ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, తాము చేసిన ఘనతలు గొప్పగా చెప్పుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలా చెప్పుకోవాలి కూడా. ఏపిలో గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, ఇలా చేసింది చెప్పుకోలేక పోవటం వల్లే, ప్రత్యర్ధుల పైడ్ ప్రచారం నమ్మి, చంద్రబాబు ఓడిపోయారు అంటూ, ఆయన ఓడిపోవటానికి ఒక కారణంగా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు కాని, ప్రభుత్వాలు కాని, తమకున్న మాధ్యమాలు ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే, ప్రభుత్వ సొమ్ముతో, పేపర్లలో, టీవీల్లో, సినిమా హాల్స్ లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు ఇచ్చి, తమ గొప్పతనం చెప్పుకుంటూ ఉంటారు. దీని కోసం, వందల, వేల కోట్లు కూడా ఖర్చు పెడుతూ, ప్రజా ధనం కర్పూరంలా కరిగిస్తూ ఉంటారు. అయితే, తమ సొంతంగా చేసుకున్న పనులకు, ఇలా చేస్తే పరవాలేదు, గుడ్డిలో, మెల్ల అని ప్రజలు సరి పెట్టుకుంటారు, కాని ఇక్కడ తాము చెయ్యని పనులు, ఎవరో చేసిన పనులు కూడా, ప్రభుత్వం సొమ్ముతో ప్రచారం చేసుకుంటే ?

lokesh 01032020 2

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, వృధాప్య, వితంతు పెన్షన్లు, నెలకు రూ.200 ఇచ్చే వారు. తరువాత వచ్చిన చంద్రబాబు, ఇవి ఏ మాత్రం సరిపోవు అని, ఇప్పుడున్న పరిస్థితిలో, వాళ్ళకు ఇవి ఏ మూలకు సరిపోవని, పెన్షన్ ను వెయ్యి రూపాయలు చేసారు. తరువాత క్రమంలో, నెమ్మది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెడుతూ వచ్చి, రాష్ట్రంలో పెరిగిన సంపద, పేదవాళ్ళ వద్దకే వెళ్ళాలని, వెయ్యి రూపాయల పెన్షన్ ను, రెండు వేలు చేసారు. జనవరి 2019 నుంచి, జూన్ 2019 వరకు ఇలా రెండు వేల పెన్షన్, దాదాపుగా, రాష్ట్రంలో ఉన్న 55 లక్షల మందికి ఇచ్చారు. అయితే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో, గతంలో చంద్రబాబు కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చే వారని, నేను వచ్చిన తరువాత దాన్ని రెండు వేల, రెండు వందల యాభై కి పెంచాను అంటూ యాడ్ ఇచ్చారు.

lokesh 01032020 3

అంతే కాదు, చంద్రబాబు హయంలో, కేవలం 44 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే వారని, మేము 58 లక్షల మందికి ఇస్తున్నాం అంటూ ఆ ప్రకటనలో ఉంది. అయితే ఒక ప్రభుత్వ ప్రకటనలో, తాను చెయ్యని పనులు కూడా చేస్తున్నట్టు, డబ్బా కొట్టటం పై, తెలుగుదేశం ఘాటుగా స్పందించింది. టిడిపి నేత లోకేష్, ఈ విషయం పై ట్వీట్ చేసారు. "సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా YS Jagan Mohan Reddy ? ప్రభుత్వ ప్రకటనల్లో, ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటానికి, ఇదేమన్నా మీ దొంగ సాక్షి అనుకున్నారా ? జనవరి 2019 నుంచి మీరు ప్రజల నెత్తిన పడిన జూన్ 2019 దాకా, 54.47 లక్షల మందికి పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? మీ నాయన కేవలం రూ.200 ఇస్తే, మా నాయన 2014లో వెయ్యి రూపాయలు, 2019లో రెండు వేలు చేశారు. అంటే, పది రెట్లు ఎక్కువ. ఇప్పుడు తమరు వచ్చి, 3 వేలు అని మోసం చేసి, లింగులిటుకుమంటూ, రూ.250 పెంచి, మోసం చేసింది కాక, ప్రభుత్వ సొమ్ముతో, ఇలా అబద్దపు డబ్బాలు కొట్టుకుంటారా ?" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వీటిపై వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచింది. ఈ ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ కు 76 పైసలు, ఒక లీటర్ డీజిల్ కు రూ. 1.07 పైసలుగా పెంపు ఉంటుంది. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై 31శాతం వ్యాట్ తో పాటు 2.76 సర్ చార్జి, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ తో పాటు అదనంగా రూ. 3.07 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలోనే వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచింది. గత నెలలో పెట్రోల్, డీజిల్ పై 4.5 శాతం వ్యాటు , ప్రభుత్వం పెంచింది. దీంతో పెట్రోల్ ధర 31 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. డీజిల్‌పై 22.5 శాతం నుంచి 27శాతానికి పెంచింది. తాజాగా సరిగ్గా నెలరోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వ్యాట్ పేరుతో ధరలు పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 76.09 పైసలు ఉండగా ఆదివారం నుంచి 76 పైసలు వ్యాట్ రూపంలో పెంచడంతో రూ. 77.04 కి పెరగనుంది. అలాగే లీటర్ డీజిల్ ధర ప్రస్తుతం రూ. 70.67 పైసలు ఉండగా రూ. 1.07 పైసలు పెరిగింది.

దీంతో ఆదివారం నుంచి డీజిల్ ధర రూ.71.74 పైసలుకు పెరగనుంది. ఇప్పటికే వివిధ రూపాల్లో ధరలు పెరగడంతో సామాన్యులు మోటారు వాహనాలను నడిపే పరిస్తితి లేదు. పెట్రోడీజిల్ ధరలు ఇదే విధంగా పెరుగుతూ పోతే ఆ ప్రభావం ఇతర నిత్యావసర సరుకులపై పడే ప్రభావం ఉంది. పెట్రోల్ ధరలు పెరగడంతో రాష్ట్ర రాజధాని విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రధాన నగరాల్లో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఏపీఎస్ఆర్టీసీ బస్ చార్జీలను గతేడాదిలోనే భారీగా పెంచింది. పెరిగిన ధరలతో ఇప్పటికే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. దీనివల్ల మరోసారి నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టోల్ గేట్లు రూపంలో వేల రూపాయిలు చెల్లిస్తున్నామని, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా చార్జీలు మిగలకపోగా వాహనాల తరుగుదల, మరమ్మతులు ఆర్ధికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాపోతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల వాహనాలను తిప్పే పరిస్తితి లేదని తమ కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశాలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉండటం వల్ల ఆయా ప్రాంతాలకు కిరాయిల నిమిత్తం వెళ్లే వాహనాలు అక్కడే తమ వాహనాలకు డీజిల్, పెట్రోలు పోయించుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ప్రధానంగా రాష్ట్రానికి వాణిజ్య పన్నులు శాఖ నుంచి అధికంగా ఆదాయం వస్తుంది. పెట్రో, డీజిలు ఆ రంగానికి చెందినవి కావడంతో రాష్ట్ర ఖజానాకు చిల్లులు పడుతున్నాయి. పెట్రో, డీజిల్ ధరల్లో కనీసం రూ. 1.50 నుంచి రూ.2 వరకూ వ్యత్యాసం ఉండటంతో ఇతర రాష్ట్రాల్లో ఆయిల్ పోయించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దుగా ఉన్న మధిరలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.42 పైసలు ఉంటే ఏపీలో రూ.77.04 గా ఉంది. డీజిల్ ధర లీటర్ కు రూ. 70.25 పైసలు ఉంటే రూ. 71.74కి పెరిగింది. తెలంగాణలోని కోదాడలో రూ. 76.43 పైసలు, డీజిల్ రూ.70.26 పైసలుగా ఉన్నాయి. తమిళనాడు సరిహద్దులో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.73 పైసలు ఉండగా, డీజిల్ ధర రూ. 68.27 పైసలు ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే నెల రోజల్లో ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.

విశాఖపట్నంలో చంద్రబాబు గారి యాత్రకు పర్మిషన్ ఇచ్చి, ఎక్కవు సంఖ్యలో వైసీపీ అభిమానులు వచ్చేలా చేసి, వారిని అడ్డుకోకుండా చేసినందుకు, వారిని అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేసారు అంటూ, హైకోర్ట్ పోలీసులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, అక్కడ అడ్డుకున్న వైసీపీ నాయకుల ఫోటోలు మీడియాకు విడుదల చేసారు. ఇవే ఫోటోలు, వీడియోలు కోర్ట్ కు కూడా ఇవ్వటానికి సిద్ధం అయ్యారు. దీంతో, పోలీసులకు, ఇక తప్పని పరిస్థితి. రెండో తారీఖు వాయిదా ఉండటంతో, ఈ రోజు, అంటే సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత, వైసీపీ వారిని అరెస్ట్ చేసారు. 32 మంది వైసీపీ కార్యకర్తలతో పాటుగా, 20 మంది టీడీపీ కార్యకర్తల పై కూడా కేసు పెట్టారు. అలాగే ఎయిర్‌పోర్టు దగ్గర ఆ-త్మ-హ-త్య-కు ప్రయత్నం చేసిన రామారావు పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఎస్‌ఐ పై దాడి చేసిన వైసీపీ మహిళా నేత కృపాజ్యోతిపైనా కేసు నమోదు చేసి, ఆమెను కూడా అరెస్ట్ చేసారు.

court 29022020 2

మరో పక్క తెలుగుదేశం నేతలు, జరిగిన ఘటన పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీలోనే కాదు దేశంలో అభివృద్ధి చంద్రబాబుకు మరోపేరుగా కీర్తి గడించారని, అరాచకమే జగన్ కు మారుపేరుగా చెడ్డపేరు తెచ్చుకున్నారని తెదేపా నేతలు అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు విమర్శించారు. 9 నెలల పాలనలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే ప్రజాదరణమిన్నగా ఉన్న చంద్రబాబు పర్యటనకు జగన్ ఈర్ష్యతో అడ్డంకులు సృష్టించడం తగదని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు తగిన రక్షణ కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అరాచాకావాదులను మంత్రులు ప్రోత్సహించి పంపినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం జగన్ ఫ్యాక్షనిస్టు మనస్తత్వానికి నిదర్శమని దుయ్యబట్టారు. అభివృద్ధికి చంద్రబాబు కేరాఫ్ అడ్రసయితే అరాచాకవాదులకు అడ్డగా వైకాపాను పోషించడం జగన్ హేయమైన చర్య అన్నారు. బాధితులపైనే కేసులు పెట్టడం వైకాపా ప్రభుత్వ నైజం మారిందని అనేక సంఘటనలు ఉదహరించారు. అమరావతికి మద్దతు పలకమని కోరిన రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర వైకాపా ఎంపీ నందిగం సురేష్ దని ఆక్షేపించారు. విశాఖలో పర్యటనకు అనుమతి తీసుకుని వెళ్ళిన చంద్రబాబును అడ్డుకోవడమే కాకుండా ఆయనపై 151 కింద అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు.

court 29022020 3

విశాఖలో చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డుపడి అల్లరులు సృష్టించి ఏపీని బీహార్ కంటే ఘోరంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాష్ట్రంగా మార్చాలని జగన్ ప్రయత్నిచడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజల్లో నిర్భయంగా పర్యటన జరిపే సత్తా , దమ్ముకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అన్నారు. ఎవరు అడ్డుకున్నా త్వరలోనే విశాఖలో చంద్రబాబు పర్యటన జరిపి తీరుతారని సవాల్ విసిరారు. అధికారమదంతో చేసిన తప్పులకు ముఖం చూపించలేక తెర చాపల వలల మధ్య జగన్ పలాయనవాదానికి నిదర్శనం ఎద్దేవా చేశారు.
ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిద్రాహారాలుమాని కృషి చేస్తే జగన్ రాష్ట్ర విధ్వంసానికి పాల్పడుతున్నాడని అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు చంద్రబాబు పర్యటనకు పూనుకుంటే సహించలేని జగన్ పోలీసులతో అరాచకానికి సిద్ధపడటం హేయమైన చర్యని విమర్శించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రోజుకు18 గంటలపాటు చంద్రబాబు పని చేసి అనేక పరిశ్రమలు నెలకొనేలా చేశారన్నారు.

గత 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 5 లక్షల ఉద్యోగాలు తెచ్చి పెట్టిన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు.ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తిని నమ్మి జగన్ కు అధికారం ఇచ్చి బంగారు గుడ్డు పెట్టె బాతును చంపుకున్నామని ప్రజలు ఆవేదన భరితులవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని రకాల వైఫల్యాలకు కారణమై ప్రజల్లో తిరగలేని దుస్థితికి జగన్ సిగ్గు పడాలన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం చంద్రబాబు తత్వమని, ప్రజలకు కష్టాలు, ఇబ్బందులు సృష్టించడం జగన్ నైజమని విమర్శించారు. నాడు తండ్రి వైఎస్ అప్పటి ముఖ్యమంత్రులను మార్చడానికి హైదరాబాద్ లో మతకలహాలకు ఆజ్యం పోశాడు... నేడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న ప్రజాస్పందనను తట్టుకోలేక ఆయన పర్యటనను అడ్డుకోడానికి జగన్ పోలీసులతోనే అల్లర్లు, అశాంతికి కారణమవడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతికాముకులైన విశాఖ ప్రజలకు వైసీపీ ఫ్యాక్షన్ రుచి చూపించడం సహించరాని నేరమని విమర్శించారు.

ప్రతిపక్షంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి, అప్పటి చంద్రబాబు పరిపాలన పై, పెట్రోల్ డీజిల్ రెట్లు పెంచేస్తున్నారు అంటూ, గొడవ గొడవ చేసేవారు. దేశంలో ఎక్కడా లేని రెట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి అంటూ విమర్శలు చేసేవారు. తన సాక్షి పత్రిక, టీవీలో కూడా, అనేక వ్యతిరేక కధనాలు వేసే వారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు కూడా, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పారు. కాని, ఇప్పుడు నెల రోజుల్లోనే రెండో సారి పెట్రోల్, డీజిల రేట్లు పెంచేసారు. నెల రోజుల క్రితం ఏపిలో పెట్రోల్, డీజిల పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం, అది మర్చిపోక ముందే, ఈ రోజు మరోసారి, రేట్లు పెంచేసింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ పెంచుతూ, ఈ రోజు జీవో ఇచ్చింది. లీటరు పెట్రోల్‌పై ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్‌తోపాటు అదనంగా 2 రూపాయలు తీసుకునే వారు. ఇప్పుడు వ్యాట్‌+రూ.2.76 వసూలు చేసారు. అంటే, పెట్రోల్ పై 76 పైసలు పెంచారు. ఇక డీజిల్ పై, 22.25 వ్యాట్‌+రూ.2 గా ఉండగా, దాన్ని 22.25+3.07కు మార్చారు. అంటే, డీజిల్ రూ.1.07 పెరగనుంది. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.

పెట్రోలు, డీజిల్ ధరలు తక్షణం తగ్గించాలి : కె ఇ కృష్ణ మూర్తి డిమాండ్ ... పెట్రోలు, డీజిల్ ధరలు నెలలో రెండుసార్లు పెంచి గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడంపై జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెదేపా నేత కె ఇ కృష్ణ మూర్తి డిమాండ్ చేశారు. గత నెలలోనే వ్యాట్‌లో సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి, అది మరవక ముందే మరోసారి పెట్రోల్ ధరలు పెంచడం సరికాదని ఆయన సూచించారు. ఇప్పుడు పెట్రోల్ లీటర్‌పై 76 పైసలు, డీజిల్ లీటర్ రూ.1.07 పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం ధరలు పెంచి ప్రజలపై భారం మోపడమే పాలనలా మారిందని ఎద్దేవా చేశారు. మాటలను మార్చడంలో ఘనుడు జగన్ అని మరోసారి రుజువయిందన్నారు. మాట తప్పను మడం తిప్పనన్న జగన్ ఇప్పుడు మాట, మడాన్ని అష్టవంకరలు తిప్పాడని విమర్శించారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచని విధంగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో పెట్రోలు, డీజిలు ధరలు ఉన్నందున తగ్గించాలని అసెంబ్లీలో మాట్లాడి ఆందోళనలు నిర్వహించిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ, విద్యుత్ ధరలు నానాటికీ పెంచడం జగన్ పాలన్ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. జ్ఞాపకశక్తి కోల్పోయి ప్రవర్తించడం జగన్ కే చెల్లుబాటయిందన్నారు. పెంచిన పెట్రోలు, డీజిలు ధరలు తక్షణం తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించే వరకూ ప్రజల పక్షాన పోరాటానికి తెదేపా సిద్ధం అని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read