టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగించేలా ఎల్లోమీడియా ప్రచారం చేసిందని సుబ్బారెడ్డి అన్నారు. వెంకటేశ్వరస్వామికి మేము సేవకులమే అని, కేవలం రాజకీయ వ్యతిరేకతతోనే మా పై నిందలు మోపుతున్నారని అనంరు. వెంకటేశ్వరస్వామికి అపవాదులు తీసుకురావద్దని కోరుతున్నా, తిరుమలపై వార్తలు రాసేటప్పుడు రాజకీయ ప్రయోజనాలు మానేయండి అంటూ మీడియాకు హితవు పలికారు సుబ్బారెడ్డి. ఇక చంద్రబాబు పై కూడా ఆరోపణలు చేసారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 450 ఎకరాలు ఐఎంజీకి దోచిపెట్టారని, మేం అలాంటి పనులు చేయడం లేదని అన్నారు. దేవుడి భూములు, కొట్టేయాలనో అమ్మేయాలనో ఏ రోజూ భావించలేదని, చంద్రబాబు హయాంలో దేవుడి ఆస్తులెన్నో కరిగించేశారని సుబ్బా రెడ్డి అన్నారు.

చెన్నైలోని సదావర్తి భూములు, కనకదుర్గమ్మ భూములు ఎలా కొట్టేయాలని చంద్రబాబు ప్రయత్నించారో మాకు తెలుసు అని అన్నారు. పదివిలో ఉన్నా, లేకున్నా దేవుడి భుముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం అని సుబ్బా రెడ్డి అన్నారు. స్వామికి చెందిన ప్రతి పైసా కాపాడలన్నదే మా ప్రయత్నం, మున్సిపాలిటీ, ప్రభుత్వం చేయాల్సిన పనులకు టీటీడీ డబ్బులా?, చంద్రబాబు హయాంలో తిరుపతిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.400 కోట్లు కేటాయించారు అని అన్నారు. టీటీడీ బాధ్యతలు స్వీకరించగానే నిధుల సంరక్షణ చేపట్టాం అని తెలిపారు.

టీడీపీ హయాంలో చదలవాడ ఛైర్మన్‍గా ఉన్నప్పుడు ఆస్తుల విక్రయం చేసారని, టీటీడీ ఆస్తులను కాపాడటంలో భాగంగానే సమీక్షలు జరిపాం అని, 1974 నుంచి 2014 వరకు వందకుపైగా ఆస్తులు అమ్మారని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న వివాదం పై స్పందిస్తూ, టీటీడీ భూమిల్ని వేలం వేసే నిర్ణయం పూర్తిస్థాయిలో తీసుకోలేదని అన్నారు. గ్రామాల్లో ఒకట్రెండు సెంట్ల టీటీడీ భూముల్ని కాపాడటం కష్టం అని చెప్తూ, భూముల వేలానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందని, అంత వరుకే జరిగింది అని చెప్పారు. మరి ఇంతకీ భూములు అమ్మేస్తారో, లేదో, ఆ రోడ్ మ్యాప్ ఏంటో వేచి చూడాలి. గతంలో చంద్రబాబు అమ్మాలని చూసారు, అని చెప్తూ, తప్పించుకునే ప్రయత్నం చేసారు.

ఇప్పటి వరకు ఇచ్చిన లాక్ డౌన్ కు సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్రం, సోమవారం నుంచి, డొమెస్టిక్ ఫ్లైట్స్ అనమతి ఇస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ప్రకారం, అన్ని రాష్ట్రాలు, అనుమతి ఇచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు మాత్రం, తమ రాష్ట్రంలో అధికంగా కేసులు ఉండటంతో, ఇప్పుడే మాకు వద్దు అని చెప్పాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా, ఫ్లైట్ షడ్యుల్ ఇచ్చేసారు. చాలా మంది బుక్ కూడా చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లలో షడ్యుల్ కూడా విడుదల అయ్యింది. అయితే ఏమైందో ఏమో కాని, నిన్న రాత్రి 9 గంటలు తరువాత, ఏపిలో ఫ్లైట్స్ అన్నీ, ఒక రోజు వాయిదాతో, మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయని వార్తలు వచ్చాయి. అలాగే పౌరవిమానయాన మంత్రి హర్దీ‌ప్‌సింగ్‌ పురి కూడా ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఒక రోజు వాయిదా వేసి, మంగళవారం నుంచి నడుపుతాం అని చెప్పింది అని, అందుకు కేంద్రం ఒప్పుకొంది అని చెప్పారు.

అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. కేవలం చంద్రబాబు అనే ఒక్కడిని విశాఖపట్నం రాకుండా ఉండటానికి, ఇన్ని కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తుంది. పోలేసులు చేత పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి, ఇప్పుడు కేవలం ఒక్క రోజు వాయిదా అంటూ నాటకాలు ఆడుతున్నారని, షడ్యుల్ ఇచ్చి, చివరి నిమిషంలో రద్దు చేసేంత ఎమర్జెన్సీ ఏమి వచ్చింది అని అన్నారు. ఇది కేవలం చంద్రబాబుని అడ్డుకోవటం కోసమే అని అన్నారు. మహానాడు 27, 28న ఉంటుంది అని, 26న వైజాగ్ వెళ్ళటం కుదరదు కాబట్టి, చంద్రబాబు ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకుంటే, కావాలని ఆపారని అన్నారు. ఒక రోజు ఆపగలరు, రెండు రోజులు ఆపగలరు, ఈ రోజు కాకపొతే, మరో రోజు వెళ్తామని తెలుగుదేశం నేతలు అంటున్నూర్.

గతంలో కూడా వైజాగ్ లో అడుగుపెడితే అడ్డుకున్నారు, ఇప్పుడు రెండో సారి దొంగదారిలో అడ్డుకున్నారని, ఎందుకు ఒక రోజు ఫ్లైట్స్ రద్దు చేసాం అనేది ఇప్పటి వరకు చెప్పలేదని అచ్చంనాయడు అన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు వైజాగ్ వెళ్ళటానికి, తెలంగాణా డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసారు. తెలంగాణా నుంచి వెంటనే అనుమతి రాగా, ఏపి పోలీసులు నిన్న సాయంత్రం అనుమతి ఇచ్చారు. అయితే అంతకు ముందు హోం మంత్రి సుచరిత, చంద్రబాబు అసలు మమ్మల్ని అడగలేదని, అడిగితే పర్మిషన్ లెటర్ చూపించాలని అన్నారు. అయితే హోంమంత్రి చెప్పిన 3,4 గంటల్లోనే, డీజీపీ చంద్రబాబు 23వ తారీఖు అనుమతి అడిగినట్టు, ప్రత్యెక పరిస్థితిలో, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పారు. అయితే విశాఖలో మాత్రం, ఫ్లైట్స్ లేని కారణంగా, చంద్రబాబు పర్యటన రద్దు చేసుకున్నారు.

15 రోజుల క్రితం, విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయ్యి, 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే, అనేకమంది అస్వస్తతకు గురయ్యారు. అయితే ఈ కంపెనీ విషయంలో, అనేక ప్రశ్నలు, అనేక ఆరోపణలు వస్తున్న వేళ, హైకోర్ట్ లో శుక్రవారం జరిగిన వాదనలు, హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సంచలనం అయ్యాయి. ఈ రోజు ఆ ఆదేశాలకు సంబంధించి, పూర్తి డాక్యుమెంట్ బయటకు రావటంతో, కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయిన తరువాత, హైకోర్ట్ ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. ఈ విషయం పై శుక్రవారం హైకోర్ట్ కీలక ఆదేశాలతో పాటుగా, కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. ఇవే ప్రశ్నలు సామాన్య ప్రజలకు కూడా వచ్చాయి. మొన్న సిఐడి ఆర్రేస్ట్ చేసిన రంగనాయకమ్మ గారి కేసు విషయంలో కూడా, ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ఈ రోజు కోర్ట్ కూడా అవే ప్రశ్నలు వేసింది.

ముందుగా కోర్ట్ ఆదేశాలు ఇస్తూ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సీజ్ చెయ్యాలని ఆదేశించింది. కంపెనీ డైరెక్టర్ లతో, కంపెనీకి సంబంధించిన ఎవరూ లోపలకు వెళ్ళవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. అలాగే విచారణ కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు అయ్యాయని, విచారణ కోసం వెళ్ళే వారు లోపలకు వెళ్ళవచ్చు కాని, గేటు బయట ఒక రిజిస్టర్ పెట్టి, ఎవరు ఎవరు లోపలకు వెళ్తున్నారో, వారు అక్కడ రిజిస్టర్ అవ్వాలని కోర్ట్ కోరింది. అలాగే ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి ఏ ఒక్కటీ, మిషనరీ కాని, ఫర్నిచర్ కాని, బయటకు వెళ్ళటానికి వీలు లేదని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్ లకు, కోర్ట్ కు తెలయకుండా పాస్ పోర్ట్ ఇవ్వకుడదు అని, ఎవరూ దేశం విడిచి వెళ్ళటానికి వీలు లేదని కోర్ట్ ఆదేశించింది.

అలాగే లాక్ డౌన్ తరువాత పర్మిషన్ ఎవరు ఇచ్చారు ? ఒక వేళ పర్మిషన్ ఇవ్వకపోతే, ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కోర్ట్ కోరింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ విషయాల్లో ఎందుకు సరిగ్గా స్పందించ లేదు అంటూ కోర్ట్ అడిగింది. ఎల్జీ పాలిమర్స్, పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా పని చేస్తుంది, అని కోర్ట్ ప్రశ్నించింది. కంపెనీలో అలారం ఎందుకు మోగలేదు అని ప్రశ్నించింది. ప్రమాదం జరిగితే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే, ట్రైనింగ్ ఎందుకు ఇవ్వలేదు ? అని ప్రశ్నిస్తూ, కంపెనీ నెట్ వాల్యు ఎంత ? కోర్ట్ పరిధిలో ఉండగానే, స్టరీన్ మోనోమార్ ని సౌత్ కొరియాకి తరలించే ఆదేశాలు ఇచ్చింది ఎవరు ? నేరం జరిగినాక ఎటువంటి మాజిస్టీరియల్ విచారణ కానీ ఇన్సెపక్షన్ టీం ఏర్పాటు కా కుండానే
ఎలా తరలించారు? అని కోర్ట్ ప్రశ్నిస్తూ, కౌంటర్ దాఖలు చెయ్యమని కోరింది.

నర్సాపురం వైసీపీ ఎంపీ, రఘురామ కృష్ణ రాజు, ఈ రోజు ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, తమ భావాలను పంచుకున్నారు. ముఖ్యంగా టిటిడి భూములు అమ్మటం విషయం పై, రఘు రామ కృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. వెంకటేశ్వర స్వామి విషయం, టిటిడి ఇష్టం కాదని, భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. నన్ను కనుక సలహా అడిగితే, వెంకన్న విషయంలో, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్తానని అన్నారు. వెంకటేశ్వర స్వామీ అంటే భక్తితో పాటు భయం ఉందని అన్నారు. దేవస్థానం భూములు అమ్మటానికి లేదని, ఇంతకు ముందు హైకోర్ట్ ఆర్డర్ ఉందని, మరి ఇప్పుడు టిటిడి ఎలా నిర్ణయం తీసుకుందో అని అన్నారు. భక్తులు దానం చేసిన భూమి అమ్మాలి అనుకుంటే, ఆ దానం ఇచ్చిన వారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భక్తుల మనోభావాలు నాకు అనవసరం, నేను ఏది చేసిన చెల్లుతుంది అంటే కుదరదు అని అన్నారు.

ఈ నిర్ణయం అనవసరంగా తీసుకుంది ఏమో అని అన్నారు. ఒక పక్క ప్రభుత్వాలు పెత్తనం, గుడి మీద ఉంది అనుకున్న సమయంలో, ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదని అన్నారు. ఒక వెంకటేశ్వర స్వామీ భక్తుడిగా, ఈ నిర్ణయం నేను సమర్ధించను అని రఘురామ కృష్ణ రాజు అన్నారు. ఇక మధ్య పాన నిషేధం పై మాట్లాడుతూ, షాపులు తగ్గించినంత మాత్రాన, మధ్యపాన నిషేధం జరగదని అన్నారు. రెండు చోట్ల ఉండే చోట, ఒక చోట వచ్చి తాగుతారని అన్నారు. చేస్తే పూర్తిగా చెయ్యాలని, అంతే కాని, ఇలా షాపులు తగ్గిస్తే మధ్య నిషేధం అవ్వదు అని అన్నారు. అలాగే 2024లో సీటు వస్తే వైసీపీ నుంచి పోటీ చేస్తానని, నాకు సీటు ఇవ్వకపోయినా పోటీ చేస్తాను అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు.

క-రో-నా సహాయం విషయంలో, జగన్ దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగి హడావిడి చేస్తేనే కాదని, తాను కూడా సైలెంట్ గా, ఎవరికీ ఇబ్బంది లేకుండా, రోజుకి రెండు ఊరులు చొప్పున సహాయం చేసానని, రఘురామకృష్ణ రాజు స్పష్టం చేసారు. అలాగే కేంద్ర మంత్రి పదవి పై ఇప్పటికి ఆశ లేదని, నాకు ఉన్నది చాలని, మంచి పదవి వస్తే, ప్రజలకు మరింత సేవ చెయ్యాలని, తనకు ఆశయం ఉందని అన్నారు. రాజశేఖర్ రెడ్డికి, జగన్ మోహన్ రెడ్డికి పోల్చి, మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అని అడగగా, రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్రెండ్ అని, ఆయన లీడర్ కాదని, జగన్ మోహన్ రెడ్డి ఫ్రెండ్ కాదని, లీడర్ అని అన్నారు. ఒక ఫ్రెండ్ కు ఉన్న ఎమోషన్, లీడర్ తో ఉండదు కదా అని, రఘు రామ కృష్ణ రాజు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read