డాక్టర్ సుధాకర్ కేసును 8 వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సీబీఐ శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శనివారం మానసిక ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌ను విచారించింది. ఈ సందర్భంగా సుధాకర్ ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకుంది. ఆయన వాంగ్ములాన్ని నమోదు చేసింది. విషయం తెలుసుకున్న సుధాకర్ తల్లి, కుమారుడు మానసిక ఆసుపత్రికి చేరుకుని సీబీఐ అధికారులను కలిసారు. వీరిద్దరి నుంచి కూడా సీబీఐ అధికారులు వాంగ్ములాన్ని నమోదు చేశారు. సుధాకర్ ఫిర్యాదు మేరకు కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసులు, మరికొందరి పై 120 బి, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేర పూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై సీబీఐ ఎస్సీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి వైద్యుల పాత్రపై సీబీఐ ఆరా తీస్తోంది. నాల్గవ పట్టణ పోలీసులు సమర్పించిన ఆధారాల నేపధ్యంలో కేజీహెచ్ వైద్యులు సకాలంలో స్పందించారా, మానసిక వైద్యాలయానికి ఎందుకు పంపించాల్సి వచ్చింది అనే విషయాల పై ఇద్దరు అధి కారులు ఇప్పటికే కేజీహెచ్ వర్గాలను విచారించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన తరువాత డాక్టర్ సుధాకర్‌ను కేజీహెచ్ డాక్టర్ల బృందం పరీక్షలు చేయాల్సి ఉండగా అలా జరగలేదని అప్పటికప్పుడు సుధాకర్ ను ఆసుపత్రికి రిఫర్ చేయడంలో లీగల్ గా వ్యవహరించారా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈకేసు విషయంలో తమ తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు అటు హాస్పిటల్ సిబ్బంది, ఇటు పోలీసులు తగిన ఆధారాలతో వస్తున్నట్టు తెలుస్తుంది. మరి సిబిఐ ఏమి తెల్చుతుందో చూడాలి.

హైకోర్ట్ నిమ్మగడ్డ రమేష్ ని, పదవిలో చేరాలని తీర్పు ఇచ్చిన తరువాత కూడా, రమేష్ కు ఆ హక్కు లేదు అంటూ, నిన్న ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జెనెరల్ ప్రెస్ మీట్ పెట్టటం పై, నిమ్మగడ్డ రమేష్ స్పందించారు. ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, ప్రభుత్వ ప్రచారాన్ని ఖండించారు. హైకోర్ట్ తీర్పును, ఆదేశాలను, రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అంటూ, రమేష్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం, నిన్న అడ్వకేట్ జనరల్ ద్వారా ప్రకటించిన అంశాలు చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందో అర్ధం అవుతుందని రమేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్, అలాగే కనకరాజ్ ని అపాయింట్ చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోని, కోర్ట్ కొట్టేసిన విషయాన్ని గుర్తు చేసారు. రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి, సమగ్రతను దెబ్బ తీసేలా, ప్రభుత్వం చర్యలు ఉన్నాయని, రమేష్ కుమార్ పేర్కొన్నారు.

హైకోర్ట్ తీర్పు ప్రకారమే తాను, ఎలక్షన్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. కోర్ట్ ఆదేశాలు ప్రకారం, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా, కనకారాజు నియామకం చెల్లదని, ఆయన ఎన్నికల కమీషనర్ గా ఇంకా కొనసాగలేరని అన్నారు. రాజ్యాంగ బద్ధ పదవి ఖాళీగా ఉండకూడదు అని అన్నారు. కోర్టు ఆదేశాలు ప్రకారమే, తాను మళ్ళీ పదవి చేపట్టానని అన్నారు. నిన్న ప్రభుత్వం పెట్టించిన ప్రెస్ మీట్ లో, వాడిన పదాలు వింటుంటే, కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా చెయ్యాలని చూస్తున్నట్టు అర్ధం అవుతుంది అని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ తీసుకుంటే, కోర్ట్ తీర్పుని ధిక్కరించటమే అని రమేష్ కుమార్ తన ప్రెస్ నోట్ లో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు శుక్ర వారం సంచలన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ విషయంలో నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం తీసుకున వచ్చిన ఆరి నెన్స్ ను కొట్టివేసింది. కమిషనర్‌ను తొలిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటిని రద్దు చేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్ర స్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్‌గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

నిమ్మగడ్డ తొలి గింపు పై మొత్తం 13పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినిపై విచారించిన తరువాత ఇటీవల తీర్పును రిజర్వులో ఉంచినట్లు ప్రకటించింది. నిన్న తీర్పును వెలువరించింది. హైకోర్టు నిమ్మగడ్డకు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పిలకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తీర్పు పూర్తిపాఠం కాపీలు రాగానే హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. హైకోర్టులో అనేక కీలకంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న క్రమంలో సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపింది. ఈసీ వ్యవహరంలో అన్ని అంశాలను పునరాలోచన చేసి సుప్రీం కోర్టుకు నివేదించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా మళ్లీ పదవిలోకి వచ్చానని డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏపీ హైకోర్ట్ తీర్పును అనుసరించి తాను బాధ్యతల్లోకి వచ్చినటేనని స్పష్టం చేసారు. ఎస్ఈసీ వ్యవహరంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు కు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేసారు. తీర్పు పై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వివరించారు. అయితే, ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్తుందని తెలుసుకోవటంతో, ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నర్రా శ్రీనివాసరావు, సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో స్టే కోసం పిటీషన్ దాఖలు చేస్తే, తమ వాదన విన్న తరువాతే, ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్, జీవోలు హైకోర్ట్ కొట్టేయటంతో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకుంటూ, ఉత్తర్వులు వచ్చాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఇది కుదరదు అంటూ, ఏకంగా హైకోర్ట్ తీర్పునే, తమకు అనుకూలంగా చెప్పుకుంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలను చేపట్టడం నిబంధనలకు విరుద్దమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డ కోర్టు తీర్పు అనంతరం వ్యవహరించిన తీరు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఆటోమెటిక్ గా కమిషనర్‌గా కొనసాగవచ్చునని హైకోర్టు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదన్నారు. నిమ్మగడ్డ మళ్లీ తనకు తాను మళ్లీ వదవిలోకి వచ్చినట్లు ప్రకటించడం తప్పు అన్నారు.

ఆయన తాను బాధ్య తలు చేపట్టినట్లు ప్రకటించుకుని స్టాండింగ్ కౌన్సిల్ లో ఉన్న ప్రభాకరను రాజీనామా చేయాలని ఫోన్ ద్వారా ఆదేశించారన్నారు. స్టాండింగ్ కౌన్సిల్లో కొత్తరక్తం కావాలని నిమ్మగడ్డ తెలిపారన్నారు. రేపే రాజీనామా చేయాలని ప్రభాకర్‌కు సూచించారన్నారు. తనకు వ్యవధి కావాలని ప్రభాకర్ కోరినప్పటికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలన్నారు. ఆయన తనను సంప్రదించారన్నారు. నిమ్మగడ్డ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా కనగరాజను గవర్నర్ నియమించారన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను కొట్టివేసిందని శ్రీరామ్ తాము కోర్టు తీర్పులను గౌరవిస్తామన్నారు. రమేష్ కుమార్ నియామకంలోనే చట్ట పరమైన ఉల్లంఘనలు ఉన్నాయని శ్రీరామ్ వ్యాఖ్యానించారు.

సుప్రీం కోర్టుకు వెళ్లేవరకు హై కోర్టు తీర్పును స్టే చేయాలని కోరామని ఆయన వివరించారు. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తెలియజేసామన్నారు. ఎస్ఈసీ నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే, గవర్నరకు నియామకం చెల్లదంటే నిమ్మగడ్డకు అదే నిబంధన వర్తిస్తుందన్నారు. ఆయనను కూడా గత ప్రభుత్వం సూచనల మేరకు అప్పటి గవర్నర్ నియమించారన్నారు. హైకోర్టు తీర్పును ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు. నిమ్మగడ్డ కొనసాగింపుకు సంబంధించి హైకోర్టు ఎటువంటి నిర్దిష కాల పరిమితిని పేర్కొనలేదన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కనీసం రెండు నెలలు అవకాశం ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం చెప్తున్న వాదన పై, భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్ట్ తీర్పులో స్పష్టంగా, ‘‘స్టాండ్ రెస్టోర్డ్’’ అనే పదం వాడారు అని, అంత స్పష్టంగా ఉన్నా, ప్రభుత్వం కావాలని వక్రభాష్యం చెప్తుందని అన్నారు. కోర్టుల తీర్పుని, ఇది వక్రీకరించటమే అని, దీనికి కోర్టు సరైన సమాధానం చెప్తుంది అని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read