ప్రజాస్వామ్యంలో, ప్రజలే నిర్ణేతలు. ఎప్పుడు ఎత్తుతారో, ఎప్పుడు పడేస్తారో తెలియదు. ప్రతిక్షణం వారికి సేవ చేస్తూనే ఉండాలి. వారి మన్ననలు పొందుతూనే ఉండాలి. మనలో ఎంత గర్వం ఉన్నా, ఎంత అహంకారం ఉన్నా, అది బయట పడిన రోజు, ఏమి మిగలదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మహా మహులు అయిన ఇందిరా గాంధీ, అన్న ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు. రెండు సీట్లు ఉన్న బీజేపీ, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తుంది అంటే, ప్రజాస్వామ్యం గొప్పదనం. ఎంత తొందరగా పైకి ఎగబాకుతారో, అహంకారం తలకు ఎక్కితే అంతే తొందరగా కింద పడిన సందర్భాలు ఎన్నో. అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయటానికి కానీ, ప్రతిపక్షాల పై కక్ష తీర్చుకోవటానికి కాదు. రాజకీయం అనేది, ఏదైనా ఒక లిమిట్ వరకు ప్రజలు ఒప్పుకుంటారు కానీ, శ్రుతిమించితే కత్తిరిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షానికి, అహంకారం అనేది తారా స్థాయిలో ఉంది. 151 సీట్లు ఉన్నాయి, మాకేంటి అనే ధీమాలో ఉన్నారు. ప్రజలకు వివిధ సంక్షేమ పధకాలతో ఆకట్టుకుంటున్నాం, మాకేంటి అనే ధీమాలో ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువే సంక్షేమం చేసింది, కానీ ఎందుకు ఓడిపోయింది. ప్రస్తుత అధికార పక్షం ఇది గుర్తిస్తున్నట్టు లేదు. నిన్న గుడివాడలో, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలై మూడేళ్ళు అయిన సందర్భంగా ర్యాలీ చేసారు.

kodali 10112020 2

ఇందులో మంత్రి కొడాలి నాని పల్గుని, తెలుగుదేశం పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం నాయకులు నా ఇల్లు నా సొంతం అంటూ రోడ్డు ఎక్కి షో చేస్తున్నారని, ఇళ్ళ పట్టాలను కోర్టుకు వెళ్లి చంద్రబాబు ఆపారని, జగన్నాధ రధ చక్రాల కింద, తెలుగుదేశం పార్టీని నల్లిని నలిపినట్టు నలిపెస్తాం అంటూ, ఎంతో అహంకారంగా మాట్లాడారు. అయితే తెలుగుదేశం వాళ్ళు నచ్చకపోతే, ప్రజలే నలిపెస్తారు. ఇక్కడ జగన్ నలిపేది ఏమి ఉండదు. ప్రజలు తలుచుకుంటే, ఎవరిని అయినా నలిపేస్తారు. అహంకారం ఉన్న వాళ్ళని, ప్రజాస్వామ్యంలో ప్రజలు అసలు హర్షించారు. గత రెండు రోజులుగా అమెరికా నుంచి, నేటి దుబ్బాక దాకా ప్రజలు చెప్పింది అదే. 2008 నుంచి, ఉప ఎన్నికల్లో ఓటమి ఎరుగని టీఆర్ఎస్, నేడు ఎందుకు ఓడిపోయింది ? గెలుస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్ ఎందుకు ఓడిపోయారు ? వీళ్ళు కూడా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వారే. కానీ వీరి ఓటమికి అహంకారం, నిర్లక్ష్యపు వైఖరి అనేవి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయం అంటే బూతులు తిట్టటం, అహంకారం ప్రదర్శించటం కాదు. ఒకరికి మించి మరొకరు ప్రజలకు సేవ చేసి, వారి అభిమానాన్ని పొందటం. ఇవి కాకుండా అహంకారంతో ముందుకు పొతే, ప్రజలే చూసుకుంటారు. కొంచెం లేట్ అవ్వొచ్చు ఏమో కానీ, ప్రజాస్వామ్యం తప్పకుండ వర్ధిల్లుతుంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. మీకు మా తీర్పు ఇష్టం లేకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళండి, అంతే కానీ మా తీర్పుని పాటించం, మా ఇష్టం అంటే కుదరదు, మీ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అన్ని అవకాశాలు మాకు ఉన్నాయి, దీని పై సుమోటోగా చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకాడం, మేము ఎంత వరకు అయినా వెళ్తాం, హద్దుల్లో ఉండమని మీ అధికారులకు చెప్పండి, రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతాం అంటే కుదరదు, మిమ్మల్ని ఎవరు వచ్చి కాపాడతారో చూస్తాం అంటూ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా తిరుమలయప్పపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్కడ గ్రామా సచివాలయం కడుతున్నారు అంటూ, ప్రజా ప్రయోజన వాజ్యం గత్మలో హైకోర్టులో దాఖలు అయ్యింది. దీని పై సెప్టెంబర్ నెలలో స్పందించిన హైకోర్టు, స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అక్కడ ఏ నిర్మాణాలు జరపటానికి వీలు లేదు. అయితే మళ్ళీ అక్కడ అధికరులు గ్రామ సచివాలయం కాకుండా, రైతు భరోసా కేంద్రం నిర్మాణం మొదలు పెట్టారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటూ, పిటీషనర్ మళ్ళీ కోర్టుకు వచ్చారు. కోర్టుకు విషయం తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా అక్కడ మరో నిర్మాణం చేస్తున్నారని, తెలివిగా, ఆన్లైన్ లో , సర్వే నెంబర్ కనిపించకుండా చూసుకున్నారని, కోర్టుకు తెలిపారు. అయితే మేము ఉత్తర్వులు ఇచ్చినా, అక్కడ ఎలా నిర్మాణం చేపడతారు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

hc 10112020 2

ఇప్పడు ఈ రైతు భరోసా కేంద్రం పై స్టేటస్ కో ఇస్తే, రేపు మరో బిల్డింగ్ కడతారా అని ప్రశ్నించింది. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది, గతంలో గ్రామ సచివాలయం పైనే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, ఆ స్థలం పెద్దదని, దాని పక్కన ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. దీని పై కోర్టు భగ్గు మంది, ఏది ప్రజా ప్రయోజనమో మాకు తెలుసు, అని విషయాల గురించి మాకు తెలిసు. ఒకసారి మేము ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా అక్కడ వేరే నిర్మాణం ఎలా చేపడతారు, ఇది కోర్టు ధిక్కారం కాదా ? మేము ఇచ్చిన తీర్పులో ప్రతి అక్షరం పాటించాల్సిందే, మీకు అభ్యంతరాలు ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్ళండి. అంతే కానీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించే హక్కు మీకు లేదు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో పాట్నాలో ఒక జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు ధిక్కారానికి పాల్పడితే, కోర్టుకు పిలిపించి, అటు నుంచి అటే జైలుకు పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. దీని పై కోర్టు ధిక్కారం కింద పిటీషన్ దాఖలు చేయాలనీ, పిటీషనర్ ను కోరింది. రాజకీయ నాయకులకు వత్తాసుగా అధికారులు ఉంటాం అంటే కుదరదు అని, మేము ఆక్షన్ తీసుకుంటే ఎవరు వస్తారో చూస్తాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చి, కేసుని డిసెంబర్ నెలకు వాయిదా వేసింది, హైకోర్టు.

మన హక్కులు మనకు రాకపోతే, నిగ్గదీసి అడగాలి. రాజకీయలు పక్కన పెట్టి, మన హక్కుల కోసం పోరాడాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎప్పుడైతే కేంద్రం మోసం చేసిందని భావించారో, వెంటనే వారి పై యుద్ధం ప్రకటించారు. హోదా దగ్గర నుంచి, వివిధ విభజన హామీల పై నిలదీశారు. అయితే ఈ పోరాటంలో రాజకీయంగా నష్టపోయారు. పొతే పోయారు, రాష్ట్రం కోసం, మోడీ, అమిత్ షా లాంటి వారి పై పోరాటం చేసి, దేశ వ్యాప్తంగా వారికి వ్యతిరేకంగా పని చేసారు అనే పేరు వచ్చింది. రాష్ట్ర ఆత్మగౌరవం నిలబడింది. అయితే ఇప్పుడు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, కేంద్రం మెడలు వంచేస్తానని అన్నారు. వంచింది లేదు , చివరకు గట్టిగా అడుగుతుంది కూడా లేదు. హోదా విషయం ఎప్పుడో మర్చిపోయారు, అమరావతిని మూడు ముక్కలు చేసాం కాబట్టి, ఇది కూడా కేంద్రాన్ని అడిగే పని లేదు. విభజన హామీలు ఏమి అయ్యయో కూడా తెలియదు. చివరకు ప్రకటించిన రైల్వే జోన్ కూడా అడ్రస్ లేదు. ఇలా అన్ని రకాలుగా కేంద్రం పై ఒత్తిడి లేదు. అయితే ఇవన్నీ పొతే పోయాయి, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ఉంటే చాలని అందరూ అనుకున్నారు. అది ఒక్కటి సాధించినా జగన్ మోహన్ రెడ్డి చిరస్థాయిలో నిలిచి పోతారని అనుకున్నారు. ముఖ్యంగా చంద్రబ్బు ఇప్పటికే 70 శాతం పై గా పూర్తి చేసారు కాబట్టి, మిగతాది కేంద్రం సాయంతో పూర్తి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ చివరకు పోలవరం విషయంలో కూడా కేంద్రం అన్యాయం చేసేసింది. అయితే, చివరకు ఈ విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి మౌనమే.

center 09112020 12

కేవలం ఒక ఉత్తరం రాసి ఊరుకున్నారు. బుగ్గన గారిని రెండు సార్లు ఢిల్లీ పంపించారు. ఇక అంతే , మిగతాది అంతా చంద్రబాబు నామ స్మరణే. చంద్రబాబు వల్లే కేంద్రం పోలవరం విషయంలో అన్యాయం చేసింది అంటూ పాట మార్చేసారు. చంద్రబాబు తప్పు చేసారే అనుకుందాం, అందుకేగా ఆయన్ను పక్కన పెట్టి, మీరు మెడలు వంచుతారని గెలిపించింది అంటే సౌండ్ లేదు. అయితే ఈ రోజు ఎట్టకేలకు పోలవరం విషయం పై జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అయితే ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదు, కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కు చేస్తున్న అన్యాయం గురించి కనీసం ప్రస్తావించలేదు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం అని అంటున్నారు. ఒక పక్క 18 నెలల నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో పక్క కేంద్రం నిధులు ఇవ్వకపోగా, అంచనాలను 50 శాతానికి తగ్గించి. మరి ఈ తరుణంలో, 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ఎలా పూర్తి చేస్తారు ? దాదాపుగా 30 వేల కోట్లు రాష్ట్రం పెట్టుకోగలదా ? అయినా మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనేది హక్కు, ఆ హక్కు గురించి ప్రతి వేదిక పైన కేంద్రాన్ని నిలదీయాలి కానీ, ఇలా వారిని ఒక్క మాట కూడా అనకుండా ఉంటే, కేంద్రం పై ఏమి ఒత్తిడి ఉంటుంది ? చూద్దాం, నిజంగా 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తారేమో.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంపై, గత కొంత కాలంగా, కేంద్రం ఇస్తున్న షాకులతో రాష్ట్ర ప్రభుత్వం అల్లాడి పోతుంది. అటో ఇటో అయితే, పోలవరం ప్రాజెక్ట్ రాజకీయ అజెండాగా మారి, అధికరాన్నే కోల్పోయే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు హయాంలో ఆమోదించిన 55 వేల కోట్లు కాకుండా, కేవలం 20 వేల కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ కు ఇస్తాం అంటూ మెలిక పెట్టింది. దీని పై జగన్ మోహన్ రెడ్డి, ఒక వారం రోజులు తరువాత ఒక లేఖ కేంద్రానికి రాయటం మినిహా, పెద్దగా కేంద్రం పై పోరాడింది ఏమి లేదు. అయితే దీని పై, తర్జనబర్జనలు జరుగుతూ ఉండగా, గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన డబ్బుల్లో, 2,234.288 కోట్లు రీయింబర్స్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్ధిక శాఖ దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది. దీంతో ఇక ఇది మా విజయం అంటూ, వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. చంద్రబాబు ఖర్చు పెట్టిన డబ్బులు తేలేకపోయారు, మేము తెచ్చేస్తున్నాం అంటూ హడావిడి చేస్తున్నారు. ఒక పక్క పోలవరం అంచనాలు 30 వేల కోట్లకు తగ్గిచేస్తుంటే, దాని పై గట్టిగా మాట్లాడరు కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన సొమ్ము, ఇప్పుడు వస్తుంటే హంగామా చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్రం మరో మెలిక పెట్టి, రాష్ట్రానికి షాక్ ఇచ్చింది.

modi 09112020 2

పోలవరం డబ్బులు రీయింబర్స్ మెంట్ చేయాలి అంటే, డైరెక్ట్ ఏపి ఎకౌంటు లో వేయమని, రాష్ట్ర ప్రభుత్వం, ఒక సరికొత్త పీడీ ఎకౌంటు ఇవ్వాలని, మేము ఆ పీడీ ఎకౌంటు లోనే డబ్బులు వేస్తామని కేంద్రం షరతు పెట్టింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఒక కొత్త పీడీ ఎకౌంటు ఓపెన్ చేసే పనిలో ఉంది. పీడీ ఎకౌంటు లో వేస్తే, దేని కోసం అయితే కేంద్రం డబ్బులు ఇస్తుందో, అది దానికి మత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గతంలో కూడా 1800 కోట్లు రీయింబర్స్ మెంట్ ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వ ఆ డబ్బులు వేరే వాటికి ఖర్చు చేసేసిందనే లెక్క కేంద్రానికి వెళ్ళింది. పోలవరం కోసం ఇచ్చే డబ్బు, పోలవరం ప్రాజెక్ట్ కు మాత్రమే ఖర్చు పెట్టాలని, అందుకే ఒక కొత్త పీడీ అకౌంట్ ను కేంద్రం ఇవ్వమని, రాష్ట్రాన్ని కోరింది. ఈ నిధులు వేరే వాటికి వాడుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉండదు. ఇప్పటి వరకు అనేక సార్లు, రాష్ట్ర ప్రభుత్వం, వివిధ నిధులు, వివిధ అవసరాలకు మళ్ళించింది అనే వార్తలు విన్నాం. ఇప్పుడు పోలవరం విషయంలో అది కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఎకౌంటు అడిగింది అంటే, రాష్ట్రం పై నమ్మకం లేకే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం పీడీ ఎకౌంటు ఇచ్చిన వారం పది రోజులకు, ఈ 2,234.288 కోట్లు వచ్చే అవకాసం ఉంది. ఇవన్నీ సాఫీగా రాష్ట్రానికి చేరతాయో, లేక మధ్యలో మరో మెలిక పెడతారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read