గజపతి రాజుల కుటుంబం అంటే, విజయనగరం జిల్లాలోనే కాదు, రాష్ట్రం మొత్తం, ఇంకా చెప్పాలి అంటే దేశంలోనే పేరు ఉంది. ఆ రాజ కుటుంబం చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఒకానొక సమయంలో సాక్షాత్తు ఇందిరా గాంధినే, గజపతి రాజుల ముందు గౌరవంగా తల వంచి నమస్కారం చేసారు అంటే, ఆ కుటుంబం చేసిన సేవలు ఎంతటి ప్రభావం చూపాయో చెప్పుకోవచ్చు. రెండో తరం అయిన ఆనందగజపతి, అశోక్ గజపతి రాజులు, ఆ కుటుంబ గౌరవాన్ని కొనసాగించేలా పనులు చేసారు. అశోక్ గజపతి రాజు గారు, కేంద్రం మంత్రి అయినా సరే, ఆయన సింప్లిసిటీకి, ప్రత్యర్ధులు కూడా ఫిదా అవుతారు. ఆ కుటుంబం నడిపే మాన్సాస్ ట్రస్ట్ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలంటి కుటుంబలో రాజకీయంగా కొంత మంది చిచ్చు పెట్టారు. మాన్సాస్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజుని రాత్రికి రాత్రి తప్పించి, సంచయితకు బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమే. ఇకపోతే అప్పటి నుంచి విబేధాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. తాజాగా, సంచయిత, ఊర్మిళ గజపతి రాజు మధ్య మరోసారి వివాదం నెలకొంది. విజయనగరంలో ప్రతిష్టాత్మిక సిరిమానోత్సవం జరుగుతుంది. గజపతిల కోట పై నుంచి ఆ కుటుంబం ఈ ఉత్సవం చూడటం ఆనవాయితీ. అయితే జరుగుతున్న విషయాలకు బాధపడి, అశోక్ గజపతి రాజు, ఈ ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆనంద గజపతి రాజు రెండో భార్య అయిన సుధ గజపతి, కూతురు ఉర్మిళ గజపతి, ఆనవాయితీ ప్రకారం కోట పై నుంచి సిరిమానోత్సవం చూడటానికి వచ్చారు.

అయితే ఇదే సమయంలో అక్కడే మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ సంచయిత కూడా వచ్చారు. ఊర్మిళ గజపతి, సుధా గజపతి అక్కడ ఉండటం పై ఆమె అసహనం వ్యక్తం చేసారు. వారిని ఇక్కడ నుంచి పంపేయాలని, అక్కడ ఉన్న అధికారులకు చెప్పారు. అయితే వారు మాత్రం, ఇది కుటుంబ వ్యవహారం అని మీరు మీరు చూసుకోవాలని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం పై, అవమానంగా భావించిన ఊర్మిళ గజపతి, సంచయిత గజపతి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ మొత్తం ఘటన పై , ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు ఊర్మిళ. తన తండ్రి ఆనంద గజపతి ఉన్న దగ్గర నుంచి, కోట పై నుంచి సిరిమానోత్సవం చూడటం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది రావద్దు అనుకున్నా, ఆనవాయితీని బ్రేక్ చేయటం ఎందుకని వచ్చామని అన్నారు. మేము ఇక్కడకు వచ్చిన తరువాత, మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ లేరని గ్రహించామని, అయిన ఇది సాంప్రదాయం అని అన్నారు. సంచయిత ఒత్తిడికి లొంగిన ఇక్కడ పని చేసే వారు, తమ వద్ద గత 20 ఏళ్ళుగా పని చేసిన వారే, వారు వచ్చి, మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పటం, చాలా అవమానకరం అని అన్నారు. అంతె కాదు, సిరిమానోత్సవం చూసే హక్కు, ఈ కుటుంబంలోని వ్యక్తులుగా మాకు ఉంది అని, ఎవరికీ మమ్మల్ని వెళ్ళమనే హక్కు లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి గత కొన్ని వందల ఏళ్ళుగా ఎంతో గౌరవంగా బ్రతికిన పూసపాటి వంశంలో, ఈ రకంగా విబేధాలు బయట పడి, రచ్చకు ఎక్కాయి. రాజకీయంగా పావులు అయ్యారు.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ, చంద్రబాబు చెవిలో ఎప్పుడూ ఏదో ఒక గోల పెడుతూ విసిగిస్తూ ఉండేది. యూసిలు అని, లెక్కలు అని, మా పేరు లేదని, ఇదని, అదని అనేక రకాలుగా, ఏదో ఒక విషయం పై ప్రతి రోజు రచ్చ జరిగేది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత సైలెంట్ అయిపోయారు. గతంలో చంద్రన్న భీమా, అన్నదాత సుఖీభవ లాంటి పధకాల పై తమ పేరు లేదని, ఇందులో కేంద్రం వాటా కూడా ఉందని ఆందోళన చేసే వారు. అయితే ఇప్పటి జగన్ ప్రభుత్వంలో మాత్రం సైలెంట్ గా ఉండటం విశేషం. ఈ రోజు రైతు భరోసా కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేస్తూ, ఒక ఫుల్ పేజి ప్రకటన అన్ని పేపర్లలో ఇచ్చింది. అయితే ఇందులో ఎక్కడా ప్రధాని పేరు లేదు. గత ఏడాది ప్రకటనలో మాత్రం, పీఎం కిసాన్ అని పేరు రాసారు. ఈ సారి మాత్రం ప్రధాని పేరు ఎత్తేసి, బీజేపీకి షాక్ ఇచ్చారు జగన్. ఈ రైతు భరోసాలో, కేంద్రం ఆరు వేలు ఇస్తుంటే, జగన్ ప్రభుత్వం ఏడు వేల 500 ఇస్తుంది, అంటే దాదాపుగా 40 శాతం కేంద్రం నుంచే వస్తాయి. అయితే ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా కేంద్రం పేరు, ప్రధాని పేరు లేకపోవటం ఆశ్చర్యం. అయితే ఈ చర్యను బీజేపీ అసలు పట్టించుకోక పోవటం మరొక ఆశ్చర్యం. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ నేతలు, వైసీపీకి అనుకూలం అనే అభిప్రాయం ఉంటే, ఇలాంటి చర్యలతో అది మరింత బలపడే అవకాసం ఉన్నా, బీజేపీ నేతలు మాత్రం ఎందుకో కానీ ఈ విషయం పై అసలు పట్టించుకోలేదు. అయితే ఈ పధకంలో ఉన్న అవకతవకల పై ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్పందించింది. రైతు పక్షపాతి అనేపదానికి ఏకైక అర్హుడిని ఈ ప్రపంచంలో తానేనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, తనకు తానే స్వీయ ధృవీకరణలు ఇచ్చుకోవడం, సొంతడబ్బాలు కొట్టుకోవడం ఆయనలా మరే ముఖ్యమంత్రి చేయడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! " వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద వరుసగా రెండోఏడాదికూడా రాష్ట్రంలో 50.47లక్షల రైతుకుటుంబాలకు పెట్టుబడి సాయంగా రూ.6,797కోట్లు ఇచ్చినట్లు పత్రికలకు ఆర్భాటంగా ప్రకటనలిచ్చారు. నేడు ఆసొమ్ము మొత్తం రైతుల ఖాతాల్లో పడుతున్నట్లు ప్రకటనల్లో చెప్పారు. రైతుభరోసా పథకమే పెద్ద రైతుదగా పథకం. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తానని, కేంద్రం సాయంతో సంబంధంలేకుండా ఏటా తానే చెల్లిస్తానని ప్రతిపక్షంలోఉన్నప్పుడు జగన్ చెప్పారు. ఇప్పుడేమో కేంద్రంఇచ్చే సొమ్ముతో కలిపి రూ.12,500 ఇస్తానని చెబుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రూ.18,500 ఇస్తానని చెప్పాడు. దానిపై రైతులంతా గొడవచేయడంతో ఏదో కంటితుడుపుచర్యగా రాష్ట్రం ఇచ్చే రూ.6,500లకు అదనంగా మరో వెయ్యి పెంచారు. రూ.1000 పెంచినా మరో 5వేలు ప్రతిరైతుకు కోతపెట్టారు. జగన్ ప్రభుత్వంలో రైతులకు చేసే సాయానికి సంబంధించిన రాతలేమో మిన్నగా సాయమేమో సన్నగా ఉంది. సరిగ్గా ఏడాదిక్రితం అక్టోబర్ 15, 2019న సాక్షిపత్రికలో రైతుభరోసా కింద ఇచ్చిన ప్రకటనలో, మొత్తం లబ్దిదారుల సంఖ్య 54లక్షల మందికి వర్తింపచేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రైతుభరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలో 50.47లక్షలలకు లబ్ధిదారుల సంఖ్యలో మూడున్నర లక్షలమందికి కుదించారు. ఒక్క ఏడాదిలోనే మూడున్నర లక్షలమంది రైతులు ఏమయ్యారో తెలియదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో రైతుభరోసా గురించి మాట్లాడుతూ, 64.06వేల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వర్తింపచేస్తామని చెప్పారు. 64 లక్షలమంది రైతులు 2019 అక్టోబర్ నాటికి 54లక్షల మంది ఎలా అయ్యారో, తిరిగి ఈ ఏడాది అక్టోబర్ నాటికి 50.47లక్షలమందికి ఎలా తగ్గిందో చెప్పాలి. "

"2019 అక్టోబర్ లో రైతుభరోసా పథకం కింద మొత్తం లబ్దిదారుల సంఖ్య కేవలం 46లక్షల69వేల,375 మంది మాత్రమే అని సాక్షి పత్రికలో నేడు (27-10-2020) రాశారు. 2020 ఖరీఫ్ సమయానికి లబ్దిదారలు సంఖ్యను 49 లక్షల 57వేలకు పెంచామని, ఇప్పుడు రబీ సమయానికి ఏకంగా 50లక్షల 47వేలకు పెంచామని తప్పుడురాతలు రాశారు. సాక్షిపత్రికలో వేసిన ప్రకటనలో లబ్ధిదారుల సంఖ్య 54లక్షలని చెప్పి, 2019 అక్టోబర్ నాటికి అదేసాక్షిలో 46లక్షల69వేల 375 మంది అని ఎలా చెప్పారు? ప్రజలుఏదినమ్మాలి? రైతుభరోసా పథకాన్ని 54లక్షలమందికి ఇస్తామనిచెప్పి, 8లక్షలమందికి కోతపెట్టేసి, చివరకు 46లక్షల69వేలమందికే ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పత్రికలో రాసిన వాటిపై ఏం సమాధానం చెబుతారు? ఈ విధంగా ప్రకటనలపేరుతో ఒకలా, రాతల్లో మరోలా ఎలా తప్పుడు రాతలు, కాకిలెక్కలు చెబుతున్నారో ప్రజలంతా అర్థంచేసుకోవాలి. వచ్చే ఏడాది లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గొచ్చు. 2019 అక్టోబర్ లో రైతుభరోసా పథకాన్ని 46లక్షల69వేలమందికే జగన్మోహన్ రెడ్డి అమలుచేశారా? లేదంటే సాక్షిపత్రిక ప్రకటనలో చెప్పినట్టు 54లక్షలమందికి అమలుచేశారా? ఏది వాస్తవమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. తెలుగుప్రజల మనస్సాక్షి పేరుతో ప్రజలకు ఎన్ని రకాలుగా తప్పుడు రాతలు రాస్తున్నారో, రాష్ట్ర రైతులను ఎలా మోసగిస్తున్నారో అందరూ అర్థంచేసుకోవాలి. " అని పట్టాభి అన్నారు.

వాళ్ళు అన్నం పెట్టే రైతులు. అంతే కాదు, ఈ రాష్ట్రం ముక్కలు అయి రోడ్డున పడితే, మనది రాజధాని లేని రాష్ట్రం అని, రాజధాని కోసం భూములు ఇవ్వాలని అడిగితే, తమతో పాటు, ఈ రాష్ట్రం కూడా బాగు పడుతుందని నమ్మి, 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులు వాళ్ళు. వాళ్ళేమి నేరాలు, ఘోరాలు చేయలేదు. అయినా ఈ రోజు ఆ రైతులను చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. చేతులకు బేడీలు వేసి, బస్సులో నుంచి దింపుతుంటే, గుండె తరుక్కు పోయింది. ఇక ఘటన వివరాల్లోకి వెళ్తే, 315 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం పై ఎలాంటి స్పందన లేకపోయినా వారు శాంతి యుతంగా ఉద్యమం చేస్తున్నారు. అయితే ఇక్కడే అమరావతికి పోటీగా, ఆటల్లో కొంత మందిని తీసుకొచ్చి, కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారు కొంత మంది. ఆటల్లో వేరే ఊరి నుంచి తమ ఊరి వచ్చి హడావిడి చేస్తున్న వారిని, అడ్డుకున్నారు రైతులు. ఇప్పుడు అదే వారి పాలిట శాపం అయ్యింది. కేవలం అడ్డుకున్నందుకు రైతు చేతికి సంకెళ్ళు వేసారు. మా గ్రామంలోకి బయట నుంచి ఎలా వస్తారు అని అడిగినందుకు వారి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి, 11 మంది దళిత, బీసి రైతులను అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన తరువాత, వారిని నరసరావుపేట సబ్ జైలుకు, మళ్ళీ అక్కడ నుంచి ఈ రోజు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ తరలించే క్రమంలో, 8 మంది రైతులకు సంకెళ్ళు వేసారు. ఈ ఘటన పై అందరూ షాక్ అయ్యారు. వాళ్ళు ఏమి పాపం చేసారు, రాజధానికి భూములు ఇవ్వటమే వారి తప్పా అంటూ వివిధ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

అయితే ఈ పరిస్థితి చూసిన రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ఇద్దరికి కలిపి సంకెళ్ళు వేసి, ఇలా దారుణంగా తీసుకురావటం పై, ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని కోసం భూములు త్యాగం చేస్తే, ఈ ప్రభుత్వం తమ చేతికి సంకెళ్ళు వేసి, బహుమానం ఇచ్చిందని వాపోయారు. రైతు కుటుంబాలు మానసిక వేదన గురి అవుతున్నారు. అయితే పోలీసులు, ఈ విషయంలో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. రైతులను, అదీ తమ ఊరికి ఎందుకు వస్తున్నారు అని అడిగిన కేసు విషయంలో, ఇంతలా చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇక మరో పక్క ఇప్పటికే, ఈ కేసు పెట్టిన వ్యక్తి తాను కేసు వెనక్కు తీసుకుంటాను అని పోలీసులకు రిటెన్ గా రాసి ఇచ్చినా, పోలీసులు మాత్రం, కోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని, తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 315 రోజులుగా వేదిస్తున్నారని, ప్రభుత్వం ఇలా చేసి ఏమి సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం, పోలీసులు ఈ వ్యవహారం పై ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2019 ఎన్నికల తరువాత, అనూహ్య రాజకీయ మార్పులు జరిగిన విషయం తెలిసిందే.. 2019 ఎన్నికల ముందు వరకు, కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్న పవన్ కళ్యాణ్, దానికి పూర్తి వ్యతిరేకంగా, సిద్దాంతాలకు పూర్తి విరుద్ధంగా ఉన్న బీజేపీతో కలిసి కొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. నిజానికి ఎన్నికల ముందు నుంచి పవన్ బీజేపీకి దగ్గర అనే ప్రచారం ఉన్నా, పవన్ కళ్యాణ్ బీజేపీ పై చేసిన విమర్శలు, ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి, బీజేపీని దోషిగా చూపించిన తీరుతో, ఆ విమర్శలు నుంచి బయట పడ్డారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన విధానం కావచ్చు, మరేదైనా కారణం అవ్వచ్చు కానీ పవన్, బీజేపీతో కలిసారు. రెండు పార్టీలు పొత్తుగా ఏర్పడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం మొదలు పెట్టాయి. నిజానికి ఈ కలయికలో పవన్ కళ్యాణ్ పార్టీనే పెద్ద పార్టీ. ఎందుకంటే పవన్ పార్టీకి 6 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి ఒక్క శాతం వరకు వచ్చాయి. అయితే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి, పవన్ తప్పని పరిస్థితిలో, బీజేపీ అజెండా మోయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయితే క-రో-నా కారణం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు కానీ, జనసేన, బీజేపీ ఇప్పటి వరకు కలిసి, క్షేత్ర స్థాయిలో పెద్దగా పని చేసింది లేదు. సోషల్ మీడియాలో మాత్రం, ఒకరికిఒకరు సమర్ధిస్తూ పోస్ట్లు పెడుతున్నా, కింద స్థాయిలో ఇంకా అంత సఖ్యతతో కార్యక్రమాలు మొదలు కాలేదనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయంలో మాత్రం, పవన్ కళ్యాణ్ వైఖరిని మెచ్చుకోవాలి. అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మద్దతు తెలుపుతున్నారు. అమరావతిలో పోలీస్ ఆంక్షలు ఉన్నా, అక్కడకు వచ్చి పర్యటన చేసారు. ఆ తరువాత అమరావతి ఉద్యమం పవనే నడుపుతారని అందరూ భావించినా, ఆ తరువాతే బీజేపీతో కలవటంతో, పవన్ కొంచెం స్లో అయ్యారు.

ఆ తరువాత బీజేపీ ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతుంది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న కన్నా అమరావతికి పూర్తి మద్దతు తెలుపుతా, ఇప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు మద్దతు అని చెప్తున్నా, ప్రజలు ఎందుకో విశ్వసించటం లేదు. అయితే బీజేపీ వైఖరి ఎలా ఉన్నా, పవన్ మాత్రం, ప్రతి సందర్భంలో అమరావతి తరుపున మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు పోలవరం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయంతో, అందరూ షాక్ అయ్యారు. పోలవరం అంచనాలు కేంద్రం తగ్గించింది. అయితే ఈ పరిణామం పై పవన్ స్పందించలేదు. స్పందించక పొతే, పవన్ ఇమేజ్ కు ఇబ్బంది. టిడిపి, వైసీపీ కంటే, పోలవరం విషయంలో బీజేపీదే బాధ్యత ఎక్కువ. మరి ఈ విషయంలో బీజేపీ పై, పవన్ స్పందన ఎలా ఉంటుంది ? నిజానికి ఇక్కడ బీజేపీకి కొత్తగా పోయేది ఏమి ఉండదు. బీజేపీని ఏపి ప్రజలు ఇప్పట్లో విశ్వసించరు అనే చెప్పాలి. అయితే వారితో ఉన్న పవన్ కు మాత్రం, ఈ పరిణామం ఇబ్బందిగానే మారుతుంది. 6 శాతం ఓటు బ్యాంకు ఉన్న పవన్, దాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పటికే ప్రత్యెక హోదా, అమరావతి పై బీజేపీ వైఖరి పై అభ్యంతరాలు ఉన్న సమయంలో, దానికి పోలవరం వచ్చి చేరింది. మరి ఈ అంశాల పై బీజేపీ పై ఉన్న నెగటివ్ ని, వారితో కలిసి ఉన్న పవన్ ఎలా అధిగమిస్తారు ? మౌనంగా భారిస్తారా ? స్నేహపూర్వకంగా ఉంటూనే అభ్యంతరం తెలుపుతారా ? లేక మిగతా రాజకీయ పార్టీలు లాగే, ఎదుటు వారి పై తప్పు తోసేసి, తప్పించుకుంటారా ? కాలమే సమాధానం చెప్తుంది.

Advertisements

Latest Articles

Most Read