విద్యుత్ ఒప్పందాల విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, రోజుకి ఒకసారి ఏదో ఒక రూపంలో, ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మొన్నటి దాకా కోర్టుల్లో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం పై గుర్రుగా ఉంది. తాజాగా రెండు రోజుల క్రితం, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా, రాష్ట్ర ప్రభుత్వ విధానాల పై, బహిరంగంగానే విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో, రాష్ట్రం పరువే కాకుండా, కేంద్రం పరువు కూడా పోతుంది అంటూ, మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా, కేంద్ర విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. విద్యుత్ చట్టంలో ఉన్న, సెక్షన్ 63 ప్రకారం, ఒప్పందాలు కుదుర్చుకుంటే, అలాంటి ఒప్పందాల్లో, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ కలుగ చేసుకోవటానికి వీలు లేదు అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది, కేంద్ర విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌.

tribunal 29022020 2

రాష్ట్ర ప్రభుత్వం కుడుర్చుకున్న ఆ ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూడాలి అని, అంతే కాని, వాటి పై, ప్రజాభిప్రాయం సేకరించి, దాని ప్రకారం, నిర్ణయాలు తెసుకునే అధికారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ కు ఉండదు అంటూ, కేంద్ర విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చింది. ఆ టారిఫ్ ఆమోదిస్తూ, షరతులతో కూడిన, అనుమతి ఇవ్వటం, కుదరదు అంటూ, ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి, స్పష్టం చేసింది. అనంతపురం సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌బీ ఎనర్జీ సోలార్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌, కడప రెన్యూవబుల్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్ప్రింగ్‌ అగ్నిత్ర ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, ఏపీ డిస్కంలతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకు, కొన్ని షరతులు ఇస్తూ, అనుమతి ఇస్తూ రెగ్యులేటరీ కమిషన్‌ అక్టోబరు 5 2019న ఇచ్చిన ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టేసింది.

tribunal 29022020 3

కంపెనీలు కుదుర్చుకున్న పీపీఏ, కేంద్రం ఇచ్చిన పీపీఏ మార్గదర్శకాలు ప్రకారం ఉంటే, విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63 ప్రకారం, దీనికి రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి, అవసరం లేదు అంటూ, ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియలో కమిషన్ చూడాల్సింది, కేవలం, విద్యుత్ సేకరణ కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్రకారం చేస్తున్నారా లేదా అని మాత్రమే అని, అక్కడి వరకు మాత్రమే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ కేసులో, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, టారిఫ్ నిర్ణయం తీసుకోవటం, విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కి వ్యతిరేకం అంటూ, ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఒప్పందాలు చేసుకున్న విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి షరతులు లేకుండానే యూనిట్‌కు రూ.2.72తోపాటు, ట్రేడ్‌మార్జిన్‌ కింద 7 పైసలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

గతంలో, అంటే 2010లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతికి కారణం అంటూ, ఆఫీసులు తగలబెట్టిన వైసీపీ కార్యకర్తలు, ఈ రోజు తమ అధినేత చేసిన పనితో షాక్ అయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే ముకేష్ అంబానీ వస్తున్నట్టు కాని, ఆయనతో జగన్ భేటీ ఉంటుంది అని కాని ముందు ఎలాంటి లీక్ కూడా ఇవ్వలేదు. అయితే ముకేష్ అంబానీ పెట్టుబడులు కోసం చర్చలు జరపటానికి వచ్చారా ? లేక మరేదైనా కారణమా అంటే, వేరే కారణం అనే రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి అంతటికీ కారణం, ముకేష్ అంబానీతో పాటు వచ్చిన వ్యక్తి. ముకేష్ అంబానీతో పాటుగా కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యులు పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ కూడా జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. పరిమల్ నత్వానీ, అంబానీకి చాలా దగ్గర మనిషి. అయితే ఈ భేటీ వెనుక పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వటం విషయంలోనే చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.

mukesh 29022020 2

పరిమల్ నత్వానీ పారిశ్రామికవేత్తగా అందరికీ పరిచయం. 1990 వరకు ఆయన సొంతగా వ్యాపారాలు చేసుకునే వారు. ఈ క్రమంలోనే ఆయన 1997లో రిలయన్స్ గ్రూప్‌లో చేరారు. 2016లో పరిమల్ నత్వానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కార్పొరేట్ అఫెయిర్స్‌కు చీఫ్‌గా పని చేసారు. పరిమల్ నత్వానీకి, ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీతో కూడా మంచి సంబంధాలు ఉండేవి అని చెప్తూ ఉంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ధీరుభాయ్ అంబానీ నెలకొల్పిన మొట్టమొదటి క్రూడ్ ఆయిల్ పరిశ్రమ పనులు అన్నీ, పరిమల్ నత్వానీ దగ్గర ఉండి చూసారని అంటారు. పరిమల్ నత్వానీ, ముఖేష్ అంబానీకి రైట్ హ్యాండ్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయనే, రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చాలా కీలక వ్యక్తి అయిపోయారు.

mukesh 29022020 3

పరిమల్ నత్వానీ రాజకీయంగా కూడా చురుకుగా ఉంటూ వచ్చారు. బీజేపీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. జార్ఖండ్ నుంచి, 2008లో ఒకసారి, 2014లో ఒకసారి ఎన్నికయ్యారు. అయితే ఈయన రాజ్యసభ పదవీ కాలం, ఏప్రిల్ 9తో ముగుస్తుంది. అయితే, జార్ఖండ్‌లో ఈ సారి, బీజేపీకి సరిపడా బలం లేకపోవటంతో, ఆయన అక్కడ నుంచి రాజ్యసభకు వెళ్ళటం అసాధ్యం అయ్యింది. ఈ నేపధ్యంలోనే, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆయన్ను మళ్ళీ రాజ్యసభకు పంపించాలని అమిత్ షా నిర్ణయం తీసుకోవటంతో, ఆ విషయం మాట్లాడటానికి జగన్ ను ఈ రోజు, ముకేష్ తో కలిసి, పరిమల్ నత్వానీ కలిసారని తెలుస్తుంది. డైరెక్ట్ గా అమిత్ షా నిర్ణయం తీసుకోవటంతో, జగన్ కూడా నో చెప్పలేని పరిస్థితి. చూద్దాం, మరి జగన్ ఏమి చేస్తారో.

అక్రమాస్తుల కేసులో జగన్ మోహన్ రెడ్డి హాజరుకు సీబీఐ కోర్టు నిన్న మినహాయింపు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున, అదీ కాక నిన్న పోలవరం పర్యటనకు వెళ్ళాల్సి ఉంది కాబట్టి, మినహాయింపు ఇవ్వాలన్న జగన్​ అభ్యర్థనను న్యాయస్థానం మన్నించింది. జగన్ తరుపు న్యాయవాది, అశోక్ రెడ్డి, సెక్షన్ 317 కింద, ఈ పిటీషన్ దాఖలు చేసారు. తన క్లైంట్ జగన్, కోర్ట్ కు రాకుండా మినహాయింపు కోరుతూ హైకోర్ట్ కు వెళ్ళారని, ఆ కేసు విచారణ ఏప్రిల్ 9 కి వాయిదా వేసింది అని, అప్పటి వరకు కోర్ట్ కు వెళ్ళకుండా, మినహయింపు కోరవచ్చు అంటూ హైకోర్ట్ మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని, సిబిఐ కోర్ట్ కు తెలిపారు. పిటీషన్ ఆమోదించిన జడ్జి, విచారణ 6 వ తేదీకి వాయిదా వేసారు. నిన్న ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్​ప్రసాద్​రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. జగన్​ దాఖలు చేసిన డిశ్చార్జ్​ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. ముగ్గురు పారిశ్రామికవేత్తల నుంచి మోసపూరితంగా జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడులు పెట్టించారన్న కేసులో జగన్​కు ఎలాంటి ప్రమేయం లేదని న్యాయవాది అశోక్​రెడ్డి వాదించారు.

lokesh 29022020 2

వాదనల అనంతరం విచారణను సీబీఐ న్యాయస్థానం మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదంతా బాగానే ఉంది కాని, ఈ రోజు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, మరో కోణం కూడా బయట పడింది అనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటన ఈ నెల 27న అంటే గురువారం ఉంటుంది అంటూ, ముందుగా పత్రికలకు చెప్పారు. కొన్ని పత్రికలు ఆ విషయాన్ని ప్రస్తావించాయి కూడా. అయితే తరువాత రోజు, జగన్ పోలవరం పర్యటన గురువారం నుంచి శుక్రవారానికి వాయిదా పడింది. అది ఎందుకు వాయిదా పడిందో తెలియదు కాని, ఈ విషయం పై లోకేష్ స్పందన చూస్తే పాయింట్ ఉన్నట్టే అనిపిస్తుంది. మరి ఈ విషయం పై, జగన్ కాని, వైసీపీ పార్టీ కాని ఎలా స్పందిస్తుందో చూడాలి

lokesh 29022020 3

లోకేష్ ట్వీట్ చేస్తూ, "శుక్రవారం వస్తే చాలు, స్కూల్ పిల్లలు సాకులు చెప్పి, బడి ఎగ్గొట్టినట్టు ఉంటాయి YS Jagan Mohan Reddy గారి కష్టాలు. ప్రతి రోజు తాడేపల్లి ఇంట్లో పబ్జీ ఆడి కాలక్షేపం చేస్తూ, శుక్రవారం వస్తే తాను సీ.యం అని గుర్తుకు వచ్చి, ఏదో ఒక రివ్యూ పెట్టి, కోర్ట్ కు డుమ్మా కొడతారు. నిన్న జగన్ గారి పోలవరం పర్యటన చూస్తే, ఇదే అనిపిస్తుంది. ముందుగా 27న పోలవరం పర్యటన అన్నారు. కాని అది 28కి ఎందుకు మారిందో, నిన్న సిబిఐ కోర్ట్ లో జగన్ పిటీషన్ చూస్తే అర్ధమవుతుంది." అంటూ ట్వీట్ చేసారు. లోకేష్ ట్వీట్ చేసారు అని కాదు కానీ, ప్రతి శుక్రవారం ఏదో ఒక రివ్యూ పెట్టుకుని, లేకపోతే ఏదో ఒక పర్యటన పెట్టుకుని, ఆ రోజు కోర్ట్ కు వెళ్ళకుండా, విచారణ సాగాదిస్తూ, విచారణ ముందుకు సాగకుండా, ప్రతి వారం జగన్ వాయిదా కోరుతున్నారు అనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇన్ని నెలల పాటు కోర్ట్ కు వెళ్ళకుండా, విచారణకు వెళ్ళకుండా, ప్రతి వారం ఏదోఒకటి చెప్పి, విచారణ తప్పించుకుంటే, ఈ కేసు ఇప్పుడప్పుడే తేలే పని కాదు.

ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో, ఇబ్బంది పడుతున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం వాపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ పీపీఏల విషయంలో, కేంద్రం చాలా ఆగ్రహంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏల పునఃసమీక్ష పై కేంద్ర ప్రభుత్వం తరుపున, కేంద్రం మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసారు. పీపీఏల పునఃసమీక్ష వల్ల, రాష్ట్రం ఒక్కటే కాదని, దేశం పరువు పోయిందని కేంద్రం ఎక్కడో ఒక చోట ఇది ప్రస్తావిస్తూనే ఉంది. తాజాగా ఏపి ప్రభుత్వం తీసుకున్న ఈ విషయాన్ని పై అంతర్జాతీయ వేదిక మీద చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఒక సదస్సుకు కేంద్రమంత్రి గోయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణాదిలో ఓ రాష్ట్రం పీపీఏల పునఃసమీక్షకు ప్రయత్నం చేసిందంటూ, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. ఇలా ఇబ్బంది పెట్టే వారిని ఏమి చెయ్యలా అని పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, మీరు కూడా ఈ విషయంలో సలహాలు ఇవ్వండి అని అన్నారు.

piyus 29022020 2

అంతేకాకుండా, ఒక కొత్త చట్టాన్ని తెస్తున్నాం అని, ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా కాంట్రాక్టులు గానీ, వాటికి సంబంధించిన, నిబంధనలు గానీ మారకుండా ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఓ చట్టం రూపొందించాల్సిన అవసరముందని, సలహాలు ఇవ్వాలి అంటూ, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు మాట వినకపోతే, రాష్ట్రానికి వచ్చే నిధులలో కట్ చేయాలని రిజర్వు బ్యాంకును కోరతామని కేంద్రమంత్రి గోయల్ చెప్పుకొచ్చారు. దీని పై స్పందించిన లోకేష్, ట్విట్టర్ లో వ్యంగంగా పోస్ట్ చేసారు "బలమైన నేత కనుకే ట్రంప్ తో విందుకి పిలవలేదు అని రాష్ట్ర మంత్రి అంటే నమ్మలేకపోయాను. దేశాన్ని నాశనం చేసే అంత బలం, కరోనా కంటే బలమైన వైరస్ అని కేంద్ర మంత్రి మాటలు విన్న తరువాత అసలు విషయం అర్ధం అయ్యింది" అంటూ ట్వీట్ చేసారు.

piyus 29022020 3

అయితే ఈ విషయం పెద్దది అయిపోవటంతో, రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయ సమస్యో, లేకపోతే, యుద్ధ సమస్యో కాదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీపీఏల సమీక్షను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తప్పుబట్టిన విషయం, పెద్దదిగా వార్తల్లో రావటంతో, ఆయన స్పందించారు. శుక్రవారం తిరుపతిలో బొత్సా మాట్లాడుతూ, "ఆయన కేంద్రమంత్రి కాబట్టి అలా మాట్లాడారు. మేం రాష్ట్రానికి బాధ్యత వహిస్తాం. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయ సమస్యో, దేశాల యుద్ధ సమస్యో కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా తక్కువ ధరకు విద్యుత్‌ దొరుకుతుంటే అధిక ధరకు కొనాల్సిన అవసరమేంటి" అంటూ బొత్సా స్పందించారు. మొత్తంగా, మా తప్పు ఏమి లేదు, కేంద్ర మంత్రి అలాగే మాట్లాడతారు అన్నట్టు బొత్సా స్పందించారు.

Advertisements

Latest Articles

Most Read