పాలకొల్లు నుంచి ఏలూరు వరకు తెదేపాఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ పై కలక్టర్ ఆఫీస్ కు బయలేదారు. రైతుల సమస్యలపై ఫోన్‌లో మాట్లాడదామంటే కలెక్టర్‌, ఎస్పీ, తదితర జిల్లా అధికారులు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలని పాలకొల్లు నుంచి సైకిల్​పై ఏలూరు వెళ్లి కలెక్టర్​కు వినతిపత్రం అందచేయనున్నట్లు తెలిపారు. ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. వారినుంచి స్పందన రాని కారణంగానే రైతుల కష్టాలను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించేందుకు సైకిల్‌పై ఏలూరు వెళ్తున్నట్లు చెప్పారు. ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతుల వ్యదను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి వెళ్తున్నట్టు చెప్పారు.

ఆయన మాట్లాడుతూ, "నా ఇంట్లో నా 4 గురు సభ్యులే నా కుటుంబం అనుకోవడం లేదు , నా నియోజక వర్గ ప్రజలు అందరు నా కుటుంబంగా భావిస్తున్నాను. సమస్యలపై మాట్లాదామంటే కలెక్టర్ , SP , వంటి జిల్లా అధికారులు కనీసం ఫోన్ లో అందుబాటులో ఉండటం లేదు. ప్రజా ప్రతినిధితో మాట్లాడం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు కలెక్టర్ , SP లకు ఎమున్నాయో నాకు తెలియడం లేదు. కలెక్టర్ , SP వంటి జిల్లా అధికారులు అందుబాటులోకి లేకపోవడంతోనే కరోనను ప్రక్కన పెట్టి ఏలూరు వెళ్లవలసి వస్తుంది. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి, ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతుల వ్యదను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి సైకిల్ పై వెళ్తున్నాను"

"ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. వ్యవసాయ రంగంలో మంత్రుల ప్రకటన ధరలకు క్షేత్ర స్థాయిలో ఉన్న ధరలకు పొంతనలేదు. ఆక్వా రైతులను ఆదుకునే విధంగా ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరికరణ నిధి నుండి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఆక్వా రైతులను ఆదుకోవడానికి ఒక కేజీ ఆక్వా ఉత్పత్తికి రు. 50 లు ప్రభుత్వం మద్దతు ధర అందించాలి. దాళ్వా పంటకు ఎకరాలకు 30 వేలు పెట్టుబడి పెట్టి సాగు నీరు లేక పంట కోల్పోయిన రైతులకు పెట్టుబడి నష్టం ప్రభుత్వం చెల్లించాలి. వరి, మిర్చి , పసుపు, బొప్పాయి, అరటి , ఇలా వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి" అంటూ ఆయన డిమాండ్ చేసారు. అయితే, రామానాయడుని పోలీసులు ఏలూరు వద్ద అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని చెప్పారు. అయితే వైసీపీ నేతలు హడావిడి చేస్తూ గుంపులు గుంపులుగా వెళ్తున్నారని, తాను ప్రజా సమస్యల పై, ఒక్కడినే, సైకిల్ మీద వెళ్తుంటే, ఎందుకు ఆపుతున్నారని, మీరు పెళ్ళాం బిడ్డలని వదిలేసి ఎలా ప్రజా సేవ చేస్తున్నారో, నేను కూడా నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం, వారి సమస్యల కోసమే, ఒక్కడినే, అదీ సైకిల్ పై వెళ్తున్నాని, రామానాయడు అన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా నిర్ధరణ అయింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. అత్యధికంగా ఇవాళ కర్నూలు జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో దిల్లీలోని సభకు హాజరై వచ్చినవారు, వారి సన్నిహితులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. అంతేకాకుండా వారి సంబంధీకులు ఆరుగురికి ఈ వైరస్ సోకింది. వీరితో పాటు వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మరో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్​గా తేలిందని హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు. మొత్తం బాధితుల్లో ఐదుగురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. ఇక మరణాల సంఖ్య కూడా మూడుకు చేరింది. విజయవాడ, హిందూపురం, మచిలీపట్టణంలో ఈ మరణాలు ఉన్నాయి.

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి గుంటూరులో లాక్ డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో 30 కేసులు నమోదు కాగా... వాటిలో 15 కేసులు గుంటూరు నగరంలోనే నమోదయ్యాయని తెలిపారు. రేపు ఉదయం నుంచి గుంటూరు మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించినట్లు ఆనంద్​ కుమార్ వెల్లడించారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి జీజీహెచ్​ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సిబ్బందికి మాస్కులు, గ్లౌజులను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. వైద్యసిబ్బందికి 2వేల పీపీఈ కిట్లను విజ్ఞాన్ సంస్థల తరపున జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడికి అందించారు.

గుంటూరులో లాక్ డౌన్​కు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులను తామే అందజేస్తామన్నపాలనాధికారి.. ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యసేవలన్నీ ఎస్మా చట్టం పరిధిలోకి వచ్చినందున ప్రైవేటు వైద్యసిబ్బంది సైతం సహకరించాలని ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అన్ని ఏర్పాట్లు చేశామని.. ఎవరూ దుష్ప్రచారం చేయవద్దని కోరారు. మరో పక్క, తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వైద్యులు రూ.3.35లక్షలను సీఎం సహాయనిధికి అందించారు. చెక్కు రూపంలో ఈ మొత్తాన్ని స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి అందజేశారు

కరోనా వైరస్ దేశంలో, రాష్ట్రంలో విజృంభిస్తూ.. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. ప్రజా ప్రతినిధులు మాత్రం రాజకీయానికే ప్రాధాన్యమిస్తున్నారు. పబ్లిసిటీ కోసం విపత్తులో ప్రారంభోత్సవాలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజాప్రతినిధుల పబ్లిసిటీ స్టంట్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ భయంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని ఇళ్లల్లో గడుపుతుంటే.. నేతలు మాత్రం తమ పబ్లిసిటీ పిచ్చితో చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉన్నాయి. కరోనా వైరసను ఎదుర్కొనేందుకుఅందరం ఇంట్లో ఉండాలి అంటూ, చేతులు ఎత్తి జగన్ దండం పెట్టి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ఇవేవీ తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిదుల తీరుపై జనం మండిపడుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుంటే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలు, సూచనలు చేస్తుంటే.. ప్రజాప్రతినిధులు మాత్రం వీటిని ఆచరించకపోవడం శోచనీయం.

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు పబ్లిసిటీ స్టంట్ల కోసం ప్రయత్నాలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని ఐసోలేషన్ వార్డులకు, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో అధికార యంత్రాంగానికి అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలను చేయడం పట్ల ప్రజానీకం మండిపడుతోంది. కొందరు ప్రజాప్రతినిధులు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లకు రిబ్బన్లు కట్టి మరీ ప్రారంభించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి. అలాగే పేదలకు ఇచ్చే వెయ్యి రూపాయలు కూడా, జగన్ ఇచ్చాడు, వచ్చే స్థానిక సంస్థల్లో మాకే ఓటు వెయ్యండి అంటూ, కొంత మంది అడుగుతూ ఉన్న వీడియోలో బయటకు వచ్చాయి.

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలే గుంపులు గుంపులుగా చేరి అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ రాష్ట్రంలో కోరలు చాపుతూ రోజురోజుకూ తీవ్రతను చూపుతున్న తరుణంలో మాస్కుల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వైకాపా నేతలు పార్టీ గుర్తుతో మాస్కులు తయారు చేసి, వాటిని పంపిణీ చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. పలు చోట్ల వైకాపా రంగులతో ముద్రించిన మాస్కులు కనిపిస్తున్నాయి. ఇలాంటి కనీవినీ ఎరుగని విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రజలను ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని, ముఖ్యమంత్రి చెబుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం అట్టహాసానికి పోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులే ఇష్టానుసారంగా లాక్ డౌన్లో బయట తిరుగుతున్నారని, అలాంటిది ప్రజలకు వారు ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్రంలో కరోనా మాటున, రాజకీయం చేస్తూ, మాకు ఓట్లు వెయ్యండి అని చేస్తూ, ప్రచారం చేసుకుంటున్న వైసీపీ తీరు, నిన్నటి నుంచి చూస్తున్నాం. కరోనా వల్ల పనుల లేక ఇంట్లో ఉంటున్న వారిని ఆదుకుంటానికి, తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, వెయ్యి రూపాయలు ఇస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4న వెయ్యి రూపాయలు ఇస్తాం అని చెప్పినట్టే, నిన్న కొంత మందికి డబ్బులు ఇచ్చారు. అయితే ఇక్కడ అనూహ్యంగా, వాలంటీర్లు లేక రెవిన్యూ సిబ్బంది కాకుండా, వైసీపీ ఎమ్మల్యేలు, స్థానిక సంస్థల్లో పోటీకి నుంచున్న వాళ్ళు వెళ్లి ఆ వెయ్యి పంచి, వచ్చే స్థానిక సంస్థల్లో వోటు వెయ్యండి, ఇవి జగన్ పంపించాడు అని చెప్పటంతో అందరూ అవాక్కయ్యారు. కరోనాలో ఈ కక్కుర్తి బుద్ధి ఏమిటి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇవన్నీ చూస్తున్న బీజేపీ, ఇక సహించం అంటూ, రియాక్ట్ అయ్యింది. మొన్న 5 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు కూడా, కేంద్రం ఇస్తే, తాము ఇచ్చినట్టు డబ్బా కొట్టుకున్నారని, ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడా అలాగే చేస్తున్నారని రియాక్ట్ అయ్యారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇవి కేంద్రం, రాష్ట్ర విపత్తుల సంస్థకు ఇచ్చిన నిధులు అంటూ, కొన్ని లెక్కలు చూపిస్తూ ట్వీట్ చేసారు. కరోనా వచ్చిన తరువాత, పంచాయతీలకు ఇచ్చే 14వ ఆర్ధిక సంఘం నిధులు : రూ.870 కోట్లు
, మునిసిపాలిటీలకు ఇచ్చే 14వ ఆర్ధిక సంఘం నిధులు : రూ.431 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద, 15వ ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు రూ.491.41 కోట్లు, విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద : రూ.559.50 కోట్లు, మొత్తంగా, 2,352 కోట్లు కేంద్రం ఇస్తే, అందులో నుంచి, 1300 కోట్లు , ఈ వెయ్యి రూపాయలు పంచి, డబ్బా కొడుతున్నారు అంటూ బీజేపీ ఆరోపించింది. మొత్తంగా, బియ్యం కేంద్రం, కందిపప్పు కేంద్రం, ప్రజలకు ఇచ్చే వెయ్యి రూపాయలు కేంద్రం, షెల్టర్లలో ఉండే వారికి అయ్యే ఖర్చు కేంద్రం, టెస్టింగ్ కిట్లు కేంద్రం, మందులు కేంద్రం, మెడికల్ కిట్లు కేంద్రం. మొత్తంగా, కరోనా పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2,352 కోట్లు ఇచ్చింది కేంద్రం అంటూ బీజేపీ ఆరోపించింది.

బీజేపీ చేస్తున్న ఆరోపణల పై వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి, బీజేపీ నేతలను ఏకి పడేసారు. చంద్రబాబు, పవన్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయి, బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ సొమ్మును పంచుతున్నామని అంటున్నారు, కాని, కోటి 33 లక్షల పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.1000 వాలంటీర్ల ద్వారా అందజేసింది. రూ.1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా ఓ వీడియో పెట్టారు. కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలి, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసింది, ఏపీతో పాటు 13 రాష్ట్రాలకు నిధులు విడుదలయ్యాయి, ఏపీకి ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు" అంటూ అంబటి బీజేపీ నేతల పై విరుచుకు పడ్డారు. మరి, ఇప్పుడు బీజేపీ ఏమి అంటుందో చూడాలి..

Advertisements

Latest Articles

Most Read