జగన్ మోహన్ రెడ్డి పీఆర్ టీం, ఆయనకు తగిలించిన ట్యాగ్ , మాట తప్పడు, మడమ తిప్పడు. పాదయాత్ర చేసే సమయంలో, దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 18 నెలల్లో మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఉన్నారా ? గద్దెనెక్కిన నెల రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా, నేను 45 ఏళ్ళకు పెన్షన్ అని చెప్పలేదు అంటూ, మడమ తిప్పెసారు. అక్కడ నుంచి మొదలై, అనేక సార్లు మడమ తిప్పుతూనే ఉన్నారు. హోదా విషయం దగ్గర నుంచి అమరావతి దాకా, ఇలా ప్రతి విషయంలో గతంలో ఇచ్చిన మాట తప్పారు. అయితే ఇప్పుడు ఇంకా 18 నెలలే అయ్యింది, మేము చెప్పింది చేసి చూపించటానికి ఇంకా టైం ఉంది కదా అని వైసిపీ చెప్తుంది. అయితే ఇప్పుడు మరో విషయంలో జగన్ మాట తప్పారా, లేదా మోసం చేస్తున్నారా అనే చర్చ నడుస్తుంది. అమరావతిని మూడు ముక్కలు చేసే బిల్లులు శాసనమండలి అడ్డుకుంది అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, శాసనమండలిని రద్దు చేసేయటానికి నిర్ణయం తీసుకుంది. దీని కోసం అసెంబ్లీలో తీర్మానం చేసారు. అలాగే తీర్మానం చేసే సమయంలో, శాసనమండలి దండుగ అంటూ దానికి అనేక కారణాలు చెప్పారు. మేధావులు అంతా మనకు అసెంబ్లీలో ఉన్నారని, ఇంకా మండలి ఎందుకు అని ప్రశ్నించారు.

jagan 21112020 2

అలాగే మండలి రద్దు చేయటమే అజెండాగా ఢిల్లీ పర్యటనలు కూడా చేసారు జగన మోహన్ రెడ్డి. మంత్రుల్ని కలిసారు, మండలి రద్దు చేయమని కోరారు. ఇలా అనేక విధాలుగా మండలిని రద్దు చేయాలని కోరారు. అయితే ఎందుకో కానీ ఇంకా మండలి రద్దు కాలేదు. ఏది ఏమైనా ఇప్పటి వరకు, దీని విషయంలో జగన్ కు రిమార్క్ లేదు. అయితే నిన్న తిరుపతి ఎంపీ స్థానంలో అభ్యర్ధిని ప్రకటించే విషయంలో, బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచి టికెట్ ఇస్తారని ఆశించినా, తన సొంత ఫిజియోకి సీట్ ఇచ్చారు జగన్. ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి, బల్లి దుర్గా ప్రసాద్ కొడుకుకి, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని వైసీపీ చెప్పింది. అయితే ఇక్కడే జగన్ చిత్తశుద్ధిని అందరూ ఎత్తి చూపుతున్నారు. మండలి రద్దు అనేది నిజమా కాదా ? లేదా దాని పై జగన్ వెనక్కు తగ్గారా ? ఒక వేల నిజమే అయితే, ఇప్పుడు బల్లి దుర్గా ప్రసాద్ కొడుకుకి, ఎమ్మెల్సీ హామీ ఎలా ఇస్తారు ? వాళ్ళని మభ్య పెట్టటానికి, ఇలా మోసం చేస్తున్నారా అనే మాటలు వస్తున్నాయి. మరి జగన్ నమ్ముకున్న వాళ్ళని మోసం చేయరు, మడమ తిప్పరు, మాట తప్పరు అనే వాళ్ళు, దీనికి ఎలాంటి సమాధానాలు చెప్తారో మరి.

సొంత ప్రభుత్వం పైనే ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతున్నారు. అనేక సందర్భాల్లో ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ఎమ్మెల్యే నిరసనగళం విప్పారు కానీ, డైరెక్ట్ గా ప్రభుత్వం పై కాకపోయినా, ప్రభుత్వ చేతకాని తరం గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ, కాంట్రాక్టు సంస్థ కార్యాలయ ముట్టడికి సిద్ధం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఏ రోడ్డు చూసినా, ఏ రోడ్డు అయినా, అన్నీ గోతులు, గుంతలే. రాష్ట్రం మొత్తం పరిస్థితి ఇలాగే ఉంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ప్రజలు ప్రతి రోజు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడక్కడా ప్రజలు ఎదురుతిరుగుతున్నా, ప్రభుత్వం పై మాత్రం ఒత్తిడి తెచ్చే వారు లేరు. మనకు ఎందుకు వచ్చిందేలా అని ఇబ్బందులు పడుతూనే వెళ్తున్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు మాత్రం, సొంత ప్రభుత్వం పైనే ఎదురు తిరిగినంత పని చేసారు. గుంటూరు జిల్లా ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సీరియస్ అయ్యారు. పిడుగురాళ్లలో రోడ్డులు అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా, ఎన్ని సార్లు చెప్పినా, రెండు వారాలు గడువు ఇచ్చినా, కాంట్రాక్టు సంస్థ మాత్రం మరమత్తులు చేయలేదని ఆయన అన్నారు.

kasu 21112020 2

ఈ నెల 29వ తేదీన తుమ్మలచెరువు టోల్‌గేట్‌ను ముట్టడి చేస్తామని, ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. అయితే ఇక్కడ కాంట్రాక్టర్ వైసీపీ ఎంపీ ఎంపీకి చెందిన సంస్థ. రాంకీ సంస్థ పరిధిలోనే ఇది ఉంది. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిది రాంకీ సంస్థ. దీంతో సొంత ప్రభుత్వం పైన, సొంత పార్టీ ఎంపీ సంస్థ పైనే , అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసన గళం వినిపించారని అనుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, ఆయన ఏమి చేసినా తెలుస్తుంది కానీ, ప్రజలు ఇలా ఎదురు తిరిగితే ఊరుకుంటారా ? ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసనతో అయినా ప్రభుత్వం ఈ సమస్య గుర్తించి, ఈ సమస్యని పరిష్కారం చేస్తే, ప్రజలకు మేలు జరుగుతుంది, అలాగే ప్రజా సమస్య పరిష్కారం చేసినందుకు, అధికార పార్టీ ఎమ్మెల్యేకే పేరు వస్తుంది. చూద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుంది ఏమో,.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజు మరోసారి ప్రభుత్వం తీరు పై అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు కూడా హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. కొన్ని నెలల క్రితం పర్మిషన్ తీసుకుని, విశాఖపట్నం పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుని, పోలీసులు అడ్డుకున్న కేసు, ఈ సందర్భంగా చంద్రబాబుని ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకోవటం, పోలీసులు నోటీసులు ఇవ్వటం, చంద్రబాబుని అక్కడ నుంచి పంపించటం, వీటి అన్నిటి పై, హైకోర్టులో ఒక కేసు నమోదు అయ్యింది. గతంలో ఇదే కేసులో డీజీపీని కూడా హైకోర్టు, కోర్టుకు పిలిపించి, సెక్షన్ ఏమిటో చదవండి అంటూ, చేసిన ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే ఈ కేసు మరోసారి హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా, పిటీషనర్ తరుపు న్యాయవాది వేసిన అఫిడవిట్ లో, ప్రభుత్వానికి మతిలేని చర్య అంటూ, పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానిది మతిలేని చర్యగా పేర్కొనటం పట్ల, ప్రభుత్వం తరుపు న్యాయవాది ఈ వ్యాఖ్య పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే ఇదే సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, అమరావతి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మించిన రాజధానిని తరలించటం మతిలేని చర్య కాదా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇప్పుడు రాజధానిని మధ్యలో తరలించటం అనేది, ఏ విధంగా అర్ధం చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

hc 20112020 2

రాజధాని నిర్మాణాలు చూసిన ఎవరికైనా బాధ ఆవేదన కలుగుతుందని, హైకోర్టు ధర్మసానం వ్యాఖ్యానించింది. దీంతో పాటుగా, రాజధానికి సంబంధించి, ఇవి మీ డబ్బులు, మా డబ్బులు కావు, ఇవి ప్రజల డబ్బులు అనేవి గుర్తు పెట్టుకోవాలని, ఏ అధికారంతో రాజధానిని తరలిస్తున్నారో తెలుసుకొండి అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వం తరుపు న్యాయవాది, ఇక్కడ ఎక్కువ ఖర్చు, అక్కడ తక్కువ ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసు ఇప్పటికే విచారణలో ఉంది కాబట్టి, దీని పై ఇక్కడ మాట్లాడవద్దు అని ప్రభుత్వం తరుపు న్యాయవాది సూచించారు. ఈ నేపధ్యంలోనే, రాజధాని ఇక్కడే ఉండాలని న్యాయవాది పేర్కొన్నారని, అందువల్లే దీని గురించి తాము వ్యాఖ్యానించామని ధర్మాసనం పేర్కొంది. ఇక దీంతో పాటుగా, రాజకీయాల్లో నేరప్రవృత్తి పెరిగిపోతున్న అంశం పై స్పందిస్తూ, ఇది మంచిది కాదని, వ్యవస్థలను పరిరక్షించుకోవాలన్నా, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా రాజ్యాంగంలో ఉన్న హక్కులు పరిరక్షించుకావాలన్నా, ఈ రాజకీయాల్లో నేర నేరప్రవృత్తిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, ఇది అందరి మీద ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేర చరిత్ర కలిగిన వారి నుంచి వ్యవస్థలను కాపాడాల్సిన అవసరం ఉందని, నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాలకు దూరంగా ఉంటేనే వ్యవస్థలు అన్నీ కూడా సరిగ్గా పని చేస్తాయని, ధర్మాసనం వ్యాఖ్యానించింది

ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే పన్నులతోనే అందులో సందేహమే లేదు. కానీ వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వాలు కూడా ప్రజల పై ఎక్కువ భారం మోపకుండా, అవసరమైన చోట, అవసరమైన మేర పన్నులు వసూలు చేస్తూ, పన్నులు పెంచుతూ వెళ్తాయి. ఇక ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, లేదా పరిశ్రమలు ఇతర వర్గాల నుంచి వచ్చిన పన్నులతోనే, ప్రభుత్వాలు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. అయితే ఈ పన్నుల భారం పేద మధ్య తరగతి పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక వింత పరిస్థితి ఉందనే చెప్పాలి. ఒక పక్క మాది సంక్షేమ ప్రభుత్వం అంటూ, అధికార పార్టీ హంగామా చేస్తూ వస్తుంది. పేద ప్రజలకు మేలు చేయటమే మా ధ్యేయం అంటూ, ఆ పధకం ఈ పధకం అంటూ హడావిడి చేస్తున్నారు. అవి నిజంగా ప్రజలకు అందుతున్నాయా, నిజమైన లబ్దిదారులు తీసుకుంటున్నారా అనేది వేరే చర్చ. అయితే ఇలా సంక్షేమం పాట పడుతున్న ప్రభుత్వం, పన్నుల రూపంలో వసూళ్ళు మాత్రం అధికంగా చేస్తుంది. అది కూడా చాలా తెలివిగా చేస్తుంది. ఇప్పటికే బస్ చార్జీలు పెంచారు, పెట్రోల్, డీజల్ ధరల పై వ్యాట్ రెండు సార్లు పెంచారు, ఒకసారి సెజ్ విధించారు, కరెంట్ చార్జీలు పెరిగాయి.

taxzes 20112020 2

ఇలా ఒకదారి తరువాత ఒకటి పెంచుకుంటూ వస్తున్న ప్రభుత్వం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియని ఒక కొత్త బాదుడుతో ముందుకు వచ్చింది. అదే రోడ్డు టోల్ టాక్స్. ఇప్పటి వరకు మనం కడుతున్న టోల్ టాక్స్ లు వేరు. అవి నేషనల్ హైవేల మీద ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర రహదారుల్లో వెళ్ళినా టోల్ టాక్స్ కట్టాలి. రాష్ట్రంలోని రహదారాలుకు ఈ టోల్ టాక్స్ వసూలు చేస్తారు. ప్రతి 60-90 కిలోమీటర్లకు టోల్ బాదుడు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని స్టేట్ రహదారులకు ఇవి ఉంటాయి. చిన్న వాహనాలకు కిలోమీటర్ కు 90 పైసలు, పెద్ద వాహనాలకు 1.80 రూపాయలు, బస్సు, ట్రక్కు వంటి వాటికి కిలోమీటర్ కు 3.55 రూపాయల, అలాగే మల్టీ యాక్సిల్ వెహికల్స్ కి 8.99 రూపాయలు వసూలు చేస్తారు. ఈ డబ్బులు అన్నీ రహదారుల అబివృద్దికి ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ రేట్లు పెరిగితే, దీని ఇంపాక్ట్ రవాణా రంగం పై పడుతుంది. అన్ని రకాల వస్తువుల రేట్లు, అటో బస్సు చార్జీలు కూడా పెరిగిపోతాయి. అయినా ఇప్పటికే లక్షల కోట్లు అప్పు తెచ్చి, భూములు అమ్మి సొమ్ము చేస్తుకుంటున్న ప్రభుత్వానికి, మళ్ళీ ఇలా ప్రజల పై భారం మోపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో. ఇంకా ఇలాంటివి ఎన్ని కొత్త కొత్త పన్నులు చూడాలో.

Advertisements

Latest Articles

Most Read