రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నెలకొంది. హైకోర్టులో ఈ విషయం పై గతంలో పడిన కేసు విచారణకు రావటం, ఎన్నికల నిర్వహణ పై తమ అభిప్రాయం చెప్పాలి అంటూ ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకునేందుకు, 28న సమావేశం ఏర్పాటు చేయటం తెలిసిందే. అయితే ఈ పరిణామం కంటే ముందే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో జరిగే ఎన్నికల పై సమీక్ష చేస్తున్నాం అంటూ, దానికి హాజరు కావాలి అంటూ, ఈ రోజు ప్రభుత్వం వైపు నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఒక సందేశం వెళ్ళింది. సోమవారం నాడు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద ఈ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశానికి హాజరు కావాలి అంటూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రాజ్యాంగబద్ద హోదాలో ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు, హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉంటారు. పైగా ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేసి, పదవి విరమణ చేసిన హోదా కూడా ఉంది. అటువంటి హోదాలు, రాజ్యాంగాబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, సియం ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ నుంచి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, సోమవారం ఉదయం సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలి అంటూ, మెసేజ్ పంపటం అనేది, తీవ్రమైన అధికార ఉల్లంఘన కింద పరిగణించారు.

ఈ నేపధంలోనే, నిమ్మగడ రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ సెక్రటరీ నుంచి, మళ్ళీ తిరిగి సియం ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ కు తిరిగి మరో మెసేజ్ పంపించారు. హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని, ఈ విధంగా మెసేజ్ ఇవ్వటం అనేది, న్యాయ సమ్మతం కాదు, చట్ట విరుద్ధం అని కూడా పేర్కొంటూ, ఇటువంటి ప్రయత్నాలు అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఒక బ్లేటంట్ అటెంప్ట్ చేస్తున్నారు అంటూ తీవ్రమైన పదజాలంలో మెసేజ్ పంపించారు. ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉండగా, ఇలా చేయటం పై, తాము ఈ విషయం పై కోర్టుకు కూడా చెప్తామని ఆ మెసేజ్ లో తెలిపారు. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణి మోహన్ ని కూడా, ఆ సమావేశానికి తన అనుమతి లేకుండా వెళ్ళవద్దు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మెసేజ్ పంపించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో పాటు, ఈ నెల 26 నుంచి తాను, విజయవాడ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, తననుతో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని, ఆయన మెసేజ్ పంపించారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతున్న ఈ మెసేజ్ ల యుద్ధం పై, ఆసక్తి నెలకొంది.

దసరా ప్రయాణం పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయాసగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు పునరుద్దరణ కాలేదు. దీంతో ప్రైవేటు ట్రావెల కు విపరీతమై డిమాండ్ పెరిగింది. శుక్రవారం నుంచి హైదరాబాద్ టు విజయవాడ రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరిగింది. దీంతో పాటే టిక్కెట్ ధర అమాంతం రూ.3వేలకు చేరింది. కరోనా కారణంగా గడిచిన ఆరు నెలలుగా ఆంధ్రా, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడవడం లేదు. అలాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు సాగిన చర్చలు విఫలమయ్యాయి. దసరా సమయంలో ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. దీన్ని ప్రైవేటు ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణ చర్యలు లేకపోవడంతో టిక్కెట్ ధరలు ఐదు రెట్లు పెంచేసి ప్రయాణీకుల్ని దోచుకుంటున్నాయి. రానుపోను ఒక • ఫ్యామిలీ (నలుగురు కుటుంబసభ్యులు) వచ్చి వెళ్ళాలంటే టిక్కెట్లకే రూ.25,000 ఖర్చయ్యే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పలువురు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పుడు రాలేంలే అని కుటుంబసభ్యులకు సరి చెప్పుకుంటున్నారు. ఇద్దరు సభ్యలే ఉంటే బైక్ పై జర్నీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.

లాక్ డౌన్ ప్రక్రియ ప్రారంభం కాకముందు వరకు నిత్యం 150 బస్సులు విజయవాడ టూ హైదరాబాద్ వెళ్లేవి. తద్వారా రూ.38 లక్షల రూపాయల మేర ఆదాయం వచ్చింది. దసర సమయంలో ప్రత్యేక సర్వీసుల పేరుతో 400కు పైగా బస్సు సర్వీసులు నడిచేవి. పండగ రద్దీని పురస్కరించుకొని ఆర్టీసీ అదనపు ఛార్జీ వసూలు చేసేది. అయినా బస్సులు ప్రయాణీకులతో కిక్కిరిసేవి.. విజయవాడ టూ హైదరాబాద్ రూటులో బస్సు సర్వీసులకు మంచి డిమాండ్ ఉంటుంది. కృష్ణా రీజియన్‌ ఆదాయం రోజుకు రూ.1.50 కోట్లు కాగా ఇందులో రూ.38 లక్షల ఆదాయం విజయవాడ టూ హైదరాబాద్ బస్సు సర్వీసుల నుంచి లభించేది. దసర, సంక్రాంతి పండుగ సీజన్లలో రూ.3 నుంచి రూ.4 కోట్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడట్లే. కృష్ణా రీజియన్లో ప్రస్తుతం 1,450 బస్సులు తిరుగుతున్నాయి. పండుగ రద్దీని పురస్కరించుకొని 450 స్పెషల్ బస్సుల్ని ఏర్పాటు చేశారు. తిరుపతి, కడప, వైజాగ్ ప్రాంతాలకు వీటిని నడుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఏమి పాపం చేసారో కానీ, విభజన నాటి నుంచి, కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇందులో ప్రజలకు చైతన్యం లేకపోవటం కూడా ఒక కారణంగా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. ముందుగా ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు తమ హక్కును వదులుకున్నారు. దీని పై ఉద్యమమే లేదు. మరి దీని విలువ తెలియక, సైలెంట్ గా ఉన్నారా, లేకపోతే పోరాడే పటిమ లేదో కానీ, ఇక ప్రత్యెక హోదా అనేది అందని విషయం అనే చెప్పాలి. అప్పటి ప్రభుత్వానికి చేతకలేదు, మెడలు వంచి తెస్తాం అని చెప్పిన అధికార పక్షం మాట్లాడటం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, ఏపికి రెండు కళ్ళుగా చెప్పుకుంది, ఒకటి పోలవరం, రెండు అమరావతి. ఎందుకంటే రెండిటి వళ్ళా, 13 జిల్లాలకు ఉపయోగం ఉంది. రాష్ట్ర రాజదాని అమరావతి, ఆర్ధిక కేంద్రంగా, ఉపాధి కేంద్రంగా మారుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ వల్ల, ప్రతి జిల్లాకు ఉపయోగం ఉంది. అందుకే ఇది జీవనాడి అయ్యింది. అయితే గత నవంబర్ నెలలో ఒక కన్ను అయిన అమరావతి ప్రాజెక్ట్ పై కుల ముద్ర వేసి, దాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేస్తుంటే కూడా ప్రజల్లో పెద్దగా పోరాడాలి అనే భావన రాలేదు. అది ఎదో ఆ 29 గ్రామాల సంగతి అని వదిలేస్తున్నారు. నిజానికి అది ప్రతి జిల్లా సమస్య. దీని కోసం అమరావతి ప్రాంత రైతులు, మహిళలు 300 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఇక మరో కన్ను, పోలవరం ప్రాజెక్ట్. ముందుగా అధికారం మారిన తరువాత, రివర్స్ టెండరింగ్ పేరుతొ దాదాపుగా ఏడు, ఎనిమిది నెలలు పనులు ఆపేశారు. తరువాత కోర్టుకు వెళ్ళటం, కరోనా రావటం, వీటి అన్నిటి నేపధ్యంలో, ఏదో పేరుకు సాగుతున్నాయి అంటే సాగుతుంది కానీ, చెప్పుకోతగ్గ పని అయితే అక్కడ ఏమి జరగటం లేదు.

మరో పక్క, కేంద్రం నుంచి, గత రాష్ట్ర ప్రభుత్వ హయంలో, పెట్టిన ఖర్చు కూడా, ఇప్పటి ప్రభుత్వం తెచ్చుకోలేక పోయింది. వీటి అన్నిటి నేపధ్యంలో, అసలు పోలవరం పరిస్థితి ఏమిటో అర్ధం కాని పరిస్థితిలో, గత మూడు రోజుల నుంచి కేంద్ర ఆర్ధిక శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు, 25 వేల కోట్లకు తగ్గించిందనే, వార్తలు వస్తున్నాయి. గత చంద్రబాబు హయంలో కేంద్ర జల శక్తి టెక్నికల్ కమిటీ కానీ, సిడబ్ల్యుసీ కానీ, 55 వేల కోట్లకు అంచనాలు, అప్రూవ్ చేసాయి. అయితే ఇప్పుడు మొత్తం తారు మారు అయ్యింది. ఈ నేపధ్యంలోనే, మంత్రి బుగ్గన, ఈ రోజు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసారు. అయితే ఆయనకు అక్కడ ఏమి భరోసా దొరకనట్టు ఉంది. ఎందుకంటే, ఆయన బయటకు వచ్చి మీడియా ముందు, ఇదంతా చంద్రబాబు చేసిన పాపం అని, అందుకే పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు తగ్గిపోయాయి అంటు , చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే, కేంద్రం నుంచి ఎలాంటి భరోసా లేదు. 25 వేల కోట్లు అని కేంద్రం అంటుంది అంటే, ఇప్పటికే 14 వేల కోట్లు దాకా ఇచ్చింది కాబట్టి, మిగత రెండు మూడువేల కోట్లు పెండింగ్ తీసేస్తే, మరో 7 వేల కోట్లు ఇస్తే, కేంద్రం పని అయిపోతుంది. మరి 7 వేల కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుందా ? కేంద్రం, ఇలా చేస్తుంటే, రాష్ట్రం ఏమి చేస్తుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్, కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి పై, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో పోరాడి సాధిస్తుందా ? లేక ప్రత్యెక హోదా లాగా, మనం ఏమి చేయలేం, టైం కోసం ఎదురు చూడాలి అని చెప్తుందా?

అమరావతి ఉద్యమం 312వ రోజుకి చేరుకుంది. అమరావతి ఉద్యమం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమంతో ఉద్యమ వేడి, ప్రభుత్వానికి తాకుతుంది. ఈ నేపధ్యంలోనే, రాజధాని రైతులకు వ్యతిరేకంగా మరో శిబిరం నడపాలని, కొంత మంది అమరావతి వ్యతిరేకులు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని గ్రామాలు కాకుండా, ప్రతి రోజు ఉద్యమం బయట నుంచి ఆటల్లో అమరావతికి వస్తున్నారు. ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. అదేమీ అంటే, ప్రభుత్వం మాకు అమరావతిలో ఇళ్ళ పట్టాలు ఇచ్చింది అంటున్నారు. అసలు అమరావతిలో రైతుల భూములు ఇచ్చింది, రాజధాని నిర్మాణం కోసం, ఇందులో పేదల కోసం భారీగా ఇళ్ళ నిర్మాణం చేపట్టి, ఇప్పటికే 5 వేల ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తి చేసి రెడీ గా ఉన్న ఇళ్ళు, పేదలకు ఇవ్వకుండా, ఇప్పుడు ఇళ్ళ పట్టాలు అంటూ, రైతుల భూములు ఇస్తున్నాం అంటూ, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసారు. ఈ విషయం కోర్టులో కూడా ఉంది. అయితే, ముందు రాజధాని నిర్మాణం చేపట్టాలని, తరువాత ప్రభుత్వ భూమి ఎవరికి ఇచ్చుకుంటే ఏమిటి అని రైతులు అంటుంటే, ఈ వర్గం మాత్రం, ప్రతి రోజు బయట ఆటోల్లో వస్తూ, పోటీ దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ, వీరు ప్రతి రోజు ఎక్కడ నుంచో రావటం, ఆటోలు వేసుకుని రావటం, ఒకసారి వచ్చిన వాళ్ళు కాకుండా, వేరే వాళ్ళు రావటం, ఇలా గమనిస్తున్న అమరావతి రైతులు, సరైన ఆధారాలు లేక, ఇన్నాళ్ళు వదిలేసారు. అయితే నిన్న అనూహ్యంగా, వీడియోలో వెళ్ళు అడ్డంగా దొరికిపోయారు.

అమరావతి రాజధాని రైతులకు వ్యతిరేకంగా మందడం సీడ్ ఆక్సెస్ రోడ్డు వద్ద పోటీ శిబిరం వెలిసింది. ఇక్కడే గత కొన్ని రోజులుగా అమరావతి వ్యతిరేకంగా అంటూ శిబిరం నడుపుతున్నారు. ఒక వైపు పోలీసులు రాజధాని గ్రామాల్లో కొత్త వారు రాకూడదని, ఆధార్ కార్డులు చూపించాలని పోలీసులు చెప్తుంటే, వీరికి ఎలా పర్మిషన్ ఇచ్చారని రాజధాని రైతులు అడుగుతున్నారు. అయితే ఇదే సమయంలో ఆ శిబిరంలో జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. అక్కడ వారికి, కొందరు ట్రైనింగ్ ఇస్తున్న వీడియో బయట పడింది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు అంటే, రాజధాని గ్రామాలు అని చెప్పండి, ఏమి కావాలి అంటే, ఇళ్ళ స్థలాలు కావలి అని చెప్పండి, మేము డబ్బులు కోసం ఇక్కడకు రాలేదని చెప్పండి, గట్టిగా మాట్లాడండి అంటూ, వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ విషయం ప్రముఖంగా చూపిస్తున్నారు. మొన్నటి దాకా, ఇప్పటికీ, అమరావతి రైతులు పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ హేళన చేస్తున్న వారు, నేడు ఈ ఉదంతం పై ఏమంటారో మరి. వీళ్ళను ఏ ఆర్టిస్ట్ అని పిలుస్తారు ? ఇది చూస్తుంటే, అమరావతి రైతుల పై ఏదో కుట్ర జరుగుతుందని అర్ధం అవుతుంది. మరి ప్రభుత్వం, ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read