తన పార్టీ సహచరుడి కోసం చంద్రబాబు ప్రత్యెక శ్రద్ద తీసుకున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి, క-రో-నా బారిన పడి హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి రెండు రోజుల నుంచి క్షీణించింది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన, విశాఖపట్నం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు తెలుసుకుని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రంగంలోకి దిగారు. సహచరుడి క్షేమ సమాచారం, వారి కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. పరిస్థితి విషమించిందని గమించిన చంద్రబాబు, అమెరికాలోని ప్రముఖ వైద్య బృందంతో, ఇక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడించారు. విశాఖకు కంటే, హైదరాబాద్ నయం అని తలిచి, ఆయన కోసం ఒక ఎయిర్ అంబులెన్స్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అది అందుబాటులోకి వచ్చిన వెంటనే, సబ్బం హరిని హైదరాబాద్ తీసుకు రానున్నారు. మరో పక్క సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి పై ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా ఆరా తీసారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

క-రో-న సెకండ్ వేవ్ మన దేశంలో రోజు రోజుకీ ఉదృతం అవుతుంది. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. దగ్గర వారు కూడా క-రో-నా బారిన పడటం, ఇప్పుడు వింటున్నాం. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క, మందులు దొరక్క, ఇలా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు స్మశానాల్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకీ పరిస్థితి దయనీయంగా మారటంతో, కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఇంట్లో ఉన్న వారు కూడా మాస్కు పెట్టుకోవాలని, ఇలా పెట్టుకోవటం ఉత్తమం అని కేంద్రం సూచించింది. వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో, ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని సూచనలు ఇచ్చింది. మాస్కులు ధరిస్తే కో-వి-డ్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని తెలిపింది. అలాగే ఇంటికి ఎవరినీ రానీయవద్దని, ఎంత తెలిసిన వారు అయినా దూరం పెట్టాలని సూచించింది. అనవసరంగా బయట తిరగటం కూడా మంచిది కాదని సూచించింది. ఇంట్లో ఎవరికైనా పోజిటివ్ వస్తే, మిగిలిన వారు కూడా మాస్కు ధరించాలని కేంద్రం ప్రకటన చేసింది.

మన దేశంలో సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 20 రోజులు పై నుంచి, పరిస్థితి ఇలాగే ఉంది. అయితే అయుదు రాష్ట్రాల ఎన్నికలు అంటూ, వివిధ రాజకీయ పార్టీలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా, పెద్ద పెద్ద మీటింగ్ లు, ర్యాలీలు పెట్టటం వివాదస్పదం అయ్యింది. ఎవరు ఎన్ని చెప్పినా , ఎవరూ వినిపించుకోలేదు. అయితే ఇప్పుడు ఇదే అంశం పై, మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పై, మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. దేశంలో ఈ రోజు ఉన్న పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ దే బాధ్యత అంటూ నిప్పులు చెరిగింది. ఎలక్షన్ కమిషన్ పై హత్య కేసు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ప్రాసిక్యూట్ చేయాలని ఆగహ్రం వ్యక్తంక్ చేసింది. కనీసం ఓట్ల లెక్కింపు రోజు అయినా, తగు జాగ్రత్తలు తీసుకోవలని, తీసుకొని పక్షం పై, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఆపేస్తామని, తమకు పూర్తి ప్రణాళిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రంలో కో-వి-డ్ వ్యాప్తితో ప్రజలు నానాబాధలు పడుతున్నారని, ఆక్సిజన్ కొరతతో అంబులెన్సుల్లో, ఇతర వాహానాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం హృదయాన్ని కలచి వేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చరిత్రలో, గడచిన వందేళ్లలో ఇటువంటి పరిస్థితి చూడలేదన్నారు. క-రో-నా రెండోదశప్రమాదకరంగా మారనుందని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని గతంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి తొలిదశ క-రో-నా వ్యాప్తినుంచి, రెండోదశకు వచ్చేసరికి ఏం చర్యలు తీసుకున్నాడో చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అదనంగా ప్రజల ఆరోగ్యంకోసం ఎటువంటి సౌకర్యాలు తీసుకున్నారన్నారు. తొలిదశలో వీధుల్లో క-రో-నా రోగులుంటే, వెంటనే పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం, నేడు గ్రామాలకు గ్రామాలే వైరస్ బారినపడుతున్నా ఎందుకు స్పందించడంలేదన్నారు. తొలిదశలో తీసుకున్న చర్యలతో పోలిస్తే, రెండో దశ వ్యాప్తిలో ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేని అనేక ఆసుపత్రులకు ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేకపోయిందన్నా రు. ప్రజలంతా ప్రాణాలు కోల్పోయాక, ఆర్థికంగా కుటుంబాలకు కుటుంబాలే చితికిపోయాక ఈ ప్రభుత్వం మేల్కొంటే ఉపయోగం ఏముంటుందన్నారు. ప్రభుత్వ సలహాదారులు గా 42మందిని నియమించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యరంగనిపుణులను ఎందుకు నియమించలేకపోయాడన్నారు. అనుభవం లేని మంత్రులు ఏంచేస్తున్నారో వారికే తెలియడంలేదన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శులు, ఇతరత్రా సిబ్బంది ఉన్నా, వారే మీచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని సోమిరెడ్డి చెప్పా రు. కళ్యాణమండపాలను, కళాశాలలను వెంటనే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చి, తక్షణమే పారామెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు. సీరియస్ కండీషన్లో ఉన్నవారిని ఆసుపత్రులకుతరలిస్తూ, కొద్దిపాటి క-రో-నా లక్షణాలతో బాధ పడేవారికి ఆ విధంగా ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రాల్లోనే చికిత్స అందించాలని మాజీమంత్రి సూచించారు.

పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆక్సిజన్, పడక లు, వెంటిలేటర్లగురించి ఏనాడూకూడా ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబా లుగా మారాయని, ముఖ్యమంత్రి చెప్పినవిధంగా రూ.1000 పైన అయ్యేవైద్యఖర్చులకు రూపాయికూడా చెల్లించాల్సిన పనిలేదన్న మాటలు ఎక్కడా ఆచరణలో అమలుకావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీకింద కో-వి-డ్ రోగులకు ఆసుపత్రులు వైద్యం అందించడంలేదని, హెల్త్ స్కీములు, ఎంప్లాయీస్ స్కీములు ఏవీకూడా ఆసుపత్రులు అమలుచేయడంలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి ఎందుకు గుర్తించడం లేదన్నారు. కుటుంబాలకు కుటుంబాలు వైద్యఖర్చులు భరించలేక చితి కిపోయాయని, నెల్లూరులోని ప్రముఖ ఆసుపత్రిలో రూ.4, రూ.5లక్షలు చెల్లిస్తున్న బాధితులు అనేకమంది ఉన్నార న్నారు. బెంగుళూరు, హైదరాబాద్ వెళ్తూకూడా అనేకమంది చనిపోయారన్నారు. 30ఏళ్ల కుర్రాడి మొదలు, వృద్ధుల వరకు కళ్లముందే ప్రాణాలువిడుస్తున్నా పాలకుల్లో చలనం లేక పోవడం అత్యంత దారుణమన్నారు. రూ.2కోట్ల20లక్షల వరకు బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం, ఒక వెయ్యికోట్లతో వెంటిలేటర్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటుచేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రప్రభుత్వం తో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం క-రో-నా కట్టడికి చర్యలు తీసుకోకుంటే దారుణమైన స్థితినిచూడాల్సి వస్తుంద ని చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత అనేది అన్నిఆసుపత్రుల్లో ఉందని, వైద్యులు నర్సులు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వనిర్లక్ష్యం వల్లే కళ్లముందు ప్రాణాలు పోతున్నా, వైద్యులు ఏమీచేయలేక పోతున్నారని చంద్రమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ఆసుపత్రు లకు బకాయిఉన్నఆరోగ్యశ్రీ బిల్లులను ప్రభుత్వం ఇంతవర కు ఎందుకు చెల్లించలేకపోయిందన్నారు.

కో-వి-డ్ రోగులందరి కీ వైద్యం అందాలని, ఆరోగ్యశ్రీకింద వారికి సేవలు అందించా లని, అవసరమైన చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందనే మాట చెప్పిఉంటే, నేడు పరిస్థితి ఇంతదారుణంగా ఉండేది కాదన్నారు. అదనపు సౌకర్యాలు కల్పించడం, రెండో దశ క-రో-నావ్యాప్తికి తీసుకోవాల్సినచర్యలగురించి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం క్షమించరాని నేరమన్నారు. తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆక్సిజన్ ను తామే వినియోగించుకోవడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరిందని, అదేగనుక జరిగితే సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని రోగులపరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తక్షణమే ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను, పరికరా లను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని సోమిరెడ్డి డిమాం డ్ చేశారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులను వెంటనే చెల్లించాలని , అన్ని ఆసుపత్రుల్లో క-రో-నా చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ కొరతలేకుండా,ఎప్పటికప్పుడు పరి స్థితి సమీక్షించేలా ఆరోగ్య నిపుణల బృందాన్ని ఏర్పాటుచే యాలని చంద్రమోహన్ రెడ్డి సూచించారు. కేజ్రీవాల్ మాదిరే ధైర్యంగా ప్రధానితో మాట్లాడి, రాష్ట్రానికి అవసరమైన వాటిని ముఖ్యమంత్రి వెంటనే రప్పించుకోవాలన్నారు. ప్రభుత్వం మేల్కొనకపోతే, విజయనగరంలో జరిగిన ఘటనే, రేపు మరోచోట జరిగే అవకాశం ఉందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా రాని భయానక, దారుణమైన పరిస్థితి ఇప్పుడొచ్చిందని, ప్రభుత్వం వెంటనే కఠినంగా వ్యవహరించ కుంటే, ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతాయన్నా రు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలకోసం ఎంతఖర్చు పెట్టినా,ఇతర శాఖల నిధులను వినియోగించినా ఎవరూ పట్టించుకోరన్నారు. ప్రత్యేకశ్రద్ధతీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు.

Advertisements

Latest Articles

Most Read