వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దేవాదాయ భూములకు ఎసరు పెట్టి హిందూమతాన్ని పరోక్షంగా అణిచివేసే ప్రయత్నాలు చేస్తుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం కన్నా నివాసంలో టిటిడి భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ, హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణకై ఉపవాసదీక్ష జరిగింది. కార్యక్రమానికి బిజెపి శ్రేణులతో పాటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, మతానికి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల జోలికి రావద్దని ప్రభుత్వానికి పలుమార్లు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని అన్నారు. రాష్ట్రంలో మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దేవాలయ భూములను కొల్లగొట్టేందుకు కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నామొన్నటి వరకు మంగళగిరి, అన్నవరం దేవాలయ భూములను లాక్కునే ప్రయత్నం చేసిన ప్రభుత్వం నేడు ఏకంగా తిరుమల వెంకన్న భూములకు ఎసరు పెట్టిందన్నారు.

టిటిడి ఆస్తులను వేలం వేయాలన్న టిటిడి బోర్డు నిర్ణయాన్ని హిందూధార్మిక సంస్థలు, బాలాజి భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు చెందిన భూముల్లో ప్రభుత్వం ఒక గజం అమ్మినా తాము పోరాటానికి సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల నుండి వస్తున్న విమర్శలను గుర్చించి ప్రభుత్వం టిటిడి ఆస్తుల వేలాన్ని తాత్కాలికంగా రద్దు చేసిందన్నారు. ప్రస్తుతం టిటిడి ఛైర్మన్‌గా ఉన్న వై.వి.సుబ్బారెడ్డి ప్రతపక్షంలో ఉన్న సమయంలో ఆలయ భూముల రక్షణకు సంబంధించి చాలా మాట్లాడారని నేడు ఆయన స్వయంగా టిటిడి భూముల వేలానికి ఆమోదం తెలిపేలా వూనుకున్నారన్నారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ఆగమేగాలపై 888జీవోను తీసుకొచ్చిందన్నారు. ఆ జీవోలో కేవలం టిటిడి ఆస్తుల వేలాన్ని తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందే తప్పా శాశ్వతంగా టిటిడి ఆస్తుల జోలికి వెళ్ళమని జీవోలో పేర్కొలేదని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన ప్రతీ పని ప్రజలను మోసం చేసేవిధంగా ఉందన్నారు.

ప్రభుత్వ కార్యకలాపాలకు దేవాదాయ భూములు వాడుకుంటారా అని ప్రశ్నించారు. కరోనాను అడ్డుపెట్టుకొని సింహాచలం దేవస్థానానికి చెందిన విలువైన భూములను వైసీపీ పెద్దల అండదండలతో వారి అనుచరులు ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు కడుతున్నా ప్రభుత్వానికి కనపడదా అని ప్రశ్నించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకొని సింహాచలం భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. తెలుగుదేశంపార్టీ హయాంలో ఆస్తుల విక్రయ ప్రక్రియ ప్రారంభమైనట్లు చెబుతున్న వైకాపా నేతలు పోలవరం ప్రాజక్టు సహా గత ప్రభుత్వ నిర్ణయాలను రివర్స్ టెండరింగ్ పేరిట ఎందుకు రద్దుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయ ఆస్తులకు సంబంధించి తాను సిఎంకు ఇప్పటికే లేఖ రాశానని, మంత్రులు దమ్ముంటే వాటికి నేరుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. జీవో నెంబర్ 39పై ప్రభుత్వం స్పష్టతనిచ్చి తన పారదర్శకతను నిరూపించుకోవాలని అన్నారు.

దక్షిణ భారత శక్తి పీఠమైన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో అంతులేని అక్రమాల భాగోతం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోంది. ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతి ఏటా లక్షలాదిగా ప్రజలు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి చెల్లించు కుంటున్న ముడుపుల సొమ్మును కొందరు స్వాహా చేస్తూ ఆలయ పవిత్రతను అప్రతిష్ట పాలు చేస్తు న్నారు. దర్శన, ఆర్జిత, అభిషేక, మహామంగళారతి టికెట్ కౌంటర్లలో చోటు చేసుకున్న భారీ కుంభకోణం ఇప్పుడు దుమారం రేపుతోంది. కౌంటర్ కేంద్రాల్లో కాంట్రాక్టు పద్దతిన వనిచేస్తున్న సిబ్బంది ఈ అక్రమ భాగోతానికి పాల్పడినట్లు ఆలయ అధికారులు గుర్తించి పోలీస్ ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆర్జిత,దర్శన టికెట్ కౌంటర్ల సిబ్బంది అంతర్జాల మాయ చేసినట్లు తెలుస్తోంది. రూ.150ల దర్శన టికెట్స్ జారీ ప్రక్రియ మొత్తం అన్లైన్ ద్వార జరు గుతోంది. ఈ వ్యవహారం అంతా ఆంధ్రబ్యాంక్, ఎస్బీఐ లకు పాలక మండలి అప్ప జెప్పారు. ఈ బ్యాంకుల పర్యవేక్షణలో ఈ కౌంటర్ల వ్యవహారం నడుస్తోంది. సాఫ్ట్వేర్ నైపుణ్యం కలిగిన ఇద్దరిని ఈ వింగ్ లో సిస్టం అడ్మినిస్ట్రేటర్స్ గా కూడ ఏర్పాటు చేశారు.

ఇక్కడే అవినీతికి బీజం పోశారు. నైపుణ్యానికి మరింత పదును పెట్టి సాఫ్ట్ వేరు అచ్చం పోలిన మరో సాఫ్ట్ వేరు క్రియేట్ చేశారు. డైలీ విక్రయాలు నిర్వహించే టికెట్స్ లో కొన్ని క్రియేట్ చేసుకన్న సాఫ్ట్వేర్ ద్వారా అమ్ముకొని సొమ్మును దారి మళ్లిచారు. గతంలో కొందరు ఈఓ లు ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించకపోవడం కూడ అక్రమాలకు అడ్డులేకుండా చేసింది. కరోనాతో ఆలయ సిబ్బందికి కొంత విరామం ఏర్పడి కంప్యూటర్ కార్యకలాపాల పై దృష్టి సారించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. అంతర్జాల మాయ పై సమగ్ర దర్యాప్తుకు ఎఇఒ స్థాయి అధికారిని నియమించి ఫిర్యాదు కూడ చేశారు. టికెట్స్ అమ్మకాల్లో జరిగిన అక్రమ లెక్కలు దాదావు కోటిన్నర ఉన్నట్లు తేల్చారు. మరింత లోతుగా దర్యాప్తు జరిగితే ఇంకొంత అవినీతి బట బయలయ్యే అవకాశం ఉంది. ఆయా టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

2017 నుండి ఆలయంలో ఆయా వింగ్లో అవినీతి బయట పడుతూనే వస్తోంది. శ్రీశైల క్షేత్రంలో అవినీతి ఆక్రమాలు తవ్వేకొద్ది బయటపడే అవకాశం ఉంది. గతంలో పెట్రోల్, విరాళాలు ఇప్పుడు ఆర్జిత, అభిషేక టికెట్స్ ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆడిట్ క్రమబద్ధంగా చేపట్టి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగితే టోల్‌గేట్, లడ్డు కౌంటర్, రెవెన్యూ విభాగం ఇలా అన్ని వింగ్ లో మరిన్ని అక్రమాలు బయట పడవచ్చని తెలుస్తుంది. స్వామి సొమ్ము స్వాహా భాగోతానికి సంబంధించి ఐటీ చట్టం కింద పోలీసులు కేసులు కట్టి విచారణ చేస్తున్నారు. శ్రీశైల శైవ క్షేత్రంలో చోటుచేసుకున్న అవినీతి ఆక్ర మాలపై సమగ్ర దర్యాప్తుకు దేవాదాయశాఖ ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల విక్రయంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపి అని జగన్ చేస్తున్న కార్యక్రమం పై, హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. భూములు విక్రయించి పరిపాలన సాగించే స్థాయికి ప్రభుత్వం దివాళా తీసిందా అని ప్రశ్నించింది. లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వ భూములను ఇ-వేలం విధానంలో విక్రయించడం సరికాదని పేర్కొంది. ఏపిలో భూముల అమ్మకాలపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకో ర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి గాని ఇలా హడావిడి చేస్తూ విక్రయాలుచేయడం ఎంత వరకు సమంజస మని ప్రశ్నించింది. విలువైన భూములు అమ్ము కోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం నడపటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వేల కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న ఎపీలో ప్రజలు ధనవంతులు మాదిరిగా ప్రభుత్వం పేదరికంగా ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ అమలులో ఉంటే ఇంత అర్జెంట్ గా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి వేలం జరపాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ భూములను ఇ-వేలం విధానంలో విక్రయించడం తగదని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ బాబు హైకో ర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

పిటీషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఒక వైపు ఇళ్లస్థలాల కొరకు భూములు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఉన్న భూములను అమ్ముకుంటున్నారు. ఇదేమి పరిస్థితి? అని హైకోర్టు ఆక్షేపించిందని న్యాయవాది శ్రీనివాస రావు తెలిపారు. హైకోర్టు తీర్పు పరిధిలోనే ఈ నెల 28నుండి జరగనున్న ఇ-వేలం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరవున కౌంటరు దాఖలుకు అదనపు అడ్వకేట్ జనరల్ గడు వు కోరడంతో కేసు తదుపరి విచారణను ఈనెల 28కు హైకోర్టు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్లో మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆంక్షలు కారణంగా వ్యాపారలావాదేవీలు లేకుండా పోయిన సంస్థలకు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు వాటిని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. నగలు, బట్టలు, చెప్పుల దుకాణాలకు, స్ట్రీట్ ఫుడ్స్ కు అనుమతినిచ్చింది. అయితే పెద్ద క్లాత్ షోరూమ్ కు వెళ్లాలంటే ఆన్లైన్లో అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అన్ని షాపుల్లో ట్రయల్ రూమ్ లకు అనుమతి నిరాకరించింది. పానీపూరీ బండ్లకు అనుమతులు నిరాకరించింది. ఈ సడలింపుల వలన చిన్నపాటి వ్యాపారులకు సైతం ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పెద్ద దుకాణాల్లోకి షాపింగు ఆన్ లైనులో ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. అన్ని దుకాణాలో ట్రయల్ రూమ్ లో ట్రయల్స్ విధానం ఉండకూడదు. నగల దుకాణంలో డిస్పోజబుల్ గ్లోవ్స్ వేసుకోవాలి. చెప్పుల దుకాణాల వద్ద ఖచ్చితం శానిటైజర్స్ ను వాడాలి. అక్కడ మాస్కులు తప్పని సరి.

తోపుడు బళ్ల పై ఆహార విక్రేతలు ఆహా రం అక్కడ తినకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింవుల ప్రకారం నేటి నుండి విజయవాడలో నిబంధనలను అనుసరించి వస్త్ర, చెప్పుల, బంగారం దుకాణాల వారు షాపులు తెర్చుకొని వ్యాపారం నిర్వహించుకోవచ్చని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటలక్ష్మి (రెవెన్యూ) తెలియచేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు మంగళవారం, విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగరంలోని వస్త్ర వ్యాపారాలు, పాదరక్షల విక్రయదారులు, జ్యూయలరీ వ్యాపార సంఘాల వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వంచే జారీచేయబడిన మార్గదర్శకాలను వివరించారు. వాటిని తప్పకుండా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మరి కొన్నింటికి లాక్ డౌన్ నిబంధనల నుండి సడలింపులు ఇస్తూ, పెద్ద షోరూం లకు వెళ్లాలంటే మందే ఆన్లైన్లో అను మతి తీసుకోవాలని, అన్నిషాపుల్లో ట్రయల్ రూమ్ కు అనుమతిని నిరాకరించారన్నారు.

ప్రతి షాపు వారు కేవలం 50 శాతం మంది సిబ్బందిని మాత్రమే వినియోగించాలని, షాపులో ధర్మల్ స్కానింగ్ అందుబాటులో ఉంచి భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, తరచూ డిస్ ఇన్పె క్షన్ చేయాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా గ్లోజు లు ధరించాలని, కొనుగోలుదారులకు కూడా గ్లోజు లు అందించాలని ప్రభుత్వం తాజా ఆదేశాలలో ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. నగరంలో కొత్త డివిజన్ల వునర్విభజన ప్రకారం, జిల్లా అధికారులు నిర్ణయించిన నాన్ కంటోన్మెంట్ జోన్ లలో మాత్రమే షాపులు తెరుచుకోవచ్చని, కంటోన్మెంట్ జోన్, టఫర్ జోన్స్ లో వ్యాపారాలకు ఎటువంటి అనుమతులు లేవని ఆమె వెల్లడించారు. షాపులు ఏ జోన్లో ఉన్నాయో తెలుసుకొని నాన్ కంటోన్మెంట్ జోన్ పరిధిలో ఉన్నవారు మాత్రమే తమ షాపులను ప్రారంభించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read