రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రమవుతోన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులన్నింటిని ఎస్మా (ఎసెన్షియల్ సర్వీస్ మెయిన్టనెన్స్ ఆక్ట్ -1977) పరిధిలోకి తీసుకొస్తూ శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులను జారీచేసింది. దీని ప్రకారం ప్రజలకు వైద్యసేవలు, ఇతర సదుపాయాలు అందించేందుకు నిరాకరించినా, పనిచేయటానికి ఆసక్తి కనబర్చకపోయినా వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆరు నెలల పాటు ఈ చట్టం రాష్ట్రం అమలులో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని వైద్యసేవలు, డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది (మెడికల్), మందుల కొనుగోలు, నిర్వ హణ, రవాణా, అమ్మకం, మందుల తయారీ, ఆంబులెన్స సర్వీసులు, మంచినీరు, విద్యుత్ సరఫరా, రక్షణ-భద్రతపరమైన అంశాలు, ఆహారం, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ సేవలన్నీ శుక్రవారం సాయంత్రం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టం చేసింది.

అయితే ఇది ఇలా ఉంటే, కొంత మంది డాక్టర్లు, ప్రభుత్వ ఉత్తర్వులు స్వాగిస్తూనే, తాము ప్రజలకు సేవ చేయటానికి ఎప్పుడూ రెడీగానే ఉంటామని, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే నడుచుకుంటామని అంటున్నారు. అయితే ఇదే సందర్భంలో, కనీసం సేఫ్టీ కిట్లు, మాస్కులు, లాంటివి, విరివిగా సప్లై చెయ్యాలని, అలాగే తమ పై దాడులు జరగకుండా, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అంటున్నారు. మరో పక్క, ఇదే విషయం పై, పతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఆయుధం లేకుండా, యుద్ధం చెయ్యమంటారా అంటూ, పవన్ కళ్యాణ్, డాక్టర్లకు కిట్లు లేకపోవటం పై ప్రశ్నించారు. అలాగే, ఈ డాక్టర్లుకి కూడా కావాల్సిన మాస్కులు, ప్రొటెక్షన్ కిట్ లు ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రజల్ని ఆర్థిక సాయం అడుగుతున్నారు అంటే, ఎంత దౌర్భాగ్యమో అంటూ, తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఈ విమర్శలు నడుమ, ప్రభుత్వం, వైద్య సిబ్బంది పై, ఎస్మా ప్రయోగించింది.

ఇది ఇలా ఉంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కు చేరింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల నుంచి శనివారం ఉదయం 10 వరకు కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 23కు చేరాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 4కు చేరాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ ఒక్కో కరోనా కేసు నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎక్కడా లేని వింత పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు, స్కూల్స్, పంచాయతీ ఆఫీసులు అంటే, ఆ ఊరిలో ప్రజలందరూ, అక్కడకు వెళ్లి పనులు చేసుకుంటారు. అంతే కాని, ఏదో ఒక పార్టీ వారే అక్కడకు వెళ్లారు. అయితే, 2019 జూన్ లో , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు, వైసీపీ జెండా రంగులు పోలిన, రంగులు వెయ్యాలి అంటూ, ఆదేశాలు వచ్చాయి. ఇక ఆదేశాలు వచ్చిందే తరువు, ప్రభుత్వాధినేతల ద్రుష్టిలో పడటానీకో, లేక నిజంగానే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందో కాని, ఆ రోజు నుంచి రాష్ట్రం మొత్తం, వైసీపీ రంగులతో నింపటం మొదలు పెట్టారు. పంచాయతీ ఆఫీస్ లకు వైసీపీ రంగులు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, వాటర్ ట్యాంకులకు వైసీపీ రంగులు, ప్రభుత్వ స్కూల్స్ కి వైసీపీ రంగులు, ఆకులకు వైసీపీ రంగులు, కరంటు స్థంబాలకు వైసీపీ రంగులు, గేద కొమ్ములకు వైసీపీ రంగులు, ఇలా కనిపించిన ప్రతి దానికి, వైసీపీ రంగులతో మొత్తం నింపేశారు.

చివరకు ఒక చోట, జాతీయ జెండా రంగులు కూడా మార్చేసి, వైసీపీ రంగులు పుసేసారు. సహజంగా, ఇవి చూస్తే ఎవరికైనా విరక్తి పుడుతుంది. ఇలా విరక్తి పుట్టే, ఒకరు హైకోర్ట్ కు వెళ్లారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, 1300 కోట్లు ఖర్చు పెట్టి, ఈ రంగులు వేసారని ఆరోపించింది. అయితే ఈ విషయం హైకోర్ట్ కు చేరటంతో, హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో, అది వైసీపీ రంగు కాదని, ప్రభుత్వ తరుపు లాయర్ చెప్పటంతో, వైసీపీ జెండా కోర్ట్ కు తీసుకురండి, అని కూడా చెప్పింది. ఆ రంగులు ఏంటి, ప్రభుత్వ భవనాల ముందు, ఆ ఫోటో ఏమిటి, మేము కూడా సుప్రీం కోర్ట్ బయట, చీఫ్ జస్టిస్ ఫోటో పెట్టుకోమా అంటూ, ప్రశ్నించింది. చివరకు, హైకోర్ట్ తీవ్రంగా స్పందిస్తూ, 10 రోజుల్లోగా, రాష్ట్రంలో రంగులు అన్నీ మార్చాలని ఆదేశించింది.

బాధ్యతను చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పింది. అయితే, అనూహ్యంగా, ప్రభుత్వం ఈ విషయం పై కూడా సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. సహజంగానే, సుప్రీం కోర్ట్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. దీంతో, ఇక చేసేది లేక, ఇప్పుడు ప్రభుత్వం, మళ్ళీ రంగుల పంచాయతీ మొదలు పెట్టింది. హైకోర్ట్ చెప్పినట్టు, రంగుల మార్చాలి కాబట్టి, ఏ రంగులు వెయ్యాలి అనే విషయం పై, ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారం రోజులల్లో, ఏ రంగులు వెయ్యాలో, నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వానికి సూచించాలని వారిని కోరింది. ఈ కమిటీలో భూపరిపాలనాశాఖ కమిషనర్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శిని సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రంగుల పంచాయతీ మొదలు కావటంతో, మళ్ళీ ఎన్ని వందల కోట్లు నష్టపోతామా అని, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

రాష్ట్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. కరోనా మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో సోమవారం మృతి చెందినట్లు ప్రకటించింది. మార్చి 30న ఉదయం 11.30 గం.కు వ్యక్తి చెకప్‌కు వచ్చారన్న ప్రభుత్వం.. గంట వ్యవధిలో మ. 12.30 గం.కు చనిపోయారని తెలిపింది. మృతి చెందిన వ్యక్తి కుమారుడు మార్చి 17న దిల్లీ నుంచి వచ్చారన్న ప్రభుత్వం, మార్చి 31వ తేదీన కుమారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యిందని ప్రకటించింది. కుమారుడి నుంచి తండ్రికి వైరస్‌ సోకిందని ప్రభుత్వం భావిస్తుంది. వీరితో కాంటాక్ట్‌ అయిన 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 161కి చేరాయి. ఇవాళ కొత్తగా 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​ పేర్కొంది. నెల్లూరులో ఇవాళ కొత్తగా 8 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం కొవిడ్ 19 కేసులు 32కి చేరాయి.

కడపలో ఇవాళ కొత్తగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కడప జిల్లాలో ఇప్పటివరకు 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఇవాళ కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులతో..మొత్తం కేసుల సంఖ్య 14కి చేరింది. మరో పక్క, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో కరోనా నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స, మోపిదేవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక మరో పక్క, రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ తీసుకునే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ రేషన్‌తోపాటు నిత్యావసరాలు, కూరగాయలు అందుబాటులో ఉండేలన్నదే ముఖ్యమంత్రి నిర్ణయంగా చెప్పారు. లబ్ధిదారులందరికీ రూ. 1000 ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్న మంత్రి... ఇందులో 140 మంది దిల్లీ నుంచి వచ్చిన వారేనని తెలిపారు. మిగిలిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారని వివరించారు. దిల్లీకి వెళ్లిన 1081 మందిలో 946 మంది రాష్ట్రంలో ఉన్నారని... మిగిలిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని స్పష్టం చేశారు. 881 మందిని గుర్తించి నమూనాలు పరీక్షకు పంపామని...108 మందికి కరోనా సోకినట్టుగా తేలిందని వివరించారు.

కోవిడ్ 19 మరణాలకు సంబంధించి చైనా వెల్లడిస్తున్న సంఖ్యను ప్రపంచం నమ్మడం లేదు. చైనా మృతుల సంఖ్యకు సంబంధించి వాస్తవాల్ని దాచిపెడుతోందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో గత మూడుమాసాల్లో పెద్ద సంఖ్యలో మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్ల వినియోగం నిల్చిపోయింది. 2019 డిసెంబర్ తో పోలిస్తే 2020 జనవరి నాటికి 2.10 కోట్లకుపైగా మొబైల్ ఫోన్లు ఆగిపోయాయి. 8.40లక్షల ల్యాండ్ లైన్ కనెక్షన్లు రద్దయ్యాయి. ఇది చైనాలో అత్యధిక మరణాల సంఖ్యను సూచిస్తున్నట్లు సందేహిస్తున్నారు. చైనాలో డిజిటలైజేషన్ స్థాయి చాలా ఎక్కువ. ప్రజలు సెల్ ఫోన్ లేకుండా జీవించలేరు. పింఛన్లు, సామాజిక భద్రతా పధకాలో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి మొబైల్ ఫోన్లో అనుసంధానమౌతుంది. ఆఖరకు షాపింగ్ నుంచి రైలు, బస్సు టికెట్ల కొనుగోలు వరకు అన్నింటికి చైనీయులు మొబైల్ ఫోన్లను వినియోగిస్తారు. అక్కడి ప్రజల రోజు వారి వ్యవహారాల్లో మొబైల్ ఫోన్ ఒక కీలకాంశం. చైనా ప్రభుత్వం కూడా మొబైల్ ఆధారిత సేవలకే ప్రాధాన్యతనిస్తోంది.

అక్కడి ప్రజలంతా ఆరోగ్య కోడ్ను మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేయాలి. ఆఖరకు మృతి చెందిన సందర్భాల్లో కూడా మృతదేహతరలింపునకు గ్రీన్ హెల్త్ కోడ్ ఆధారంగానే ప్రభుత్వం అనుమతిస్తుంది. అలాంటి చైనాలో ఎవరూ తమంతతాముగా సెల్‌ఫోన్లను రద్దు చేసుకోరు. అందుకెవరూ సాహసించరు. మరణం సంభవించిన సమయంలోనే మొబైల్ ఫోన్ల రద్దుకు ఆస్కారముంటుంది. కానీ గత మూడుమాసాల్లో చైనాలో మొబైల్, ల్యాండ్ ఫోన్ల వినియోగం, రద్దు అనూహ్యంగా పడిపోయింది. 2019 నవంబర్ నాటికి చైనాలో మొత్తం 160,09,57,000 మొబైల్ ఫోన్లు వినియోగంలో ఉండేవి. మార్చి 2020 చివరి నాటికి 157,99,27,000లకు పడిపోయాయి. అంటే 2,10,30,000 మొబైల్ కనెక్షన్లు తగ్గిపోయాయి.నవంబర్ 2019 నాటికి చైనా లో మొత్తం 19,08,30,000ల్యాండ్ లైన్ ఫోన్లుండేవి. మార్చి 2020 చివరినాటికివి 18,99,90,000 లకు పడిపోయాయి.

ఈ నాలుగుమాసాల్లో వీటి సంఖ్య 8.40లక్షలు తగ్గిపో యాయి. చైనాలో అతిపెద్ద మొబైల్ కనెక్షన్‌దార్లు చైనా మొబై ల్, చైనా టెలికామ్ కనెక్షన్లు అనూహ్యంగా పడిపోయాయి. చైనా మొబైల్ ఇది చైనాలో అతిపెద్ద సెల్ నెట్వర్క్ దేశంలోని మొత్తం కనెక్షన్లలో 60శాతం దీనివే. 2019 డిసెంబర్ లో ఈ కంపెనీకి కొత్తగా 37లక్షల ఖతాలు జతయ్యా యి. జనవరి 2020లో 8.62లక్షల ఖాతాలు తగ్గిపోయాయి. ఫిబ్రవరి 2020లో 72లక్షల ఖతాలు రద్దయ్యా యి. మార్చిలో 88లక్షల ఖాతాలు నిల్చిపోయాయి. చైనా టెలికామ్ చైనాలో ఇది రెండో అతిపెద్ద టెలికామ్ నెట్ వర్క్. మొత్తం మార్కెట్లో దీనివాటా 21శాతం. డిసెంబర్ 2019లో ఈ నెట్వ ర్క్ కు కొత్తగా 11.80లక్షల ఖాతాలొచ్చా యి. జనవరి 2020లో 4.30లక్షల ఖాతాల్ని కోల్పోయింది. ఫిబ్రవరి 2020లో 56లక్షల ఖాతాలు తగ్గిపోయాయి. మార్చి 2020లో 71లక్షల ఖాతాల్నిది కోల్పోయింది. చైనాలో ఒక వ్యక్తి తన సెల్ ఫోన్‌ను రద్దు చేయడం అసాధ్యం. కానీ అనూహ్య సంఘటనల నేపధ్యంలోనే ఇలాంటి రద్దులు జరుగుతుంటాయి. చైనా మొబైల్ నెట్ వర్క్ సంస్థలు ప్రకటించిన తాజా సంఖ్యలు ఆదేశంలో కోవిడ్ 19 మరణాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దిష్ట సమాచారన్ని ప్రపంచానికందిం చడం లేదన్న సందేహాల్ని బలపరుస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read