కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గున్తున్నారు... ఈ సందర్భంలో, నిన్న ఆయన ప్రయాణిస్తున్న విమానంలో అతి పెద్ద సాంకేతిక లోపం తలెత్తింది... మానవరహిత పైలట్‌ వ్యవస్థ పని చెయ్యకపోవటంతో, రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో, ల్యాండింగ్ కష్టం అయ్యింది... మూడో సారి అతి కష్టం మీద విమానం ల్యాండ్ అయ్యింది... ఆ టైంలో విమానంలో భయానక పరిస్థితినెలకొన్నా తాను ప్రశాంతంగాఉంటూ, తోటి ప్రయాణికులకు రాహుల్‌గాంధీ ధైర్యం చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఒక ఎస్పీజీ భద్రత ఉన్న వ్యక్తి ప్రయాణిస్తున్న విమానంలో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తటం అనేది మామూలు విషయం కాదని, దీని వెనుక ఎదో కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది...

విమానంలో మానవరహిత పైలట్‌ వ్యవస్థ పని చెయ్యకపోవటం అనేది, అత్యంత ప్రమాదకరమైన అంశమని, రాహుల్ పై కుట్ర జరిగిందన్నది తమ ఆరోపణని, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.. మరో పక్క ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ, వెంటనే రాహుల్ గాంధీకి ఫోన్ చేసే మాట్లాడారు.. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. ఘటన గురించి తెలిసింది అని, ఇలా ఎందుకు జరిగిందో శాఖా పరమైన ఎంక్వయిరీ జరుగుతుందని చెప్పినట్టు సమాచారం... రాహుల్ గాంధీ కూడా, ప్రధాని మోడీకి, ఘటన జరిగిన తీరు వివరించి, ప్రజల ఆశీర్వాదంతోనే క్షేమంగా బయట పడినట్టు రాహుల్ చెప్పారు..

ఇది ఇలా ఉండగా, విమానంలో సాంకేతికలోపం గురించి తెలిసిన వెంటనే కారణాలేమిటో తెలుసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని డీజీసీఏను ఆదేశించినట్లు కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. ఎవరైనా బాధ్యులని తేలితే తగిన చర్య తీసుకుంటామన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరు నిపుణులతో కమిటీని నియమించినట్లు డీజీసీఏ తెలిపింది. రెండు, మూడువారాల్లో నివేదిక వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంతకుముందు విమానం నడిపిన పైలట్‌ను సైతం ప్రశ్నించనున్నట్లు తెలిపింది. మరో పక్క, కర్ణాటకలో జరిగిన విషయం, కుట్ర ఆరోపణలు రావటంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ, అక్కడ తెలుగు వారు అంటున్నారు.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థుతుల్లో ఏదీ తీసి పరెయ్యలేమని చెప్తున్నారు...

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ప్రధాని మోడీ మీదే యుద్ధం ప్రకటించారు చంద్రబాబు... దీని వల్ల తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారని తెలిసినా, రాష్ట్రం కోసం తప్పలేదు... ఇలాంటి చంద్రబాబు ముందు, తోక జాడిస్తూ, పార్టీకి, చంద్రబాబుకి చెడ్డ పేరు తీసుకువస్తున్న కొంత మంది సొంత పార్టీ నేతల పై, ఇంకే రేంజ్ లో విరుచుకుపడతారు ? అదే జరిగింది, మాటి మాటికి చిరాకు పెడుతూ, రచ్చకి ఎక్కి, పరువు పొగుడుతున్న వారిని, గత రెండు రోజులు నుంచి, అమరావతి పిలుపించుకుని, లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పంపించారు... నేను గతంలో మాదిరిగా, నచ్చజెప్పే ధోరణిలో ఉండను, ప్రజల్లో పలుచన అయ్యే చర్యలు సహించను, మీకు ఇష్టమైతే క్రమశిక్షణగా ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ, సీనియర్ నాయకులని కూడా చూడకుండా, వాయించారు...

ముందుగా గురువారం రాత్రి దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను వాయించారు... బస్సు మీద బొమ్మ చిరిగితే, ఇంత రచ్చ చెయ్యటం ఏంటి, ప్రతి సారి మీరు ఇలా చేస్తే ఎలా ? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రోడ్డుమీద ఈ తగాదాలు, గొడవలేంటి? నా చాకిరీ అంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయునా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ఠ నాకు ముఖ్యం అంటూ చింతమనేని పై ఫైర్ అయ్యారు... ఇక, ఆళ్లగడ్డ తగాదా, నెలకు ఒకసారి చంద్రబాబు ముందుకు వస్తుంది... నిన్న అటు సుబ్బారెడ్డిని, అఖిల ప్రియను పిలిపించారు.. ఎన్ని సార్లు మీకు రాజీ కుదర్చను, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అంటూ ఖటువుగా హెచ్చరించారు..

సుబ్బారెడ్డిని ఉద్దేశిస్తూ, ఆళ్లగడ్డలో వేలు పెట్టవద్దు, మీకు ఎదో ఒక అవకాసం ఇస్తాను, పని చెయ్యండి అంటే, మీరు ఆగారు.. కానీ నీ తొందరపాటుతో పాడు చేసుకుంటున్నావు, మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు.. వింటే బాగుపడతారు. లేకపోతే మీ కర్మ అంటూ వాయించారు... ఇక అఖిలప్రియ పై ఎప్పుడూ లేని విధంగా, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ‘మీ అమ్మకు, నాన్నకు రాని అవకాశం నీకు వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు చిన్న పిల్లలు. రాజకీయంగా ఇంకా అనుభవం రాలేదు. సుబ్బారెడ్డికి, మీకు సమస్యలేవైనా ఉంటే ఎవరైనా మధ్యవర్తిని పెట్టి పరిష్కరించుకోండి. అంతేతప్ప పార్టీ వేదికగా వాటిపై పోరాటం చేయవద్దు’ అని ఆయన సూటిగా చెప్పేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో, ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు చేస్తున్న రచ్చ పై కూడా, ఇద్దరినీ పిలిచి హెచ్చరించారు... మీరు మారకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. నేను చెప్పింది నచ్చకపోతే బయటకు వెళ్లిపొండి. నాకేమీ అభ్యంతరం లేదు అని తెగేసి చెప్పారు.

‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా, విలేకరులు అడిగిన ప్రశ్నకు, చంద్రబాబు చెప్పిన సమాధానం ఆసక్తి కలిగించింది... సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారయణ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, ఆయన మీ పార్టీలో చేరతారు అనే ప్రచారం జగుతుంది, దీనికి మీ సమాధానం చెప్పండి అని చంద్రబాబుని అడగగా, ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు.. ఇవన్నీ ఊహాగానాలు అని, ఊహాజనిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తాం అంటూ, నవ్వుతూ చంద్రబాబు చెప్పారు... చంద్రబాబు చెప్పిన విధానం చూస్తుంటే, లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరతారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి...

మరో పక్క, తన పాదయాత్ర విశేషాలు చంద్రబాబు నెమరు వేసుకున్నారు... అయుదు సంవత్సరాల క్రితం, అనంతపురం జిల్లా హిందూపురంలో అక్టోబర్‌ 2న పాదయాత్ర ప్రారంభించి, సరిగ్గా ఇదే రోజున విశాఖలో ముగించామని చంద్రబాబు చెప్పారు. ఆ రోజు ఎంతో పవిత్ర భావంతో, పాదయాత్ర చేశానని, పాదయాత్ర చేపట్టక ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కాంగ్రెస్‌ పరిపాలన ఎంతో దారుణంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు... పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేశామని చంద్రబాబు అన్నారు. అప్పట్లో వృద్ధులకు కేవలం రూ.200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే 47 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేదని, నిరంతర విద్యుత్‌ కోతలు ఉండేవని చెప్పారు.

పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచామని, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశామని, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. పట్టిసీమను పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాకు తీసుకొచ్చామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు, రైతు, డ్వాక్రా రుణమాఫీ చేశామన్నారు. విభజన గాయాలు ఎన్ని ఉన్నా సొంత కష్టంతో నాలుగేళ్లుగా ఎదుగుతూ వచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజలకు ఎక్కడా ఇబ్బందిలేని పాలన ఇచ్చామని తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్లేవాళ్లమని వివరించారు. ఉద్యోగాల నుంచి రిటైర్డయిన కొందరు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై పుస్తకాలు రాస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. 

ఈ రాష్ట్రంలో మోడీని మొట్టమొదటి సారి, డైరెక్ట్ గా తిట్టి, పార్లమెంట్ వేదికగా "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్" అంటూ వాయించి వదిలిన గల్లా జయదేవ్ పై, జనసేన ట్విట్టర్ నుంచి విమర్శలు వచ్చాయి... రెండు రోజుల క్రితం, గల్లా జయదేవ్ తన ట్విట్టర్ లో, జగన్ - పవన్ కలిసిపోతున్నారు అని, త్వరలోనే ప్రజల ముందుకు కలిసి వస్తున్నారు అంటూ, ఒక ట్వీట్ చేసారు.. దానికి, తాపీగా రెండు రోజుల తరువాత, జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది... ఆ ట్వీట్ లో వాడిన భాష, ఒక పార్టీ ఆఫిషయల్ హేండిల్ నుంచి వచ్చిందంటే ఆశ్చర్యం వేస్తుంది... మా అధినేతే, చౌకబారు భాషలో ట్వీట్ లు చేస్తుంటే, మేమేమి తక్కువ అన్నట్టు, జనసేన పార్టీ కూడా తమ ఆఫిషయల్ హేండిల్ నుంచి అలాంటి భాషలోనే ట్వీట్ చేసి, ఒక కొత్త సంప్రదాయానికి తెర లేపింది...

‘‘వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’’ అంటూ జనసేన ఆఫిషయల్ హేండిల్ నుంచి ట్వీట్ వచ్చింది.. దీనికి వెంటనే జయదేవ్ రియాక్ట్ అయ్యారు. ‘‘4 సంవత్సరాల నుంచి సుమారు 100 సార్లు స్పీచ్ ఇచ్చాను. అంటే సెంచరీ కొట్టాను. ప్రత్యేక హోదా కోసం మేము కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రిపై యుద్ధం చేస్తూనే ఉన్నాం. మరి పవన్ కల్యాణ్ గారు ప్రధానమంత్రిపై ఎందుకు ఆధారపడుతున్నారో? అసలు ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? ఇక మా బ్యాటరీస్ గురించి చెప్పాలంటే.. అవి ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌తోనే ఉంటాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. నిజంగా అలాగే ఉంటాయి’’ అంటూ గల్లా దానిని రిప్లై ఇచ్చారు...

అయినా, గల్లా పార్లమెంట్ పెర్ఫార్మన్స్ చూసి , జనసేన ట్వీట్ చెయ్యల్సింది... ఇక్కడ చూడండి... http://www.prsindia.org/mptrack/jayadevgalla ... ఇప్పటి వరకు 105 చర్చల్లో గల్లా పాల్గున్నారు.. 432 ప్రశ్నలు వేసారు... 84 శాతం అటెన్డేన్స్ ఉంది... 6 ప్రైవేటు మెంబెర్ బిల్ లు ప్రవేశ పెట్టారు.. అయినా గల్లా మంచివాడు కాబట్టి అలా రిప్లై ఇచ్చారు.. మీ చిరంజీవి ఏమి చేసాడు అని అడిగితే, జనసేన బ్యాచ్ ఇది చూపించాలి http://www.prsindia.org/mptrack/chiranjeevikonidala.. 6 ఏళ్ళ పదవి కాలంలో, 2 చర్చల్లో చిరంజీవి పాల్గున్నారు... అది కూడా రాష్ట్రం విడిపోయే సమయంలో... సున్నా ప్రశ్నలు వేసారు... 32 శాతం అటెన్డేన్స్ ఉంది... సున్నా ప్రైవేటు మెంబెర్ బిల్ లు ప్రవేశ పెట్టారు.. ఇలాంటి ప్రొఫైల్ ఉన్న వీళ్ళు, ఎదుటి వారిని, హేళన చేస్తూ, మాట్లాడతారు... ఆ ఎదుటి వాళ్ళు, క్లాసు ఫస్ట్ అయితే, మనం లాస్ట్... సరిగ్గా హోం వర్క్ చేసే చావం.. మనకి కౌంటర్ లు ఎందుకు...

Advertisements

Latest Articles

Most Read