హిమాలయాల్లో ఘోర తపస్సులో ఉండే అఘోరాలు ఉన్నట్టు ఉండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షం అయ్యారు. సహజంగా వీళ్ళు జనావాసాల మధ్యకు రారు. అయితే వీరు ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉండటం, అందునా రాజకీయ ప్రముఖల నివాసాల్లో కనిపించటం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ అఘోరాలు వచ్చింది టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి. ఈ అఘోరాలతో కలిసి సుబ్బారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆశీర్వాదం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి సేవలో మాత్రమే ఉండాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్, ఇలా అఘోరాలకు మొక్కటం పై, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న స్వరూపానందని కలిసిన సమయంలో, శ్రీవారి ప్రసాదం ఆయన కాళ్ళ దగ్గర పెట్టిన ఫోటోలు వైరల్ అవ్వటంతో, అప్పుడు కూడా భక్తులు ఆగ్రహించిన విషయం తెలిసిందే.

aghora 14092019 2

ఈ విధంగా, టిటిడి చైర్మెన్ గా ఉంటూ, అఘోరాలకు మొక్కిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవ్వటంతో, ఈ విషయం చర్చనీయంసం అయ్యింది. అలాగే సుబ్బారెడ్డి తో పాటుగా బీజేపీ మాజీ ఎంపి గోకరాజు గంగరాజు నివాసంలోనూ అఘోరాలు ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అఘోరాలను తమ నివాసానికి తీసుకొచ్చి, గంగరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే ఈ ఫోటోల పై ఇప్పటి వరకు ఇరువురు స్పందించలేదు. ఈ అఘోరాలు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమైనా పూజలు చేసారా, అనేది తెలియాల్సి ఉంది. అయితే, వారిని హిమాలయాల నుండి ప్రత్యేక ఖర్చులతో తమ నివాసాలకు తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది.

aghora 14092019 3

ఇప్పుడు సుబ్బారెడ్డి ఇంటికి హిమాలయాల నుంచి అఘోరాలు వీరి ఇళ్ళకు విచ్చేయడం సంచలనంగా మారింది. సుబ్బారెడ్డి, గంగరాజు ఇద్దరూ తమ నివాసాలకు ఈ అఘోరాలను ఆహ్వనించటం, పూజలు నిర్వహించటం పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. దీని పైన సోషల్ మీడియాలో చర్చ నీయాంశంగా మారింది. అయితే గంగరాజు విషయం పక్కన పెడితే, టిటిడి చైర్మెన్ గా ఉంటూ, సుబ్బారెడ్డి ఇలా చెయ్యటం కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తుంది. దీని పై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు నడుస్తున్నాయి. అసలు అఘోరాలు ఎలాంటి పూజలు చేస్తారో తెలుసా ? దేని కోసమో ఈ పూజలు ? అఘోరాలతో టిటిడి చైర్మెన్ కు ఏమి పని ? ఇలా అనేక రకాల ప్రశ్నలు వేస్తూ, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

విజయసాయి రెడ్డి... ఈయన రాజ్యసభ సభ్యుడే అయినా, జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా బాగా గుర్తింపు. జగన్ కంపెనీల్లో ప్రధాన ఆడిటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా, జగన్ కేసుల్లో ప్రధాన పాత్ర అని భావించి, సిబిఐ విజయసాయి రెడ్డిని ఏ2గా పెట్టి, అరెస్ట్ చేసింది. జగన్ తో కలిసి, విజయసాయి రెడ్డి కూడా జైలు జీవితం అనుభవించారు. అప్పటి నుంచి జగన్ మొహన్ రెడ్డికి అన్ని విధాలుగా విజయసాయి రెడ్డి అండగా ఉంటున్నారు. ముఖ్యంగా 2014 తరువాత, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య గ్యాప్ తెప్పించాతంలో, ఆయన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. అదే సందర్భంలో, బీజేపీ అధిష్టానానికి బాగా దగ్గర అయిపోయారు విజయసాయి. ప్రతిపక్షంలో ఉండగా, విజయసాయి రెడ్డి ఎక్కువగా ప్రధాని కార్యాలయంలో కనిపిస్తూ ఉండేవారు. అయితే విమర్శలు వచ్చినా సరే, నేను ఇలాగే వెళ్తాను, చంద్రబాబుని ఓడించటమే నా ధ్యేయం అని చెప్పారు కూడా.

vsreddy 14092019 1

అయితే మొత్తానికి అందరూ కలిసి చంద్రబాబుని ఓడించారు. చంద్రబాబుని ఓడించే పాత్రలో విజయసాయి రెడ్డికి ఎక్కువ మార్కులే వెయ్యాలి. ఢిల్లీ లెవెల్లో చెయ్యాల్సిన లాబీయంగ్ అంతా పర్ఫెక్ట్ గా చేసుకొచ్చారు. అందరూ సహకరించారు కూడా. మొన్నా మధ్య, సాక్షాత్తు ప్రధాని మోడీ, హలో విజయ్ గారు అంటూ పలకరించిన వీడియో కూడా చూసాం. అయితే అంత రిలేషన్ ఉన్న, విజయసాయి రెడ్డి, బీజేపీ అధిష్టానం మద్యం, గత కొంత కాలంగా గ్యాప్ వచ్చిందని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. బీజేపీ అధిష్టానం కూడా, విజయసాయి రెడ్డిని దూరం పెట్టిందని, ఇది వరకటి లాగా ఉన్న స్వేఛ్చ విజయసాయి రెడికి లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, విజయసాయి రెడ్డి చూపిన అత్యుత్సాహంగా చెప్తున్నారు.

vsreddy 14092019 1

ఒక పక్క జగన్ మొహన్ రెడ్డి చేస్తున్న పనుల పై,కేంద్రం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాల విషయంలో, పోలవరం రీటెండరింగ్ విషయంలో కూడా కేంద్రం ఆగ్రహంగా ఉంది. వారం క్రితం సాక్షాత్తు కేంద్ర మంత్రి, జగన ని పట్టుకుని, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని బహిరంగంగా అన్నారు అంటే, విషయం ఎక్కడి వరకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇదే సమయంలో విజయసాయి రెడ్డి మాత్రం, విద్యుత్ ఒప్పందాలు కాని, పోలవరం కాని, అన్ని విషయాలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఇదే విషయం ఢిల్లీలోని బీజేపీ అధిష్టాననికి కోపం తెప్పించింది. మీరు చేసే పనులకు, మమ్మల్ని బాధ్యులని చేస్తారా అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తింది. దీంతో అప్పటి నుంచి, విజయసాయి రెడ్డిని దూరం పెడుతూ, ఇది వరకు ఇచ్చినంత స్వేఛ్చ ఇప్పుడు ఇవ్వటం లేదని సమాచారం. మాటి మాటికి ఢిల్లీలో లాబీయింగ్ చేసే విజయసాయి రెడ్డికి, ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

గోరంతను కొండత చేసి చూపించి, చివరకు సెల్ఫ్ గోల్ వేసుకోవటం రాజకీయ నాయకుల స్టైల్. ఇందులో వైసీపీ రెండు ఆకులు ఎక్కువే చదివింది. ఇలా అతి ప్రచారం చేసి, చివరకు వారి మెడకే చుట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాగే ఫేస్బుక్ లో అతి ప్రచారం చేసి, తమ ప్రభుత్వానికి, తమ అధినేత జగన్ కు మంచి పేరు తీసుకువద్దాం అనుకుని, ఆయన బుక్ అయ్యింది కాక, తన ప్రభుత్వాన్ని, తమ అధినేత జగన్ ను కూడా బుక్ చేసి, అభాసుపాలు అయ్యారు. ఆ ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఎన్నికైన సీదిరి అప్పలరాజు. ఎంతో కష్టపడి, నిజాయతికి మారు పేరు అయిన సర్దార్ గౌతు లచ్చన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన మనవరాలు శిరీష పై గెలుపొందారు. అయితే అంతటి గొప్ప ఘన విజయం సాధించిన అప్పలరాజు, మరీ అతి ప్రచారం చేసి, ఇప్పుడు ఇబ్బందులు పాలు అయ్యారు.

appalraju 14092019 2

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అలాగే నాణ్యమైన బియ్యం పధకాల పై, ప్రజలకు ప్రచారం చేయాలనీ, ఇది ఎంతో గొప్ప వ్యవస్థ, బియ్యం ఎంతో బాగున్నాయి అని చెప్దాం అనుకుని బుక్ అయిపోయారు. ఒక రేషన్ బియ్యం బస్తా ముందు పెట్టి, తన ఫ్యామిలీ మొత్తాన్ని ఉంచి, ఒక మాంచి ఫోటో ఒకటి దిగి, అది సోషల్ మీడియాలో పెట్టారు. చూసారా, ఈ వ్యవస్థ ఎంత గొప్పగా పని చేస్తుందో అని చెప్పాలని, ఆయన ఉద్దేశం. అయితే ఆ ఫోటో సాక్షిగా వచ్చే ముప్పుని, విమర్శలని గుర్తించలేక పోయారు. ఆ ఫోటో పెట్టగానే, నెటిజెన్ లు ప్రశ్నలు మీద ప్రశ్నలు అడగటం మొదలు పెట్టారు. అసలు మీకు తెల్ల రేషన్ కార్డు ఎలా వచ్చింది ? మీరు డాక్టర్ కదా, మీరు తెల్ల రేషన్ కార్డు, కోటా బియ్యం తీసుకునేంత పేద వారా ?

appalraju 14092019 3

ఒకవేళ ప్రభుత్వం పొరపాటున ఇచ్చినా, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఎందుకు తీసుకున్నారు ? ఇలా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసారు. ఇదేనా మీ ప్రభుత్వం విధానం ? పేదలకు ఇవ్వకుండా, మీలాంటి వారికి రేషన్ బియ్యం అవసరమా అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ విమర్శల పై అప్పల రాజు స్పందిస్తూ, రేషన్ కార్డు తాను తీసుకోలేదని, తనకు అవసరం అయ్యి 2009లో తెల్ల కార్డ్ తీసుకున్నా అని, ఈ కార్డు ఎప్పుడో 2014లోనే రద్దు అయిపోయిందని, మళ్ళీ ఈ నెల ఎందుకు యాక్టివ్ అయ్యిందో తెలియదని, ఇప్పుడు వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చెయ్యమని కోరతా అని కవరింగ్ ఇచ్చుకోచ్చారు. అయితే ప్రజలు మాత్రం, ఇదంతా ఒక కట్టు కధ అని, ఒక స్క్రిప్ట్ రాసి, జగన్ ప్రభుత్వాన్ని గొప్పగా చెప్దాం అనుకుని, ఇలా బుక్ అయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రశంసలు ప్రజల నుంచి రావాలి కాని, ఇలా ఎమ్మెల్యేలు, సొంత స్క్రిప్ట్ తో డబ్బా కొడితే, జగన్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా ?

స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన సింధుని, నిన్న రాష్ట్ర ప్రభుత్వం సాన్మానించింది. ఇది జరిగి దాదపుగా రెండు వారల పైన అవుతుంది. సింధు ఇండియా వచ్చిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యామంత్రి కేసిఆర్ తో పాటు, మిగతా ప్రముఖులు కూడా సింధుని సన్మానించారు. అయితే సింధుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంత వరకు సన్మానించక పోవటంతో, సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే నిన్న ఎట్టకేలకు, సింధుని సన్మానించింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ మోహన్ రెడ్డికి ఇన్నాళ్టకు ఫ్రీ అవ్వటంతో, సింధుకి అప్పాయింట్మెంట్ ఇచ్చారు. సింధుని సన్మానించి, విశాఖలో అకాడమీ కోసం ఐదు ఎకరాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇస్తునందని చెప్పారు.

sindhu 14092019 2

అయితే సింధుతో పాటు, సింధుని తీర్చి దిద్దిన కోచ్ పుల్లెల గోపీచంద్ లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే, సింధుని ఎప్పుడు, ఎవరు సన్మానం చేసినా, కోచ్ గా ముందు గోపీచంద్ ను అభినందిస్తూ ఉంటారు. మొన్న సింధు, ప్రధాని మోడీని కలిసిన సమయంలో కాని, అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన సందర్భంలో కాని, గోపీచంద్ కూడా సింధు పక్కనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే జగన మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో, గోపీచంద్ లేకపోవటంతో, రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. ఆయన అందుబాటులో లేకపోవటంతో, జగన్ మోహన్ రెడ్డిని కలవటానికి కుదరలేదని చెప్పారు. అయితే దీనికి వేరే కారణం ఉండనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

sindhu 14092019 3

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం స్థలం ఇచ్చారు. అయితే తరువాత సియం అయిన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నం చెయ్యటంతో, అది పెద్ద వివాదాస్పదం అయ్యింది. ఒకటి రెండు ఇంటర్వ్యూ ల్లో, గోపీచంద్ కూడా ఇదే విషయం చెప్పారు. కోర్ట్ ల్లో పోరాడి ఆ స్థలం సాధించామని, సింధు కూడా ఈ అకాడమీలోనే శిక్షణ పొందిందని చెప్పారు. అయితే ఇది మనసులో పెట్టుకుని, జగన్ వద్దకు గోపీచంద్ రాలేదా ? లేకపోతే ప్రభుత్వం తరుపున ఆయనకు పిలుపు అందలేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సింధుని ఇన్నాళ్ళు ఎందుకు సన్మానం చెయ్యలేదు ? దేశం గర్వించే ఇలాంటి ఆడ పిల్లలను ప్రోత్సహించాలి కదా అనే విమర్శలకు చెక్ పెడుతూ ప్రభుత్వం నిన్న సింధుని సన్మానించినా, గోపి చంద్ లేకపోవటంతో, ఇది మరో చర్చకు దారి తీసింది.

Advertisements

Latest Articles

Most Read