ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అయుదు ఎదురు దెబ్బలు తగిలాయి. మొదటిది, గ్రామ సచివాలయ భవనాలకు రంగులు మార్చాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. రంగులు మార్చాలన్న హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకొంటారా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

రెండోది... విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పేదల ఇళ్ల పట్టాల కోసం 6 వేల ఎకరాలకు పైగా భూసమీకరణ సంబంధించి ప్రభుత్వం జీవో 72 జారీ చేసింది. మూడోది... రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఆవల నందకిషోర్.... కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇంద్రనీల్... సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించాల్సి ఉందన్నారు. ఆ పని చేయకుండా ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 107 జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే కేసులో, నాలుగోది... అమరావతి లో పేదల అసైన్డ్ భూములను భూ పంపిణీ కి తీసుకోవడానికి వీలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయిదోది.... కరోనా వైరస్.. లోక్​​సభ కార్యకలాపాలపై ప్రభావం చూపింది. మరో రెండు వారాలపాటు సాగాల్సిన లోక్​సభను షెడ్యూల్​ కంటే ముందే నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ సమావేశాల్లో, మండలి రద్దు బిల్లు వస్తుందని జగన్ చాలా ఆశపడ్డారు.

ఒక పక్క ప్రపంచం, దేశం, పక్క రాష్ట్రాలు కరోనా పై అప్రమత్తం అయ్యి, లాక్ అవుట్ చేసి, యుద్ధం చేస్తున్నాయి. మరి మన ప్రభుత్వం ? సరిగ్గా వారం కిందటి దాకా, ఎన్నికల కమీషనర్ కులం పై గోల గోల చేసారు. ఆదివారం నుంచి, గురువారం, శుక్రవారం దాకా, సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చే దాకా, ఎన్నికల కమీషనర్ కులం కులం అంటూ, గోల గోల చేసారు. దాదాపుగా, 70 పైన ప్రెస్ మీట్లు పెట్టారు. చివరకు, కోర్ట్ కొట్టేయటంతో, అప్పుడు కరోనా మీదకు డైవర్ట్ అయ్యారు. అప్పటి దాకా, జగన్ కు ప్రయారటీ ఎన్నికలు, ఈసీ కులం. దేశం మొత్తం కరోనా మీద ఉంటే, మనం అక్కడే ఆగిపోయాం. అయితే, గత రెండు రోజులుగా, పక్క రాష్ట్రాలు, కేంద్రం లాక్ డౌన్ ప్రకటించటంతో, ఇక తప్పక మనం కూడా అదే చెయ్యాల్సి వచ్చింది. జగనే ఈ ముక్క నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. సరే, ఇప్పటికైనా, కరోనా మీద ఏపి ప్రభుత్వం సీరియస్ అయ్యింది, అని అనుకున్న టైంలో, మరొక్కసారి రాజకీయాలు మొదలు పెట్టరు జగన్. కరోనా వస్తే, సరైన హెల్త్ ఫెసిలిటీస్ లేవు.

సరైన హాస్పిటల్స్, బెడ్స్, వెంటిలేటర్స్, టెస్టింగ్ సెంటర్స్, ఇలా ఏమి లేవు. అయినా వీటి మీద మన ప్రభుత్వానికి దృష్టి లేదు. ఎంత సేపు చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు. ఇప్పుడు ఆ చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవటానికి, మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే అమరావతిలో ఏదో జరిగిపోయింది అంటూ, మంత్రుల కమిటీ, సిట్, సిఐడి వేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సిబిఐ ఎంక్వయిరీ వేస్తూ, జీవో ఇచ్చారు. అమరావతి రాజధాని పరిధిలో భూముల అవకతవకలు జరిగాయని, సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొందరు భూములను కొనుగోలు చేసిన వ్యవహారంపై మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ కేసులో సీఐడీ.. ఐపీసీ సెక్షన్లు 420, 506ల కింద కేసు నమోదు చేసినట్టు ప్రభుత్వం తెలియచేసింది. ప్రస్తుతం వీటన్నిటిపైనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్టు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సబ్ కమిటీ ఏమి అయ్యింది, సిట్ ఏమైందో, సిఐడి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు సిబిఐ అంటున్నారు. సరే, సిబిఐ ఎంక్వయిరీ జరిగితే, చంద్రబాబుకి ఎలాగూ క్లీన్ చిట్ వస్తుంది, అది రాజకీయంగా ఆయనకే ఉపయోగ పడుతుంది. కాని, ఇక్కడ విషయం, ఇప్పుడున్న పరిస్థితిలో అంత హడావిడిగా సిబిఐ విచారణకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? తన బాబాయ్ కేసు సిబిఐ విచారణకు ఇచ్చారు కాబట్టి, ఇది కూడా ఇవ్వటానికి తప్ప, కోరనా పై శ్రద్ధ పెట్టి, ఆ గోల అయిన తరువాత, ఈ రాజకీయాలు చేసుకోవచ్చు కదా అని ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన. సరే, చూద్దాం సబ్ కమిటీ, సిఐడి, సిట్, పట్టుకోలేనిది, సిబిఐ పట్టుకుంటుంది ఏమో.

దేశంతో పాటు, రాష్ట్రంలో కూడా, రాష్ట్రంలో కరోనా మహమ్మరి విస్తరిస్తున్న పరిస్థితి. శనివారం మూడు కేసులు ఉన్న ఏపిలో, ఈ రోజు ఆరు కేసులు వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు లాగే, . ఈ నెల 31 వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ అమలుకు ఆదేశాలు ఇచ్చింది. ప్రజా రవాణా ఆగిపోయింది. నిత్యావసరం కాని దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, గోదాములు వంటివి అవసరమైతే.. పరిమిత సిబ్బందితో పనిచేయాలని సూచించారు. మందిరాలు, మసీదులు, చర్చిల్లోనూ 31వ తేదీ వరకు దర్శనాలు, ప్రార్థనలు నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రజలు కొన్ని రోజుల పాటు ఇళ్లలోనే ఉండటం ద్వారానే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పది మంది కంటే ఎక్కువ గుమికూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్లు, జేసీలు,ఆర్డీవోలు,ఎమ్మార్వోలు, వైద్యఆరోగ్య సిబ్బంది, పోలీసులు, విద్యుత్‌ శాఖ, మున్సిపల్ సిబ్బంది, బ్యాంకులు, ఏటీఎంలు, ఫార్మసీ దుకాణాలు, మీడియా సిబ్బందికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అత్యవసర విధులు నిర్వహించేవారు మాత్రమే హాజరవ్వాలని సూచించారు. తప్పనిసరిగా ఉత్పత్తి కొనసాగించాల్సిన పరిశ్రమలు.. ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. వ్యవసాయ పనులపై ఉన్న రైతులు, కూలీలకు మినహాయింపునిచ్చారు. లాక్ డౌన్ ఆదేశాలు, ఎవరైనా ఉల్లంఘిస్తే, అలాంటి వారిపై ఐపీసీ 188 ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

అయితే సరిగ్గా వారం క్రిండటం, పరిస్థితి వేరు. అన్నీ అనుకునట్టు జరిగితే, ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగేవి. కాని, ముందు చూపుతో, కరోనా విస్తరిస్తుంది అని తెలుసుకుని, కేంద్రం సూచనలతో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్, ఎన్నికలు వాయిదా వేసారు. అయితే జగన్, ఆయన మంత్రులు, రమేష్ కుమార్ కు కులం ఆపాదించింది, ఎన్నికలు జరగాల్సిందే అంటూ సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. అయితే సుప్రీం కోర్ట్ లో కొట్టేసారు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందొ చూస్తున్నాం. మొత్తం దేశం లాక్ డౌన్ అయ్యింది. మూర్ఖంగా, ఈ రోజు ఎన్నికలకు వెళ్లి ఉంటే ? ఎంతటి విధ్వంసం జరిగేది ? ఆయన కనుక వాయిదా వేయకపోతే, తెలుగు నెల ఇంకో ఇటలీ అయియ్యేది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం సరిగ్గా స్పందించటం లేదు అనే వాదన ఉంది, ఒక వేళ ఎన్నికలు జరిగి ఉంటే ? దేశం కాదు, ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా జగన్ పై విమర్శలు చేసావారు. ప్రజలు కూడా సహకారం ఇచ్చే వారు కాదు. ఇవన్నీ చూస్తుంటే, రమేష్ కుమార్ గారు ఎన్నికలు వాయిదా వేసి, జగన్ మోహన్ రెడ్డికి ఎంతో మంచి చేసారని, విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన్ను తిట్టకుండా, ఈ రోజు ఏమి జరగనందుకు, థాంక్స్ చెప్పాలని అంటున్నారు.

గౌ. జగన్మోహన్ రెడ్డిగారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి.
విషయం: కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు-ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవడం గురించి...

కరోనా మహమ్మారి తీవ్రతతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయి. వేలాదిమంది మృతి చెందడం, లక్షలాదిమంది వ్యాధి బారిన పడటం కనీవినీ ఎరుగని పరిణామం. ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లో రోజుకు వందలాదిమంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఏదైనా విపత్తు సంభవించినా ఏవో కొన్ని జిల్లాలకో, ఏదో ఒక రాష్ట్రానికో నష్టంచేసేవి. కానీ కరోనా మహమ్మారి మాత్రం యావత్ ప్రపంచానికే పెను విపత్తుగా పరిణమించింది.
మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిద్- 19 వైరస్ ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తోంది. ప్రాణాంతకంగా మారిన ఈ కరోనా వైరస్ ను ఏవిధంగా నియంత్రించాలనే దానిపై ప్రధాని శ్రీ నరేంద్రమోది నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అనేక మార్గదర్శకాలు ఇచ్చింది. విదేశాలనుంచి వచ్చేవారికి క్వారంటైన్ చేయడం, ఐసొలేషన్ లో పెట్టడం, స్థానికంగా ఈ వైరస్ ఎవరికీ సోకకుండా నిరోధించడం పైనే, ప్రభుత్వాలు పెద్దఎత్తున దృష్టి పెట్టాల్సివుంది. కేవలం లాక్ డౌన్ చేయడంతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని, దానితో పాటుగా, పెద్దఎత్తున ప్రజారోగ్య చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య ఇప్పటికే సూచించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మనరాష్ట్రంలో కూడా కరోనా వ్యాధి నిరోధక చర్యలు త్వరితగతిన చేపట్టాలి.

విదేశాలనుంచి దాదాపు 15వేల మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇప్పటికే చేరినట్లుగా తెలుస్తోంది. వాళ్లందరికీ క్వారంటైన్ కట్టుదిట్టంగా చేయాలి, పకడ్బందీగా ఐసొలేషన్ నిర్వహించాలి. ఆసుపత్రులలో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులతో సరిపెట్టకుండా, కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లో, వార్డులలో పారిశుద్య చర్యలు చేపట్టాలి, పరిసరాలను పరిశుభ్రం చేయాలి. ముందు జాగ్రత్త చర్యలపై అన్నివర్గాల ప్రజల్లో అవగాహన పెంచాలి. పరిశుభ్రత ప్రాధాన్యతపై అందరినీ చైతన్య పరచాలి. లాక్ డౌన్ చేయడం కోట్లాది ప్రజలపై ప్రభావం చూపడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఉపాధికి గండిపడింది. ఇంట్లోనుంచి బైటకు రాకపోవడం వల్ల అటు ఉపాధిని కోల్పోయి, ఇటు రోజువారీ ఆదాయంలేక రెండిందాలా నష్ట పోయారు. రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికుల కుటుంబాల జీవనం దుర్భరం అయ్యింది. విపత్తులు సంభవించినప్పుడు బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత.

ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా రేషన్ (బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు) ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడంతో పాటు, ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు నగదు తక్షణమే, ఏమాత్రం జాప్యం చేయకుండా అందజేసి ఈ విపత్కర సమయంలో వారిని ఆదుకోవాలని కోరుతున్నాం. బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు పెరిగిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కూరగాయల ధరలు 300% పెరిగినట్లుగా మీడియాలో చూస్తున్నాం. కాబట్టి రైతు బజార్లలో చౌక ధరలకు కూరగాయలు అందుబాటులో ఉండేలా చూడాలి. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలి. దళారుల బెడదకు అడ్డుకట్ట వేయాలి. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్యం- పరిశుభ్రతపై ప్రధాన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

నారా చంద్రబాబు నాయుడు
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత

Advertisements

Latest Articles

Most Read