తమ `ప్రత్యర్ధులపై ఫేక్ న్యూస్ సృష్టించి, రాజకీయంగా లాభ పొందటం, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. మన రాష్ట్రంలో అలాంటివి కొంచెం ఎక్కువే. ఈ అతితోనే, ఏకంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్న వారి పై, హైకోర్టు కలుగ చేసుకుని, ఏకంగా సిబిఐ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టు సీరియస్ అయినా, సిబిఐ ఎంక్వయిరీకి ఆదేసించినా, కొంత మంది మాత్రం ఇంకా రేచ్చిపోతూనే ఉన్నారు. తమకు ఎవరు అడ్డు వస్తే వారి పై, తప్పుడు కధనాలు అల్లటం, వారి పరువు ప్రతిష్టలను దెబ్బ కొట్టటం, చాలా మామూలు విషయం అయిపొయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు, ఇలాంటి వాటి పై ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు వైపు నుంచి పెద్దగా స్పందన రావటం లేదు కానీ, అధికార పక్షం నుంచి ఏదైనా కేసు వస్తే మాత్రం, వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఫేక్ కధనాల బారిన, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ కూడా పడ్డారు. ఆయన పై ఇప్పటికే అనేక విధాలుగా, ఒక సెక్షన్ అఫ్ మీడియాలో కధనాలు వస్తుంటే, సోషల్ మీడియాలో శ్రుతిమించి కధనాలు వస్తున్నాయి. తాజాగా ఒక వెబ్సైటులో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తప్పుడు కధనాలు రాసారు. మంత్రి పేర్ని నాని చెప్పారు అంటూ, ఆ తప్పుడు కధనం సారాంశం.

nimmagadda 01112020

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదివిని మళ్ళీ తెచ్చుకోవటానికి, వందల కోట్లు ఖర్చు చేసారని, పేర్ని నాని ఈ విషయం చెప్పారు అంటూ సదరు వెబ్సైటు కధనాలు రాసింది. అయితే ఈ వార్త వైరల్ కావటంతో, ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల పై కఠినంగా ఉండే నిమ్మగడ్డ, వెంటనే విజయవాడలో ఈ వార్తపై కంప్లైంట్ ఇచ్చారు. తమ పరువుకు భంగం కలిగిస్తూ వస్తున్న ఈ వార్త పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ వార్తను పేర్ని నాని చెప్పారు అంటూ, ఆ వెబ్సైటు రాసింది. అయితే మంత్రి పేర్ని నాని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, మీడియాలో హైలైట్ అయ్యేది. మరి మంత్రి గారు, ఆ వెబ్సైటుతో డైరెక్ట్ గా ఈ విషయం చెప్పారా ? అనేది తెలియాల్సి ఉంది. మరి పోలీసులు ఈ విషయం పై ముందుకు వెళ్తారా లేదా అనేది చూడాలి. రాజ్యాంగా వ్యవస్థ పై ఇలాంటి కధనాలు రాస్తుంటే, పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఒక వేళ నిజంగా మంత్రి పేర్ని నాని, ఈ వ్యాఖ్యలు అని ఉంటే, ఆయన పైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మంత్రి గారు ఆ మాటలు అనకుండా, ఈ వెబ్సైటు వేస్తె, మంత్రి గారు కూడా ఆ వెబ్సైటు పై, చర్యలు తీసుకోమని చెప్పాలి. మొత్తానికి ప్రతి రెండు రోజులకు ఏదో ఒక విధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహారం వార్తల్లో ఎక్కుతూనే ఉంది.

రాష్ట్ర నీటిపారుదల శాఖా మాత్యులు అనిల్ కుమార్ ఈరోజు మాట్లాడుతూ, పోలవరానికి సంబంధించిన నిజాలు బయటపెడతానని, దమ్ముంటే సమాధానాలు చెప్పాలని తమపార్టీకి సవాల్ విసిరితే, ఆయన మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం చెప్పడానికే తాము వచ్చామని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. శనివారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. "పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏబీసీడీ లు కూడా తెలియని అనిల్ కుమార్ కి తాము సమాధానం చెప్పడమేంటి. ఆయనకు ప్రాజెక్ట్ గురించి ఏం తెలుసు? టీఎంసీ అనే పదానికి పూర్తి అర్థం ఆయనకు తెలుసా? క్యూసెక్కు అంటే ఎన్నినీళ్లు వస్తాయో తెలుసా? ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కాకపోతే, ఆయన రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రా? ఆయనకు తాము సమాధానం చెప్పడమేంటి? మార్చి 2017లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆనాడు తమపార్టీకిచెందిన మంత్రులెవరూ మాట్లాడలేదని, దానివల్లే ప్రాజెక్ట్ కు తీరని అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ ఏదేదో మాట్లాడాడు. మార్చి 2017లో ఏం జరిగింది...తరువాత ఏంజరిగిందో చెప్పడానికే తాము మీడియా ముందుకు వచ్చాం. ఘోరం, నేరం జరిగినట్లు, అనిల్ కుమార్ ఊదరగొడుతూ, తన, తనప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం తమపై బురదజల్లుతున్నాడు. మార్చి 15 - 2017లో జరిగిన కేబినెట్ మీటింగ్ నోట్ ను పరిశీలిస్తే, 01-04-2014 నుంచీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పెట్టేఖర్చును తామే భరిస్తామని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో, దానిపైనే ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన అంచనా వ్యయం బాధ్యత పెట్టడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిధిలోకే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా వస్తుంది."

"ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కైనా ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజేషన్ కలిపే ఉంటుంది. ఇందులో ఏముందని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అనిల్ గోల చేస్తున్నాడు? అనిల్ ఏనాడైనా ఢిల్లీ వెళ్లి, కేంద్ర జలశక్తి మంత్రితోగానీ, ఆర్థికమంత్రితో గానీ మాట్లాడాడా? అనిల్ ఒక బెట్టింగ్ ముఠా నాయకుడు. అటువంటివ్యక్తి 420కి భక్తుడు కావడంలో ఆశ్చర్యం ఏముంది? 420లంతా ఎప్పుడూ ఒకేచోట ఉంటారు. 2017 మార్చిలో కేంద్ర కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత, తమప్రభుత్వం దాదాపు లక్ష డాక్యుమెంట్లను ఢిల్లీకి తరలించింది. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ను ఎస్టిమేట్ చేయించడం కోసం లక్షడాక్యుమెంట్లను తరలించడం జరిగింది. అనేకసార్లు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన సభ్యులు పోలవరంప్రాజెక్ట్ ని సందర్శించారు. ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి ఆప్రాంతమంతా తిరిగారు. ఆ తరువాతే కేంద్ర టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రూ.55,548కోట్ల అంచనావ్యయానికి ఆమోదం తెలిపింది. ఇవన్నీ తెలిసే, అనిల్ మాట్లాడుతున్నాడా? చంద్రబాబు నాయడు ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే, పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,548కోట్లకు ఆమోదించేలా చేశారు. మీరు వచ్చాక సంవత్సరంన్నరకే ప్రాజెక్ట్ ని అటకెక్కించి. ఫిబ్రవరి 20-2014న ఆనాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్, ల్యాండ్ అక్విజేషన్ మరియు ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి రాజ్యసభలో మాట్లాడుతూ, చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనేం చెప్పారో ఏపీ ఇరిగేషన్ మంత్రికి తెలుసా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్ట్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ ప్రక్రియని పూర్తిచేస్తామని నాటి ప్రధాని చెప్పారు. "

"అంతస్పష్టంగా ప్రధాని చెబితే, ఇప్పుడు ఈ మంత్రి ఏం మాట్లాడతాడు? 24-06-2019న పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నాటి కేంద్రమంత్రి సమాధానమిస్తూ, పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి, రూ.55,548 కోట్లకు రివైజ్ట్ కాస్ట్ అంచనాలను అమోదించడం జరిగిందన్నారు. 11-02-2019న జరిగిన 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో రూ.55,548కోట్లకు ఆమోదించామని నాటి కేంద్రమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. దానిలోనే రూ.33,168కోట్లు ఆర్ అండ్ ఆర్ మరియు ల్యాండ్ అక్విజేషన్ కు కేటాయించడం జరిగిందని కూడా చెప్పారు. ఇంతా జరిగితే, ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజేషన్ గురించి టీడీపీ పట్టించుకోలేదని ఈ మంత్రి ఎలా చెబుతారు? రూ.33,168కోట్లకు ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ కు ఆమోదం తెలిపేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదికాదా? ఆ ఘనత సాధించింది టీడీపీ ప్రభుత్వం కాదా? దీనికేం సమాధానం చెబుతాడు మంత్రి అనిల్ కుమార్? విజయసాయి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం చెప్పిన రోజునే, విజయసాయి ట్వీట్ పెట్టారు. దానిలో జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కలిసి పోలవరం నిధుల గురించి అడిగినట్లు, అందుకు స్పందనగానే రూ.55,548కోట్లకు ఆమోదం తెలిపారని ట్వీట్ లో చెప్పారు. వైసీపీప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, జగన్ ఏమీ సాధించకపోయినా, టీడీపీప్రభుత్వ ఘనతను మీదిగా చెప్పుకున్నారు.. సిగ్గులేకుండా."

"ఫిబ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.55,548కోట్లకు ఆమోదం పొందేలా చేస్తే, తమనాయకుడే చేశాడని, మోదీతో మాట్లాడాడని విజయసాయి ట్వీట్లు ఎలా పెడతాడు? జగన్ అడగకపోయినా అడిగినట్లు విజయసాయి ఢంకా ఎలా భజాయించాడు. ఆ ఖ్యాతి మీదైతే, ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనావ్యయంలో రూ.20వేలకోట్లు కోత పెట్టారు కదా.. దానికి కూడా బాధ్యత మీరే తీసుకోవాలి కదా? కోత పెడితే బాధ్యత మాదికాదంటూ, ఆమోదించిన దానికి మాత్రమే బాధ్యత తీసుకుంటారా.? పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటషన్ పై విచారణ జరిగినప్పుడు కేంద్రజలవనరుల శాఖ జూన్ 2020న వేసిన పిటిషన్లో ఆర్ అండ్ ఆర్ కింద దాదాపుగా రూ.33వేలకోట్ల వరకు ఒప్పుకున్నట్లు చెప్పారు. దీనికేం సమాధానం చెబుతారో చెప్పాలి. జూన్ 2020న కూడా కేంద్రం ఆర్ అండ్ ఆర్ కి ఎంతమొత్తానికి ఒప్పుకుందో స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా తెలుగుదేశంపై నిందలేస్తారా? ఆనాడు చంద్రబాబు నాయుడు అనేకసందర్భాల్లో ఢిల్లీ వెళ్లినప్పడల్లా పోలవరం ప్రాజెక్ట్ పై శ్రధ్దచూపి, సోమవారాన్ని పోలవారం గా మార్చుకొని పనులు చేయబట్టే 70శాతం పనులు పూర్తయ్యాయి. రూ.55,548కోట్లకు అంచనాలను ఆమోదింపచేశారు. అదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరుల మంత్రే ఒప్పుకున్నారు. ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిననివేదికలో కూడా దాన్నే సమర్థించారు. ఇంతజరిగితే, టీడీపీని, చంద్రబాబుని విమర్శిస్తారా? 70శాతం పనులు ఎక్కడ పూర్తయ్యాయో మంత్రి అనిల్ కు, ముఖ్యమంత్రికి తెలియదా? "

"ప్రాజెక్ట్ పనులు 70శాతం పూర్తయ్యాయని, వైసీపీప్రభుత్వంలోని అధికారులే ముఖ్యమంత్రి, నోటిపారుదల శాఖా మంత్రి సమక్షంలో వీడియో ప్రదర్శించి మరీ వివరణ ఇచ్చారు. హెడ్ వర్క్స్ పనులు, రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు, కాపర్ డ్యామ్ పనులు ఎంత జరిగాయో వివరిస్తూ, 70శాతం పనులు జరిగాయన్నారు. నోటి పారుదల మంత్రి ఆనాడు జరిగిన సమావేశంలో నిద్రపోతున్నాడా? ఆయన కళ్లెదురే కదా అధికారులు 69.05శాతం పనులుజరిగాయని చెప్పారు. ఆనాడే ఈ మంత్రి అధికారులను ఎందుకు అడగలేదు? ఈ విధంగా వాస్తవాలన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే, టీడీపీని ఎలా నిందిస్తారు? టీడీపీప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ కి ఆమోదించిన అంచనా వ్యయం రూ.55,548కోట్లపై కేంద్రాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతోంది? పోలవరం ప్రాజెక్ట్ ని అటకెక్కించి, పూర్తిగా నిర్వీర్యంచేసిన ఘనత వైసీపీప్రభుత్వానిదే. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు అర్థంచేసుకోవాలి. విషయపరిజ్ఞానం లేనివ్యక్తులు, ప్రాజెక్ట్ నినాశనం చేసినవ్యక్తులే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడి కృషికారణంగానే దేశంలో ఏ ప్రాజెక్టులో జరగనివిధంగా 70శాతం పనులుజరిగాయి. అదే విషయాన్ని తరువాత కేంద్రమంత్రి గడ్కరీ కూడా ఒప్పుకున్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం అటకెక్కడానికి, ఆగిపోవడానికి కారణం ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డేనని ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి." అని పట్టాభి అన్నారు.

అమరావతి రైతులకు సంకెళ్ళు వేసిన దానికి నిరసనగా, నిన్న అమరావతి జేఏసి, చలో గుంటూరు జైలుకు పిలుపు ఇచ్చింది. గత రెండు రోజులుగా ఈ విషయం పై వ్యక్తం అవుతున్న నిరసన చూసి, పోలీసులు ఈ చలో గుంటూరు జైలు కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. వస్తున్న స్పందన చూసి, రైతులు, మహిళలు ఎలాగైనా ఈ కార్యక్రమం చేసి తీరుతారని, ఇంటలిజెన్స్ రిపోర్టుల నేపధ్యంలో, ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటానికి, పోలీసులు తమ వ్యూహానికి పదును పెట్టారు. శుక్రవారం అర్ధరాతి నుంచే అమరావతి జేఏసి నాయకులు, అలాగే విపక్ష నేతల ఇళ్ళ వద్దకు చేరుకున్నారు. ఉదయానికి మొత్తం, అందరినీ హౌస్ అరెస్ట్ చేసారు. అలాగే రాజధాని గ్రామాల్లో కూడా ముఖ్యమైన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, హౌస్ అరెస్ట్ చేసారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం కంట్రోల్ లో లోని ఉందని పోలీసులు భావించారు. అప్పటికి వార్తలు కూడా, అందరినీ నిర్భందిస్తున్నారు అనే వార్తలే వచ్చాయి. ఎక్కడా చడీ చప్పుడు లేదు. దీంతో పోలీసులు, ప్రభుత్వం, అమరావతి ఉద్యమకారులు ఇచ్చిన పిలుపు భగ్నం చేశామనే ఆలోచనలో, మరొక్క రెండు మూడు గంటలు ఇలాగే ఉంటే చాలని అనుకున్నారు. పోలీసులు వ్యూహం ఫలించిందని అందరూ భావించారు. అయితే 10 గంటలు దాటగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నెమ్మదిగా అక్కడక్కడ ఆక్టివిటీ జరుగుతూ వచ్చింది. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు పోలీసులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే 11.30 గంటల సమయంలో మెరుపు దా-డిలాగా అమరావతి ఉద్యమకారులు గుంటూరు దూసుకుని వచ్చారు. అంతే పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. అదనపు బలగాలు రప్పించారు.

మొత్తం పరిస్థితి మళ్ళీ చేతిలోకి రావటానికి, మధ్యానం రెండు గంటలు అయ్యింది. ఈ మధ్యలో అరగంట సేపు రహదారి దిగ్బంధించారు. అలాగే కొంత మంది, జైలు గోడలు దూకి లోపలకు వెళ్లి, రైతులకు సంఘీభావం తెలిపారు. ఇలా పోలీసులు పన్నిన వ్యూహాన్ని చేధించుకుని, అమరావతి ఉద్యమకారులు, తాము ఇచ్చిన కార్యక్రమ పిలుపుని, సక్సెస్ చేసారు. అయితే ఇందు కోసం అమరావతి రైతులు ఒక వ్యూహాన్ని అమలు చేసారు. పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న నేతలు, శుక్రవారం సాయంత్రమే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. నేతలను పక్కన పెడితే సామాన్య రైతులు, మహిళలు, గుంటూరు చేరుకొని, రోడ్డు మీద అటు ఇటూ తిరుగుతూ, సమయం కోసం వేచి చూసారు. అనుమానం వచ్చి కొంత మందిని పోలీసులు అడిగితే, షాపింగ్ కోసం అని, మా వాళ్ళు వస్తారని, ఇలా రకరాల సమాధానాలు చెప్పారు. 11.20 సమయంలో ఒకేసారు అరండల్‌పేట, బ్రాడీపేట వీధుల నుంచి అందరూ జైలు వైపు పరుగులు తీసారు. అప్రమత్తం అయిన పోలీసులు, బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో రహదారిపై బైఠాయించటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతు జేఏసి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌, దళిత రైతు జేఏసీ కన్వీనర్‌ మార్టిన్‌ లూథర్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, వివిధ పార్టీల నేతలు సుంకర పద్మశ్రీ, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు సైతం ఇక్కడకు రావటంతో, పోలీసుల వ్యూహం కంటే, రైతుల వ్యూహమే ఫలించినట్టు అయ్యింది.

ఇప్పటికే పోలవరం విషయంలో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షాక్ తో, రాష్ట్ర ప్రజలతో సహా, అందరూ షాక్ లో ఉన్నారు. గత చంద్రబాబు హయంలో 55 వేల కోట్ల పోలవరం అంచనాలు ఆమోదించిన కేంద్రం, ఇప్పుడు దాన్ని 20 వేల కోట్లకు తగ్గిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీని పై ఇప్పటికే తర్జనబర్జనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయండి ప్లీజ్ అంటూ, కేంద్రానికి నిన్న ఒక లేఖ కూడా రాసింది. కేంద్రాన్ని గట్టిగా , రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలని, పోలవరం విభజన చట్టంలో పెట్టిక హక్కు అంటూ, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. రేపు పీపీఏ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఈ విషయం పై తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలో, మరో పిడిగు లాంటి వార్తా కేంద్రం చెప్పింది. ఇది చాలా అసంబద్ధంగా ఉందని, కేంద్రం కావాలనే ఇలా చేస్తుందని, పలువురు వాపోతున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం కోసం విడుదల చేసిన డబ్బులు, కేవలం పోలవరం ప్రాజెక్ట్ కే వాడారనే పద్దులు చూపించాలని కేంద్రం కోరుతుంది. ఇలా ఖర్చు చేసారని నిరూపిస్తేనే, తాము మిగతా డబ్బులు విడుదల చేసామని కేంద్రం అంటుందని, ఇదే విషయం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా కేంద్రం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.

polavaram 01112020 1

కేంద్రం నుంచి మనకు ఇంకా రూ.2234.288 కోట్లు, మన రాష్ట్రం, గత ప్రభుత్వంలో ఖర్చు చేసిన సొమ్ము రావాల్సి ఉంది. అయితే కేంద్రం పెట్టిన తాజా షరతుతో, ఈ డబ్బులు వచ్చే అవకాసం లేదు. కేంద్రం ఇలాంటి కొర్రీలు కావాలని పెడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీయకపోతే, ఇలాగే ఆడిస్తారని అంటున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక పద్దు పెట్టి అందులో డబ్బులు వేసి వాడుకోమని చెప్పటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు చేసి, దానికి సంబందించిన వివరాలు అన్నీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తే, వివిధ స్థాయిల్లో ఈ లెక్కలు అన్నీ పరిశీలించి, కేంద్రం ఇస్తుంది. కేంద్రం అన్నీ పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దానికి రీఇంబర్స్‌ చేస్తుంది. మరి ఇప్పుడు ఇలా చెప్పటం, పూర్తి విరుద్ధం అని, కేంద్రం నిర్ణయంతో అసలకే ఎసరు అని అంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాలు పై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉండాలని, అన్న అంశాల్లో రేపు జరిగే సమావేశంలో కేంద్రాన్ని నిలదీయాలని, రాజకీయాలకు తావు లేకుండా, రాష్ట్రం కోసం, కేంద్రాన్ని దీటుగా ప్రశ్నించాలని కోరుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read