ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వరుసుగా కోర్టుల్లో పడుతున్న మొట్టికాయలు చూసి, రాష్ట్ర ప్రభుత్వ లీగల్ టీం పై, ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి, ఈ లీగల్ టీం వల్ల, అన్నీ ఇబ్బందులు వస్తున్నాయి, ఈ లీగల్ టీంలో సరైన సమర్ధత ఉన్న వాళ్ళు లేరని, ఈ రోజు ఒక జాతీయ పత్రికలో కూడా కధనం వచ్చిన నేపధ్యంలో, వైసీపీ పార్టీలో సీనియర్ మంత్రులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే, సుప్రీం కోర్ట్ లో వేసిన ఒక పిటీషన్ విషయంలో, మరోసారి, ఈ లీగల్ టీం డొల్లతనం బయట పడింది. రాష్ట్ర ప్రభుత్వ పరువుతో పాటుగా, రాష్ట్రం పరువు కూడా ఢిల్లీ లెవెల్ లో పోయింది. నిమ్మగడ్డ కేసు విషయం, జగన్ మోహన్ రెడ్డి ఎంత పర్సనల్ గా తీసుకున్నారో అందరికీ తెలిసిందే. డీ అంటే డీ అంటూ, నిమ్మగడ్డ విషయంలో ముందుకు వెళ్తున్నారు. హైకోర్ట్ లో వ్యతిరేక తీర్పు వచ్చినా సరే, సుప్రీం కోర్ట్ లో తేల్చుకుంటాను అంటూ, జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన తీర్పుని, సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసింది.

అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో, ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో అన్నీ తప్పులే ఉన్నాయి. ఆ తప్పులు చూసి, సుప్రీం కోర్టులో ఉన్న లాయర్లు ముక్కున వేలు వేసుకున్నారు. నిమ్మగడ్డ కేసులో వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో, వాద, ప్రతి వాదులుగా, రెండు చోట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. కనీసం పరిజ్ఞానం కూడా లేదా అని, న్యాయ నిపుణులు, విస్మయం వ్యక్తం చేసారు. దీంతో పిటీషన్ లో తప్పులు ఉన్నాయని తెలుసుకున్న ప్రభుత్వం, పిటీషన్ ను వెనక్కు తీసుకుని, తప్పులు సరి చేసి, మరో పిటీషన్ దాఖలు చెయ్యటానికి రెడీ అయ్యింది. అలాగే దీంతో పాటుగా మరో 3 స్పెషల్ లీవ్ పిటీషన్లు కూడా దాఖలు చెయ్యనున్నారు. అయితే ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి తెలియటంతో, ఆగ్రహం వ్యక్తం చేసారని, తెలుస్తుంది.

ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళాల్సి ఉండగా, పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి, గన్నవరం వెళ్ళటానికి, ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యారు, ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి పెట్టారు, అయితే, లాస్ట్ మినిట్ లో, ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చెయ్యటంతో, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. అమిత్ షాతో, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి భేటీ కావాల్సి ఉంది. ఈ రోజు రాత్రికి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే తుఫాను నేపధ్యంలో, అమిత్ షా బిజీ గా ఉంటారని, అందుకే అపాయింట్మెంట్ రద్దు అయ్యిందని, త్వరలోనీ మళ్ళీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి, పిలుస్తామని, హోం శాఖ వర్గాలు చెప్పాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం, ఈ పరిణామంతో ఊపిరి పీల్చుకున్నారు. జగన్ ఢిల్లీ వెళ్ళిన తరువాత, ఈ విషయం తెలిసి ఉంటే, పరువు పోయేది అని, ఇప్పటికే రెండు సార్లు, జగన్ ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలవకుండా, వెనక్కు తిరిగి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అలా జరిగితే, ప్రతిపక్షాలు గోల చేసేవి అని, ముందే తెలిసి మంచి పని అయ్యింది అని వైసీపీ భావిస్తుంది.

మరో పక్క, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దు అయిన వెంటనే, ఆయన తన నివాసంలో, విజయసాయి రెడ్డి, మంత్రి కొడాలి నాని, అలాగే మరో మంత్రి బాలినేనితో జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలో ఉన్న తన క్యాంప్ ఆఫీస్ లో జగన్ వారితో భేటీ అయ్యారు. ఢిల్లీ టూర్ రద్దు అవ్వగానే, జగన్ వారితో భేటీ కావటం, ఆసక్తిగా మారింది. గంటకు పైగా ఈ సమావేశం జరుగుతుంది. వరుసుగా రాష్ట్ర ప్రభుత్వానికీ తగులుతున్న ఎదురు దెబ్బలు, డాక్టర్ సుధాకర్ కేసు, ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ కేసు, అలాగే రంగులు కేసు పై సుప్రీం కోర్టుకు వెళ్ళటం, అన్ని వైపుల నుంచి వస్తున్న ఇబ్బందులు, ప్రతిపక్షలాకు గట్టిగా బదులు ఇవ్వటం, వంటి అంశాల పి చర్చిస్తున్నారని, ఈ భేటీ అనంతరం, కీలకమైన ప్రెస్ మీట్ కూడా, కొడాలి నాని కాని, విజయసాయి రెడ్డి కాని అడ్డ్రెస్ చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

టీడీపీ ఎమ్మెల్సీ, బుద్దా వెంకన్న, విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. "వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విఫల సాయి రెడ్డిగా మారారని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ లో ఉంటారా లేదా అని విజయసాయిని ఎవరూ అడగలేదు. అయినప్పటికీ చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఆయనకు ఆయనే చెప్పుకున్నారంటే..జగన్ తో గ్యాప్ వచ్చిందని స్పష్టంగా అర్ధమవుతోంది. పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల వల్లే విజయసాయి ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. సీఎం జగన్ కారులో నుంచి దించాక విజయసాయిలో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఢిల్లీ, విశాఖ తనదే అన్నట్టు విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఉత్తరాంధ్రకు అన్నీ తానై వ్యవహరించారు. ఏపీకి ముఖ్యమంత్రి జగనా లేక విజయసాయా అన్నంత సీన్ క్రియేట్ చేశారు. చివరకు తాను పార్టీలోనే ఉంటానని చెప్పుకోవడం ద్వారా విజయసాయిని జగన్ పక్కన పెట్టారన్నది అర్ధమవుతోంది. ఇంతకుముందు జగన్ ఢిల్లీ పర్యటనలో అన్నీ తానై విజయసాయి వ్యవహరించేవారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ అనగానే విధేయుడినని తనకు తానే చెప్పుకోవాల్సిన పరిస్థితి విజయసాయికి వచ్చింది. విజయసాయి దందాలే ఈ పరిస్థితికి కారణం. ప్రశాంతమైన ఉత్తరాంధ్రను విజయసాయి అండ్ గ్యాంగ్ దోచేస్తున్నారు."

"వైసీపీ సోషల్ మీడియా తానే చూసుకుంటానని విజయసాయి చెబుతుంటే.. సోషల్ మీడియా మురుగు గుంట అని సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మీరు చేస్తున్న పనులన్నీ చెత్త అని సజ్జల చెప్పకనే చెప్పారు. సోషల్ మీడియాలో హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వ్యక్తులను విజయసాయి కాపాడబోతున్నారా? చంద్రబాబు, లోకేష్ పై అసత్యపు ట్వీట్లు పెట్టడమే విజయసాయి పని. ఒక బాధ్యతాయుతమైన రాజ్యసభ ఎంపీగా ఉండి న్యాయవ్యవస్థను దూషించే వారిని కాపాడతానని విజయసాయి ఎలా చెప్పగలుగుతున్నారు? 16 నెలలు జైల్లో ఉండొచ్చారు విజయసాయి. వయసుకు తగిన మాటలు మాట్లాడటం లేదు. పదవిని దేనికైనా వాడుకోవచ్చని ఆయన భావిస్తున్నారు."

"సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించింది విజయసాయి రెడ్డే. ప్రభుత్వాలు మారుతుంటాయి. పదవులు వస్తుంటాయి పోతుంటాయి. మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాలి. గాంధేయ మార్గం గురించి మాట్లాడుతున్న విజయసాయి తనపై , జగన్ పై నమోదైన కేసులపై సమాధానం చెప్పాలి. కేసులున్నాయని నిజాయితీగా ఒప్పుకోగలరా? మిడతలు పంటను నాశనం చేస్తుంటే... పచ్చగా ఉన్న విశాఖను విజయసాయి అండ్ గ్యాంగ్ నాశనం చేస్తున్నారు. వైసీపీ ఏడాది పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వైన్ షాపు, చిల్లర కొట్టు, గుడి, బడి దగ్గరకు వెళ్లి అడగండి మీ పాలన గురించి తెలుస్తుంది. వైసీపీ పాలన బాగుందని ఒక్కరు చెప్పినా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని చెబుతున్న విజయసాయి రెడ్డి లక్షల కోట్లు దోచేశామని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఓ వైపు ప్రజలను రెచ్చగొడుతూ మరోవైపు కోర్టులను తప్పుబడుతున్న విజయసాయి రెడ్డి ...ఎంపీగా ఉండేందుకు అనర్హుడు. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి." అని అన్నారు.

 

ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో, మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మే 29న రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా ఉండవచ్చు అంటూ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పై, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే హైకోర్ట్ లో స్టే పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా, ఈ రోజు ఆ స్టే పిటీషన్ ని ప్రభుత్వం వెనక్కు తీసుకుని. ఈ పరిణామం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాలు ఏమిటో అర్ధం కావటం లేదు. సుప్రీం కోర్ట్ లు కేసు వేసారు కాబట్టి, ఈ పిటీషన్ వెనక్కు తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే, సుప్రీం కోర్ట్ లో కేసు వేసిన సమయంలోనే, హైకోర్ట్ లో కూడా ప్రభుత్వం పిటీషన్ వేసింది. ఆ సమయంలో అలా ఎందుకు చేసింది, ఇప్పుడు ఎందుకు వెనక్కు తీసుకుంది అనేది తెలియదు. హైకోర్ట్ లో స్టే పిటీషన్ ఉంటే, సుప్రీం కోర్ట్, కేసు అడ్మిట్ చేసుకోదు అని భావించిన ప్రభుత్వం, ఇలా చేసి ఉండవచ్చు అని, అందుకే హైకోర్ట్ లో వేసిన స్టే పిటీషన్ వెనక్కు తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక మరో పక్క, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కొనసాగనివ్వలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంచాయతీరాజ్ ఎన్నికల సంస్కరణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని తగ్గించామని చెప్తూ, అందుకు అనుగుణంగా గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ కు అనుసరించి ఉత్తర్వులు జారీ చేసి అప్పటి వరకు ఎన్నికల కమిషనర్ గా వున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలిగించింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై విచారణ జరిపిన ఎస్ఈసి పదవీకాలాన్ని కుదిస్తూ ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను, జివోలను కొట్టివేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read