క-రో-నా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం చేస్తుంది. చాలా రాష్ట్రాలు ఆంక్షలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది వేల కేసులు దాటుతున్నా, ఏపి ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. రోజు రోజుకీ కేసులు పెరుగుతూ ఉండటంతో, ఏపి ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. ఎట్టకేలకు ఆంక్షలు మోపింది. ఈ రోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఉప సంఘం, నిన్న సమావేశం అయి, జగన్ అనుమతి తీసుకుని నిన్న, వైద్య శాఖా మంత్రి ఆళ్ళ నాని, ఈ విషయం ప్రకటించారు. ఈ రోజు రాత్రి పది గంటల నుంచి, ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఉంటుంది. కేవలం ఎమర్జెన్సీ సర్వీస్ లు మినహాయించి, అన్ని సర్వీస్ లు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, రాత్రి పది గంటల నుంచి, ఉదయం 5 గంటల వరకు ఎవరూ రోడ్డుల పై సంచరించకుండా, ఇళ్ళ వద్దే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో పోలీసులు కూడా, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం, ఈ రోజు రాత్రి నుంచి, నైట్ కర్ఫ్యూ అమలు చేయటానికి రెడీ అయ్యారు. ప్రజలు సహకరించాలని కోరారు.

రాష్ట్రంలో క-రో-నా విలయతాండవంచేస్తోందని, రోజుకి 10వేలకు పైగా కేసులు, లెక్కకురాని మరణాలతో పరిస్థితి హృదయవిదారకంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. "నాపై, నరేంద్రపై పెట్టిన తప్పుడు కేసులన్నీ న్యాయస్థానాల్లో వీగిపోతాయి. నాపై పెట్టిన కేసులతాలూకా నిన్ననే న్యాయస్థానం తీర్పుఇచ్చింది. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుపై, 29వతేదీన సీఐడీ ఎదుట హాజరై, ఆధారాలతో సహా తెలియచేస్తాను. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను... పదిరోజుల్లో వస్తానని చెప్పినా వినకుండా, తాను తప్పించుకున్నానని, దొరకడం లేదని సాయిరెడ్డితో విషపు ట్వీట్లు చేయించారు. రోజుకోనోటీసు ఇచ్చి, కావాలని నానావిధాలుగా దుష్ప్ర్రచారం చేశారు. నాపై ఇంత హాడావుడిగా తప్పుడుకేసులు పెట్టడానికి కారణం పోలవరంలో ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేస్తున్న దోపిడీగురించి తాను నిత్యం ప్రశ్నించడమే. పోలవరంలో రూ.3222కోట్ల దోపిడీకి తెరలేపారు. ఒకే ఒక్కరోజులో రూ.2569కోట్లకు అంచనాలుపెంచారు. ఎవరి కోరకప్రకారం ప్రాజెక్ట్ అంచనావ్యయం పెంచారో చెప్పాలి. కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీకోసమా? పోలవరం హెడ్ వర్క్స్ డ్యామ్ పనులు అంచనాలు పెంచినప్పుడు ముఖ్యమంత్రిగానీ, మంత్రిగానీ మీడియాముందుకొచ్చి వివరణ ఇచ్చారా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చేశారు. పోలవరం డ్యామ్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర రూ.912కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం రూపొందించి, ఈ ముఖ్యమంత్రి గోదావరి డెల్టాను, కృష్ణా డెల్టాను ఉద్ధరిస్తాడా? పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. 196 టీఎంసీలనిల్వసామర్థ్యంతో దాని నిర్మాణం జరగాలి. పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపుఆలోచనతోనే రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఫోర్స్ ఫుల్ క్లోజర్ తో పనులు ఆపేయించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దగ్గరదగ్గర 3వేలకోట్లవరకు నిర్మాణ వ్యయం పెరిగింది. నాలుగేళ్లసమయం వృథా అయ్యింది. తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక, డ్యామ్ సైట్ లోని నిర్వాసితులకు గతప్రభుత్వాలుచేసిన అన్యాయాన్ని సరిదిద్దింది."

"నిర్వాసితులకు మరలా డబ్బులిచ్చి, వారిని బతిమాలి...బామాలి.. ఇళ్లుకట్టించి ఖాళీచేయించడం జరిగింది. డ్యామ్ సైట్ ఖాళీ అయ్యాకే పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు పెంచిన అంచనా వ్యయం రూ.3222కోట్లు, ఇసుకపేరుతో పెంచిన రూ.569కోట్ల వ్యవహారంపై ఈ ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. పోలవరం ప్రాజెక్ట్ ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి కోట్లాది ప్రజల ఆశలను నీరుగార్చాడు. ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాడు. ధూళిపాళ్ల నరేంద్ర బయటకువస్తే, ప్రభుత్వ దుర్మార్గం బట్టబయలవుతుంది. సంగండెయిరీ, విజయడెయిరీ, విశాఖ డెయిరీ వంటివాటిని దెబ్బతీయడానికి, అమూల్ ను బాగుచేయడానికే ముఖ్యమంత్రి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయించాడు. అమరావతికోసం పోరాడుతున్న అనేకమంది రైతులు, మహిళలు నేడు క-రో-నా బారినపడి, చావుబతుకుల్లో కొట్టుమిట్టాడు తున్నారు. అమరావతిని ఆవిధంగా చంపేసిన ముఖ్యమంత్రి, తనదోపిడీకోసం పోలవరాన్ని ఈ విధంగా నాశనంచేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఎన్ని తప్పుడుకేసులుపెట్టినా, ఎన్నిరకాలుగా వేధించినా, చంద్రబాబునాయుడిగారి నాయకత్వంలో వీరోచితంగా పోరాడుతూనే ఉంటాము. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందంకోసమే ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, ప్రశ్నించేవారిని అరెస్ట్ చేయిస్తున్నాడు. ముఖ్యమంత్రికి దమ్ము,ధైర్యముంటే క-రో-నా రోగులను పరామర్శించాలి. క-రో-నా-తో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవాలి. రాష్ట్రంలో ఏదోఒక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి క-రో-నా రోగులతో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి. క-రో-నా వ్యాక్సిన్ కోసం వేలాదిమంది క్యూలైన్లలో నుంచున్నా పట్టించుకునేవారే లేరు. వాలంటీర్లు దొంగఓట్లు వేయిస్తుంటే, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖం చాటేసి తిరుగుతున్నారు. " అని ఉమా అన్నారు.

టిడిపి నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను నిన్న ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నరేంద్ర అరెస్ట్ వెనుక రాజకీయం కోణంపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ధూళిపాళ్ల నరేంద్ర కొద్ది రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే స్టింగ్ ఆపరేషన్ చేసారు. ఆ కక్షతోనే, ఇలా చేసారని టిడిపి ఆరోపిస్తుంది. అమరావతిలో, దళితుల అసైన్డ్ భూములు దోచేశారు అంటూ, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై సిఐడి, చంద్రబాబు, నారాయణ పై కేసు పెట్టినవ్ విషయమై, ధూళిపాళ్ల నరేంద్ర ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు అన్నీ చెప్పటమే కాక, స్టింగ్ ఆపరేషన్ వీడియోలు కూడా బయట పెట్టారు. అందులో, మేము ఏమి ఫిర్యాదు చేయలేదని, సంతకాలు పెట్టుంచుకున్నారని, ఎందుకో కూడా చెప్పలేదని చెప్పటంతో, అమరావతి కేసు రాజకీయ ప్రేరేపితమైన కేసు అని అందరికీ అర్ధమై పోయింది. ధూళిపాళ్ల నరేంద్ర ఆ స్టింగ్ ఆపరేషన్ చేసి, జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయట పెట్టినందుకే, ఆయన పై ఇప్పుడు కక్ష పెట్టుకున్నారని లోకేష్ కూడా ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ, తెలుగుదేశం నేతలను ఇబ్బంది పెడుతున్నారని లోకేష్ అన్నారు. అయుదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతం అని, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసిన చరిత్ర ఉందని, అలాంటి వారిని, ఇలా అక్రమ కేసులు పెట్టి వేధించటం ఎంత వరకు సమంజసం అని లోకేష్ ప్రశ్నించారు.

dhulipalla 24042021 2

ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఇవే ఆరోపణలు చేసారు."క-రో-నా పరిస్థితి పై సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి, ఏసీబీ, సీఐడీ అధికారులతో గంటలతరబడి చర్చలు జరుపుతున్నాడు. ఈరోజు ఏమాజీమంత్రిని అరెస్ట్ చేయాలి... ప్రతిపక్షానికిచెందిన ఏనాయకుడిపై ఎలాంటి తప్పుడుకేసులు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ప్రశ్నించే గొంతులను ఎలా నొక్కాలనే దానిగురించి చర్చిస్తున్నాడు. నిన్న వందలకొద్దీ పోలీసులు, ఏసీబీ అధికారులు టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్రఇంటికెళ్లి, ఒక బందిపోటుని, గూండాను తీసుకొచ్చినట్లుగా ఆయన్ని అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర తండ్రిగారైన ధూళిపాళ్ల వీరయ్యచౌదరి సంగం డెయిరీని స్థాపించి, రూ.1100కోట్ల టర్నోవర్ వచ్చేస్థాయికి దాన్ని తీసుకెళ్లారు. నేడు ఆ సంస్థ పాడి రైతులకు లీటర్ పాలకు రూ.66చెల్లిస్తోంది. దానితోపాటు బోనస్ లు ఇస్తోంది. ఎంతోమంది పాడిరైతులకు అండగా ఉంటున్న సంగం డెయిరీ ఛైర్మన్ ఇంటిపైకి వందలమంది పోలీసులను పంపి, ఆయనకు అవినీతి మరక అంటించాలని చూస్తారా? దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చూపుతున్నది నరేంద్రమీద కక్షకాదు, అది సంగం డెయిరీపై ఉన్న కక్ష. ఈ ముఖ్యమంత్రి పెద్దఎత్తున రాష్ట్రంలో అమూల్ డెయిరీని ప్రోత్సహించి, దాన్ని బాగుచేయడంకోసం సంగండెయిరీని దెబ్బకొట్టడానికి, అవినీతికుట్రలో భాగంగా, రాజకీయకక్షలోభాగంగానే నరేంద్రను అరెస్ట్ చేయించాడు. నరేంద్రపై ముఖ్యమంత్రి ఉన్న కోపానికి కారణం.. గతంలో అతను జగన్మోహన్ రెడ్డి అక్రమఆస్తులను, అవినీతి గురించి అసెంబ్లీలో ప్రశ్నించడమే. జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను గురించి నరేంద్ర నిలదీశాడు. చంద్రబాబుపై, మాజీమంత్రి నారాయణపై అమరావతి భూములకు సంబంధించి పెట్టిన తప్పుడుకేసుల తాలూకా స్టింగ్ ఆపరేషన్లో ధూళిపాళ్ల నరేంద్ర సమర్థవంతంగా వ్యవహరించాడు. ప్రభుత్వంపెట్టినవన్నీ తప్పుడుకేసులేనని ఆధారాలతో సహా మీడియా ద్వారా నరేంద్ర నిరూపించాడు. నరేంద్ర ప్రభుత్వ తప్పుడుకేసులను ఎత్తిచూపి, వాస్తవాలు బయటపెట్టడంతో , అమూల్ ను భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రి, ఆ వంకతో నరేంద్రను లక్ష్యంగా ఎంచుకున్నాడు." అని అన్నారు.

తాడేపల్లిలోని విలాసవంతమైన రాజభవనంలో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి 15లక్షలమంది అమాయకులైన విద్యార్థులజీవితాలతో, తనస్వార్థ రాజకీయాలకోసం చెలగాటమాడుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. క-రో-నా రెండోదశ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో దేశంలోని 11రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వం వివిధరకాల పరీక్షలను వాయిదావేస్తే, ఈ దిక్కుమాలిన ముఖ్యమం త్రి 15లక్షలమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా డుతున్నాడని మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 30లక్షల కుటుంబాల్లో తీరని శోకం నింపడమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడన్నారు. రోజూ కొన్ని వందలమంది క-రో-నా-తో చనిపోతుంటే, కొన్ని లక్షల కుటుంబాలు భయాందోళనతో ఉంటే, అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలతో ఆటలాడేహక్కు ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని సత్యనారాయణమూర్తి నిలదీశారు. నారాలోకేశ్ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో చర్చించిన తర్వాత పరీక్షలువాయిదా వేయాలని ముఖ్యమంత్రిని కోరితే, కళ్లు నెత్తికెక్కిన అహంకారంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడన్నా రు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలు వాయిదా వేయాలనికోరుతోంటే, ఎంతసేపూ అక్రమార్జన గురించి, అవినీతి, దోపిడీలగురించి ఆలోచించే ముఖ్యమంత్రికి విద్యార్థినీ, విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందన్నారు. విద్యాదీవెన అంటూ విద్యార్థులను క-రో-నా-కి బలిచేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనా అని మాజీమంత్రి నిలదీశారు. తనకుమార్తెలను విదేశాల్లో చదివిస్తూ, వారిగురించి అన్నిరకాలుగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని పసిమొగ్గల గురించి ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. మంత్రి ఆది మూలపు సురేశ్ మూర్ఖుడిలా మాట్లాడుతున్నాడని, భావితరాలపై ఎందుకింతలా కక్ష కట్టారో మంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని బండారు డిమాండ్ చేశారు.

భూములమ్మితే ఎంతొస్తాయి... వేంకటేశ్వరస్వామి సంపదను ఎలా కొల్లగొట్టాలి... ప్రజలపై అధికంగా పన్నులభారంవేసి ఎలా దోచేయా లనే ఆలోచనలు తప్ప, ఈ ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టడంలేదన్నారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలనుబాధిస్తున్నాయా.. వారికి మేలుచేస్తున్నాయా అనేదానిపై ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచనచేయకపోతే ఎలాగని సత్యనారాయణమూ ర్తి నిలదీశారు. ముఖ్యమంత్రి చదువుకున్న మూర్ఖుడిలా, రాక్షసుడిలా వ్యవహరిస్తుంటే, బాధ్యతగల అధికారులు, మరీ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్ ఎందుకు స్పందించడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాల్సిరావడం ఆంధ్రా ప్రజలు చేసుకున్న పాపమని టీడీపీనేత వాపోయారు. 15లక్షల మంది విద్యార్థులకు ఏదైనా జరిగితే, వారి కుటుంబాలకు ఎవరు సమాధానంచెబుతారో ముఖ్య మంత్రి చెప్పాలన్నారు. రాష్ట్రంలో క-రో-నా కేసులు పెరుగు తున్నా... ఆక్సిజన్ కొరత, పడకలకొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నా, మరణాలు పెరుగుతున్నా ముఖ్యమంత్రికి అవేవీ పట్టడంలేదని సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించిందని, దాంతో మోదీ నేడు అత్యవసరసమీక్షా సమావేశం ఏర్పాటుచేశాడన్నారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలువేసినా ఈ ముఖ్యమంత్రికి మాత్రం సిగ్గుండదన్నారు. ప్రజలను, కోర్టులను, ప్రసార మాధ్య మాలను ఖాతరుచేయకుండా, మూర్ఖత్వంతో, డబ్బు పిచ్చితో, అధికారమదంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తు న్నాడని బండారు తేల్చిచెప్పారు. విద్యార్థులనే పసిమొ గ్గలు రాలిపోకుండా ముఖ్యమంత్రి వెంటనే పరీక్షలు వాయిదావేయాలని డిమాండ్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read