ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య, జల వివాదం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అటు కేసీఆర్, ఇటు జగన్, ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో, ఇరువురి మధ్య ఎందుకు వివాదం వచ్చిందో అర్ధం కాలేదు. పోనీ పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా వందల టిఎంసిలు నీళ్ళు తీసుకువెళ్ళే ప్రాజెక్ట్ అంటే అదే కాదు. కృష్ణాలో వరదలు వచ్చిన సమయంలో, గట్టిగా ఒక 10-15 రోజులు నీళ్ళు తీసుకువెళ్ళేది. మరి ఈ ప్రాజెక్ట్ పై లేని వివాదం ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. గతంలో చంద్రబాబు, ముచ్చుమర్రి ప్రాజెక్ట్ కట్టిన సమయంలోనే, తెలంగాణాతో సమన్వయం చేసుకుని, సీమకు నీళ్ళు వచ్చేలా చేసారు. చంద్రబాబు అంటే కేసీఆర్ కు ఎంత కోపమో తెలిసిందే. మరి అలాంటి కేసిఆర్, అప్పట్లో చంద్రబాబు ముచ్చుమర్రి కట్టిన సమయంలో ఏమి వ్యతిరేకం చూపించకుండా, మాకు, జగన్ కు మధ్య మంచి స్నేహం ఉందని చెప్పి, ఇప్పుడు వివాదాలు చెయ్యటం, ఏపి కెలికి కయ్యానికి వస్తుంది, నోరు మూపిస్తాం అంటూ, చెయ్యటం, అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.

అయితే ఇటు కేసీఆర్, అటు జగన్ పెద్ద డ్రామాలు ఆడుతున్నారని, లేని సమస్య సృష్టిస్తున్నారు అంటూ, ఇప్పటికే కొంత మంది విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, అయ్యా ఏమో కయ్యం అంటాడు, కొడుకు ఏమో దుస్తులు అంటున్నాడు, ఏమిటి ఈ డ్రామాలు అంటూ, జగన్ ని ఉద్దేశించి, అటు కేసీఆర్ , ఇటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పేపర్ క్లిప్పింగ్స్ చూపించారు. జగన్ తో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయనే విధంగా రేవంత్ మాట్లాడారు. రెండు రోజులు క్రిందట కేటీఆర్ మాట్లాడుతూ, జగన్ మాకు మంచి స్నేహితుడు అని చెప్పిన విషయం తెలిసిందే. రెండో రోజే, కేసీఆర్ వచ్చి, మాతో కెలికి కయ్యం పెట్టుకున్నారు, నోరు మూయిస్తాం అంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఈ రెండు విషయాలని రేవంత్ లేవనెత్తి, ఇది ఒక పెద్ద డ్రామా అంటూ వ్యాఖ్యలు చేసారు.

తాను ఒక మంత్రి హోదాలో ఉన్నాను అనేది తెలిసో తెలియకో, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు, వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని. ముఖ్యంగా చంద్రాబాబు నాయుడుని అయితే, ఆయన వయసు, హోదాకు కూడా గౌరవం ఇవ్వకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. గతంలో కౌంటర్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, ఇలాంటి వారికి రియాక్ట్ అవ్వటం కూడా అనవసరం అంటూ కొడాలి నానిని పూర్తిగా వదిలేసింది. ఏదో మూడు రోజులకు ఒకసారి మీడియా ముందుకు రావటం, చంద్రబాబుని తిట్టటం, జగన్ ని సంతోష పెట్టటం, తమ సొంత మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం, వెళ్ళిపోవటం, ఇదే వారు చేసే పని. అయితే, ఈ క్రమంలో, కొడాలి నాని, ఈ రోజు కూడా మీడియా ముందుకు వచ్చారు. ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్పటిలాగే చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అయితే ఇంతటితో ఆగకుండా, ఆ ఫ్లోలో బీజేపీ పార్టీని కూడా తిట్టేసారు, కొడాలి నాని. రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న, మహమ్మారి కరోనాతో, దేశంలో బీజేపీ పార్టీని పోల్చారు.

ఈ దేశంలో ఒక కరోనా పుట్టింది అని, దాని పేరు బీజేపీ ని అన్నారు. ఈ కరోనా, వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను తినేస్తుందని అన్నారు. అలాగే త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్ ని తినేస్తుంది అని అన్నారు. బీజేపీ అనే కరోనాకి అదీ ఇదీ అని ఉండదు అని, దేన్నీ అయినా తినేస్తుంది అని, ఈ కరోనా ఏపి రాష్ట్రానికి కూడా వచిందని, మాస్కులు పెట్టుకుని జాగ్రత్త పడాలని అన్నారు. అయితే ఏదో ఫ్లో లో చంద్రబాబుని తిట్టినట్టు, తిడితే బీజేపీ ఊరుకుంటుందా. వెంటనే కొడాలి నానికి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చింది, ఏపి బీజేపీ. ఆయా రాష్ట్రాల్లో కష్టపడి మేము అధికారంలోకి వచ్చామని అన్నారు. అవినీతిలో పుట్టిన వైరస్ లాంటి పార్టీలకు, బీజేపీ వ్యాక్సిన్ అంటూ కొడాలి నానికి కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇప్పటికే తెర వెనుకా ముందు, కలిసిపోయి ప్రయాణం చేస్తున్న వైసీపీ, బీజేపీ మధ్య, కొడాలి నాని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసారో, అర్ధం కావటం లేదు.

అమ్మోనియం నైట్రేట్ నిల్వలనుంచి విశాఖను కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అమ్మోనియం నైట్రేట్ బహుళార్థ ప్రయోజనాలు కలిగినరసాయనం అని దీనిని జాగ్రత్త గా వాడుకుంటే ప్రగతి ఫలాలు అందిస్తుందని, అయితే ఏ మాత్రం అజాగ్రత్త చేసినా.. ఊహించని విధ్వంసాన్ని సృష్టిస్తుందని హెచ్చరించారు. ఈ సంద ర్భంగా లెబనాన్లో పేలిన విధ్వంసాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రమాదంలో 158 మంది మరణించగా 4 వేలకు పైగా తీవ్రంగా గాయపడ్డారని కోట్ల రూపా యల ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన నగరంలోని జనాభాలో సగానికి పైగా జీవితాలు కకావికలం అయ్యాయని వెల్లడించారు. సుమారు 200 కిలోమీటర్ల మేర పేలుడు శబ్దం వినిపించిందన్నారు. రిక్టర్ స్కేలులో బీరూట్ నగరంలో ప్రకంప నలు 3.3గా నమోదయ్యా యని తెలిపారు. ఇది ఒక మోస్తరు భూకంపం వంటిదని చిన్న దేశమైన లెబనాన్ కోలుకోవడానికి దశాబ్ద కాలం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ప్రస్తుతం విశాఖలో 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నిల్వలు ఉన్నాయని బీరూట్ నగరంతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువని తెలిపారు. విశాఖ నగరంలో అమ్మోనియం నైటైట్ పేలుళ్లు జరిగితే పరిస్థితి ఊహించుకోవడానికే ఒళ్లు గగ్గురుపు డుతోందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదకరమైన రసాయనాన్ని కేవలం విశాఖ పోర్టు ద్వారా దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. విశాఖ కేంద్రంగా అమ్మోనియం నైట్రెట్ దేశ మంతటికీ సరఫరా అవుతుందని వెల్లడించారు. అమ్మోనియం నైటైటి నిల్వలకు 7 గోదాములు విశాఖ లో ఉన్నాయని బీరూట్ ప్రమాదం తరువాత వీటిని పరిశీలించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ రసాయనం కారణంగా ఒక్క ప్రమాదం కూడా జరగలేదని 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని భయం అవసరం లేదని అధికారులు చెబుతున్నారని అయితే కీడెంచి మేలెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

ప్రభుత్వాలు, అధికారులు అమ్మోనియం నైటైటి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరి కలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో విశాఖలో చిన్న చిన్న తప్పిదాల వల్ల పెద్ద, పెద్ద పారిశ్రామిక ప్రమాదాలు చోటుచేసు కుంటున్నాయని ఈ నేపథ్యంలో అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. బీరూట్లో ప్రమాదం జరిగినప్పుడు 270 డిగ్రీల ఉష్ణోగ్రతలు లేవని అటువంటప్పుడు ప్రమాదం ఏ విధంగా సంభవించిందో అధికారులు ఆలోచిం చాలని హితువు పలికారు. ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలను ఉంచ కుండా వికేంద్రీకరణ జరపడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలని ఉదాసీనంగా వ్యవహరిస్తే జరగరానిది జరిగితే నష్టాన్ని అంచనా వేయడానికే భయమేస్తోందన్నారు. మరోవైపు విజయవాడ శివారులోని కొండ పల్లిలో కూడా 100 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నట్లు మీడియా ద్వారా తెలిసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గుండెల మీద నిప్పుల కుంపటితో ఉన్న విశాఖ రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పవన్ కళ్యాణ్ కోరారు.

అంతా అనుకున్నట్టే జరుగుతుంది. జగన్ మోహన్ రెడ్డి గారు గెలిచిన కొత్తలో, గోదావరి నీటిని, తెలంగాణా భూభాగం నుంచి తీసుకుని వెళ్లి శ్రీశైలంలో కలుపుతాం, కేసీఆర్ ఈజ్ మ్యగ్నానమస్ అంటూ, అసెంబ్లీలో పొగడ్తల వర్షం కురిపించారు. కేసిఆర్ పెద్ద మనుసుతో ముందుకు వస్తే, చంద్రబాబు కుళ్ళి పోతున్నారు అంటూ చెప్పారు. అప్పట్లోనే అసెంబ్లీలో చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇది మీ ఇద్దరి స్నేహం విషయం కాదు, రాష్ట్రము విషయం, రేపు మీ ఇద్దరికీ స్నేహం చెడితే, ఎవరు బాధ్యత వహిస్తారు ? మన ఇబ్బందులు మనమే పడదాం అని. ఇప్పుడు సరిగ్గా ఈ మాటలు గుర్తు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంతే కాకుండా, రాయలసీమకు నష్టం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు వెళ్ళారు. అయితే ఈ రోజు కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే, మళ్ళీ ఆయన ఏపి పై కాళ్ళు దువ్వుతున్నారు. ఏ నోటితో అయితే, రాయలసీమను రత్నాల సీమ చేస్తాను అన్నారో, ఇప్పుడు ఏపి నోరు మూయిస్తాను అంటున్నారు. ఈ రోజు తెలంగాణాలో, నీటి పారుదలశాఖ పై, కేసిఆర్ సమీక్ష చేస్తూ, ఏపి పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. నీటి ప్రాజెక్టుల విషయంలో, అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీరు సరిగ్గా లేదు అని అన్నారు.

తెలంగాణాలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పై, ఆంధ్రప్రదేశ్ అర్ధం లేని నిరాధార ఆరోపణలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని అన్నారు వీటి అన్నిటి పై, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్థంగా వాదనలు వినిపిస్తామని అన్నారు. నేను ఏపి ప్రభుత్వ పెద్దలను పిలిచి, భోజనం పెట్టి, ఇరు రాష్ట్రాల రైతులకు ఉపయోగపడేలా ప్రణాళిక రచించి, బేసిన్లు, భేషజాలు లేవని చెప్తే, ఇప్పుడు ఏపి ప్రభుత్వం, కెలికి కయ్యం పెట్టుకుంటుందని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు సెహ్సారు. అన్ని వివరాలతో, సమగ్రంగా కౌంటర్ ఇచ్చి, అపెక్స్ కమిటీ భేటీలో ఏపీ నోరు మూయించేలా, అర్ధం పర్ధం లేని వాదనలకు సమాధానం చెప్తాం అని అన్నారు. మరి ఈ వైఖరి పై జగన్ గారు ఏమి అంటారో ? కేవలం పోతిరెడ్డిపాడు వెడల్పు అంటేనే, అదీ గట్టిగా మహా అయితే వరద వచ్చే సమయంలో, వచ్చే 5 నుంచి 10 టిఎంసి నీటి కోసం, ఈ గొడవ ఏమిటో. ఇదేదో పెద్ద ప్రాజెక్ట్ లాగా, ఇరు రాష్ట్రాల మధ్య ఈ సమస్య నిజంగా వచ్చిందా, లేక ఇరు రాష్ట్రాల పెద్దలు ఉన్న సమస్యల నుంచి డైవర్ట్ చెయ్యటానికా, అనేది చూడాలి

Advertisements

Latest Articles

Most Read