వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంత్రి కొడాలి నాని, ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఆయన నేపధ్యం ఎలా ఉన్నా, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత, అదీ బాధ్యత గల మంత్రిగా ఉన్న తరువాత, ఆయన భాష పై కంట్రోల్ ఉంచుకోవాలి. అయినా మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి, చంద్రబాబు పై విరుచుకు పడుతూ ఉంటారు. అవి రాజకీయ విమర్శలు అయితే పరవాలేదు. కాని, అవి వ్యక్తిగత విమర్శలు. అది కూడా చంద్రబాబు లాంటి సీనియర్ నేతను పట్టుకుని, ఇష్టం వచ్చినట్టు, మాట తూలుతూ ఉంటారు. ఒక్కో సందర్భంలో వైసీపీ క్యాడర్ కు కూడా వెగుటు పుట్టేలా ఉంటాయి ఆ మాటలు. అయితే, కొడాలి నాని, ఇలా ఇష్టం విచ్చినట్టు నోరు పారేసుకున్నా, తెలుగుదేశం నేతలు మాత్రం, పెద్దగా రియాక్ట్ అవ్వరు. అతని స్థాయి అదే అని వదిలేస్తారో, లేక జరుగుతున్న విషయాల నుంచి టాపిక్ డైవర్ట్ చెయ్యటానికి, కొడాలి నానిని, దించుతారనో కానీ, తెలుగుదేశం పార్టీ అసలు నానిని పట్టించుకోదు.

అయితే నిన్న విశాఖలో, గ్యాస్ బాధితులు, మీ కోటి వద్దు ఏమి వద్దు, ఇక్కడ నుంచి కంపెనీని తరలించండి అంటూ, ఆందోళన చేసిన నేపధ్యంలో, దాన్ని నుంచి డైవర్ట్ చేయ్యటానికో ఏమో కాని, కొడాలి నాని, ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అయితే, తెలుగుదేశం ఈ సారి తీవ్ర స్థాయిలో స్పందించింది. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాస్, కొడాలి నాని పై విరుచుకు పడ్డారు. కోడాని నాని చరిత్ర అంతా చెప్తూ, చంద్రబాబు ఇంట్లో అంట్లు తోమటానికి కూడా స్థాయిలేని నువ్వా, చంద్రబాబుని విమర్శించేది అంటూ విరుచుకు పడ్డారు. వైఎస్ఆర్ పార్టీ సంస్కృతి, పద్దతి, కొడాలి నాని మాటలు చూస్తే అర్ధం అవుతుందని, వారి స్థాయి అంతే అని అన్నారు.

మంత్రి హోదాలో ఉన్నాననే సోయ కూడా లేకుండా, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లడటం చూస్తే, అతని అహంకారం ఎలా ఉందొ అర్ధం అవుతుంది అన్నారు. ఏదైనా విషయం పై ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అనుకుంటే, తాడేపల్లి నుంచి ఫోన్లు వస్తాయని, ఫోన్లు వస్తూనే, అచ్చోసిన ఆంబోతుల్లా వచ్చి, బూతులు తిడుతూ ప్రెస్ మీట్లు పెడతూ, కుక్కల్లా మొరిగి, ఇంటికి వెళ్లి పడుకుంటారని అన్నారు. లారీ క్లీనర్ గా ఉండే నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని, చంద్రబాబు అని గుర్తు చేసారు. పొట్ట కొస్తే అక్షరం ముక్క రాని సన్నాసి, నువ్వా చంద్రబాబు గారిని విమర్శించేది అని విరుచుకు పడ్డారు. నీ శాఖకు సంబంధించి వేరే మంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటేనే, నీ బ్రతుకు ఏమిటో తెలుస్తుందని అన్నారు. మాట్లాడితే చంద్రబాబుకి వయసు అయిపొయింది అంటున్నారని, నీకు వయసు అయిపోదా అని ప్రశ్నించారు. మేం బూతులు మాట్లాడలేమా.? తిట్టలేమా.? ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు అంటూ హెచ్చరించారు.

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. పరిశ్రమ వద్ద 82.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని తెలిపారు. అయితే మరో 24 గంటలు పరిసర గ్రామ ప్రజలు శిబిరాల్లో ఉండాలని ఆయన కోరారు. కేజీహెచ్‌ నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తులు కూడా శిబిరాల్లో ఉండాలని... అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. విశాఖలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్​తో సహా ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ కొరియాలోని ఎల్​జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారని కన్నబాబు వెల్లడించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించామని చెప్పారు. ప్రజలు, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వం ప్రకటించే వరకు ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ పరిసరాల్లోని గ్రామాల ప్రజలు ఇళ్లకు వెళ్లవద్దని మంత్రి అవంతి సూచించారు. ఆయా గ్రామాల్లో నిపుణుల బృందం పర్యటించిందన్న మంత్రి, వారి సూచనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్​ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. స్టైరిన్ ట్యాంక్ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గిందన్నారు. పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాల్లో నివాసానికి అనువైన పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందన్న మంత్రి... నివేదిక వచ్చే వరకు ప్రజలు గ్రామాలకు రావద్దని కోరారు. స్టైరిన్ ట్యాంక్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ జీఎం మోహన్​రావు చెప్పారు. ప్రమాదానికి కారణమైన స్టైరిన్ లిక్విడ్ గడ్డకట్టి పాలిమర్ అయ్యిందని అన్నారు. దీని నుంచి ఎలాంటి వాయువు బయటకు రావడం లేదని స్పష్టం చేశారు.

ఇది కాకుండా కంపెనీలో 2, విశాఖ పోర్టులో 2 స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని... వాటిల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ట్యాంకుల్లో ఉన్న లిక్విడ్ స్టైరిన్‌ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నామని జీఎం వివరించారు. మరో పక్క, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితులకు ఆసుపత్రుల్లో చేదు అనుభవం ఎదురవుతోంది. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళితే వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారా అని కొంతమంది వైద్య సిబ్బంది మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు.

తెలుగు మహిళా రాష్ట్ర అద్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మ‌హిళ‌ల‌ను మోసం చేసేందుకు మాతృదినోత్స‌వం రోజు నైనా నిజాలు చెప్ప‌లేని ధీనావ‌స్థ‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంది. మ‌ద్య నియంత్ర‌ణ పేరుతో కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌తికల‌కు, మీడియాకు అడ్వ‌ర్ టైజ్ మెంట్లు ఇవ్వ‌డం బాధాక‌రం. క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప్రతి ఒక్కరు ఆర్ధికంగా, మాన‌సికంగా క‌రోనా త‌రువాత బ‌ల‌ప‌రుచుకోవాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం జేబులు నింపుకోవ‌డానికి మ‌ద్యం షాపులు తెరిచి పేద‌ల క‌డుపుకొట్ట‌డం సిగ్గుచేటు. జే టాక్స్ కోసం ప్ర‌జ‌లను బ‌లిగొన‌డానికైనా జ‌గ‌న్ సిద్ధ‌ప‌డ‌టం హేయం. అత్య‌ధిక‌మైన ధ‌ర‌లు పెంచాం కాబ‌ట్టి మ‌ద్యం సేవించే వారి సంఖ్య త‌గ్గుతుంద‌ని జ‌గ‌న్ చెప్ప‌డం ఆయ‌న అవ‌గాహ‌న లేమికి, అజ్ఞానానికి, మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌నం. మ‌ద్యం సేవించే వారు ధ‌ర‌లు పెంచినా తాగుతారు గాని త‌గ్గించ‌రు. మ‌ద్యం బానిస‌లు ఇంట్లో సామాన్లు, మ‌హిళ‌ల మెడ‌లో పుస్తెలు తాక‌ట్టు పెట్టి మ‌రి మ‌ద్యం కొని తాగుతున్నారు. ఇప్ప‌టికే మ‌హిళ‌లు పోలీస్ స్టేష‌న్ల లో కేసులు పెడుతున్నారు. మ‌ద్యం కేసులు పెరిగిపోతున్నాయి. జ‌గ‌న్ మ‌ద్యంతో చేస్తున్న హంగామాకి మ‌హిళ‌లు, చిన్న‌పిల్లలు బ‌లైపోతున్నారు. మ‌ద్య పాన నిషేదం చేస్తాన‌ని హామీనిచ్చి మ‌హిళ‌ల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు మ‌ద్యం షాపులు తెరిచి అదే మ‌హిళ‌ల‌ను బాధ‌పెట్ట‌డం దుర‌దృష్ట‌కరం."

"గ‌తంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 20% మ‌ద్యం షాపులు త‌గ్గించామ‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికారు. టెండ‌ర్ వేయ‌ని, వేయ‌లేని మాత్ర‌మే త‌గ్గించారు. మ‌ద్య పాన నిషేదం అనేది ఒక కొంగ జ‌పం చేస్తూ మ‌హిళ‌ల‌ను మోసం చేస్తున్నారు. మ‌ద్యం మానిపించ‌డానికి ఒక్క రీఎడిక్ష‌న్ సెంట‌ర్, కౌన్సింగ్ సెంట‌ర్, టీం, యంత్రాంగం ఏమైనా పెట్టారా? మ‌ద్యం పాన నిషేదం చేయ‌డానికి జ‌గ‌న్ కు వ‌చ్చిన మంచి అవ‌కాశం దానినికూడా ఆయ‌న నీళ్ల పాలు చేశారు. మ‌ద్యం మ‌హామ్మారి వ‌ల‌న‌ ఆరెంజ్ జోన్ లో ఉన్న వైజాగ్ రెడ్ జోన్ లోకి వెళ్లింది. ఈ రోజు 13% మ‌ద్యం షాపులను నెలాక‌ర‌కు త‌గ్గిస్తామ‌ని చెబుతున్నారు. ప‌క్క రాష్ట్రాల్లో ఎక్క‌డా మ‌ద్యం షాపులు తెర‌వ‌లేదు. చుట్టు ప‌క్క రాష్ట్రాల నుంచి ఏపీకి మ‌ద్యం కొనుగోలు చేసేందుకు వ‌స్తున్నారు. గ‌తంలో రోజుకు రూ.300 కూలీ చేసి సంపాదించే వ్య‌క్తి రూ.100తో తాగి రూ.200 ఇంట్లో ఇచ్చేవారు. నేడు ఆ రూ.300 కాకుండా మ‌రో రూ.200 అప్పు చేస్తున్నారు. 5 ఏళ్ల‌ల్లో జే టాక్స్ రూపంలో రూ.25వేల కోట్లు వ‌సూలు చేయ‌డం అఫిషియ‌ల్ పిక్ పాకెటింగ్ కాదా? విద్యా దీవ‌న పేరుతో త‌ల్లుల ఖాతాలో డ‌బ్బులు వేశారు."

:ఆ త‌రువాత రోజునే మ‌ద్యం షాపులు ప్రారంభించారు. ఇంట్లో తండ్రి గొంతు త‌డి ప‌ధ‌కం కింద దానిని వాడుకున్నారు. జ‌నాల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఇస్తున్నాన‌ని చెప్పి మ‌రో చేత్తో మ‌ద్యం పేరుతో లాక్కుంటున్నారు. 16 నెల‌ల జైల్లో ఉన్న నేప‌ధ్యం ఇలాంటి ఆలోచ‌న‌లో పుట్టుకొస్తాయి. జ‌గ‌న్ కు ఇచ్చే స‌ల‌హాదారులు ఇదే త‌ర‌హాలో ఉన్నారు. 36 కంపెనీల ద్వారా 1300 మ‌ద్యం బ్రాండుల‌ను తీసుకువ‌చ్చారు. మ‌ద్య నిషేదం చేస్తాన‌ని హామీనిచ్చిన పెద్ద మ‌నుషులు అన్ని బ్రాండుల‌ను తీసుకురావాల్సిన అవ‌స‌రం ఏముంది? అన్ని కంపెనీల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏమోచ్చింది? మ‌ద్యం హుండీల్లో డ‌బ్బులు వేయ‌డానికి ప్ర‌జ‌లు బారులు తీరుతున్నారు. క‌ల్తీ మ‌ద్యం, నాటు సారా ఏరులై పారుతుంద‌ని స్పీక‌ర్ అన్నారు. నాటు సారా త‌యారుచేయడంలో జ‌గ‌న్ వాలెంట‌రీల‌కు తెలిసినంత‌గా ఎవ‌రికి తెలియ‌దు. గ్యాస్ స్టౌ మీద నాటు సారా త‌యారు చేయ‌డం వారికే కుదిరింది. 24వేల బెల్టు షాపుల కేసులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే న‌మోద‌య్యాయి. క‌ర్నూలు లో బెల్టు షాపుల‌కు ఎక్సైజ్ పోలీసులచేత మ‌ద్యం స‌రఫరా చేయించారు. జే టాక్స్ కోసం ఆఖ‌రికి పోలీసుల చేత త‌ప్పుడు ప‌నులు చేయించే దుస్థితికి జ‌గ‌న్ దిగ‌జారిపోయారు. లిక్క‌ర్ పెట్టెలో లెక్క‌లు కాదు కావాల్సింది నాటు సారా బ‌ట్టీలు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పాలి. మ‌ద్యం రేట్లు పెంచితే మ‌ద్యం తాగే వాళ్లు త‌గ్గుతార‌ని ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌కు నా సానుభూతి." అని అనిత అన్నారు.

మాజీ మంత్రి, టిడిపి నేత కె. ఎస్ . జవహర్ ప్రభుత్వం పై మండి పడ్డారు. "వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం రేట్లను విపరీతంగా పెంచేసింది. దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని భారీ ప్రకటన ఇచ్చి ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రభుత్వమే వ్యాపార సంస్థగా మారి అధికారుల చేత మద్యాన్ని అమ్మిస్తోంది. 75 శాతం రేట్లు పెంచితే మద్యం తాగరనడం హాస్యాస్పదం. లాక్ డౌన్ తో అందివచ్చిన అవకాశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జారవిడిచింది. వైసీపీ తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుంది. వ్యవసం బలహీతను నియంత్రించకుండా మద్యపాన నిషేదాన్ని ఎలా సాధ్యం? ఒక దళితుడిని ఎక్సైజ్ మంత్రిగా పెట్టి ప్రకటనలో అతని ఫోటో కూడా వేయలేదు. పేరుకే మంత్రి, అధికారం మాత్రం లేదు. నాణ్యత లేని మద్యాన్ని మార్కెట్ లోకి తెచ్చారు.జే ట్యాక్స్ పేరుతో సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు, ఐదేళ్లలో 25 వేల కోట్లు టార్గెట్ గా పెట్టుకుని దోచుకుంటున్నారు. నాశిరకం బ్రాండ్లతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలను బలితీసుకోవడానికే ఎల్జీ పాలిమర్స్ ను తెరిపించారు."

"బూతు పురాణం తప్పించి మంత్రులకు ఏమీ రాదని ప్రజలకు అర్దమైంది. బాధితులకు కోటి ఇచ్చారు సరే. కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు. క్విడ్ ప్రోకో ద్వారా మీకు ఎల్జీ కంపెనీ నుంచి వచ్చే వాటాలెంత? ముద్దాయిలతో ముచ్చట్లేంటి సీఎం గారికి? ఇంతటి విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మద్యపాన నిషేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందా లేదా? సారా నిషేద కమిటీలు ఎన్ని ఉన్నాయి? కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా లేదా? అదెక్కడ పనిచేస్తోంది? టీడీపీ హయాంలో డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాం. యూనివర్సిటీలకు నేను స్వయంగా తిరిగాను. ఈ ప్రభుత్వం సారా నియంత్రించలేదు., గంజాయి ధ్వంసం చేసే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. అనుకూలమైన పత్రికలకే ప్రటకనలు ఇస్తున్నారు."

"మూసివేసిన డిస్టరీలను ఈరోజు ఏ పేరుతో తెరిపించారు? నాశిరకం బ్రాండ్లను తీసకొచ్చారు. మీ బ్రాండ్లు నాణ్యమైనవి అయితే ఏపీలో తప్పించి మరెక్కడా దొరకడం లేదేంటి? ఇక్కడ ధరలు పెరగడంతో ప్రజలు తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటకలో నుంచి మద్యం తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడే హక్కు మంత్రులకు లేదు. కొడాలి నాని, నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి శాశ్వత రాజకీయ సమాధికి సిద్ధంగా ఉండాలి. టీడీపీ వేసిన కమిటీల్లో విద్యావంతులైన రామానాయుడు, చినరాజప్ప ఉన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీలో నిపుణులు ఉండాలని కూడా పాలకులకు తెలియడం లేదు. ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జగన్, బూతుల మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ది చెప్తారు. రాజకీయ శాశ్వత నిద్రకు మంత్రులు సిద్ధంగా ఉండాలి. మీలా బేవర్స్ బ్యాచ్ టీడీపీలో లేరు. విద్యావంతుల నాయకత్వాన్ని టీడీపీ ప్రోత్సహించింది. బ్రోకర్ పనులు, మాఫియాలు బాగా చేసేవారికే వైసీపీలో పదవులు ఇచ్చారు."

Advertisements

Latest Articles

Most Read