అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ, అలాగే సిఆర్డీఏ రద్దు, ఈ రెండు బిల్లులు గవర్నర్ ఆమోదించటం, అలాగే గజెట్ విడుదల కావటంతో, రాజధాని రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. పోయిన వారం దీని పై విచారణ చేసిన ధర్మసానం, 14 వరకు దీని పై యదాతధ స్థితి కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ రోజు 14 కావటంతో, ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ చేసిన ధర్మాసనం, మళ్ళీ ఈ నెల 27 వరకు స్టేటస్ కో ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 27 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, అమరావతి పై యధాతధ స్థితి కొనసాగనుంది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు స్టేటస్ కో ఇవ్వగానే, ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పందిస్తూ, కావాలంటే వాయిదా వెయ్యాలని, కనీ స్టేటస్ కో ఇస్తే, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేయటానికి వీలు లేకుండా పోతుందని, అందుకే స్టేటస్ కో ఎత్తేయాలని, హైకోర్టును విజ్ఞప్తి చేసారు.

అయితే హైకోర్టు ధర్మాసనం, ఈ ఆర్గుమెంట్ తో ఏకీభవించలేదు. ఈ కరోనా సమయంలో, మీరు అంత ఎమర్జెన్సీగా చేసే పనులు ఏమి ఉంటాయి, దీని పై స్టేటస్ కో ఇస్తున్నాం అంటూ, ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం తరుపున ఢిల్లీ నుంచి రాకేష్‌ త్రివేది వాదించారు. స్టేటస్ కో ఇస్తే, కార్యాలయాలు తరలించే అధికారం లేకుండా పోతుందని, అన్నిటికీ ఈ ఉత్తర్వులు ఇబ్బందిగా ఉంటాయని అన్నారు. అయితే రాకేష్‌ త్రివేది మాటలను, పిటీషనర్ తరుపు న్యాయవాది వ్యతిరేకించారు. చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్నారు కాబట్టే, మేము స్టేటస్ కో అడిగామని, దాన్ని తీయటానికి వీలు లేదని కోర్టు ముందు వాదించారు. దీంతో ఇరు పక్షాల వాదన విన్న హైకోర్టు, స్టేటస్ కో వైపే మొగ్గు చూపుతూ, ఈ నెల 27కి కేసును వాయిదా వేసింది. ఈ పరిణామం పై, రాజధాని రైతులు, మహిళలు సంతోషం వ్యాప్తం చేసారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయట నుంచి జరిగే విచారణలు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా కోర్టు ఆదేశాలు ప్రకారం, అలాగే రాష్ట్ర పోలీసులు పై నమ్మకం లేక ఫిర్యాదులు చెయ్యటం, ఇలాంటి వాటితో బయట నుంచి వచ్చి ఎంక్వయిరీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పలు కేసుల్లో హైకోర్టు తీర్పులు ఇవ్వగా, మరో నాలుగు కేసులు వరకు సిబిఐకి ఇచ్చారు. అలాగే ఈ రోజు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి చేత విచారణకు ఆదేశించారు, ఇక శిరోమండనం కేసులో రాష్ట్రపతి కల్పించుకుని, డైరెక్ట్ గా విచారణ అధికారీని నియమించి, వివరాలు ఇవ్వమన్నారు. రాష్ట్రంలో ఇలా జరుగుతున్న సందర్భంలో, ఇప్పుడు సిబిఐ మరో కేసులు విచారణ ప్రారంభించింది. ఇప్పటికే సిబిఐ వైఎస్ వివేక కేసు, డాక్టర్ సుదాకర్ కేసులో విచారణ జరుపుతూ ఉండగా, ఇప్పుడు గుంటూరు పోలీసులు పై సిబిఐ కేసు పెట్టి విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, సిబిఐ ఈ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తుంది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పరిధిలో, క్రికెట్ బుకింగ్ కేసు వ్యవహారంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గుంటూరు సిసియస్ పోలీసులు, క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు అంటూ ముగ్గురు వ్యక్తులను నిర్బంధించారు అంటూ, 2019 అక్టోబర్ నెలలో, ఆ ముగ్గురుకు సంబందించిన కుటుంబ సభ్యులు హైకోర్టు లో తమ వారిని అక్రమంగా నిర్బందించారని, అరెస్ట్ అయిన 24 గంటల్లో కోర్టులో హాజరు పరచుకుండా, కేసు ఒప్పుకోవాలి అంటూ, మూడు రోజులు పాటు నిర్బందించి ఇబ్బందులు పెట్టారని కోర్టుకు తెలపటంతో, హైకోర్టు ఈ విషయం పై రాష్ట్ర పోలీసులు మీదే అభియోగం రావటంతో, సిబిఐ విచారణకు ఆదేశించింది. దీని ప్రకారం, సిబిఐ గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరావు , అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, మరో కానిస్టేబుల్ వీరాంజనేయులుతో పాటు పలువురి సిబ్బంది పై సిబిఐ కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో సంచలన ఆదేశాలు ఇచ్చింది. రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, ఆడియో టేప్ కొన్ని రోజుల క్రిందట బయట పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, చిత్తూరు జిల్లాలో ఒక జడ్జి అయిన రామకృష్ణను అధికార పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టటం లాంటివి కొన్ని రోజులుగా చూస్తున్నాం. ప్రభుత్వానికి ఇబ్బంది రావటంతో, రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్యతో ఫోన్ లో మాట్లాడారు. జస్టిస్ ఈశ్వరయ్య, ప్రస్తుతం ఏపి ప్రభుత్వంలో పని చేస్తున్నారు. అలాగే నెల రోజులు క్రిందట, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీసి సంఘం నుంచి, హైకోర్టు చీఫ్ జస్టిస్ వల్లే, హైకోర్టు రిజిస్టార్ కరోనా వచ్చి చనిపోయారు అంటూ, రాష్ట్రపతికి లేఖ రాసారు. ఇవన్నీ పక్కన పెడితే, మేజిస్ట్రేట్ రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణలో, జస్టిస్ ఈశ్వరయ్య, చేసిన కొన్ని వ్యాఖ్యలు న్యాయముర్తులను, అలాగే హైకోర్టు పై కుట్ర పన్నేలా ఉన్నాయి అంటూ, రామకృష్ణ హైకోర్టులో ఇప్పటికే హైకోర్టు పై కుట్ర పన్నారు అనే కేసులో ఇంప్లీడ్ పిటీషన్ వేసారు. ఇది గత సోమవారం విచారణ చేసిన కోర్టు, ఈ రోజుకి వాయిదా వేసింది.

అయితే ఈ రోజు, ఇంప్లీడ్ పిటీషన్ పై నిర్ణయం చెప్పే ముందు, రామకృష్ణ చెప్తున్న విషయాలు నిజమా కాదా అనే విషయం పై తేల్చటానికి, హైకోర్టు, జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ తో పాటు, నిజంగానే హైకోర్టు పై కుట్ర జరిగిందా అనే విషయం పై తేల్చటానికి, సుప్రీం కోర్టు మాజీ జడ్జితో విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ ను హైకోర్టు నియమించింది. సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు కూడా సహకరించాలని కోరింది. కుట్రను ఛేదించి తమకు, నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ టేపులు నిజమా కదా అనే తేల్చటంతో పాటుగా, కుట్రను ఛేదించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ విచారణ చేసిన తరువాత, రామకృష్ణ ఇంప్లీడ్ పిటీషన్ పై నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. అలాగే సుప్రీం కోర్టు జడ్జి ఇచ్చిన నివేదిక కనుక ఈ టేపులు నిజం అని చెప్తే, పూర్తీ స్థాయిలో ఈ విషయం తేల్చటానికి, సిబిఐ కూడా అప్పగించే అవకాసం ఉందని, కొంత మంది న్యాయవాదులు చెప్తున్నారు. మరి విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెమనాయుడుకి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయ్యి, జ్యుడీషియాల్ రిమాండ్ లో అచ్చమనాయుడు ఉన్నారు. రెండు రోజుల నుంచి ఆయనకు జలుబు చెయ్యటంతో, ఆయనకు హాస్పిటల్ వైద్యులు కరోనా పరీక్షలు చెయ్యటంతో, ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో హాస్పిటల్ యాజమాన్యం, ఈ విషయం హైకోర్టుకు సమాచారం అందించింది. అయితే దీని పై తమకు అధికారికంగా ఒక లేఖ ద్వారా ఈ విషయం చెప్పాలని, హైకోర్టు ఆదేశించింది. అయితే అచ్చెమనాయుడుని ఈఎస్ఐ కేసులో ప్రభుత్వం అరెస్ట్ చేసి, శ్రీకాకుళం నుంచి, విజయవాడ వరకు, పైల్స్ ఆపరేషన్ జరిగింది అని చెప్పినా, అలాగే తీసుకురావటం, ఆయన్ను 15 గంటలు 600 కిమీ తిప్పటం, ఇవన్నీ చెయ్యటంతో, ఆయనకు బ్లీడింగ్ ఎక్కవ అయ్యి, ఆపరేషన్ ఫెయిల్ అవ్వటంతో, మరో సారి ఆపరేషన్ చేసారు. ఇదంతా ఆయన జ్యుడీషియాల్ రిమాండ్ లో ఉండగానే జరిగింది.

అయితే దీని పై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ఇష్టం వచ్చినట్టు తిప్పితే, ఈ పరిస్థితిలో కరోనా లాంటివి వచ్చే అవకాసం ఉందని, ఆయన ఎక్కడికీ పారిపోరు కదా, విచారణ చేసుకోవచ్చు కదా అని చెప్పినా, ఆయన్ను అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో ఆయనను గుంటూరు జీజీహెచ్ నుంచి, విజయవాడ సబ్ జైలుకు తీసుకు రావటం పై కూడా, టిడిపి అభ్యంతరం చెప్పింది. ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రెండు ఆపరేషన్ లు జరిగాయని, కోర్టులో కేసు వెయ్యటంతో, ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్ళటానికి కోర్టు ఒప్పుకుంది. ఆ సమయంలో ఆచ్చెమనాయుడు పై ప్రవర్తించిన తీరు పై, కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరి అక్కడ కరోనా ఎలా సోకింది అనే విషయం పై ఆరా తీస్తున్నారు. ఈ విషయం పై, ఆయనకు అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారా, లేదా వేరే చోటుకి తరలిస్తారా అనే దాని పై హైకోర్టు ఇచ్చే ఆదేశాల పై ముందుకు వెళ్లనున్నారు.

Advertisements

Latest Articles

Most Read