ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం విషయంలో, పెద్ద వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు సియంగా ఉండగా, పోలవరం అంచనాలు 55 వేల కోట్లకు కేంద్రం జల శక్తి శాఖ టెక్నికల్ కమిటీ ఆమోదం చేసిన విషయం పక్కన పెట్టి, ఇప్పుడు మేము అంత డబ్బులు ఇవ్వం అంటూ, కేవలం 20 వేల కోట్లకే పోలవరం అంచనాలు తగ్గిస్తున్నట్టు కేంద్రం చెప్తుంది. అయితే ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై పోరాడకుండా, చంద్రబాబు పై తప్పు నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం పై, జగన్ పై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం చెప్తున్న ప్రతి దానికి తలొగ్గి, జగన్ మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారు అంటూ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సహజంగా జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండవల్లి మాట్లాడతారనే పేరు ఉంది. ఆయనే అనేక సార్లు చెప్పారు కూడా. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా సాఫ్ట్ కార్నర్ ఉందని ఉండవల్లి అన్నారు. అయితే పోలవరం విషయంలో మాత్రం, ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తానని, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం విషయంలో, రాజశేఖర్ రెడ్డి కొడుకు అయినా జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి లొంగిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో పాదయాత్రలో అంచనాలు ఎందుకు పెంచారు అంటూ చంద్రబాబు పై అంత ఎత్తున ఎగిరి, ఇప్పుడు బోర్లా పడ్డారని, అలాగే ప్రతి మీటింగ్ లో, పోలవరం కేంద్రం కట్టాలి, నువ్వు ఎందుకు తీసుకున్నావ్ అంటూ చంద్రబాబుని ప్రశ్నించిన జగన్ ను చూసి, ఈయన అధికారంలోకి రాగానే, పోలవరం కేంద్రానికి ఇచ్చేస్తారని అనుకున్నాని అన్నారు.

జరుగుతున్నవి చూస్తుంటే, జగన మోహన్ రెడ్డి, తన కేసుల విషయం పై భయపడుతున్నారని, అందరూ అనుకుంటున్నారని, చూస్తుంటే అలాగే ఉందని అన్నారు. కేసీఆర్ పెద్ద మొనగాడు అని కేంద్రంతో పోరాడుతున్నారా ? నీకెందుకు భయం ? కేసులు ఇప్పుడే ఏమి తేలవు కదా అయినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే ఎలా ? అంటూ ఉండవల్లి ప్రశ్నించారు. మోటార్లు పెడతాం అంటే సరే అంటారు, కేంద్రం ఏది చెప్తే అది ఒప్పుకుంటుంటే, పోలవరం కోసం ఇవన్నీ భరిస్తున్నారు అనుకుంటే, నేడు పోలవరం కూడా కేంద్రం చెప్పినట్టు వింటేఇంకా ఎందుకు ఈ పదవులు అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రతి దానికి చంద్రబాబు పై తోయటానికి మీకు అధికారం ఇవ్వలేదని అన్నారు. పోలవరం బాధ్యతల నుంచి జగన్ ప్రభుత్వం తప్పుకుందనే తాను భావిస్తున్నానని, కేంద్రాన్ని డిమాండ్ చేయాలని నిస్సహయ స్థితిలో జగన్ ఉన్నారని అన్నారు. కేవలం ఒక కేసు వేస్తె చాలని, మోడీ కాలర్ పట్టుకుని, పోరాడాల్సిన అవసరం లేదని, పోలవరం విభజన చట్టంలో పెట్టిన మన హక్కు అని, ఉండవల్లి అన్నారు. కేవలం కోర్టులో కేసు వేసినా చాలని, జగన్ ప్రభుత్వం అది కూడా చేయలేకపోతుందని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్న ఎన్నికల కమిషన్, ఈ రోజు ఉదయం, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు, విడతల వారీగా అన్ని రాజకీయ పార్టీలను కలిసి వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మధ్యానం 3 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎన్నికల కమిషన్ చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీతో ఎన్నికల కమిషన్ భేటీ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం అయ్యారు. ఉదయం రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశం యోక్క అంశాన్ని , వారి వారి అభిప్రాయలు, డిమాండ్లను ఎన్నికల కమీషనర్, చీఫ్ సెక్రటరీ దృష్టికి తెచ్చారు. సమావేశం మొత్తం వివరాలను, చీఫ్ సెక్రటరీతో పంచుకునట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తరుపున సన్నద్ధతను, రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అనే విషయం పై నివేదిక ఇవ్వాలని, చీఫ్ సెక్రటరీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి గంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున, చీఫ్ సెక్రటరీ తన నివేదికను , రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అందచేసినట్టు సమాచారం. రాష్ట్రంలో క-రో-నా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అనే అభిప్రాయాన్ని చీఫ్ సెక్రటరీ, వ్యక్తం చేసినట్టు తెలిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా క-రో-నా వైరస్, వ్యాప్తి పై అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటున్నా కూడా, ఇంకా అదుపులోకి రాలేదని, ప్రస్తుతం కూడా ప్రతి రోజు, మూడు వేల కేసులు వరకు నమోదు అవుతున్న పరిస్థితి ఉందని వివరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఎన్నికలు నిర్వహణ చేసినట్టు అయితే, వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇది ప్రమాదం అని ఆమె తెలిపారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చాలా కీలకం అవుతారని, అయితే ముఖ్యంగా పోలీస్ విభాగంకి చెందినా వారు చాలా ఎక్కువగా కావలసి ఉంటుందని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే, పోలీస్ శాఖలోనే 11 వేల మంది, వైరస్ బారిన పడ్డారని నివేదికలు ఉన్నాయని, వీటి అన్నిటికి సంబంధించిన ఆధారాలతో సహా, నివేదికను పొందు పరిచి, ఆ నివేదికను చీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమీషనర్ కు ఇచ్చారు. అదే విధంగా పలు ప్రభుత్వ విభాగాల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవసరం అని, వారు కూడా చాలా మంది వైరస్ బారిన పడ్డారని, ప్రస్తుత పరిస్థితిలో వారు అందరూ కూడా ఎన్నికల నిర్వహణలో పాల్గునటం కష్టం అని కూడా నివేదికలో చెప్పినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఎన్నికల నిర్వహణ కష్టం అనే అభిప్రాయాన్ని ప్రభుత్వం తరుపున చీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమీషనర్ కు తెలిపారు. పరిస్థితి కుదుట పడగానే, తాము ఎన్నికల నిర్వహణ పై చెప్తామని, అప్పటి వరకు తరుచూ క-రో-నా వ్యాప్తి పై తాము నివేదికలు అందిస్తూ ఉంటామని ఎన్నికల కమీషనర్ కు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పై, హైకోర్టులో కేసు ఉండటంతో, హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు జరుపుతారో చెప్పాలి అంటూ, అసలు ఇప్పుడు జరిపే పరిస్థితి ఉందో లేదో చెప్పాలి అంటూ, ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని పై తమకు పూర్తి అఫిడవిట్ ఇవ్వాలి అంటూ, హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు నవంబర్ 4 న విచారణకు రానుంది. అయితే అంతకంటే ముందే, ఎన్నికల నిర్వహణ పై ఎలక్షన్ కమిషన్ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని, అందరి అభిప్రాయం తీసుకుని దీని పై కోర్టుకు తమ నిర్మాణం తెలపాలి అనే ఉద్దేశంతో, ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణ పై ప్రతి రాజకీయ పార్టీ తమ తమ అభిప్రాయాలు తెలియ చేసాయి. ఇప్పటికే బీహార్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో, ఎన్నికల నిర్వహణ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ సమావేశానికి, వైసీపీ పార్టీ తప్ప, మిగతా అన్ని పార్టీలు హాజరు అయ్యి తమ అభిప్రాయాలు తెలిపారు. క-రో-నా నిబంధనలు పాటిస్తూ సమావేశం జరిగింది. అందరినీ ఒకేసారి కాకుండా, ఒక్కో పార్టీకి, కొంత సమయం కేటాయించారు. ఇందులో కొన్ని పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కోరగా, మరికొన్ని పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని ప్రకటించాయి. ఈ నేపధ్యంలో, వైసీపీ మాత్రం, ఎలక్షన్ కమిషన్ పై విమర్శలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఈసి పట్టించుకోలేదని ఆరోపణలు చేసింది.

సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా, అభిప్రాయలు చెప్తూ, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని, అయినా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అంటూ, వైసీపీ ఆరోపించింది. అయితే ఈ రోజు సమావేశం అయిన తరువాత, సమావేశం వివరాలు చెప్తూ ఎన్నికల కమిషన్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో, 19 పార్టీలకు ఆహ్వానం పంపగా 11 పార్టీలు తమ వద్దకు వచ్చి అభిప్రాయం తెలిపాయని, రెండు పార్టీలు రాత పూర్వకంగా అభిప్రాయలు చెప్పాయని, ఆరు పార్టీల ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదని చెప్పారు. అయితే ఈ సందర్భంగా వైసీపీ ఆరోపణలు పై స్పందిస్తూ వారి మాటలు బాధించాయని అన్నారు. తాము ఎక్కడా అతిక్రమించలేదని, ప్రభుత్వంతో సంప్రదించలేదు అని చెప్పటం అవాస్తవం అని అన్నారు. నిన్న హెల్త్ సెక్రటరీతో , హెల్త్ కమీషనర్ తో రాష్ట్రంలో పరిస్థితి పై చర్చించామని, ఈ రోజు చీఫ్ సెక్రటరీతో కూడా చర్చలు ఉన్నాయని, ప్రభుత్వంతో పాటు, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవటం ఆనవాయితీ అని, దాని ప్రకారమే మేము వ్యవహరించామని అన్నారు. గౌరవ హైకోర్టు చెప్పిన ప్రకారం, వారికి తమ అభిప్రాయం చెప్పాల్సి ఉన్నందున, అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, తమ పై ఆపాదించటం శోచనీయం అని అన్నారు. రాజ్యాంగాబద్ధంగా ఏమి చెయ్యాలో, అవే చేస్తున్నామని, ఎక్కడా అతిక్రమణలు జరగలేదని స్పష్టం చేసారు.

అమరావతి రైతులకు సంకెళ్ళు వేయటం పై, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. అన్నం పెట్టే రైతులకు బేడీలు ఏమిటి అంటూ, అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఆందోళన ఒక వైపు, అలాగే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మరొక వైపు, మీడియా మరొక వైపు , పోలీసుల వైఖరి పై అభ్యంతరం తెలిపాయి. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావటంతో, గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఈ అంశం పై స్పందించి చర్యలు తీసుకున్నారు అంటూ, పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ కేసుల్లో రిమాండ్ లో ఉన్న 43 మందిని ఒకే బస్సులో నరసరావుపేట సబ్ జైల్, గుంటూరు జైలుకు తేసుకువచ్చె క్రమంలో ప్రిజనర్స్ ఎస్కార్ట్ ఏర్పాటు చేసి, వారిని తరలించే క్రమంలో, మిగతా వారితో కలిపి 7 గురు రైతులకు బేడీలు వేశామని తెలిపారు. అయితే సంకెళ్ళు వేసిన విషయం తెలిసిన వెంటనే, ఈ ఘటనకు బాధ్యులుగా 6 మంది హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, కొంత మందికి మేమోలు ఇచినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ ఘటన పై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అయితే పోలీసులు ప్రకటన పై విమర్శలు వస్తున్నాయి. కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయటం కాదని, కానిస్టేబుళ్ళు చెప్తే సంకెళ్ళు వేయరు కదా, దీని వెనుక ఉన్న పై స్థాయి అధికారులు ఎవరు, వారికి చెప్పిన నేతలు ఎవరు, వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే డీఎస్పీ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు డీఎస్పీదే బాధ్యత అని తెలిపారు.

రాజధానికోసం రైతులు చేసిన త్యాగాలను రోడ్డెక్కించేలా మూడురాజధానులనే మూర్ఖపు నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి భావితరాల భవిష్యత్ ను అంధకారం చేశాడని, ఆయన అరాచకపు పాలనకు నిదర్శనంగా అమరావతి మౌనంగా నిలిచి రోదిస్తోందని, టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి స్పష్టంచేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! రాష్ట్రంకోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను రోడ్లెక్కించి, వారికి బేడీలు వేసిన పాలనను ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. ప్రపంచంలోని అనేక గొప్పనగరాలకు ధీటుగా గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని తలపెట్టింది. చంద్రన్న పాలనలో ఆకాశాన్నంటే భవనాలు అక్కడ భూమిని చీల్చుకొని మొలిచాయి. సీడ్ యాక్సెస్ రోడ్లు రాజధానికి మణిహారాల్లా నిలిచాయి. అటువంటి నగరం ప్రభుత్వం మారగానే మౌనంగా రోదిస్తోంది. మూర్ఖపు పాలనలో మూడు రాజధానుల నిర్ణయంతో భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. పాలకుల తెలివితక్కువ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాయపూడి రోడ్డెక్కితే, తుళ్లూరు తుళ్లిపడింది. బోరుపాలెం బోరున విలపిస్తుంటే, అనంతవరం ఆగ్రహిస్తే, ఉద్ధండరాయుని పాలెం ఉడుకెత్తుతోంది. ఒక్క అవకాశమంటూ బతిమాలిన రాక్షసపాలనకు, రైతులకు మధ్య 315 రోజులుగా పోరాటం సాగుతోంది. దళితులు, బీసీలు, మైనారిటీలందరి కలల రూపంగా నిలిచిన బహుజనవర్గాల రాజధానికి కమ్మసామ్రాజ్యం అని పేరు పెట్టారు. శ్మశానమని, ఎడారని, ముంపుప్రాంతమని దుష్ప్రచారం చేశారు." అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read