, ఆ రోజు కోడెల కనుక చూసి చూడనట్టు వెళ్ళకపోయి ఉంటే, ఈ రోజు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యే వారు కాదు. ఇదే విషయం స్వయంగా కోడెల చెప్పారంటూ, ఈ రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసారు.

kodela vs 18092019 3

రిటర్నింగ్‌ అధికారిగా అసెంబ్లీ అధికారి ఉన్నారు. ఈ సమయంలో, విజయసాయి రెడ్డి నామినేషన్ లో తప్పులు ఉన్నాయని, ఆయన్ను నామినేషన్ తిరస్కరించాలని, ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విజయసాయి వెంటనే రంగంలోకి దిగి, కోడెలతో మాట్లాడి, అవి చిన్న చిన్న తప్పులు అని, వాటి కోసం నామినేషన్ తిరస్కరించవద్దు అని కోరారు. దీంతో కోడెల రంగంలో దిగి, రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న అసెంబ్లీ అధికారితో మాట్లాడి, చిన్న చిన్న ఫిర్యాదులు ఆధారంగా నామినేషన్‌ తిరస్కరించడం సరికాదని, రాజకీయంగా మేము మేము చూసుకుంటాం అని, విజయసాయి నామినేషన్‌ ఒకే అయ్యేలా చూసారు కోడెల. అయితే ఇప్పుడు ప్రభుత్వం వేధిస్తున్న విధానం చూసి, ఇలా చెయ్యటం మంచిది కాదని, కోడెల తనకు తెలిసినవారితో విజయసాయిరెడ్డితో మాట్లాడించారు. అయితే అప్పటి నుంచి, విజయసాయి ట్విట్టర్ లో ఇంకా హీనంగా కోడెల పై రాతలు రాయటం మొదలు పెట్టటంతో, కోడెల నివ్వెరపరపోయారు. వైసీపీ ప్రత్యర్ధులను వేటాడి వెంటాడు తుంటే, తెలుగుదేశం మాత్రం అధికారంలో ఉండగా, జాలి గుండెలతో వైసీపీ నేతలకు సహాయం చేసారు. రెండు పార్టీల రాజకీయానికి ఇదే తేడా.

గోదవరిలో బోటు ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయ్యింది. ఇప్పటికీ ఇంకా కొన్ని మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. మృతదేహాలు వాటంతట అవి కొట్టుకుస్తుంటే, ఇప్పటి వరకు 33 మంది మృతదేహాలను కనుకున్నారు. ఇంకా 13 మృతదేహాల కోసం గాలింపు చేస్తున్నారు. అయితే అవి బోటులోనే ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది. మరో పక్క దాదపుగా నాలుగు రోజులు అవుతూ ఉండటంతో, మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా అయిపోతున్నాయి. మిగతా మృతదేహాలు కనుక తొందరగా దొరక్కపొతే, అవి గుర్తుపట్టలేని విధంగా అయిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ మృతదేహాలు బోటులోని ఏసి గదిలో చిక్కుకున్నాయా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఈపాటికే మృతదేహాలు పైకి తేలేయి. ఇప్పటికీ అవి కనిపించకపోవటంతో, బోటు తీస్తే కాని, ఆ మృతదేహాలు కనిపించే అవకాసం లేదని చెప్తున్నారు.

boat 18092019 2

అయితే బోటు తీసే విషయంలో అధికారులు చేతులు ఎత్తేసారు. ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అంత కిందకు వెళ్లలేమని చేతులు ఎత్తేసారు. చివరకు నేవీ వాళ్ళు కూడా కుదరదని చెప్పేసారు. ముఖ్యంగా నౌకాదళానికి చెందిన ఉన్నతాధికారి దశరథ్‌ , ఇలాంటి ఘటనలలో బోటును వెలికి తియ్యటంలో అనుభవం ఉంది. ఆయన వస్తే, బోటు బయటకు వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. దీంతో దశరథ్‌ ను మంగళవారం రప్పించారు. ఆయన ప్రమాద ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితులు పరిశీలించారు. గోదావరి నదిలోకి 150 అడుగుల లోతు దాకా వెళ్లేందుకే తమకు అనుమతి ఉందని, అంతకుమించి కిందకు వెళ్ళలేమని ఆయన తేల్చి చెప్పారు.

boat 18092019 3

ఇన్ని రోజులు గడిచిన తరువాత, అంత లోతులో ఎవరూ బ్రతికే అవకాసం ఉండదు కాబట్టి, సాహసం చేసేందుకు తమకు అనుమతులు ఉండవని ఆయన చెప్పారు. అయితే మరో పక్క, అధికారులు మరో పధ్ధతిలో బోటు తియ్యటానికి ప్రయత్నం చేసే విధానం గురించి ఆలోచించారు. కొన్నేళ్ల కిందట బలిమెల రిజర్వాయరులో భద్రతా బలగాలతో కూడిన బోటు మునిగిన సమయంలో బోటు ఎలా తీసామో, అలా తీద్దామని ప్రయత్నం చేసారు. కాని, ఇక్కడ పరిస్థితిలో అది కుదరదని, అంచనాకు వచ్చారు. అందుకే మృతదేహాలు వాటంతట అవి పైకి తేలితేనే అవి దొరికినట్టు అని, బోటులో కనుక ఉంటే, అవి తియ్యటం చాలా కష్టం అనే అంచనాకు అధికారులు వచ్చారు. అయితే ఇంకా మృతదేహాలు దొరకని బంధువుల ఇబ్బందులు మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయి. కనీసం మృతదేహాలు అయినా ఇవ్వమని కోరుతున్నారు.

 

 

మాజీ స్పీకర్, మజీ మంత్రి అయిన కోడెల శివ ప్రసాద్ చనిపోవటానికి, గత మూడు నెలలుగా జగన్ ప్రభుత్వం, వెంటాడి, వేటాడి, కోడెలను మానసిక క్షోభకు గురి చెయ్యటమే కారణం అని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, టిడిపి పార్టీ కార్యకర్తలకు, కోడెల అభిమనులకు కోపం తెప్పించేలా చేసింది. ఒక పక్క వేధిస్తూనే, మరో పక్క కోడెల అంత్యక్రియలకు, ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని జగన్ ఆదేశించటం వీరి ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ రోజు కొంత మంది రెవిన్యూ, పోలీస్ అధికారులు, కోడెల ఇంటికి వచ్చి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చెయ్యమని జగన్ ఆదేశించారని చెప్పారు. అయితే, వారు తీవ్ర ఆవేదనకు గురై, ఆ అధికారులకు దండం పెట్టి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని, మీ ప్రభుత్వం వద్దు మీరు వద్దు, అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయనకు కడసారి వీడ్కోలు పలుకుతాం అని అన్నారు.

kodela 18092019 2

అయితే చంద్రబాబు వచ్చిన వెంటనే, ఈ విషయం పై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాసం ఉంది. ఒక పక్క అంతిమయాత్రలో 144 సెక్షన్ పెడుతూ, ఇప్పుడు అధికార లాంచనాలా అంటూ, నిన్న చంద్రబాబు ఫైర్ అయిన తరువాత, నిన్న 144 సెక్షన్ ఎత్తేస్తున్నాం అని పోలీసులు ప్రకటించారు. అయితే, ఇప్పుడు అధికార లాంఛనాలతో చేస్తారా లేదా అనేది చంద్రబాబు నిర్ణయం పై ఆధార పడి ఉంటుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని చంద్రబాబు ఒప్పుకుంటారా, లేక కోడెలకు సరైన గౌరవం ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వ లాంచనాలతో చెయ్యాలని, కుటుంబ సభ్యులను ఒప్పిస్తారా అనేది చూడాలి. అయితే అక్కడ కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం, ఈ ప్రభుత్వమే హత్య చేసి, ఇప్పుడు ఇలా వద్దు అని అంటున్నారు.

kodela 18092019 3

అంతకుముందు, అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో కోడెల పార్థివదేహాన్ని ఉంచారు. మంగళవారం ఉదయం అక్కడ నుంచి అంబులెన్సులో గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. నిన్న అంతా జోరు వాన కురుస్తున్నా, లెక్క చేయకుండా అంబులెన్స్‌ వెళ్లే దారిపొడవునా ప్రతి ఊరిలో ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కోడెల పార్థివదేహంతో కలిసి హైదరాబాద్‌ నుంచి గుంటూరు పార్టీ ఆఫీస్ వరకూ వచ్చారు. కొద్ది సేపు పార్టీ ఆఫీస్ లో ఉంచిన తరువాత, కోడెల పార్థివదేహాన్ని నరసరావుపేటలోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. ఈ రోజు సాయంత్రం, 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాసం ఉంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ చనిపోయిన విధానం పై, ఆయన పై ప్రభుత్వ వేధింపులే కారణం అని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రూపాయి తీసుకుని వైద్యం చేసిన కోడెల, కేవలం ఫర్నిచర్ విషయంలో ఎదో చేసారు అంటూ, వైసిపీ కావాలని చేసిన విష ప్రచారం వల్ల, ఆయన తీవ్ర అవమానానికి గురై, బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇదే విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు సత్యప్రసాద్‌, మద్దాలి గిరి, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎల్‌.రమ ణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ లో, కేంద్రం హోం సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం నడుస్తుందని ఫిర్యాదు చేసారు.

kishan 18092019 1

జగన్‌ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, కోడెలపై 19 అక్రమ కేసులు పెట్టి ఆయన్ను వేధించిందని, అది తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఈ దుర్మార్గపు ప్రభుత్వం పై, దీనికి కారణం అయిన వారి పై కేసు పెట్టాలని అన్నారు. అయితే ఇవన్నీ వని, కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కేంద్రానికి ఇప్పటికే, కొన్ని ఫిర్యాదులు అందాయని అన్నారు. రాష్ట్ర పోలీసులు, అక్కడ ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చాయని అన్నారు. ఈ విషయం పై కేంద్రంతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.

kishan 18092019 1

కోడెల లాంటి మహా నాయకుడు ఇలా మృతిచెందడం చాలా బాధగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కోడెలతో తనకు వ్యక్తిగత సంబధాలున్నాయని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏ కుటుంబంలో ఇలా జరగొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను గౌరవించాలి కాని, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని హిత వుపలికారు. కోడెల విషయం పై, రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలలను కేంద్రం తెప్పించుకుంటుందని అన్నారు. కోడెల మృతి పై రెండు రాష్ట్రాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. కోడెల మృతి విచారణ అంశాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని, కోడెల మృతిపై కేంద్రమే పూర్తిస్థాయిలో విచారణ జరిగేలా కూడా చూస్తామని వెల్లడించారు కిషన్ రెడ్డి.

Advertisements

Latest Articles

Most Read