సాక్షి పత్రికలో తన ఇంటర్వ్యూ పై వచ్చిన కధనం పైన, బీజేపీ జాతీయ నేత, రాం మాధవ్ ఘాటుగా స్పందించారు. తన పేరు మీద సాక్షిలో వచ్చిన కధనాన్ని ఆయన ఖండించారు. తన మాటలకు సాక్షి పత్రిక వక్రీకరించి రాసింది అని అన్నారు. దీని పై స్వయంగా తానే లేఖ రాసి, రాం మాధవ్ మీడియాకు విడుదల చేసారు. జగన్ దృఢసంకల్పంతో పని చేస్తున్నారు అంటూ, తన పై రాసిన కధనం పై ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. సాక్షి కధనంలో తన వ్యాఖ్యలను సరిగ్గా ప్రతిబింబిన్చాలేదాని, రాం మాధవ్ అన్నారు. మోడి ప్రభుత్వం, ఏడాది పాలన పై సాక్షి తనను సంప్రదించింది అని, 40 నిమిషాల దాకా సాగిన ఈ ఇంటర్వ్యూ లో, చివరి భాగంలో, సాక్షి ప్రతినిధులు, ఏపిలో ప్రభుత్వం పని తీరు పై తనను ప్రశ్నలు అడిగారని, ఆ లేఖలో స్పష్టం చేసారు రాం మాధవ్. మూడు రాజధానులు నుంచి, నిన్నటి తిరుమల విషయం వరకు, అనేక విషయాలు వివాదాస్పదం అయ్యాయని, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని తాను చెప్పానని, రాం మాధవ్ చెప్పారు.

టిటిడి భూములు విషయంలో, వెనక్కు తగ్గిన విషయాన్నీ స్వాగతిస్తూనే, మొదట అమ్మేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను తప్పుబట్టానని అన్నారు. ముఖ్యమంత్రికి తెలిసి అన్ని నిర్ణయాలు జరుగుతాయని అనుకోవటం లేదని, కాని అన్ని విషయాలు ఆయన తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పానని రాం మాధవ్ అన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం చెయ్యటానికి, కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలా సహకారం అందించామో, ఇప్పుడు కూడా అలాగే సహకారం అందిస్తున్నాం అని చెప్పానని ఆ లేఖలో తెలిపారు. ఏపిలో బీజేపీ ప్రతిపక్షంలో ఉందని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, మేము వ్యవహరిస్తామని చెప్పానని, గుర్తు చేసారు. ఆ మాత్రాన, మేము రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకం కాదని, అర్ధం చేసుకోవాలని అన్నారు. నేను చెప్పింది ఇది అయితే సాక్షి వేరేది రాసింది అని, వాళ్ళు మొత్తం 40 నిమిషాల ఇంటర్వ్యూ ప్రసారం చేస్తే, మొత్తం అర్ధం అవుతుందని అన్నారు.

ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం పై, ఈ రోజు హైకోర్ట్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియామకం విషయంలో, సంస్కరణలు పేరుతో, నిబంధనలు మారుస్తూ తీసుకోవచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్ట్ కొట్టేసింది. ఈ ఒర్దినన్స్ తెచ్చి, రమేష్ కుమార్ ని తొలగిస్తూ జీవో ఇచ్చి, కనకరాజ్ ను నియమిస్తూ మరో జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇవి కూడా కోర్ట్ రద్దు చేసింది. దీంతో రమేష్ కుమార్ మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియామకం అయ్యారు. ఆర్టికల్ 213 ప్రకారం, ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం, ప్రభుత్వానికి లేదని, కోర్ట్ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై, కోర్టులో ఎదురు దెబ్బ తగలటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి అవగాహన లేక, ఇలా జరుగుతుంది అని, 151 కాదని, 175 సీట్లు వచ్చినా, చట్టాలను గౌరవిస్తూ, ముందుకు వెళ్ళాలని, నాకు బలం ఉంది, నా ఇష్టం అంటే, మన దేశ ప్రజాస్వామ్యంలో కుదరదు అని, చట్టాల ప్రకారం అందరూ నడుచుకోవాల్సిందే అంటూ, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో, జగన్ కు సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది.

వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని స్వాగతించారు. రమేష్ కుమార్ ని, మళ్ళీ పదవిలో తీసుకుంటూ, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు రద్దు చెయ్యటం పై, రఘురామ కృష్ణ రాజు, స్వాగతించారు. హైకోర్ట్ ఇలా చేస్తుంది అని, నాకు ముందుగానే తెలుసు అని, రఘురామ కృష్ణ రాజు అన్నారు. ఈ తీర్పు నాకు అయితే, ఎలాంటి ఆశ్చర్యం కలగించలేదని, ఇలాగే వస్తుంది అని నాకు ముందే తెలుసు అని, రఘురామ కృష్ణం రాజు అన్నారు. గతంలోనే ఇలాంటి విషయాల పై తీర్పులు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగ పదవులకు, పదవీ కాలం తగ్గించేలా ఆర్డినెన్స్ లో చెల్లవు అని గతంలోనే కోర్టులు చెప్పాయని అన్నారు. ఎన్నికల సంస్కరణలు మంచిదే అయినా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం దురదృష్టం అని అన్నారు. నిర్ణయాలు తెసుకునే ముందు, అందరితో సంప్రదించి, తీసుకుంటే మంచిది అని అన్నారు. సొంత పార్టీ నేతలు, ఇష్టం వచ్చినట్టు, హైకోర్ట్ పై మాటలు చెప్పటం దారుణం అని అన్నారు. ఇలాంటి వారిని శిక్షిస్తే తప్పు లేదని అన్నారు.

ఏకంగా ఎన్నికల కమీషనర్ నే తప్పిస్తూ, జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ పై ఈ రోజు హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. రెండు వారాల క్రితం ఈ కేసు పై, విచారణ జరిగింది. వాదనలు పూర్తి అవ్వటంతో, నిమ్మగడ్డ కేసు తీర్పుని హైకోర్ట్ రిజర్వ్ లో పెట్టింది. ఈ రోజు, దీని పై తుది తీర్పుని ప్రకటించింది హైకోర్ట్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు ఉపయోగించిన ఆర్డినెన్స్ కోర్ట్ కొట్టేసింది. వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లో చేరాలని ఆదేశించింది. అలాగే నిమ్మగడ్డ ని తొలగిస్తూ ఇచ్చిన జీవో, కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమిస్తూ ఇచ్చిన జీవో కొట్టేసింది. అలాగే రమేష్ కుమార్ తన పూర్తీ కాలం పదవిలో ఉండవచ్చు అని చెప్పింది. ఈ తీర్పుతో, ఈ క్షణం నుంచి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా కొనసాగనున్నారు.

మార్చ్ నెలలో, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రక్రియ నామినేషన్ల వరకు వెళ్ళింది. అయితే ఆ ప్రక్రియలో అధికార పార్టీ హింస, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకోవటం, ఇలా అనేక ఘటనలు జిరిగాయి. ఎప్పుడూ లేనన్ని ఎకగ్రీవాలు అయ్యాయి. ఇలా నడుస్తూ ఉండగానే, రాష్ట్రంలో కరోనా విజ్రుంభించింది. దీంతో కరోనా ఎక్కువ అవుతూ ఉండటంతో, రమేష్ కుమార్ కేంద్రంతో చర్చించి, స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని పై జగన్, ఆయన మంత్రులు అభ్యంతరం చెప్తూ, బూతులతో, కులం పేరు పెట్టి దూషిస్తూ విరుచుకు పడ్డారు. చంద్రబాబు ఏజెంట్ అంటూ మాట్లాడారు.

ఈ క్రమంలోనే, తనకు రక్షణ కావాలి అని, కేంద్ర హోం శాఖకు రమేష్ కుమార్ లేఖ రాసారు. దానికి తగ్గట్టే కేంద్రం కూడా, భద్రత పెంచింది. అయితే ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలి అనే తలంపుతో ఉన్న ప్రభుత్వ పెద్దలు, తమకు అడ్డుగా ఉన్న రమేష్ కుమార్ ని తప్పించటానికి, ఆర్డినన్స్ తీసుకు వచ్చారు. ఈ ఆర్డినన్స్ తో, రమేష్ కుమార్ పదవి పోయింది. ఆ ఆర్డినన్స్ కూడా గంటల్లో ఆమోదం పొందింది. తరువాత మరో కొన్ని గంటల్లోనే, తమిళనాడు నుంచి జస్టిస్ కనకరాజ్ ను తీసుకు వచ్చి, ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మొత్తం పరిణామాల పై, రమేష్ కుమార్ సహా 12 మంది హైకోర్ట్ కు వెళ్ళారు. ప్రభుత్వం కక్షతోనే ఇలా వివాహరించింది అని, ఒకసారి ఎలక్షన్ కమీషనర్ ని నియమించిన తరువాత, రాష్ట్రానికి తప్పించే అవకాసం లేదని, వాదించారు. అలాగే ప్రభుత్వం కూడా తమ వాదన వినిపించింది. అయితే కోర్ట్ ఒప్పుకోలేదు, ఆర్డినెన్స్ కొట్టేసింది.

హైకోర్టు తీర్పుతో తిరిగి ఎస్​ఈసీగా బాధ్యతలు స్వీకరించినట్లు రమేష్ కుమార్ తెలిపారు. వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పదని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ఉందని చెప్పారు. "ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తిరిగి నేను విధుల్లో చేరాను. గతంలో వ్యవహరించిన మాదిరిగానే నేను నా విధులను నిస్పక్షపాతంగా నిర్వర్తిస్తాను. పరిస్థితులు చక్కబడిన వెంటనే రాష్ట్రంలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి చేపడతాను. ఇందులో భాగస్వామ్యమైన వ్యక్తులతో రాజకీయ పార్టీలతో చర్చించిన మీదట ముందుకెళతాం. వ్యక్తులు ఎప్పుడూ శాశ్వతం కాదు. రాజ్యాంగ వ్యవస్థలు, అవి పాటించే విలువలే శాశ్వతం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ఆ పదవుల్లోకి వచ్చిన వారికి ఆ వ్యవస్థలను రక్షించాల్సిన ఆవశ్యకత, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటాయి. " అని అన్నారు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే అని పిటిషనర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. కరోనా విషయంలో ప్రభుత్వం మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆయన...రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం తప్పులు చేస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి సరిగా లేదని తెలిపారు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పాజిటివ్​గా తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తన వద్ద తప్పులు పెట్టుకుని వ్యవస్థలను నిందించడం సరికాదన్నారు. నిమ్మగడ్డను తప్పించిన తీరు, కనకరాజ్‌ను నియమించిన తీరు దోషపూరితంగా ఉందని కామినేని వ్యాఖ్యానించారు.

టీడీపీ మాజీ మంత్రి
అచ్చెన్నాయుడు, స్పందించారు "రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాల్సిందేనన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టు తీర్పుతో ఏపీలో ఇంకా ప్రజాస్వామ్యం బతికేఉందన్న నమ్మకం కలిగింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ తప్పూ చేయలేదని మేము చెబుతూనే ఉన్నాం.. కరోనా ఉధృతి నేపథ్యంలో నిమ్మగడ్డ ముందుచూపుతో ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల వాయిదాను జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల అధికారిని కులం పేరుతో దూషించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇబ్బందులకు గురిచేశారు. ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని, అపహాస్యం చేసింది. వ్యవస్థలను నాశనం చేసింది. న్యాయవ్యవస్థ వల్లే ఏపీలో ప్రజాస్వామ్యం కాపాడబడింది. హైకోర్టు తీర్పు ఈ ముఖ్యమంత్రికి రెండు వైపులా చెడాపెడా కొట్టే విధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నింటినీ హైకోర్టు రద్దు చేసింది . సిగ్గుంటే ఈ ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి." అని అన్నారు

Advertisements

Latest Articles

Most Read