రైతు బజార్ల వద్ద నిబంధనలు అమలుకావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అసహనం వ్యక్తం చేశారు. లాక్​డౌన్ లక్ష్యం నెరవేరడం లేదని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. రైతు బజార్లకు ప్రజలు ఒకేసారి వస్తున్నారని, అందుకే వాటిని వికేంద్రీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో ఇళ్లకు 3 కిలోమీటర్లలోపు రైతు బజార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్యావసర షాపులు ఉదయం 6 నుంచి 1 గంట వరకే తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వల్ల ప్రజలు గుమిగూడకుండా ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

నిత్యావసర ధరలు పెరగడం, బ్లాక్ మార్కెటింగ్ నివారణకు 1902 టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు. ఈ నంబర్​కి ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక వాహనంపై ఒకరు మాత్రమే వెళ్లాలని, నిత్యావసర సరకుల రవాణాకు అవసరమైన హమాలీలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొన్ని ఇబ్బందులున్నా నిబంధనలను పాటించాలని మంత్రి కోరారు.

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా దెబ్బకు తల పండిన శాస్త్రవేత్తలు కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టలేని పరిస్థితుల్లో ఇక అందరికీ ఆ దేవుడే దిక్కయ్యాడు. ఎవరో ఒక రూపంలో దేవుడు విరుగుడు మందును కనిపెట్టి, పంపిస్తే తప్పా, కరోనా బారి నుండి బయట పడే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ముందు చూపుతో తీసుకుంటున్న జనతా కర్ఫ్యూ , లాక్ డౌన్ వంటి కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా మేలు చేసేవే. అయితే ఇటువంటి ముందస్తు నిర్ణయాలు మంచిదే అయినప్పటికీ బడుగులకు మాత్రం చీకటి రోజులే. రెక్కాడితే కానీ డొక్కా డనీ దినసరి కూలీలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో నిత్యం రోజువారీ కూలీపనులు చేసే వారితో పాటు రిక్షా, ఆటో కార్మికులు, వివిధ వ్యాపార సంస్థల్లో అనుబంధ కార్మికులుగా సుమారు 80 లక్షల మంది పని చేస్తున్నారు. వారంతా రోజువారీ, వారంతపు కూలీ సొమ్ముపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారే.

వారంలో ఒకటి రెండు రోజులు కూలీ పనులు దొరక్కపోయినా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు లక్షల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు వారాలు లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలెవ్వరూ రోడ్ల మీదకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆయా సంస్థలు ఇంటి నుంచే విధులు నిర్వహించుకునేలా అవకాశం ఇచ్చింది. అయితే రోజువారీ కూలీలకు మాత్రం ఎటువంటి ఆర్థిక వెసులుబాటు లేకపోవటం, పని చేస్తే కాని పూటగడవని ఆ నిరుపేద బడుగుల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. చిరు వ్యాపారులకు.. చీకటి రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులు లక్షల్లో ఉన్నారు.

ప్రతి జిల్లాలోనూ లక్ష నుంచి రెండు లక్షల వరకు రోడ్డు మార్జిన్, హాకర్స్, వీధి చివర్లో ప్రజలకు అందు బాటులో వివిధ రకాల చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వ్యాపారులు న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదివారం నుంచి లాక్ డౌన్ ప్రకటించటంతో వీరంతా వ్యాపారాలకు దూరమై, ఇళ్లకే పరిమితం కావాల్సివచ్చింది. తమ వద్ద ఉన్న కొద్దీ గొప్ప సొమ్ముతో పెట్టుబడి పెట్టి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసి, వచ్చిన ఆదాయంలో కొంత ఇంటి ఖర్చులకు ఉంచుకుని, మిగిలినది మరుసటి రోజు వ్యాపారాని పెట్టుబడిగా పెట్టి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై కరోనా ప్రభావం తీవ్రంగా పడుతోంది. గడిచిన రెండు రోజుల్లోనే వీరు వ్యాపారాలకు దూరం కావటంతో రానున్న 21 రోజుల్లో ఎలా బతకాలి దేవుడా అంటూ వేడుకుంటున్నారు.

కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందు చూపుతో రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేసింది. ఇందులో భాగంగానే రిక్షా, ఆటోలు కూడా రోడెక్కటానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో రిక్షా, ఆటో కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోంది. రోజువారీ వడ్డీల కు డబ్బు అప్పుగా తీసుకుని, పెట్టుబడి పెట్టి, ఆటోలు కొనుగోలు చేసిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆటోలు నిలిపివేయటంతో వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోంది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో వివిధ దినసర కూలీలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఆదుకోవలసిన పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రంలో అన్నపూర్ణ క్యాంటీన్లు ద్వారా పేదలకు అన్నం పెడుతుంటే, మనకు మాత్రం అన్న క్యాంటీన్లు ఎత్తేయటంతో, తిండి తినటానికి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కనీసం వీరిని రెండు పూటలా అన్నం అయినా పెట్టే ఏర్పాటు చెయ్యాలి.

తెలుగు ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసి, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ "ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను." అని ట్వీట్ చేసారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ రోజు కొత్త సంవత్సరం అయినా, కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాం అని అన్నారు. ఈ సారి, ప్రతి పండుగ లాగా, జరుపుకొలేకపోయినా, భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుందని ప్రధాని అన్నారు.

ఇక మరో పక్క, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రీ శార్వారి నామ సంవత్సరం తెలుగువారు అందరికీ శుభదాయకం కావాలి. ఈ ఉగాది మనందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. బైటకు రాకుండా ఇళ్లలోనే ఉగాదిని జరుపుకోవాలి. జాతరలకు, వేడుకలకు దూరంగా ఉండాలి. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. కుటుంబ భద్రత, సామాజిక భద్రత మనందరి సంకల్పం కావాలి. కరోనా తీవ్రత దృష్ట్యా సామాజిక దూరం పాటించాలి. డిజిటల్ సోషలైజేషన్ సద్వినియోగం చేసుకోవాలి.

‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ అని పెద్దలు చెప్పారు. ఉగాది పచ్చడిలో తీపి,చేదు,పులుపు,వగరు...షడ్రుచులు ఉన్నట్లే, మానవ జీవితంలో కష్టాలు-నష్టాలు, సుఖాలు-దు:ఖాలు కలబోసి ఉంటాయి అనేదే ఉగాది పండుగ పరమార్ధం. కష్టం వస్తే కుంగిపోకూడదు, సుఖాలకు పొంగిపోరాదనేదే ఉగాది సందేశం. విపత్తులు ఎన్ని ఎదురైనా గట్టి పట్టుదలతో ఎదుర్కొందాం. మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుదాం. ‘‘వికారి’’కి వీడ్కోలు పలుకుదాం-‘‘శార్వారి’’ని స్వాగతిద్దాం’’ అని, ఉగాది పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తెలుగువారు అందరికీ విజ్ఞప్తి చేశారు.

మార్చ్ 31 లోపు, బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే, ఏప్రిల్ 1 నుంచి, రూపాయి వాడటానికి కూడా ప్రభుత్వానికి వెసులుబాటు ఉండదు. సహజంగా, ప్రతి సారి, ఫిబ్రవరి చివరి వారంలో కాని, మార్చ్ మొదటి వారంలో కాని బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే మన ప్రభుత్వం ఎన్నికల గోలలో పడి, ముందు ఎన్నికలు అయిపోవాలని, బడ్జెట్ ని మార్చ్ చివర్లో పెడదాం అని అనుకున్నారు. ఇలా చివరి దాకా వాయిదా వేస్తే, అనుకోని పరిస్థితి వస్తే ఎలా అనే ఆలోచన చెయ్యలేదు. దీంతో, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 27న ప్రారంభం కానున్నాయి అంటూ చెప్తూ వచ్చారు. తొలుత ఈనెల 28 నుంచి సమావేశాలు ప్రారంభించాలని భావించినా, 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కారణంగా ఎమ్మెల్యేలు ఆరోజు సభకు రావల్సి ఉంటుంది. దీంతో ఆ మరసటి రోజు నుంచే సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఇప్పడు రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మొత్తం లాక్ డౌన్ లో ఉంది. దీంతో, అసెంబ్లీ సమావేశాలకు వచ్చే పరిస్థతి లేదు. దీంతో ఇప్పుడు హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి, రెండు మూడు నెలలకు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయంలో తర్జబర్జన పడుతూనే ఉంది. అన్ని విషయాలు అలోచించి, ఇక అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాసం లేదని, కేవలం ఆర్డినెన్స్ ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తేవటం ఒక్కటే మార్గం అని ప్రభుత్వ పెద్దలు ఆలోచనకు వచ్చారు. మరో, రెండు మూడు రోజుల్లో దీని పై నిర్ణయం ప్రకటించనున్నారు.

సహజంగా, బడ్జెట్ సమావేశాలు, 15 రోజులు జరుగుతాయి. అది కూడా ఫిబ్రవరి చివరి వారంలో, లేదా మార్చ్ మొదటి వారంలో, తొలిరోజున గవర్నర్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై చర్చ జరుగుతుంది తరువాత, బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని పై చర్చ ఉంటుంది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపి సమావేశాలు ముగిస్తారు. అయితే, మన ప్రభుత్వం, ఇది ఆలోచన చేసిందా, లేక ఎన్నికలు ముందు అయిపోవాలి, బడ్జెట్ ఏముంది అనుకున్నారో ఏమో కాని, ఇప్పుడు చివరకు ఆర్దిన్దన్స్ ద్వారా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టే పరిస్థితికి తెచ్చారు. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి, ఇక చేసేది ఏమి లేదు. నెల రోజుల క్రిందట తెలంగాణా, ఇతర రాష్ట్రాలు బడ్జెట్ పెట్టుకుని, సేఫ్ గా ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read