ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో పాలక మండలి నియామకాల తీరు పై, హైకోర్టు తీవ్రంగా స్పందించింది. యూనివర్సిటీ పాలకమండలి నియామకాలు, రాజకీయా ప్రయోజనల కోసం, రాజకీయ సిఫారసులతో మాత్రమే నియామకాలు జరుగుతున్నాయని, హైకోర్టులో మాజీ జడ్జి జాడ శ్రవణ్ కుమార్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ నేపధ్యంలో, ఈ పిటీషన్ పై నేడు ధర్మాసనం, విచారణ చేసింది. జస్టిస్‌ రాకేష్‌కుమార్‌, జిస్టిస్‌ ఉమాదేవి దర్మసానం ఈ కేసు విచారణ చేసింది. శ్రవణ్ కుమార్ తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యూనివర్సిటీ పాలకమండలి నియామకాలు మొత్తం, రాజకీయ సిఫారుసలతో నియమించారని, దానికి సంబందించిన ఫైల్స్, ఆధారాలు అన్నీ కోర్టు ముందు ఉంచారు. అయితే దీని పై కోర్టు తీవ్రంగా స్పందించింది. రాజకీయ జోక్యం, సిఫారుసు ఎక్కువ అయ్యింది అంటూ స్పందించింది. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నత విద్యా మండలికి పంపిన ఫైల్, సిఫారుసు వివరాలు కూడా కోర్టు ముందు ఉంచారు. ఎవరు సిఫారుసులు చేసింది, లాంటి పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. మాములుగా యూనివర్సిటీ పాలకమండలి నియామకాల్లో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని కోర్టుకు తెలిపారు.

hc 09112020

అయితే దీని పై స్పందించిన కోర్టు, అసలు పాలకమండలి సభ్యులను ఏ అర్హతలతో నియమిస్తారు, వివిధ మార్గదర్శకాల వివరాలు ఇవ్వాలని, ధర్మాసనం కోరటంతో, ఈ కేసు విచారణ ఈనెల 23కు వాయిదా పడింది. ఇక మరో అంశం పై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో శ్మశానంలో నిర్మిస్తున్న అనధికార నిర్మాణాల విషయమై హైకోర్టు సీరియస్ అయ్యింది. చిత్తూరు జిల్లా తిరుమలాయపల్లిలో ప్రభుత్వమే అనధికార నిర్మాణాలు చేయటం పై కోర్టు సీరియస్ అయ్యింది. శ్మశానం దాని చుట్టూ పక్కలా, అనుమతులు లేకపోయినా సరే, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను నిర్మాణం చేస్తున్నారు. అయితే గతంలో దీని పై హైకోర్ట్ ఆదేశాలు ఉన్నా, వాటిని పాటించక్పోవటంతో హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీని పై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఇక మరో పక్క అమరావతి రాజధాని పిటీషన్ రోజు వారీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అమరావతి అంశంపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ప్రధాన పిటిషన్ల పై విచారణను హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎప్పుడూ లేని విధంగా, కష్టం చేసుకునే రైతుల చేతులకు బేడీలు వేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. గత శనివారం చేసిన చలో గుంటూరు జైలు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. మహిళల పై పోలీసులు ప్రవర్తించిన తీరు అందరూ చూసారు. అయితే ఇదంతా విధుల్లో భాగంగా చేసామని పోలీసులు అంటున్నారు. ఇది ఇలా ఉంచితే, మూడు రాజధానులకు మద్దతుగా అంటూ, కొంత మందిని ఆటోల్లో వేరే ప్రాంతం నుంచి తరలించి, అమరావతికి తీసుకుని వచ్చి ధర్నా చేపించే క్రమంలో, మీరు మా ఊరు ఎందుకు వచ్చి ధర్నా చేస్తున్నారు అంటూ, కొంత మంది రైతులు వారిని అడ్డుకున్నారు. అయితే దీని పై కేసు పెట్టటంతో, అమరావతి రైతుల పై ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసారు. దళితుల పైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయటంతో అందరూ ఆశ్చర్య పోయారు. అయితే వీరిని నరసరావుపేట నుంచి గుంటూరు జైలుకు తీసుకుని వచ్చే సమయంలో రైతుల చేతులకు సంకెళ్ళు వేసి తీసుకువచ్చారు. దీంతో ఈ సంఘటన పెద్ద దుమారం రేపింది. అయితే దీని పై స్పందించిన జిల్లా ఎస్పీ కొంత మంది పోలీసుల్ని సస్పెండ్ చేసారు. అయితే రెండు రోజులకే వారి పై సస్పెన్షన్ ఎత్తి వేసారు. ఇక మరో పక్క, రైతులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ వారికీ బెయిల్ రాలేదు.

humanrights 09112020 2

దీంతో వారు హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇది ఇలా ఉంటే, రైతులకు బేడీలు వేసిన సంఘటన మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అంటూ, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మొత్తం ఘటన పై స్పందించిన నతిఒన హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆ ఫిర్యాదుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి పంపి, ఈ పూర్తీ ఘటన పై చర్యలు తీసుకుని, 8 వారాల్లో తమకు నివేదిక ఇవ్వాలని, అలాగే ఏమి చర్యలు తీసుకున్నారో, పిటీషనర్ కు తెలపాలని ఆదేశాలు జారీ చేసారు. అక్రమ అరెస్ట్ లు చేసి, బేడీలు వేసి, ఉద్యమం చేస్తున్న వారిని భయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసారు. మొదటి ఐపిసి సెక్షన్ల కింద కేసులు పెట్టి, తరువాత దీన్ని ఎస్సీ ఎస్టీ కేసుగా మార్చారని, దీని వెనుక రాజకీయ నాయకులకు హస్తం ఉందని ఫిర్యాదులో తెలిపారు. అసలు ఎస్సీల పైనే, ఎస్సీ, ఎస్టీ ఆక్ట్ పెట్టటం ఎక్కడ ఉండదని అన్నారు. అలాగే రైతులకు బేడీలు వేయటం, సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం అని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. మరి డీజీపీ గారు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి మాట తప్పను, మడమ తిప్పను అంటూ, ఎన్నికల ప్రచారంలో కానీ, లేక వివిధ సందర్భాల్లో కానీ వాడే మాట ఇది. ప్రతిపక్షంలో ఉండగా, పెన్షన వెయ్యి రూపాయాలు వచ్చే సమయంలో, నేను అధికారంలోకి వస్తే రెండు వేలు చేస్తా అని ప్రకటించారు. అయితే అప్పటికే అప్పటి టిడిపి ప్రభుత్వం, పెన్షన్ రెండు వేలు చేసింది, దీంతో వెంటనే మూడు వేలు అంటూ చెప్పేసారు. ఇదేదో వేలంపాటలాగా ఉన్నా, ప్రజలకు మాత్రం ఇది నచ్చింది. మాట తప్పను, మడమ తిప్పను, ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని ఒక్క చాన్స్ ఇచ్చారు. అయితే ప్రమాణస్వీకారం రోజు, పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు అయిపోతుందని, అవ్వా తాతలు సంతోష పడ్డారు. అయితే అలా కుదరదు అంటూ జగన్ మోహన్ రెడ్డి జర్క్ ఇచ్చారు. రెండు వేలు నుంచి కేవలం 250 పెంచి, 2250 ఇచ్చారు. ప్రతి ఏడు 250 పెంచుకుంటూ పోతానని అన్నారు. నేను మూడు వేలు ఒకేసారి పెంచుతానని చెప్పలేదని, పెంచుకుంటూ పోతానని చెప్పారు. సరి అప్పటికే అధికారంలోకి వచ్చేసారు కాబట్టి, ఇంకా అవ్వా తాతలు చేసేది ఏముంది. ఎదో ఒకటి 250 పెరిగాయి కదా అని సంతోషించారు. వచ్చే ఏడాది మరో 250 పెరుగుతుంది కదా, 2500 అవుతుందని సంతోష పడ్డారు. అయితే ఏడాది దాడి పోయింది, అదిగో ఇదిగో అని పేపర్ లో లీక్ లు ఇస్తున్నారు. అలా మరో ఆరు నెలలు గడిచిపోయాయి.

volunteer 081132020 2

ఏడాది దాటి ఆరు నెలలు అయినా, పెంచుతాను అన్న 250 పెంచలేదు. అదిగో ఈ నెల, ఇదిగో ఈ నెలా అంటూ తమ అనుకూల మీడియాలో లీకులు ఇచ్చి, అవ్వా తాతలను ఆశ పెడుతూ వచ్చారు. ఈ నవంబర్ నుంచి అయినా పెంచుతారని ఆశగా చూస్తే, ఈ సారి కూడా పెంచలేదు. ఇంతోటి దానికి హామీలు ఇవ్వాటం దేనికి, అంటూ కొంత మంది వాపోతున్నారు. అయితే ఇందులో వాలంటీర్లు నలిగిపోతున్నారు. ప్రతి నెల పెన్షన్ ఇవ్వటానికి వెళ్తుంటే, ఈ నెల అయినా పెంచారా అని అవ్వా తాతలు అడిగే ప్రశ్నలకు, ఈ వాలంటీర్ల దగ్గర సమాధానం లేదు. ఏదో తప్పించుకోవటానికి, వచ్చే నెల ఆ వచ్చే నెల అంటూ, సమాధానం చెప్పి వచ్చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తొందరగా పెంచితే, బాగుండు అని, వారికి సమాధానం చెప్పలేక పోతున్నాం అని, వారు ఆశగా అడుగుతుంటే బాధ వేస్తుందని వాపోతున్నారు. అయితే కొంత మంది స్థానికి వైసీపీ నేతలు, ఎప్పుడు పెంచినా, ఈ ఏడాది మొదటి నుంచి పెండింగ్ లో ఉన్న పెంపు, బకాయల రూపంలో వస్తుంది అంటూ, వారిని మభ్య పెడుతున్నారు. ఇప్పటికే ఈ క-రో-నా తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని, ప్రభుత్వం తొందరగా పెన్షన్ పెంచాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి, ఈ ఏడాది మొదటి నుంచి బకాయ పడ్డ పెన్షన్ కూడా, ఒకేసారి కలిపి ఇవ్వాలని కోరుతున్నారు.

నంద్యాలలోని సలాం కుటుంబంపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని, తనపై, తన కుటుంబంపై పోలీసులు చేస్తున్న దౌ-ర్జ-న్యా-లు చూడలేకనే తాను ఆ-త్మ-హ-త్య చేసుకుంటున్నట్లు సలాం సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మరీన విషయం తెలిసిందే. సలాం కుటుంబాన్ని వే-ధిం-చి, ఇబ్బందులకు గురిచేసిన సీఐ సోమశేఖర్ రెడ్డిపై క్రి-మి-న-ల్ కేసుపెట్టాలని, సీఐని ఆదిశగా ప్రోత్సహించిన వైసీపీ నేతలపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఈప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ, వివిధ పార్టీలు, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారటంతో, ప్రభుత్వం స్పందించి, ఘటన పై ఎంక్వయిరీ వేసారు. ఈ విచారణలో షాకింగ్ వెలుగులోకి వచ్చాయి. అందురూ అనుకుంటున్నట్టే సీఐ సోమశేఖర్‌రెడ్డి ఒత్తిడి మేరకే కుటుంబం ఆ-త్మ-హ-త్య చేసుకున్నట్టు విచారణలో తేలింది. సిఐకి , హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌ కూడా సహకరించారు, ఇద్దరూ ఆ కుటుంబాన్ని వేధించినట్టు విచారణలో తేలింది. దీంతో ఇద్దరినీ పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేసారు. మరో పక్క, నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిశితి నెలకొంది. స్టేషన్ బయట పెద్ద ఎత్తున వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.

abdul 08112020 2

ఈ ఈ ఘటన పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండి పడింది. రాష్ట్రంలో ముస్లిం-మైనారిటీలకు రక్షణ లేకుండాపోయిందని, ప్రభుత్వ అసమర్థత, ముఖ్యమంత్రి నియంత్రత్వ ధోరణికి తోడు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థమొత్తం, వైసీపీనేతల అక్రమదందాలకోసమే పనిచేస్తున్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మొహమ్మద్ నజీర్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ పనితీరుని కోర్టులు సైతం తప్పుపట్టాయని, ఖాకీలకు న్యాయస్థానాలు చీవాట్లు పెట్టిన సందర్భాలను చూశామన్నారు. కర్నూలుజిల్లాలోని నంద్యాలలో ముస్లిం వర్గానికిచెందిన సలాం కుటుంబాన్ని, స్థానిక సీఐ సోమశేఖర్ రెడ్డి భ-య-భ్రాం-తు-ల-కు గురిచేశాడని, పోలీస్ వే-ధిం-పు-ల-కు భయపడిన సలాంకుటుంబం మొత్తం ఆ-త్మ-హ-త్య-కు పాల్పడిందని, జరిగిన దారుణాన్ని ప్రభుత్వ హ-త్య గానే తాము భావిస్తున్నామని నజీర్ తేల్చిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలపై అనేక రకాల దా-డు-లు జరుగుతున్నాకూడా, జగన్మోహన్ రెడ్డి అవేమీ పట్టించుకోకుండా, కనీసం సమాధానంకూడా చెప్పకుండా వ్యవహరిస్తున్నాడన్నారు.

Advertisements

Latest Articles

Most Read