యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఈ రోజు మినీ రాజధాని రచ్చబండలో, జగన్ వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా మన తెలుగు వారు అయిన, జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వటం, అంతకు ముందు జగన్ చేసిన పనులు, ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ అయిన తరువాత, జగన్ నడుపుతున్న రాయబారాల గురించి బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లుగా అరాచక పాలనతో, ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కానీ ఇప్పుడు సీన్ మారిందని, రఘురామ రాజు అన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా మన తెలుగు బిడ్డ వచ్చారని, జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని, అప్పటి సుప్రీం కోర్టు జస్టిస్ గా ఉన్న ఎన్వీ రమణ ప్రభావితం చేసారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని న్యాయ నిపుణులు కోరుతున్నారు అంటూ, జగన్ మోహన్ రెడ్డి సాక్షిలో ఒక బోగస్ ప్రచారం చేసారని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వకుండా, జగన్ చేయని ప్రయత్నం లేదని, చివరకు విఫలం అయ్యారని అన్నారు. ఇలాంటి వ్యవహారాలకు జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీలో తన బ్రోకర్లని పెట్టారని, వాళ్ళు రేపే మోడీని దించేయలని జగన్ మోహన్ రెడ్డి కోరితే, దించేస్తాం అని చెప్పంత గొప్ప వాళ్ళని అన్నారు.

nvramana 25042021 2

జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో కూడా అదే జరిగిందని అన్నారు. మీరు ఫిర్యాదు ఇవ్వండి చాలు, రమణ చీఫ్ జస్టిస్ అవ్వకుండా మేము చేసుకుంటాం అని వాళ్ళు చెప్పటం, జగన్ మోహన్ రెడ్డి గుడ్డిగా వెళ్ళటం వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల విషయంలో, జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాలు ఇచ్చిన తరువాత, న్యాయ వ్యవస్థనే భయబ్రాంతులకు గురి చేసేలా జగన్ వ్యవాహరించారని అన్నారు. అయితే ఇప్పుడు తన ప్రయత్నాలు అన్నీ తారు మారు అయ్యాయని, జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వటంతో, జగన్ మోహన్ రెడ్డి అనూహ్య చర్యలకు దిగారని అన్నారు. తన సొంత బాబాయ్ , టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డిని, ఆశీస్సుల సాకుతో, రాయబారానికి పంపించారని అన్నారు. ఈ తిరుమల బ్యాచ్ ఎవరికీ చిడతల కొట్టమంటే వారికి కొడతారని, మూడు నెలలు క్రిందట రమణ గారు తిరుమల వస్తే, ప్రోటోకాల్ పాటించని వారు, ఇప్పుడు వెళ్లి రాయబారం నడుపుతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

రాష్ట్రమంతటిదీ ఒకదారి అయితే, జగన్మోహన్ రెడ్డి తనది మరోదారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, విద్యార్థుల చదువులకు సంబంధించిన పరీక్షలను, వారి జీవితాలకు విషమపరీక్షలుగా ఈ ముఖ్యమంత్రి మార్చాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లా డారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఈ ప్రభుత్వం మొండిగా, మూర్ఖంగా వ్యహరిస్తోందన్న రామానాయుడు, 15లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉన్నారని, వారి కుటుంబసభ్యులతో కూడా దాదాపు 60లక్షలమందిని, 30 నుంచి 40వేలమంది ఉపా ధ్యాయులు, లెక్చరర్లను వారి కుటుంబాలను ముఖ్యమంత్రి తన మూర్ఖత్వానికి బలి తీసుకోబోతున్నాడన్నారు. వారితో పాటు, పారిశుధ్యకార్మికులు, విద్యా సంస్థల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది కలిపీ దగ్గర దగ్గర 90 లక్షల కుటుంబాల వరకు కో-వి-డ్ వైరస్ బారినపడే ప్రమాదం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. ఇంత తెలిసీకూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతాననడం మూర్ఖత్వం కాక ఏమవుతుం దన్నారు. తెలంగాణ సహా, పదిరాష్ట్రాల ప్రభుత్వాలు పది, ఆపై తరగతులు పరీక్షలు, ఇతరత్రా పోటీ పరీక్షలను వాయిదా వేయడం జరిగిందన్నారు. దేశంలో 10లక్షల కో-వి-డ్ కేసులతో, ఏపీ 6వస్థానంలో ఉందన్ననిమ్మల, తొలి 5స్థానాల్లోఉన్న అన్నిరాష్ట్రాలు పరీక్షలను ఇప్పటికే వాయిదా వేయడం, రద్దుచేయడం చేశాయన్నారు. జగన్మో హన్ రెడ్డి తనఫ్యాక్షన్ స్వభావంతో, మొండిపట్టుదల తో విద్యార్థులు, వారి కుటుంబాలజీవితాలతో చెలగాటమా డుతున్నాడని టీడీపీ నేత మండిపడ్డారు. పరీక్షలు నిర్వహి స్తే హాజరవ్వాలా వద్దా అనేఅంశంలో కూడా విద్యార్థులు సందిగ్ధావస్థలో ఉన్నారన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించినదంటూ మోడల్ పేపర్ ఒకటి బయటకొచ్చిందని, అదిచూశాక పదోతరగతి విద్యార్థు లు మరింత గందరగోళానికి గురవుతున్నారన్నారు.

గతంలో ఒక్కో సబ్జెక్ట్ కి రెండు ప్రశ్నపత్రాలను (ఒక్కోటి 50మార్కులకు) ఇచ్చేవారని, ఇప్పుడు ఒక ప్రశ్నపత్రాన్నే 100 మార్కులకు పెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందన్నా రు. ప్రశ్నపత్రంలో ఎన్నిమార్కుల ప్రశ్నలు ఎన్నిఉంటాయో , ఎటువంటి అవగాహనలేకుండా విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారో ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి సమాధానంచెప్పాల ని నిమ్మల డిమాండ్ చేశారు. క-రో-నా దృష్ట్యా విద్యాసంవత్సరాన్ని కుదించిన ప్రభుత్వం, జనవరి 22న పాఠశాలలు ప్రారంభించిందన్నారు. అంతకు ముందు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వపాఠశాలలోనూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించిన దాఖాలాలు లేవన్నారు. జనవరి 22 తర్వాతే విద్యార్థులు వారి పాఠ్యాంశాలపై, తరగతి గదుల్లో దృష్టిపెట్టారని, అప్పటి నుంచి ఏప్రియల్ 22వరకు మాత్రమే పాఠ్యాంశాల బోధన జరిగిందన్నారు. కేవలం 3నెలల సమయంలో విద్యార్థులకు చెప్పాల్సిన సిలబస్ ఏదీ పూర్తికాలేదన్నారు. ఆ మూడునెలల సమయంలో ప్రభుత్వం ఉపాధ్యాయులను స్థానిక ఎన్నిక లకు వినియోగించడమే సరిపోయిందని, దానితో విద్యార్థుల పాఠ్యాంశాల బోధన ఎక్కడికక్కడే నిలిచిపోయిందన్నారు. అన్ని సబ్జెక్ట్ లకు సరైన ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనమొత్తం అసంపూర్తిగానే ఉండిపోయిందన్నారు. విద్యాసంవత్సరం కుదించారు కాబట్టి బోధనాంశాలను తగ్గిస్తారని భావించామని, కానీ ప్రభుత్వం అలాంటిచర్యలేవీ తీసుకోలేదన్నారు. ఒక్కో అధ్యాయానికి సంబంధించి చివరి 3, 4 పేజీలు తొలగించడం వల్ల ఆ అధ్యాయాన్ని అసంపూర్తిగానే విద్యార్థినీ, విద్యార్థులు అవగతం చేసుకోవాల్సినదుస్థితిని ఈ మూర్ఖపు ముఖ్యమం త్రి కల్పించాడన్నారు. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే తీసేసిన అధ్యాయంలోని అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఇస్తారా లేక చదివిన అంశాలకు సంబంధించి ఇస్తారా అనేది కూడా విద్యార్థులకు అర్థంకావడంలేదన్నారు.

ఈ విధంగా లోపభూ యిష్టమైన విధ్యావిధానాన్ని కావాలనే సృష్టించిన ప్రభుత్వం, పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలను కోవిడ్ కు బలిచేయా లనిచూడటం దుర్మార్గమని రామానాయుడు మండిపడ్డారు. విద్యార్థులు, వారి కుటుంబాలతో చెలగాటమాడే హక్కు ఈ ముఖ్యమంత్రికి, విద్యాశాఖమంత్రికి ఎవరిచ్చారన్నారు. తాడే పల్లి దాటి బయటకురాని ముఖ్యమంత్రికి, మంత్రికి విద్యార్థు లు పరీక్షలు రాయడంలో ఉండే సాధకబాధకాలు తెలియక పోవడం సిగ్గుచేటన్నారు. పిల్లలే తమప్రాణంగా బతికే తల్లి దండ్రులకు ఈముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతాడో చెప్పాలన్నారు. మొండిపట్టుదలకు పోకుండా, ముఖ్యమం త్రి, విద్యాశాఖమంత్రి పరీక్షలను వాయిదావేయాల్సిందేనని నిమ్మల తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయ కపోతే, టీడీపీ జాతీయప్రధానాకార్యదర్శి నారా లోకేశ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తారని రామానాయుడు హెచ్చరించా రు. అవసరమైతే టీడీపీ న్యాయపోరాటంచేసైనా సరే, ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, ప్రభుత్వం మెడలు వంచితీరుతుందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రసారమాధ్యమాల్లో వచ్చే వార్తలు, కథనాలన్నీ మారిపోయాయని, ఏప్రతిపక్ష నేత ఇంటిని కూలుస్తారో, ఏ నాయకుడిని అక్రమకేసులతో అరెస్ట్ చేస్తారో నని మీడియాతోపాటు, ప్రజలంతా వేచిచూడాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యంపై, వారి ప్రాణాలను కాపాడటంపై శ్రద్ధపెడితే మంచిదని నిమ్మల హితవుపలికారు.

ఒక పక్క క-రో-నా తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, టీకాలు స్టాక్ లేక, మందులు దొరక్క, ఇలా అనేక ఇబ్బందులు ఉంటే, అవి పట్టించుకోవలసిన ప్రభుత్వాలు, ఈ సమయంలో కూడా రాజకీయం, కక్ష సాధింపు మీదే ఉన్నాయి. వీకెండ్ వచ్చింది అంటే, జేసిబీలతో దిగుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ వీకెండ్ కూడా మళ్ళీ కూల్చివేతలు మొదలు పెట్టింది. పాత గాజువాకలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విశాఖ ఉక్కు కోసం ముందుండి పోరాటం చేస్తూ, నిరాహార దీక్ష కూడా చేసిన పల్లా శ్రీనివాస్‍కు చెందిన భవనాలను ఉదయమే వచ్చిన జీవీఎంసి అధికారులు కూల్చేస్తున్నారు. ఆ భవనాలు నిర్మాణంలు ఉన్నాయి. ఈ భవనాలు అన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే కూల్చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇందు కోసం భారీగా పోలీసులను కూడా రంగంలోకి దించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని,అసలు ఏ తప్పు జరిగిందో చెప్పలేదని, ఏమి లేకుండా ఉన్న పళంగా వచ్చి, కుల్చేస్తున్నారని, పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా, అసలు ఎలా కూల్చేస్తారని నిలదీశారు. పల్లా శ్రీనివాస్ కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అధికారాలు మాత్రం నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు.

gajuwaka 25042021 2

పల్లా శ్రీనివాస్ మాత్రం, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, నోటీసులు ఇస్తే అమ్మవారి గుడిలో ప్రమాణం చేయాలని అధికారులను నిలదీశారు. అయినా అధికారులు మాత్రం, తమ పని తాము చేసుకు పోతున్నారు. ఈ ఘటన పై టిడిపి నేతలు భగ్గుమన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రజలు ఒక పక్కన ఇబ్బందులు పడుతుంటే, అవేమీ పట్టించుకోకుండా, టిడిపి నేతల పై కక్ష సాధింపుకి దిగారని వాపోయారు. జగన్ మోహన్ రెడ్డి, పని దినాల్లో అక్రమాలు, సెలవు దినాల్లో విధ్వంసాలు చేస్తుందని వాపోయారు. ఇంట్లో మనుషులు లేని సమయంలో దొంగలు పడినట్టు, కోర్టు సెలవు దినాల్లో ఇలా చేయటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పల్లా శ్రీనివాస్ పై కక్ష సాధింపు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా లేక రాక్షసులు పాలిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది అని అన్నారు. అధికారం శాశ్వతం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్నటినిన్న ఒక దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడని, ధూళిపాళ్ల నరేంద్ర, వారి తండ్రిగారైన వీరయ్యచౌదరి గురించి గుంటూరుజిల్లా వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, గౌరవప్రదమైన కుటుంబనుంచి వచ్చి, ప్రజాభిమానంతో 5సార్లు ఎమ్మల్యేగా గెలిచిన వ్యక్తిని తెల్లవారుజామున ఏసీబీ వారు ఇంటికెళ్లి దారుణంగా అరెస్ట్ చేయడం దారుణాతి దారుణమని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరోసభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో విలేకరులకు అందచేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "ధూళిపాళ్ల నరేంద్ర వంటి పెద్దనాయకులను అరెస్ట్ చేసే ముందు, తగినఆధారాలు చూపి, నోటీసులిచ్చి, తరువాత చర్యలకుఉపక్రమించాలి. ఏ ఆధారాలు లేకుండా, నోటీసులు ఇవ్వకుండా టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్లు నరేంద్రను అరెస్ట్ చేశారు. ఇంటిలోని ఆడవాళ్లను బెదరించారు. నరేంద్రను అంత దారుణంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమిటీ దారుణం. ఒకపక్క కరోనాతో ప్రజలు చనిపోతున్నా శాడిస్ట్ ముఖ్యమంత్రికి ఏమీ పట్టడంలేదు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ దొరకడంలేదు. టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవు. కరోనా రోగుల గోడు పట్టించుకునే నాధుడే లేడు. ఇవేమీ పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లోకూర్చొని, ఎవరైతే తనను, తన ప్రభుత్వాన్ని, తన అవినీతిని ప్రశ్నిస్తున్నారో, వారిని లోపలేయాలని చూస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రికి బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చింది. ఇదివరకు అచ్చెన్నాయుడును కూడా ఏతప్పూలేకపోయినా అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. కొల్లురవీంద్రనుకూడా అదేమాదిరి తప్పుడుకేసులతో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఇప్పుడు నరేంద్ర గారిని అదేవిధంగా అరెస్ట్ చేయించారు. మరోపక్క మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా నోటిసులిచ్చారు. ఈ ముఖ్యమంత్రే పెద్ద దొంగ, దోపిడీదారు. ఆయనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలంతా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వారిమీద చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి, ప్రతిపక్షపార్టీకి చెందినవారిపై తప్పుడుకేసులు పెడుతున్నాడు. ఈ ప్రభుత్వం నరేంద్రపై చేస్తున్న ఆరోపణలేమిటి? సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ లోకి మార్చడం తప్పని చెబుతున్నారు."

"సంగం డెయిరీ తరుపును ఒక ట్రస్ట్ ఏర్పాటుచేసి, ఆసుపత్రి నిర్మించి, పేదలకు, మధ్య తరగతివారికి ఉచితంగా, నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి నరేంద్ర ప్రయత్నించాడు. అదికూడా తప్పేనని ఈ ప్రభుత్వం అంటోంది. పక్కరాష్ట్రంలోని నల్గొండలో ఒక డెయిరీని, విశాఖపట్నంలోని విశాఖ డెయిరీని కూడా కంపెనీ యాక్ట్ పరిధిలోకి మార్చారు. అదికూడా తప్పేనా? అది ఒప్పు అయినప్పుడు సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ లోకి తీసుకురావడం కూడా ఒప్పే కదా? ఒక వేళ అది తప్పయితే, సంగండెయిరీ కంటే ముందే కంపెనీ యాక్ట్ లోకి వచ్చిన నల్గొండ డెయిరీ, విశాఖ డెయిరీల నిర్వాహాకులపై ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారినెందుకు అరెస్ట్ చేయించలేదు? విశాఖ డెయిరీ వారు వైసీపీవారు కాబట్టి, ముఖ్యమంత్రి వారిపైకి ఏసీబీవారిని పంపలేదా? తనపార్టీ వారు అయితే ఏంచేసినా పర్లేదా? లేకుంటే పార్టీలోకి వచ్చేటప్పుడు కోట్లాదిరూపాయలు కప్పం కడతారు కాబట్టి, వారిని ముఖ్యమంత్రి టచ్ చేయడా? విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేసినప్పుడు, భోజనాలు, టిఫిన్లు, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్ల వంటివవన్నీ విశాఖ డెయిరీవారే పంచారు కాబట్టి, వారిపై చర్యలు లేవా? మంచీచెడూ లేకుండా శాడిస్ట్ ముఖ్యమంత్రికి ఎవరు కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటాడా? నరేంద్ర కుటుంబం ఏమిటి.. వారి పరపతి ఏమిటి... వారుచేసిన సేవలేంటి అనేది ఆలోచించరా? నిజంగా నరేంద్రగానీ, ఆయనకుటుంబంగానీ తప్పుచేస్తే ఏంచేశారో చెప్పాలికదా? దాన్ని నిరూపించాలి కదా.. ఆతరువాత కదా ఆయన్ని జైలుకు పంపాల్సింది. ఇవేవీ చేయకుండా రాత్రికి రాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయాల్సిన ఎమర్జన్సీ పరిస్థితి ఏమొచ్చింది. నరేంద్రచేసింది తప్పయితే , విశాఖ డెయిరీ నిర్వాహకులు చేసిందికూడా తప్పే కదా? ఏసీబీ వాళ్లకు నిజంగా మానవత్వముంటే, వారి విధినిర్వహణపై వారికి నమ్మకముంటే, విశాఖ డెయిరీ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలి."

"ఇవన్నీ మీడియావారికిచెప్పాను కాబట్టి, నాదేమైనా తప్పుంటే నాకు సమాధానం ఇవ్వండి. దానిలో తప్పులేదు. నేను ఇప్పుడుచెప్పింది తప్పయితే సరిదిద్దుకుంటాను. ఏసీబీవారికి, సీఐడీవారికి, పోలీసులకు ఒక విషయం చెప్పాలి. నా చిన్నతనంలో పోలీస్ శాఖ, అనుబంధ శాఖలను చూస్తే ఎవరైనా గర్వంగా ఫీలయ్యేవారు. న్యాయంచేస్తారని నమ్మేవారు. కానీ ఇప్పుడుచూస్తుంటే, ఇంతలా దిగజారిపోయారేంటి అనిపిస్తోంది. స్వతంత్ర సంస్థలైన ఏసీబీ, సీఐడీ, పోలీస్ శాఖలు ఒక దొంగ జేబులో దూరిపనిచేస్తున్నాయి. సీఐడీ అధికారుల పనితీరుగురించి గతంలో సినిమాల్లో చాలా గొప్పగా చూపేవారు. ఇప్పుడు రాజకీయ నేతలుఏంచెప్తే వారి ఇళ్లపైకి వెళ్లడం, ముఖ్యమంత్రి చెప్పినవారిని అరెస్ట్ చేయడం చేస్తారా? అధికారులు, లేదా నాయకలు అవినీతికి పాల్పడితే, లంచాలు తీసుకుంటే, ప్రజలు వారిపై ఫిర్యాదుచేశాక, సీఐడీ, ఏసీబీ విభాగాలు స్పందించేవి. కానీ ఇప్పుడలా లేదు. ముఖ్యమంత్రి చెప్పడమే ఆలస్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ డెయిరీ, విశాఖ డెయిరీలపై తాముకూడా ఫిర్యాదుచేస్తాము.. ఏసీబీ వారు చర్యలు తీసుకుంటారా? లేక ముఖ్యమంత్రి అనుమతికోసం ఎదురు చూస్తారా? ఏంటండీ ఇది.. వ్యవస్థలు ఇలా దిగజారిపోతే, సామాన్యుడు న్యాయం కోసం ఎవరిదగ్గరకు వెళ్లాలి. పోలీస్ శాఖ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏపీ పోలీస్ అంటే దేశమంతా అసహ్యించుకుంటోంది. ఒక దొంగోడు చెప్పినట్టు నడుచుకుంటూ, దొంగఓటర్లను అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఏసీబీ, సీఐడీ విభాగాలు స్వతంత్ర సంస్థలని, ఆయా విభాగాల అధిపతులు గుర్తిస్తే మంచిది. ఉన్నతమైనస్థానాల్లో ఉన్న అధికారులు ప్రజల్లో మీపై ఉన్న నమ్మకాన్ని పోగోట్టుకోవద్దని విజ్ఞప్తిచేస్తున్నాను. ఎవరు తప్పుచేసినా అరెస్ట్ చేయండి...కానీ ఆధారాలతో సహానిరూపించండి. రాజకీయ నాయకుల ఒత్తిడితోనో, శాడిస్ట్, తుగ్లక్ ముఖ్యమంత్రి ఆదేశాలతోనో పనిచేయకండి. ఎవరినైనా జైల్లో పెట్టి అద్దంలో చూసుకొని నవ్వుకోవడం ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రికి అలవాటు. ఆ విషయం ఏసీబీ, సీఐడీ అధికారులు గ్రహించాలని కోరుతున్నాను."

Advertisements

Latest Articles

Most Read