తెలుగుదేశం పార్టీ 38వ మహనాడు, ఆన్లైన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రెండో రోజు కూడా మహనాడు ప్రారంభం అయ్యింది. ఈ రోజు మహానాడులో మొదటిగా, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో, ఎన్టీఆర్ తనయుడు, నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడున్న ప్రభుత్వం, మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం, మాములుగా అయితే 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, కాని ప్రజలు 5 ఏళ్ళు భరించే పరిస్థితిలో లేరు, చాలా తొందరగానే, ఈ ప్రభుత్వం దిగిపోతుంది. నేను మరోసారి చెప్తున్నా, 5 ఏళ్ళు అవసరం లేదు, తొందరోనలోనే ఈ ప్రభుత్వం నుంచి విముక్తి లభిస్తుంది అంటూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇది రాజకీయ కోణంలో, చేసారా , లేక జరుగుతున్న పరిస్థితులు, ప్రజలు విసిగెత్తి పోవటం, కోర్టుల్లో ఎదురు దెబ్బలు, కేంద్రం ఆగ్రహం, ఇవన్నీ రోజు రోజుకీ ఎక్కువ అయిపోతు ఉండటంతో, అన్నీ అలోచించి వ్యాఖ్యలు చేసారో కాని, బాలకృష్ణ వ్యాఖ్యల ఆసక్తికరంగా మారింది.

బాలయ్య మాట్లాడుతూ, ‘‘ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, పొగడరా నిండు భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం...’’ గేయాన్ని గుర్తు చేసిన నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ జయంతి ప్రతి తెలుగువాడికి పండుగ రోజు. ఎందరో పుడతారు, గిడతారు, కానీ మహానుభావులు కాలేరు. తన ఆదర్శాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుజాతి నిర్వీర్యమై దిక్కుతోచని స్థితిలో మద్రాసీలుగా పిలువబడే పరిస్థితుల్లో ఎన్టీఆర్ తెలుగువారికి గుర్తింపు తెచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ద్వారా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు పెంచారు. నటన అంటే నటించడమే కాదు సజీవ పాత్రపోషణకు నాంది పలికారు ఎన్టీఆర్. ఎన్ అంటే నటనాలయం. టి అంటే తారక మండలం. ఆర్ అంటే రాజర్షి, రాజకీయ దురంధరుడు. తెలుగు అనే 3అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది. ఎన్టీఆర్ అనే 3అక్షరాలు వింటే నా మనసు పులకరిస్తుంది. ఇది ప్రతి తెలుగువాడి భావన. తన కుటుంబానికి, తన భాషకు, తన జాతికి, తన రాష్ట్రానికి ఎనలేని గుర్తింపు తెచ్చారు.

ఒక చారిత్రాత్మక పురుషుడు ఎన్టీఆర్. సినీ జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం టిడిపి స్థాపించారు. కనీస అవసరాలైన కూడు-గుడ్డ-నీడ అవసరాలు తీర్చారు. ఆడబిడ్డలకు ఆస్తిహక్కు కల్పించారు. పేదలంతా ప్రతిరోజూ పండుగ భోజనం( తెల్లన్నం)తినేలా చేశారు. నాకు ఎన్టీఆర్ తండ్రిమాత్రమే కాదు. గురువు, దైవం. ఎన్టీఆర్ ను తలుచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆయనను అనుకరించడం కాదు, అనుసరించాలి. అనుకరించేవాడు వారసుడు కాదని ఎన్టీఆర్ అనేవారు. నేను కాదు ఎన్టీఆర్ వారసుడిని, టిడిపి కార్యకర్తలంతా ఎన్టీఆర్ వారసులే. ఎన్టీఆర్ స్ఫూర్తితో టిడిపి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే అది ఎన్టీఆర్ మస్తిష్కంలో ఆలోచనే. ఎన్టీఆర్ కలను నిజం చేసింది చంద్రబాబు. హిందూపురం శాసన సభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యకర్తల పార్టీ తెలుగుదేశం. టిడిపికి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరు. నా తుది రక్తపు బిందువు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే నా జీవితం అంకితం. తెలుగుదేశం పార్టీ సేవకే నా జీవితం అంకితం. ఈ అరాచక పాలన అంతానికి 5ఏళ్లు అవసరం లేదు. ప్రజలే అరాచకశక్తులకు తగిన బుద్ది చెబుతారు" అని బాలయ్య అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగానే కాన, దేశ వ్యాప్తంగా సంచలనం అయిన, డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఉత్తర్వు లపై సుప్రీంకోర్టుకు అప్పీలకు వెళ్ళనున్న రాష్ట్ర ప్రభుత్వం యోరిస్తోంది. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనను సస్పెండ్ చేసింది. అనంతరం రోడ్డు పై ఆయన న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన చేతులు వెనక్కు కట్టివేసి పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. అంతే కాకుండా ఆయనకు మతిస్థిమితం కోల్పోయారని మానసిక వైద్యశాలకు తరలించారు. దీనిపై హైకోర్టు సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం ఇచ్చిన వివరణకు, వాస్తవానికి చాలా తేడాలు ఉన్నట్లు న్యాయస్థానం వ్యాఖ్యానించింది. డాక్టర్ సుధాకర్ శరీరంపై గాయాలు కూడా ఉండటంతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఒక్క గాయం ఉంటే, మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో, ఆరు గాయాలు ఉన్నాయని, ఫోటోలు కూడా ఉన్నాయని, ఈ తేడా ఎందుకో అర్ధం కావటం లేదని, ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు అంటూ, కేసు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే విశాఖ పోలీసులే, ఆయన్ను కొట్టి దాడి చేసారని, ఆరోపణలు వస్తున్న వేళ, వారి చేతే విచారణ చేపించటం సమంజసం కాదని భావించిన హైకోర్ట్, ఈ కేసు విచారణ సిబిఐకి అప్పచెప్తూ, హైకోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చల జరిపింది. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా తమ వాదనను వినిపించాలని న్యాయనిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

కరోనా సమయంలో రాజకీయ సమావేశం జరుగుతుంది అంటూ, తమకు ఫిర్యాదు వచ్చింది అని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి, నోటీస్ ఇచ్చారు, మంగళగిరి తాహసీల్దార్. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి, ఎక్కువ మంది తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు వచ్చారని తమకు ఫిర్యాదు వచ్చిందని, ఆ నోటీస్ లో పేర్కొన్నారు. మహానాకు కార్యక్రమం జరుగుతంది కాబట్టి, కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని, ఆయన ఆ నోటీస్ లో కోరారు. దీనికి సంబంధించిన నోటీస్ ను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో వెంకటేశ్వర్లు అందచేసారు. అయితే కార్యకర్తలు ఎవరూ రాలేదని, ముఖ్య నాయకులు మాత్రమే వచ్చారని, మహానాడు జూమ్ యాప్ ద్వారా జరుగుతంది అని, ఇక్కడకు వచ్చిన వారికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, తీసుకున్న జాగ్రత్తలు అన్నీ తెలిపారు. అధికారులకు అన్నీ వివరింకాహారు.

మరో పక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మహానాడులో ప్రారంభ ఉపన్యాసం చేసారు. "38ఏళ్లుగా కార్యకర్తలు త్యాగాలు చేశారు. భుజాలు అరిగిపోయేలా టిడిపి జెండాలు మోశారు. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా వెనుకంజ వేయలేదు. ప్రాణాలు పోయినా పార్టీని వదిలేదని చెప్పారు. కార్యకర్తల త్యాగాలు నా జీవితంలో మరిచిపోలేను. గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరం. శారీరకంగా మానసికంగా ఆర్ధికంగా దెబ్బతీశారు. ఉన్మాదులు మాదిరిగా వైసిపి నేతలు వ్యవహరించారు. చేయని తప్పుకు టిడిపి కార్యకర్తలు జైళ్లకు వెళ్లారు. చిరు వ్యాపారంతో ఉపాది పొందేవాళ్లను ఆర్దికంగా నష్టం చేశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. ఆర్ధికంగా కుంగదీసినా, శారీరకంగా హింసించినా పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను. కరోనా కష్టాల్లో టిడిపి కార్యకర్తల సేవాభావం మరువలేం. సేవాభావానికి మారు పేరు టిడిపి. పేదలకు అండగా ఉన్న అందరికీ అభినందనలు. 38ఏళ్ల చరిత్రలో 22ఏళ్లు అధికారంలో ఉన్నాం, 16ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశాం. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచాం."

"ఎన్టీఆర్ హయాంలో ఆత్మగౌరవాన్ని ప్రబోధించారు. మా హయాంలో ఆత్మవిశ్వాసం పెంచాం . వినూత్న పద్దతుల్లో అబివృద్ది చేశాం. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపాం. టిడిపి పథకాలు దేశానికే మార్గదర్శకం అయ్యాయి. రూ 2 కే కిలో బియ్యం పథకం తర్వాత ఆహార భద్రతగా మారింది. రూ50కే హార్స్ పవర్ విద్యుత్ ఉచిత కరెంటుకు నాంది పలికింది. పక్కా ఇళ్లు కట్టించిన పార్టీ టిడిపి. హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా చేశాం. జంట నగరాలకు తోడుగా సైబరాబాద్ ను నిర్మించాం. అభివృద్దికి అనుకూల వాతావరణ సృష్టించాం. అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, ఐటి, బయోటెక్ అభివృద్ది చేశాం. టిడిపి అభివృద్ది ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోంది: చంద్రబాబు బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం కృషి చేశాం. బీసిలే టిడిపికి వెన్నెముక. 24% రిజర్వేషన్లు ఎన్టీఆర్ తెచ్చారు. నేను 34%కు పెంచాను. బిసి రిజర్వేషన్లను 24%కన్నా తగ్గించేశారు. 140పైగా బిసి కులాలకు చేతివృత్తులే ఆధారం. కరోనా సమయంలో బలహీన వర్గాలకు అనేక ఇబ్బందులు. ఆదరణ పథకాల ద్వారా టిడిపి వారిని ఆదుకుంది. బీసిలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెట్టాం. 5ఏళ్లలో రూ46వేల కోట్లు బిసిలకు ఖర్చు చేశాం. ఎస్సీలకు రూ40వేల కోట్లు, ఎస్టీలకు రూ12వేల కోట్ల బడ్జెట్ పెట్టాం. ముస్లింల బడ్జెట్ 3రెట్లు అధికం చేశాం. ఎంబిసిలకు రూ 100కోట్లు పెట్టాం. బ్రాహ్మణ సంక్షేమానికి రూ 300కోట్లు పెట్టాం. అభివృద్ది ద్వారా సంపద పెంచాం. పెరిగిన సంపద ద్వారా సంక్షేమం చేశాం. ఉద్యోగులను ఆదరించాం. ఉద్యోగులకు 43% ఫిట్ మెంట్ ఇచ్చాం. ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంచాం. రాజధానికి భూములిచ్చిన రైతులను రోడ్డుమీదకు తెచ్చారు. కరోనాలోనూ ఆందోళనలు చేసే దుస్థితి కల్పించారు. వాళ్లు పోరాడుతుంటే ఈ సీఎం జగన్ పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు. " అని చంద్రబాబు అన్నారు.

విశాఖ డాక్టర్ సుధాకార్ కేసు విషయంలో మరో ట్విస్ట్ నెలకొంది. మాస్కులు అడిగితే సస్పెండ్ చేసిన దగ్గర నుంచి, అతని కుమారుడు పై కేసు పెట్టటం, తరువాత డాక్టర్ తాగి గొడవ చేస్తున్నారు అంటూ, రోడ్డు మీద పాడేసి కొట్టి, చేతులు కట్టేసి, షర్టు చింపేసి, పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి, చివరకు మెంటల్ హాస్పిటల్ లో చేర్చారు. ఆ తరువాత ఈ కేసుని హైకోర్ట్ తీసుకోవటం, తరువాత సిబిఐకి ఇవ్వటం తెలిసిందే. అయితే ఇప్పటికీ డాక్టర్ సుధాకర్ మెంటల్ హాస్పిటల్ లోనే ఉన్నారు. అక్కడే సుధాకర్ కు హాని చేసే అవకాసం ఉందని, ఆయనకు ఇస్తున్న మందులు పై కూడా అనుమానం ఉంది అంటూ, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో, మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు డా.సుధాకర్‌ ఈ రోజు ఒక లేఖ రాసారు. ఆలాగే, కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసారు. ఆయన లేఖ రాస్తూ, అన్ని వివరాలు ఆ లేఖలో తెలిపారు.

తనకు ఇస్తున్న మందులు గురించి రాస్తూ, ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ మందులు వల్ల తనకు రియాక్షన్ వచ్చింది అని, తన పెదాలు డ్రై అయిపోయాయి అని, అలాగే యూరిన్ ఇబ్బందులు కూడా వచ్చాయని, కంటి చూపు కూడా మందగించింది అని చెప్పారు. ఈ హాస్పిటల్ రామి రెడ్డి అనే డాక్టర్ ఆధ్వర్యంలో నడుస్తుంది అని, మామూలు మనిషి అయిన నాకు, ఇలాంటి డ్రగ్స్ ఇస్తున్నారని అన్నారు. తనను ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ కు మార్చాలని కోరారు. అలాగే ఈ లేఖలో తాను, ఏ పరిస్థితిలో సస్పెండ్ అయ్యింది, ఈ హాస్పిటల్ లో ఎలా చేర్చింది అనేది, వివరించారు. కుటుంబ సభ్యులు తనని కలవటానికి వచ్చిన సమయంలో, ఈ లేఖ రాసినట్టు అర్ధం అవుతుంది. మరి ఈ లేఖ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read