రాష్ట్రంలో కరోనా వైరస్​తో మరో వ్యక్తి మృతి చెందారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య నాలుగుకు పెరిగిందని తెలిపింది. కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు కేసుల సంఖ్య 304కు పెరిగినట్టు హెల్త్ బులెటిన్​లో స్పష్టం చేసింది. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ జిల్లాలో మొత్తం కేసులు సంఖ్య 33కు చేరినట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న ఆరుగురుని డిశ్చార్జి చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు 74 నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 42, కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 27, ప్రకాశం జిల్లాలో 24 , పశ్చిమ గోదావరి జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని బులెటిన్​లో పేర్కొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 3677 నమూనాలు పరీక్ష చేస్తే 3270 కేసులు నెగెటివ్​గా నిర్ధరణ అయ్యాయని.. మరో 104 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. అయితే, రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, అమరావతి నామ స్మరణ చేస్తూ, అమరావతి రైతులకు వ్యక్తిరేకంగా మరో అడుగు ముందుకు వేసింది. నేటి నుంచి రాజధాని గ్రామాల్లో ఆర్​-5 జోన్ పై సీఆర్డీఏ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటానికి ప్రయత్నం చేసారు. ఆర్-5 జోన్‌ పరిధిలోని రైతుల అభ్యంతరాలను తెలుసుకోవతనకి అని, ఉదయం 11 గంటల నుంచి 12 వరకు వీడియో కాన్ఫరెన్స్ చేపట్టలనుకున్నారు. అయితే అధికారుల తీరుపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే అభ్యంతరాలు స్వీకరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో R5 జోన్ పై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన సీఆర్డీఏ అధికారులను రైతులు అడ్డుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజాభిప్రాయం ఎలా చేపడతారని రైతులు ప్రశ్నించారు, లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చెయ్యటంతో, ఏపీ సి ఆర్ డి ఏ అధికారులు వెళ్ళిపోయారు. ఇక మరో పక్క, ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 112వ రోజూ కొనసాగాయి. తుళ్లూరు మండలం పెదపరిమి, మందడం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు సామాజిక దూరం పాటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. 3 ముక్కల రాజధాని వద్దంటూ నినాదాలు చేశారు. జగన్ అమరావతి తరలింపుపై పునరాలోచన చేయాలన్నారు.

కరోనా వచ్చిన దగ్గర నుంచి, అనేక ఫేక్ వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. చాలా మంది ప్రజలు అది నిజం అని నమ్ముతున్నారు కూడా. ముఖ్యంగా ఒక మతం పై, జరుగుతున్న విష ప్రచారం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే, అవన్నీ వివిధ సందర్భాల్లో, జరిగినవి. కాని అవి తీసుకొచ్చి, వారేదో కావాలని చేస్తున్నట్టు ప్రచారం చేసారు. చివరకు అవన్నీ ఫేక్ న్యూస్ లు అని తెలిసినా, ఆ మతాన్ని టార్గెట్ చేసుకున్న రాజకీయ పార్టీలకు, ఏమి కావాలో అది జరిగింది అనే చెప్పాలి. ఇక కరోనా పై అయితే, లెక్క లేని అన్ని ఫేక్ న్యూస్ లు వచ్చాయి. అవి తినాలి, ఇవి తినాలి, అలా చేస్తే కరోనా రాదు, ఇలా చేస్తే రాదు, కరోనాకి మందు దొరికింది, లేకపోతే కరోనాని ఒక దేశం కావాలని, అందరికీ అంటించింది అంటూ, ఇలా అనేక అనేక వార్తాలు, సోషల్ మీడియాలో తిరిగాయి. అయితే, జనాలు ఇంట్లో ఉండటం వల్లో ఏమో కాని, చాలా మంది ఇది నిజం అని నమ్మే పరిస్థితి వచ్చింది. అయితే నిన్నటి నుంచి తిరుగుతున్న మరో వార్త, ఏకంగా ముఖ్యమంత్రులనే బుట్టలో పడేసింది.

దేశ వ్యాప్తంగా, 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరో, వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుంది. ఈ నేపధ్యంలోనే, ఒక పక్క దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ ఉన్న సమయంలో, లాక్ డౌన్ ఎత్తేయాలా వద్దా అనే చర్చ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా,మోడీ ఈ విషయం పై మాట్లాడారు. అయితే కొంత మంది విడతల వారీగా లాక్ డౌన్ ఎత్తేయాలని, హాట్ స్పాట్ లు ఉన్న చోట కొనసాగించాలని కోరారు. ఈ నేపధ్యంలోనే, రెండు రోజులుగా ఒక వార్తా సోషల్ మీడియాలో తిరుగుతుంది. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ (బీసీజీ) ఒక నివేదిక విడుదల చేసింది అని, దాని ప్రకారం, సెప్టెంబర్ వరకు దేశంలో లాక్ డౌన్ ఉంటుంది అని రిపోర్ట్ చెప్తుంది.

ఇక అందరూ సోషల్ మీడియాలో ఇదే తిప్పటం మొదలు పెట్టారు. చివరకు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ రిపోర్ట్ గురించి చెప్తూ, ఇది ఒక పెద్ద గ్లోబల్ కంపెనీ అని, వారు అన్నీ పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ తయారు చేసారని, చెప్తూ, జూన్ వరకు లాక్ డౌన్ ఉంటే మంచిది అంటూ చెప్పుకొచ్చారు. అయితే, నిన్న రాత్రికి, ఇది బాగా వైరల్ అవ్వటంతో, బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ స్పందించింది. లాక్ డౌన్ పొడిగింపు ఇస్తూ మా సంస్థ పేరుతొ తిరుగుతున్న రిపోర్ట్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఇండియాలో లాక్ డౌన్ పొడిగింపు పై, తాము ఎలాంటి అంచనాలు వెలువరించలేదని స్పష్టం చేసింది. తమ పేరుతొ తిరుగుతున్న అలాంటి వార్తలు నమ్మవద్దు అంటూ ప్రకటన చేసింది.

కరోనా వైరస్ నియంత్రణకు దేశ ప్రధాని మోడీ పిలుపుతో యావత్ దేశం మొత్తం ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్లోకి వెళ్లి పోయింది. దీంతో లక్షాలాది రూపాయల ఖర్చుతో రైతులు పండించిన పంటలు చేతి కోచ్చే సమయానికి నేలపాలు అవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రైతు కూలీలకు అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేటుగా ఆదేశాలు వచ్చాయి. అయినా, బయటకు వచ్చే వారు లేదు. దీంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత పరిస్థితులల్లో రైతులు పంట పొలాల్లోకి వెళ్లి పరిస్థితి లేదు. ఒకవేళ అన్ని ఇబ్బందులను అధిగ మించి పొలాలకు వెళ్లినా, పండించిన పంటలను ట్రాక్టర్, ఇతర రవాణా వాహనాల ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చి వాటిని విక్రయించే పరిస్థితి లేదు. దీంతో రైతులు పండిన పంటను పొలాల్లోనే ఉంచడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో చేతి కొచ్చిన పంట మొత్తం దాదాపు నేలపాలవుతోంది. పంట దిగుడికోసం పెట్టిన లక్షాలాది రూపాయిల పెట్టుబడి మొత్తం వృధా అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

చివరికి రైతు పండించిన పంట నేలపాలు అవటంగాని, లేక సరైన గిట్టుబాటు - ధరలేక పోవటంతో రైతులు అప్పుల పాలవుతు న్నారు. ముఖ్యంగా పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపుతోపాటు సీజన్ పండ్లు అయిన మామిడి, సపోటా, కమలాలు, పుచ్చకాయలతో సహా అనేక రకాల పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా మామిడి, పుచ్చకాయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యకారణం లాక్ డౌన్లో ఎక్కడి రవణా ఆక్కడ స్తంభించిపోవడం. దేశంలోని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ఆలాగే రాష్ట్రాల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలు, నిత్యావసర సరకుల కోసం మాత్రమే ప్రజలు ఇంటి బయటకి వచ్చి నిర్ణీత సమయంలో వాటిని కొనుగోలు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లి పోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

రైతులు పండించిన పంటను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన, నిత్యవసరాలైన కూరగాయలు, పండ్లులను మార్కెట్లోకి రైతులు తీసుకోచ్చెటప్పుడు వారికి ఏవిధమైన ఆటంకాలు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే ప్రభుత్వమే , ఈ పండ్లు, కూరగాయలు కొని, ప్రజల వద్దకే మొబైల్ రైతు బజార్లు పెట్టి అమ్మాలని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే మిగతా పంటలకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరారు. నిత్యవసరాలైన పూలు, పండ్లు, కూరగాయ లతోపాటు సీజనల్ పండ్లు పండించే రైతులకు కూడా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే నష్టం జరిగిపోయింది అని, ఇప్పటికైనా మేల్కొని, ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కోరుతున్నారు.

మరో సారి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, విచ్చల విడిగా రెచ్చిపోతున్న అధికార పార్టీకి, అదిరిపోయే జర్క్ ఇచ్చారు. ఇప్పటికే నామినేషన్ల సమయంలో, వైసీపీ చేసిన అరాచకం గురించి, దాని పై ఎన్నికల కమీషనర్ స్పందించిన తీరు తెలిసిందే. అలాగే, కరోనా మహమ్మారి భారీగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో, ఎన్నికలు పెట్టటం సరి కాదని, ఎన్నికలు వాయిదా వేసి, 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడిన దేవుడిగా, నిమ్మగడ్డను ప్రసంసిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పై, జగన్ మోహన్ రెడ్డి అండ్ కో, కుల ముద్ర వేసి విచక్షణ లేకుండా, మాట్లాడిన తీరు అందరికీ తెలిసిందే. చివరకు సుప్రీం కోర్ట్ కూడా, రమేష్ కుమార్ నిర్ణయానికి జై కొట్టింది. అయితే, కరోనా సహాయం పేరుతొ, ఇంటింటికీ వెయ్యి రూపాయాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్ధులు, వారే ప్రతి ఇల్లు తిరిగి, వెయ్యి రూపాయలు పంచుతూ, చివరికీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి పంచుతూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యండి అని చెప్పిన వీడియోలు నెట్ లో తిరిగాయి. దీని పై ఫిర్యాదు చెయ్యటంతో, ఈ రోజు ఈసీ స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో స్వయంసేవకులతో కూడి ఆర్ధిక ప్రయోజనం అందజేయడం , స్వప్రయోజనాల కై ప్రజల మద్దతు కోరడం వంటివి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం. రమేష్ కుమార్ అన్నారు. ఈ విషయం పై బిజిపి అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, 13 జిల్లాల జిల్లా ఎన్నికల పరిశీలకులు / జిల్లా కలెక్టర్లు లకు సోమవారం లేఖ వ్రాయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాల చేకూర్చే పంపిణీ కొత్త పథకం ఎన్నికల ఉల్లంఘన కింద రాదని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, ఈ సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియ చేస్తున్నామన్నారు.

పోటీ చేసే అభ్యర్థులు వారి స్వయ ప్రయోజనం కోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లు ను ప్రభావితం చెయ్యడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున అటువంటి సంఘటన పై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని రావాలన్నారు. సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్. రమేష్ కుమార్ వారి లేఖలో పేర్కొన్నారు. మరి ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు కూడా, ఆయనకు కులం అంట గుడుతూ, జగన్ వచ్చి ప్రెస్ మీట్ పెడతారో, లేక తమ పార్టీ వారితో, ఇది వరకు పెట్టించినట్టు, 70 ప్రెస్ మీట్లు పెట్టి, ఆయన్ను తిట్టిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read