ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ రోజు విచారణ జరిగింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‍కు నివేదిక సమర్పించారు, విశ్రాంత న్యాయమూర్తి బి.శేషయానారెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ సభ్యులు. స్టైరీన్ గ్యాస్ లీకేజీ మానవ తప్పిదం అని, భద్రతా ప్రమాణాల వైఫల్యం కూడా దీనికి తోడయ్యి, సంస్థ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నివేదికలో విచారణ కమిటీ పేర్కొంది. నివేదిక పై అభ్యంతరాలను ఒక్కరోజులో చెప్పాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎల్జీ పాలిమర్స్ ని కోరింది. నేడు సాయంత్రం లేదా రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఎల్జీ పాలిమర్స్ తరపున వాదనలు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్ర వినిపించారు. గ్యాస్ లీకేజీ ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు లేదని వాదనలు వినిపించారు ఎల్జీ పాలిమర్స్ తరపున న్యాయవాది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారణ చేపట్టే అంశం పై సుప్రీం కోర్టులో పెండింగ్‍లో ఉందని ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాది, ఎన్జీటీకి చెప్పారు. 2001 నుంచి అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ వాదనలు వినిపించారు. గ్యాస్ లీకేజీ ఘటనలో బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోలని శర్మ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కోరారు. తన పిటిషన్‍ను పరిగణనలోకి తీసుకుని నోటీసులు ఇవ్వాలని ఈఏఎస్ శర్మ కోరారు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ విషయం పై, కేంద్ర, రాష్ట్రం, హైకోర్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహా, 7 సంస్థలు, జరిగిన ఘటన, పై విచారణ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం పై, హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో, ఎల్జీ పాలిమర్స్ డిఫెన్సు లో పడిన సంగతి తెలిసిందే.

వైసీపీలో నెంబర్ 2 నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆసక్తికరంగా మారాయి. జగన్ కు, విజయసాయి రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. జగన్ జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి, ఇప్పటి వరకు, అన్నీ తానై విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్నారు. అయితే, ఈ రోజు విజయసాయి రెడ్డి జగన్ తో తనకు ఉన్న రేలషన్ గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. నాకు, మా అధ్యక్షుడు జగన మోహన్ రెడ్డి గారికి, ఎలాంటి విబేధాలు లేవని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. నేను చనిపోయేంత వరకు జగన్, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉంటానని, విజయసాయి రెడ్డి అన్నారు. జగన్ తో ఎలాంటి విబేధాలు లేవు, భవిష్యత్తులో కూడా రావు అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య, సజ్జల రామకృష్ణా రెడ్డి పేరు ఎక్కువ తలుస్తూ ఉండటంతో, ఇలా ఏమైనా అనుకుని, విజయసాయి రెడ్డి, ముందుగానే ఇలా ప్రకటించారా అనేది తెలియాలి.

సహజంగా ఇలాంటి పెద్ద నాయకులు, ఇలాంటి ప్రకటన చెయ్యరు. మరి విజయసాయి రెడ్డి ఎందుకు ఇలా వ్యాఖ్యానించారు, అనేది చూడాలి. ఇక మరో పక్క, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టినందుకు హైకోర్టు నుంచి నోటీసులందుకున్న వారందరికీ తాను అండగా ఉంటానని విజయసాయి రెడ్డి అన్నారు. తాను మొదటి నుంచి సోషల్ మీడియా చూసుకుంటున్నానని, ఏది జరిగినా, తమ కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. కావాలని అలా కోర్టుల పై వ్యాఖ్యలు చెయ్యలేదని, తెలుగుదేశం వారు రెచ్చగొట్టటంతో అలా చేసి ఉంటారని అన్నారు. ఇందులో కూడా, ఎంత మంది ఫేక్ ఎకౌంటులతో, తమ పై ఇలా కుట్ర పన్నారో, చూడాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఇక నిమ్మగడ్డ పై కూడా విజయసాయి రెడ్డి, విమర్శలు చేసారు. నిమ్మగడ్డ రాసిన లేఖ, తెలుగుదేశం వాళ్ళు పంపించిందే అని విజయసాయి రెడ్డి అన్నారు.

ప్రభుత్వం, పేదలకు ఇస్తున్న ఇళ్ళ స్థలాల విషయంలో, కొంత మంది లంచాలు అడుగుతున్నారు అని తెలుస్తుంది అంటూ, ఏకంగా అధికార పార్టీ ఎంపీ సేల్ఫీ వీడియో చెయ్యటం సంచలనంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు, దీనికి సంబంధించి, ఒక సేల్ఫీ వీడియో పోస్ట్ చేసారు. ఆయన ఏమి అన్నారంటే "ప్రజల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ఇళ్ల స్థలాల అందరికీ ఇల్లు ఉండాలి, అని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది అది అందరికీ తెలుసు. అంతా కూడా, ఈ కార్యక్రమం చాలా చోట్ల జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని చోట్ల స్థలాలు అలాట్ చేయాలి అంటే లబ్దిదారుని చాలాచోట్ల డబ్బులు అడుగుతున్నారు. ఫ్లాట్ 20 వేల నుంచి సుమారు 60 వేల వరకు కూడా డబ్బులు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, అని కొన్ని కంప్లైంట్లు నా వద్దకు కూడా రావటం జరిగింది. దీన్ని నేను మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లడం జరిగింది. దీని మీద తక్షణం, ఇందులో ఏ మాత్రం నిజం ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది."

"ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఒక్క రూపాయి అడిగినా కూడా, అలాట్ చేయటానికి, ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసి, లేదా డైరెక్ట్ గా అయినా సరే కలెక్టర్ గారికి, మీరు ఒక పిటీషన్ ఇచ్చి, పలానా గ్రామంలో, పలానా వ్యక్తి మమ్మల్ని, ఈ లాండ్ అలాట్ చెయ్యటానికి, మమ్మల్ని ఇంత డబ్బులు డిమాండ్ చేశారు, మేం అంత డబ్బులు ఇచ్చాను అని చెప్తే, ఇచ్చిన వాళ్ళు ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుపట్టడం జరగదు. మీ డబ్బు మీకు వెనక్కి ఇచ్చి, ఆ ఫ్లాట్ కూడా మీకు అలాట్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, కొన్ని దశాబ్దాల పాటు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగ నిలిచిపోవాలన్న కోరికకు, కొంతమంది కావాలని చెప్పి తూట్లు పొడుస్తున్నట్లుగా అర్థం అవుతోంది, ఈ డబ్బులు డిమాండ్ చెయ్యటం అంటే. దయచేసి ఎవరూ కూడా, ఏ ఒక్కరూ కూడా ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ డిమాండ్ ఉంటే, అటువంటి డీటెయిల్స్ అన్నీ, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేదా రేపు తెలియచేయ బోయే ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి, మీరు చెప్తే, తగిన చర్యలు తీసుకొని, మీకు ఫ్లాట్ అలాట్ చెయ్యటం జరుగుతుంది అని అన్నారు

ఒక పక్క క-రో-నా రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. మరో పక్క ఆర్ధిక కష్టాలు, రాష్ట్రాన్ని కబళించి వేస్తున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో, చతికిలపడిన రాష్ట్ర ప్రగతి, కరోనాతో పూర్తిగా పడుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇప్పటికే 87 వేల కోట్లు అప్పు చేసింది. ఇక అప్పులు పెద్ద మొత్తంలో పుట్టాలి అన్నా, కష్టమయ్యే పరిస్థితి. కేంద్ర సహకారం అంతో ఇంతో ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి ఆడుతుంది, లేకపోతే ఎప్పుడో చేతులు ఎత్తేసేది. ఇక మరో పక్క, కోర్టుల్లో ఎదురు దెబ్బలు. అనాలోచితంగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టు తప్పు బడుతుంది. మరో పక్క ఎలక్షన్ కమీషనర్ వివాదం. మరో పక్క వివేక కేసు, డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి ఇవ్వటం. మరో పక్క తనకు ఇష్టం లేని ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నా, కోర్టు తీర్పులతో మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇంత గందరగోళం మధ్య రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. 151 సీట్లు వచ్చి రాజకీయంగా బలంగా ఉన్నా, అవగాహన లేమితో, అహంకార ధోరణితో, కోరి తెచ్చుకున్న కష్టాలు ఇవి.

ఇన్ని అవరోధాల మధ్య, కేంద్ర సహకారం కోసం, జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ఆసక్తి రేపుతుంది. కరోనా సహాయం కోసం, లేకపోతే మరో ఇతర సహాయాల కోసం అయితే, వీడియో కాన్ఫరెన్స్ లో, మాట్లాడవచ్చు. ఇప్పటికే ప్రధాని కాని, హోం మంత్రి కాని అలాగే మాట్లాడారు. అయితే రేపు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలుస్తారని, అలాగే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కలుస్తారనే వార్తలు, వింటుంటే, ఇది కరోనా సహాయం కోసం కాదని, మరేదో ఉంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారని, కాని మోడీని కలిసే అవకాశం లేదని తెలుస్తుంది. మరి ఇంత అర్జెంటుగా, ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలిసేది, రాష్ట్రానికి సహాయం కోసమా, ప్రత్యెక హోదా, విభజన హామీల కోసమా, లేక ఇంకా ఏదైనా ఉందా అనేది, రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తే కాని, తెలిసే పరిస్థితి లేదు.

Advertisements

Latest Articles

Most Read