ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం కంటే, ఖర్చులు ఎక్కువ. అందుకే అప్పులు తెచ్చి, భూములు అమ్మి నెట్టుకుని వస్తున్నారు. గత 18 నెలల కాలంలో లక్షా 20 వేల కోట్లు వరకు అప్పు చేసారు. అంటే గత ప్రభుత్వ హయంలో 5 ఏళ్ళలో చేసినంత అప్పు. పోనీ దీని నుంచి ఆదాయం వచ్చే పనులు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇలా మొత్తానికి ఏదో రకంగా అప్పులు చేసి నెట్టుకుని వస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గిస్తున్నారా అంటే, ఎక్కడ చూసినా భారీ ఖర్చులే. ఇంకా చెప్పాలి అంటే అనవసరపు ఖర్చులు అని కూడా చెప్పవచ్చు. కానీ అది ప్రభుత్వానికి అవసరం ఏమో. ఇక విషయానికి వస్తే, అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి రైతులు వివిధ కేసులు హైకోర్టులో వేసారు. ఈ కేసులు కోసం ప్రభుత్వం, బడా బడా లాయర్లను తీసుకుని వస్తుంది. అందులో ఢిల్లీలో ఉండే టాప్ లాయర్లు కూడా ఉన్నారు. గట్టిగా గంట వాదిస్తే, లక్షలు లక్షలు ఇవ్వాల్సిందే. అలాంటి లాయర్లను ప్రభుత్వం తన వాదనలు విపించటానికి పెట్టుకుంది. అయితే వీళ్ళు ఎంత వరకు సక్సెస్ అవుతారు అనేది పక్కన పెడితే, ప్రభుత్వం వారికి ఇచ్చిన మొదటి విడత ఫీజు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. అప్పుడెప్పుడో ఒక లాయర్ కోసం 5 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వివిధ పెద్ద పెద్ద లాయర్లకు డబ్బులు విడుదల చేసారు.

cases 12112020 2

నిన్న ప్రభుత్వం అమరావతి కేసులు విషయంలో, అటు సుప్రీం కోర్టులో, ఇటు హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఫీజులు కింద రూ.2.3 కోట్లు వరకు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఇందులో న్యాయవాదులు పరంగా వారికి చెల్లించిన ఫీజు వివరాలు చూస్తే, ప్రముఖ లాయర్ హరీష్‌ సాల్వేకి రూ.45 లక్షలు ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక మరో ప్రముఖ లాయర్ రాకేష్‌ ద్వివేదికి రూ.73 లక్షలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది కూడా అయినా కపిల్‌ సిబల్‌కి రూ.25 లక్షలు విడుదల చేసారు. నిన్న నంద్యాల కేసులో టిడిపి లాయర్ పై నిందలు వేసారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ లాయర్ ని ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నిస్తే ? సరే మనకు ఎందుకులే. ఇక ఆత్మారాం నాదకర్ణికి రూ.17.60 లక్షలు, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌కి రూ.18.10 లక్షలు, నిరంజన్‌రెడ్డికి రూ.22 లక్షలు ఇలా విడుదల చేస్తూ, అమరావతి కేసు విషయంలో ప్రభుత్వ వాదనను సమర్ధవంతంగా వినిపిస్తున్నారు. అయితే అమరావతిని మూడు ముక్కలు చేయటమే ఒక తెలివి తక్కువ నిర్ణయం అనుకుంటే, ఆ నిర్ణయం సమర్ధిస్తూ మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టటం ఏమిటి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి జరిగిన కేసులో, గత ప్రభుత్వం కేసులు పెట్టింది. 2018 మే నెలలో కొంత మంది యువకులు, ఒక పద్దతి ప్రకారం పోలేస్ స్టేషన్ పై దాడి చేసారు. దీంతో గత ప్రభుత్వంలో పోలీసులు కేసు నమోదు సెహ్సారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఆగస్టు 12న, జీవో 776 ను విడుదల చేసి, ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. అయితే దీని పై దుగ్గిరాలకు చెందిన పసుపులేటి గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో దీని పై పిటీషన్ దాఖలు చేసారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద, పిటీషన్ దాఖలు చేసారు. దీని పై గతంలోనే ఒకసారి విచారణ జరిగింది. దీని పై స్టే ఇచ్చిన హైకోర్టు, ఎన్ఐఏని కూడా ప్రతివాదిగా చేర్చాలని పితీషినర్ ను కోరింది. అయితే ఈ కేసు ఇప్పుడ మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవి ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది. పిటీషనర్ స్పందిస్తూ, కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్ఐఏను ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటీషన్ వేసినట్టు కోర్టుకు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఎన్ఐఏ తరుపు న్యాయవాది చేసిన వాదనతో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు షడ్యుల్ నేరాల క్రిందకు రాదని, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సి తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

hc 121122020 2

కేంద్రం హెం శాఖ నుంచి తమకు అనుమతి రావాలని, అనుమతి రాకుండా తాము విచారణ చేయలేమని కోర్టుకు చెప్పారు. దీని పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కేవలం ఎఫ్ఐఆర్ చూసేసి, ఇవి షడ్యుల్ నేరాల క్రిందకు రావాలని ఎలా చెప్తారు అంటూ, హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ పోలీస్ ఆక్ట్ ప్రకారం నడుచుకునే సిబిఐ కూడా పరిమితులు ఉంటాయని, కానీ వారు తమ ఆదేశాలు పాటిస్తున్నారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 226 ప్రకారం, మిమ్మల్ని దర్యాప్తు చేయమని చెప్పే హక్కు తమకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆగ్రహంతో ఎన్ఐఏ తరుపు న్యాయవాది స్పందిస్తూ, హైకోర్టు ఏమి ఆదేశాలు ఇస్తే అవి పాటిస్తామని, ఏది చెప్తే అది చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇక మరో పక్క సిబిఐ తాము అఫిడవిట్ దాఖలు చేసామని, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపింది. కౌంటర్ అఫిడవిట్ అందకపోవటంతో, అది జత చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, కేసుని నవంబర్ 18కి వాయిదా వేసింది. మరో పక్క తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటి వరకు కొనసాగుతాయని తెలిపింది.

ఒక పార్టీ విధానాలు నచ్చక, వేరే పార్టీలో చేరటం, మనం చూసే రాజకీయాల్లో సర్వ సాధారణం. ఎమ్మెల్యే పదవుల్లో ఉన్న వాళ్ళే, పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారుతున్న రోజులు ఇవి. రాజీనామా చేయకుండా వస్తే కుదరదు అని చెప్పిన వాళ్ళే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. అయితే పదవుల్లో లేని వాళ్ళు, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక వేరే పార్టీలో చేరటం సర్వ సాధారణం. అయితే మన రాష్ట్రంలో దానికి కూడా అవకాసం లేనట్టు ఉంది. మా పార్టీని కాదని వేరే పార్టీలోకి వెళ్తావా అంటూ, ఆ నాయకుడుని కిడ్నాప్ చేసిన షాకింగ్ ఘటన, ఇప్పుడు ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా కిడ్నాప్ లు చేయటం, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సమయంలో చూసాం. అయితే ఇప్పుడు వెరైటీగా, పార్టీ మారతాను అంటే కిడ్నాప్ చేసేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఆయన గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని చండ్రాజుపాలెంకు చెందిన, వైసీపీ మండల స్థాయి నాయకుడు. ఆయన పేరు గాదె వెంకటరెడ్డి. వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన నాయకుడు. మొన్న ఆరు నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల నామినేషన్ లో కూడా, బెల్లంకొండ జడ్పీటీసీ అభ్యర్ధిగా వైసీపీ తరుపున నామినేషన్ వేసారు. మొన్నటి దాకా వైసిపీ గెలుపు కోసం అన్ని విధాలుగా పని చేసారు. అయితే ఎందుకో కానీ ఆయనకు పార్టీకి గ్యాప్ వచ్చింది.

tdp 1112020 2

ఆయన్ను పార్టీ పట్టించుకోవటం మానేసింది. కొద్ది రోజులు క్రితం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వచ్చిన సమావేశానికి వెళ్ళినా, అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కావాలనే తనను పక్కన పెడుతున్నారని, ఇది అవమానంగా భావించి, పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక తెలుగుదేశం నేతలతో మాట్లాడారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌ హైదరాబాద్ లో ఉండటంతో, వారి సమక్షంలో పార్టీలో చేరాలని, తన అనుచరులతో కలిసి బయలు దేరారు. అయితే ముందుగా ఆయన నలుగురుతో కలిసి కార్ లో హైదరాబాద్ బయలు దేరి వెళ్ళగా, కొద్ది సేపటి తరువాత, ఒక వంద మంది అనుచరులు కూడా హైదరాబాద్ వెళ్లారు. అయితే, హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డు వద్ద ఆయన కారు ఆపిన కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు, కారు తాళాలు లాక్కుని, ఆయన్ను తీసుకుని వెళ్లారు. ఆయన ఆచూకీ కోసం వెతుకుతూ ఉండగా, తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయతే ఆయన తనని ఎవరూ కిడ్నాప్ చేసినట్టు చెప్పలేదు. అయితే ఇదంతా వైసీపీ చేసిన పని అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. చివరకు పార్టీ మారతాం అంటే కూడా, ఇలా వేదిస్తారా అంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. అయితే ఇది కిడ్నాప్ ఆ, లేదా బెదిరించారా అనేది మిస్టరీ గానే మిగిలిపోయింది.

నంద్యాలలో జరిగిన అబ్దుల్ సలాం కేసు విషయం అందరికీ తెలిసిందే. సేల్ఫీ వీడియో బయటకు వచ్చి, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు గొడవ చేయటం, తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వటంతో, ఘటనకు బాధ్యత వహిస్తూ, సిఐ, కానిస్టేబుల్ పై కేసులు పెట్టి కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. అయితే ఆ కేసులో 12 గంటల్లోనే బెయిల్ వచ్చింది. అరెస్ట్ చేపించాం అని ప్రచారం చేసుకున్నంత సేపు కూడా, వాళ్ళు జైల్లో లేరు. సహజంగా పెట్టే కేసులు బట్టి, పోలీసులు తరుపు వాదించే న్యాయవాదులను బట్టి, కోర్టులో జడ్జి బెయిల్ పై నిర్ణయం తీసుకుంటారు. నిందితులకు బెయిల్ వచ్చింది అంటే అది నిందితుడు తరుపు న్యాయవాది వాదన కంటే, దర్యాప్తు సంస్థలు బలంగా వాదించలేదని, పెట్టన సెక్షన్ లకు, సరైన ఆధారాలు కోర్టుకు చూపించలేదని అర్ధం. అయితే, చివరకు ఈ విషయాన్ని కూడా వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది. తమ అసమర్ధ పాలనతో , ఒక పక్క కుటుంబం మొత్తం చనిపోతే, ఆ విషయం పట్టించుకోకుండా, అరెస్ట్ అయిన పోలీసులు తరుపున వాదనలు వినిపించింది తెలుగుదేశం లాయర్ అంటూ, అసంబద్దమైన వాదన తీసుకుని వచ్చారు. ఘటన ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎందుకు ఇన్నాళ్ళు వారిని అరెస్ట్ చేయలేదు, మూడు నెలల నుంచి వేధిస్తుంటే ఏమి చేస్తున్నారు, ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోవటానికి కారణం ఎవరు అనే ప్రశ్నలకు వైసిపీ దగ్గర సమాధానం లేదు. న్యాయవాది టిడిపి అంటూ కొత్త వాదన తెచ్చారు. వృత్తిలో భాగంగా న్యాయవాదులు విధ రకాల కేసులను వాదిస్తూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డి పక్కన ఉండే లాయర్ జంధ్యాల రవి శంకర్, ఇప్పుడు అమరావతి తరుపున వాదిస్తున్నారు.

jagan 11112020 2

అంటే రాజశేఖర్ రెడ్డి కలలోకి వచ్చి చెప్తే, రవి శంకర్ ఈ కేసు వాదిస్తున్నారా ? బీజేకి బద్ధ శత్రువు అయిన ఎంఐఎం పార్టీ ఓవైసికి పర్సనల్ లాయర్ గా నిన్న బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ ఉన్నారు. అంటే మోడీ చెప్తే ఈయన పని చేస్తున్నారా ? న్యాయవాదులకు, రాజకీయాలకు ముడిపెట్టి ఏకంగా జగన్ మోహన్ రెడ్డి గారే, ఈ వాదన ఒక ముఖ్యమంత్రి హోదాలో తేవటం ఆశ్చర్యకరం. రిమాండ్ రిపోర్టును బలహీనంగా పెట్టిన పోలీసులది ఏ తప్పు లేదు కానీ, బెయిల్ పిటీషన్ పై వాదిస్తున్న వారి తప్పు అని, ఆయన తెలుగుదేశం పార్టీ కాబట్టి, కుటుంబం మొత్తం పోయినా, ఏమి మాట్లాడకుండా ఉండాలని చెప్తున్నారా ? తెలుగుదేశం కాకపొతే జనసేన అడుగుతుంది, జనసేన కాకపోతే ముస్లిం సంఘాలు అడుగుతాయి. ప్రతిది ఇలా ఎదురు దాడి చేసి తప్పించుకుంటే ఎలా ? న్యాయమూర్తులు పై ఇలాగే దాడి చేసారు. ఇప్పుడు న్యాయవాదులు తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదు, డాక్టర్లు తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదు అనే వాదన ఏమిటి ? ప్రభుత్వంలో ఉండి, బలమైన కేసులు పెట్టకుండా, బలమైన రిమాండ్ రిపోర్ట్ రాయకుండా, బలమైన వాదనలు వినిపించకుండా, ఇలా ముఖ్యమంత్రి, ఇలాంటి వాదనలు వినిపించి, తమ తప్పు కనపకుండా చేయటం ఎంత వరకు న్యాయం ? ఎంత సేపు తెలుగుదేశం మీద, న్యాయమూర్తులు మీద, వ్యవస్థల మీద ఎదురు దాడి చేసి, తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుతారు ?

Advertisements

Latest Articles

Most Read