ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో, ఇబ్బంది పడుతున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం వాపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ పీపీఏల విషయంలో, కేంద్రం చాలా ఆగ్రహంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏల పునఃసమీక్ష పై కేంద్ర ప్రభుత్వం తరుపున, కేంద్రం మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసారు. పీపీఏల పునఃసమీక్ష వల్ల, రాష్ట్రం ఒక్కటే కాదని, దేశం పరువు పోయిందని కేంద్రం ఎక్కడో ఒక చోట ఇది ప్రస్తావిస్తూనే ఉంది. తాజాగా ఏపి ప్రభుత్వం తీసుకున్న ఈ విషయాన్ని పై అంతర్జాతీయ వేదిక మీద చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఒక సదస్సుకు కేంద్రమంత్రి గోయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణాదిలో ఓ రాష్ట్రం పీపీఏల పునఃసమీక్షకు ప్రయత్నం చేసిందంటూ, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. ఇలా ఇబ్బంది పెట్టే వారిని ఏమి చెయ్యలా అని పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, మీరు కూడా ఈ విషయంలో సలహాలు ఇవ్వండి అని అన్నారు.

piyus 29022020 2

అంతేకాకుండా, ఒక కొత్త చట్టాన్ని తెస్తున్నాం అని, ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా కాంట్రాక్టులు గానీ, వాటికి సంబంధించిన, నిబంధనలు గానీ మారకుండా ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఓ చట్టం రూపొందించాల్సిన అవసరముందని, సలహాలు ఇవ్వాలి అంటూ, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు మాట వినకపోతే, రాష్ట్రానికి వచ్చే నిధులలో కట్ చేయాలని రిజర్వు బ్యాంకును కోరతామని కేంద్రమంత్రి గోయల్ చెప్పుకొచ్చారు. దీని పై స్పందించిన లోకేష్, ట్విట్టర్ లో వ్యంగంగా పోస్ట్ చేసారు "బలమైన నేత కనుకే ట్రంప్ తో విందుకి పిలవలేదు అని రాష్ట్ర మంత్రి అంటే నమ్మలేకపోయాను. దేశాన్ని నాశనం చేసే అంత బలం, కరోనా కంటే బలమైన వైరస్ అని కేంద్ర మంత్రి మాటలు విన్న తరువాత అసలు విషయం అర్ధం అయ్యింది" అంటూ ట్వీట్ చేసారు.

piyus 29022020 3

అయితే ఈ విషయం పెద్దది అయిపోవటంతో, రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయ సమస్యో, లేకపోతే, యుద్ధ సమస్యో కాదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీపీఏల సమీక్షను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తప్పుబట్టిన విషయం, పెద్దదిగా వార్తల్లో రావటంతో, ఆయన స్పందించారు. శుక్రవారం తిరుపతిలో బొత్సా మాట్లాడుతూ, "ఆయన కేంద్రమంత్రి కాబట్టి అలా మాట్లాడారు. మేం రాష్ట్రానికి బాధ్యత వహిస్తాం. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయ సమస్యో, దేశాల యుద్ధ సమస్యో కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా తక్కువ ధరకు విద్యుత్‌ దొరుకుతుంటే అధిక ధరకు కొనాల్సిన అవసరమేంటి" అంటూ బొత్సా స్పందించారు. మొత్తంగా, మా తప్పు ఏమి లేదు, కేంద్ర మంత్రి అలాగే మాట్లాడతారు అన్నట్టు బొత్సా స్పందించారు.

అక్రమాస్తుల కేసులో జగన్ మోహన్ రెడ్డి హాజరుకు సీబీఐ కోర్టు నిన్న మినహాయింపు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున, అదీ కాక నిన్న పోలవరం పర్యటనకు వెళ్ళాల్సి ఉంది కాబట్టి, మినహాయింపు ఇవ్వాలన్న జగన్​ అభ్యర్థనను న్యాయస్థానం మన్నించింది. జగన్ తరుపు న్యాయవాది, అశోక్ రెడ్డి, సెక్షన్ 317 కింద, ఈ పిటీషన్ దాఖలు చేసారు. తన క్లైంట్ జగన్, కోర్ట్ కు రాకుండా మినహాయింపు కోరుతూ హైకోర్ట్ కు వెళ్ళారని, ఆ కేసు విచారణ ఏప్రిల్ 9 కి వాయిదా వేసింది అని, అప్పటి వరకు కోర్ట్ కు వెళ్ళకుండా, మినహయింపు కోరవచ్చు అంటూ హైకోర్ట్ మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని, సిబిఐ కోర్ట్ కు తెలిపారు. పిటీషన్ ఆమోదించిన జడ్జి, విచారణ 6 వ తేదీకి వాయిదా వేసారు. నిన్న ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్​ప్రసాద్​రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. జగన్​ దాఖలు చేసిన డిశ్చార్జ్​ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. ముగ్గురు పారిశ్రామికవేత్తల నుంచి మోసపూరితంగా జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడులు పెట్టించారన్న కేసులో జగన్​కు ఎలాంటి ప్రమేయం లేదని న్యాయవాది అశోక్​రెడ్డి వాదించారు.

lokesh 29022020 2

వాదనల అనంతరం విచారణను సీబీఐ న్యాయస్థానం మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదంతా బాగానే ఉంది కాని, ఈ రోజు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, మరో కోణం కూడా బయట పడింది అనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటన ఈ నెల 27న అంటే గురువారం ఉంటుంది అంటూ, ముందుగా పత్రికలకు చెప్పారు. కొన్ని పత్రికలు ఆ విషయాన్ని ప్రస్తావించాయి కూడా. అయితే తరువాత రోజు, జగన్ పోలవరం పర్యటన గురువారం నుంచి శుక్రవారానికి వాయిదా పడింది. అది ఎందుకు వాయిదా పడిందో తెలియదు కాని, ఈ విషయం పై లోకేష్ స్పందన చూస్తే పాయింట్ ఉన్నట్టే అనిపిస్తుంది. మరి ఈ విషయం పై, జగన్ కాని, వైసీపీ పార్టీ కాని ఎలా స్పందిస్తుందో చూడాలి

lokesh 29022020 3

లోకేష్ ట్వీట్ చేస్తూ, "శుక్రవారం వస్తే చాలు, స్కూల్ పిల్లలు సాకులు చెప్పి, బడి ఎగ్గొట్టినట్టు ఉంటాయి YS Jagan Mohan Reddy గారి కష్టాలు. ప్రతి రోజు తాడేపల్లి ఇంట్లో పబ్జీ ఆడి కాలక్షేపం చేస్తూ, శుక్రవారం వస్తే తాను సీ.యం అని గుర్తుకు వచ్చి, ఏదో ఒక రివ్యూ పెట్టి, కోర్ట్ కు డుమ్మా కొడతారు. నిన్న జగన్ గారి పోలవరం పర్యటన చూస్తే, ఇదే అనిపిస్తుంది. ముందుగా 27న పోలవరం పర్యటన అన్నారు. కాని అది 28కి ఎందుకు మారిందో, నిన్న సిబిఐ కోర్ట్ లో జగన్ పిటీషన్ చూస్తే అర్ధమవుతుంది." అంటూ ట్వీట్ చేసారు. లోకేష్ ట్వీట్ చేసారు అని కాదు కానీ, ప్రతి శుక్రవారం ఏదో ఒక రివ్యూ పెట్టుకుని, లేకపోతే ఏదో ఒక పర్యటన పెట్టుకుని, ఆ రోజు కోర్ట్ కు వెళ్ళకుండా, విచారణ సాగాదిస్తూ, విచారణ ముందుకు సాగకుండా, ప్రతి వారం జగన్ వాయిదా కోరుతున్నారు అనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇన్ని నెలల పాటు కోర్ట్ కు వెళ్ళకుండా, విచారణకు వెళ్ళకుండా, ప్రతి వారం ఏదోఒకటి చెప్పి, విచారణ తప్పించుకుంటే, ఈ కేసు ఇప్పుడప్పుడే తేలే పని కాదు.

టీడీపీ పాలనలో పోలవరం నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, పూర్తి వివరాలను, రోజువారీ జరిగే పనుల పురోగతిని ఆన్ లైన్ లో ఉంచడం జరిగిందని, పనులు చూడటానికి వెళ్లిన ప్రతిసారీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయప్రాజెక్ట్ నిర్మాణ వివరాలను అందరికీ తెలియచేసేవారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు పోలవరం పనులను పరిశీలించడానికి వెళ్లిన ప్రతిసారీ, కేంద్రజలవనరుల శాఖా మంత్రికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఛైర్మన్ కు, సభ్యులకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులకు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సభ్యులకు, రాష్ట్రప్రజలకు, పూర్తిస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా తెలియచేయడం జరిగేదన్నారు. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, తాను పోలవరం పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ, అక్కడేం పనులుజరుగతున్నాయి... తానేం పరిశీలించాడు.. ఏఏ పనులు చేయమని అధికారులను ఆదేశించాడనే వివరాలను ఎందుకు బహిర్గతం చేయడంలేదని ఉమా ప్రశ్నించారు. అసలు జగన్.. పోలవరం పనులు జరుగుతున్న తీరుని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, మీడియా ముందుకొచ్చి వివరాలు ఎందుకు వెల్లడించలేదన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వంపై పోలవరం నిర్మాణానికి సంబంధించి రోజుకోరకంగా అవినీతి ఆరోపణలుచేస్తూ, రూ.16వేలకోట్ల పోలవరం అంచనా వ్యయాన్ని, రూ.43వేలకోట్లకు పెంచామని, రూ.వెయ్యికోట్లు అదనంగా హెడ్ వర్క్స్ పనులకు కేటాయించామని గగ్గోలుపెట్టిన వైసీపీనేతలు, సాక్షి మీడియా నేడు జగన్ పోలవరం సందర్శనకు వెళితే, ఎందుకు మౌనంగా ఉన్నాయని దేవినేని ప్రశ్నించారు. 2021కి పోలవరం పూర్తవుతుందని జగన్ ప్రభుత్వం చెబుతుంటే, అది ఎలా సాధ్యమవుతుందని ఎవరూ ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు? వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నివేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయో, ఎన్ని తట్టల మట్టివేశారో, ఎన్ని యంత్రాలను తెప్పించారో, ఎందరు పనివాళ్లు పనిచేస్తున్నారనే వివరాలు ఎందుకు బయటకు రావడంలేదన్నారు. పోలవరం పనుల్లో రూ.20వేలకోట్ల వరకు దేవినేని ఉమా కాజేశాడని, చిలువలు పలవలుగా విష ప్రచారం చేసిన నోళ్లన్నీ ఏమైపోయాయని ఉమా నిలదీశారు. టీడీపీ పాలనలో పోలవరం పునాదులే లేవలేదని చెప్పిన జగన్, నేడు ఎందుకు మౌనంగా ఉన్నాడన్నారు. రూ.20వేలకోట్ల దోపిడీ జరిగితే, ఆ డబ్బంతా ఎక్కడికెళ్లిందో ముఖ్యమంత్రి ఎందుకు చెప్పడంలేదన్నారు. జగన్ తన బంధువైన పీటర్ తో వేసిన కమిటీ, పోలవరం పనులపై ఏమని నివేదిక ఇచ్చిందో ఎందుకు బయటపెట్టడం లేదని ఉమా ప్రశ్నించారు.

2006లో పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో, ఆనాడు జరుగుతున్న పనులను జగన్ అడ్డుకోవడం జరిగిందన్నారు. జగన్ అత్యాశ కారణంగా, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న పన్నాగంతో ప్రాజెక్ట్ పనులు ఆరేళ్లపాటు ఆగిపోయింది నిజం కాదా అని దేవినేని నిగ్గదీశారు. జగన్ నిర్వాకం వల్ల రూ.2537 కోట్ల భారం ప్రాజెక్ట్ నిర్మాణంపై పడిందన్నారు. జగన్ వేసిన పీటర్ కమిటీ పవర్ ప్రాజెక్ట్ పనుల్లో రూ.2,346కోట్ల అవినీతి జరిగిందని, 2015-16 ఎస్సెస్సార్ తప్పని చెప్పడం జరిగిందన్నారు. పీటర్ కమిటీ తప్పన్న 2015-16 ఎస్సెస్సార్ నే ఆధారం చేసుకొని, జగన్ ప్రభుత్వం మరలా టెండర్లు ఎలా పిలిచిందో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన జగన్, రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు ఒక సంస్థకు అప్పగించాక, మరలా అదనంగా చెల్లింపులుచేయాలని అధికారులను ఎలా ఆదేశించారో చెప్పాలన్నారు. రివర్స్ టెండరింగ్ లో ఒకే కంపెనీ ఎలా పాల్గోందో, అదే కంపెనీకి -14, -12.06శాతంతో పనులప్పగించి, వందరూపాయల పనిని రూ.26తక్కువకు ఎలా చేయిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డే చెప్పాలన్నారు. 100రూపాయల పనిని 74రూపాయలకు జగన్ రెడ్డి ఎలా చేయిస్తున్నాడు అన్న ఆశ్చర్యం పక్కరాష్ట్రాలకు కూడా ఉందని దేవినేని ఎద్దేవాచేశారు.

కేవలం తాను పనులు అప్పగించిన కంపెనీకి మేలు చేయడానికే జగన్ నేడు పోలవరం వెళ్లాడని, ఆ మేలు ఏవిధంగా, దేన్ని పెంచి చేయాలో కూడా ఆయనే అధికారులను ఆదేశించాడని ఉమా తెలిపారు. చంద్రబాబు కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న జగన్, గతప్రభుత్వం చేసిన పనులుగురించి మాట్లాడే సాహసంచేయడం లేదన్నారు. జాతీయప్రాజెక్ట్ లో దోపిడీచేయడానికే, రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారని, ల్యాండ్ అక్విజేషన్ లో గానీ, ఆర్ అండ్ ఆర్ లోగానీ ఒక్కరూపాయికూడా ఎందుకు ఖర్చుచేయలేకపోయారన్నారు. పీటర్ కమిటీ రిపోర్ట్ కేంద్రానికిచ్చి అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయబట్టే, నేడు జగన్ ప్రభుత్వం డీపీఆర్-2ను ఆమోదింపచేసుకోలేని దుస్థితికి వచ్చిందన్నారు. వందలు, వేలు, లక్షలకోట్ల అవినీతి జరిగిందన్నవారు, నేడుపోలవరం పనులు వివరాలను వెల్లడించలేకపోతున్నారో చెప్పాలన్నారు. టీడీపీప్రభుత్వం పునాదుల్లేని పోలవరం నిర్మిస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని 2021కి ఎలా పూర్తిచేస్తుందో సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. న్యాయం అడవులపాలైంది కాబట్టే, అన్యాయం రాజ్యమేలుతోందని, ఆ అన్యాయం, న్యాయం చేసిన పనులను ఒప్పుకోలేకపోతోందన్నారు. చంద్రబాబు హయాంలో పనులు జరుగుతుంటే, లక్షలాదిరైతులు వాటిని ప్రత్యక్ష్యంగా చూశారని, జగన్ మాత్రం ఒక్కనాడుకూడా పోలవరం వెళ్లలేదన్నారు. గతంలో చాలాసార్లు ఇదే అంశంపై జగన్ ని ప్రశ్నించామని, ఆయనెప్పుడూ నోరు మెదపలేదన్నారు. పోలవరం పునాదులే పూర్తి కానప్పుడు, జగన్ వైఎస్సార్ పేరుబ్రిడ్జికి పెడతానని ఎలా అంటున్నాడో తెలియడంలేదన్నారు.

ప్రజా చైతన్యయాత్రలో భాగంగా చంద్రబాబు విశాఖ పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారని, అటువంటప్పుడు ఆయన యాత్రకువెళ్లడానికి ఆలోచించాల్సిన అవసరమేముంటుందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఒప్పుకున్నాక, తానేదో విశాఖను బాగుచేసినట్లు, ఉత్తరాంధ్రను ఉద్ధరించినట్లు భావిస్తూ, మంత్రి బొత్స పర్యటనను అడ్డుకుంటానని చెప్పడం, వైసీపీనేతలారా మీరంతా అడ్డుకోండని పిలుపునివ్వడం దేనికి సంకేతమని వర్ల ప్రశ్నించారు. దేశంలో పిచ్చి బొత్సకే అలా మాట్లాడటం సాధ్యమైందని, రాజ్యాంగంపై ప్రకటన చేశాక, మామూలుగా మతి ఉన్నవారెవరూ అలాంటిప్రకటనలు చేయరని రామయ్య తెలిపారు. బొత్సప్రకటన తర్వాత పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, శాంతిభద్రతలు కాపాడాలనే సదుద్దేశంతో వారు పనిచేసి ఉండేవారని, బొత్సను, ఇతరవైసీపీనేతలను ముందస్తు అరెస్ట్ లు చేసి ఉండాల్సిందన్నారు. చంద్రబాబు గతంలో ఆత్మకూరు పర్యటనకు వెళుతుంటే, శాంతిభద్రతల సాకుతో ఆయన ఇంటిగేటుకు తాళ్లు కట్టి నిరోధించిన పోలీసులు, బొత్సను, ఇతర వైసీపీనేతలను ఎందుకు నిర్బంధించలేదో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

వైసీపీవారిని కట్టడిచేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబునాయుడి పర్యటనకు ఒకరోజు ముందు, డీజీపీ సవాంగ్ ముఖ్యమంత్రితో రహస్యంగా మాట్లాడాడని, వారిసంభాషణల్లోంచే చంద్రబాబు పర్యటనను ఎలాగైనా అడ్డుకొని తీరాలన్నదురాలోచన వచ్చిందన్నారు. విశాఖ వాసులెవరూ చంద్రబాబుని అడ్డుకోరన్న వర్ల, హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖ నగరాన్ని కాపాడటంకోసం తన రెండుచేతులు అడ్డుపెట్టిన వ్యక్తిగా... ఆయనపట్ల ఆనగర వాసులందరికీ ఉన్న సదభిప్రాయమే అందుకు కారణమన్నారు. చంద్రబాబు పాదం విశాఖలో పెట్టకుండా ప్రభుత్వమే కుట్ర పన్నిందన్నారు గతంలో విశాఖలో జగన్మోహన్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ చేపడతానంటే, పెట్టుబడుల సదస్సు జరుగుతున్న దృష్ట్యా, ఆనాడు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగిందన్నారు. టీడీపీ కార్యకర్తలెవరూ ఆనాడు, జగన్ ను అడ్డుకోలేదని, దాన్ని మనసులో పెట్టుకున్న ముఖ్యమంత్రి, కేవలం వీధిరౌడీలా, దుర్మార్గపు ఆలోచనలు చేసి, చంద్రబాబుని అడ్డుకునేలా యంత్రాంగం నడిపాడన్నారు. వైసీపీ నేతలు, వారు తీసుకొచ్చిన కిరాయివ్యక్తులే చంద్రబాబుని అడ్డుకున్నారన్న రామయ్య, అందుకు సంబంధించిన చిత్రాలను, దృశ్యాలను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. చంద్రబాబు విశాఖలో అడుగుపెడితే పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకొని చస్తానంటూ, హల్ చల్ చేసిన జెట్టి రామారావు, స్వయంగా మంత్రి బొత్సకు బంధువని వర్ల స్పష్టంచేశారు. రామారావు గత జీవితమేమిటో విశాఖ వాసులందరికీ తెలుసునని, ఆయన బొత్సకు ఎలాంటి బంధువో.. రామారావు సేవలు పొందినందుకు గాను కృతజ్ఞతతో బొత్స ఆయనతో బంధుత్వం కలుపుకున్నాడని వర్ల దుయ్యబట్టారు.

మరో మంత్రి అవంతి శ్రీనివాస్ కు రామరావు ముఖ్య అనుచరుడని, ఆయనకూడా సదరు జెట్టి వారి సేవలు పొంది ఉండవచ్చన్నారు. పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ వీరంగం వేసిన రామారావుని ఆపి తనిఖీచేస్తే, శీతలపానీయమైన ఫాంటా ను సీసాలో పోసి, పెట్రోల్ అని నమ్మించేలా ఓవరాక్షన్ చేసినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇద్దరు మంత్రులకు అతిసన్నిహితుడైన వ్యక్తి, కూల్ డ్రింక్ ను సీసాలో పొసుకొని, చాలా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తే అతనిపై పోలీసు వారు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకున్న అన్నల జాబితాలో గాజువాక, వేమూరు ఎమ్మెల్యేల కుమారులు తిప్పల వంశీరెడ్డి, మేరుగ కిరణ్ నాగ్ లు కూడా ఉన్నారని, ఈ విషయం వారి అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ లతోనే బయటపడిందన్నారు. వైసీపీవారే లేరని పిచ్చికూతలు కూస్తున్న బొత్స, అవంతి, రోజా, ఇతర వైసీపీనేతలు, తమపార్టీ ఎమ్మెల్యేల కుమారులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని వర్ల నిలదీశారు. అర్థరాత్రివేళ రాజధాని మహిళల ఇళ్లచుట్టూ తిరిగే పోలీసులు కిరణ నాగ్ ను, తిప్పల వంశీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. కందుకూరి కాంతారావు అలియాస్ కత్తి కాంతారావు అనే మరోప్రముఖవ్యక్తి కూడా చంద్రబాబు పర్యటనలో గోబ్యాక్ ప్లకార్డులు పట్టుకున్నాడని, ఆయన వైజాగ్ వైసీపీ స్టూడెంట్ యూనియన్ కి చెందిన నేత అని వర్ల చెప్పారు. (కాంతారావు ప్లకార్డు పట్టుకొని కూర్చున్న ఫొటోను విలేకరులకు చూపించారు.) జుట్టంతా ఊడిపోయి, 60ఏళ్ల వాడిలా, తన క్లాస్ మేట్ లా కనిపిస్తున్న కాంతారావు విద్యార్థివిభాగం నాయకుడు ఎలా అవుతాడో, కందుకూరి నుంచి ఆయన విశాఖకు ఎందుకొచ్చాడో శ్రీమతి రోజా చెబితే బాగుంటుందని రామయ్య చురకలు వేశారు.

చంద్రబాబుపై కడుపుమండి అందరూ ఆయన్ని అడ్డుకున్నారంటున్న రోజా, కందుకూరులో ఉండే కాంతారావు కి కడుపుమండితే విశాఖ ఎలా వచ్చాడో, ఎందుకొచ్చాడో చెప్పాలన్నారు. టీడీపీనేత గంటాపై పోటీచేసి ఓడిపోయిన కే.కే.రాజు చంద్రబాబు పర్యటనలో పోలీసులను తోసుకుంటూ, ముందుకు ఉరికాడని, అయినాకూడా వారు చోద్యం చూశారుతప్ప, ఆయన్ని అరెస్ట్ చేయలేదన్నారు. చంద్రబాబుని అడ్డుకోవడానికి తాను వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చానని, సాక్షి టీవీతో ఒకవ్యక్తి చెప్పాడని, ఆ వ్యక్తికి విశాఖలో ఏం పని అని, ఎవరు ఎంతసొమ్మిస్తే అతను అక్కడకు వచ్చాడో రోజా అక్క సమాధానం చెప్పాలన్నారు. రామారావు, కాంతారావు, వంశీరెడ్డి, కిరణ్ నాగ్, కే.కే.రాజు, వారి వెంట నడిచిన ఇతర వైసీపీనేతలు, కార్యకర్తలు ఎందుకు చంద్రబాబుని అడ్డుకున్నారో, ఎవరు పంపితే వారు ఆపనిచేశారో మంత్రి బొత్స, అవంతి, రోజా, అంబటి సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందస్తుగా, వివిధ ప్రాంతాలనుంచి డబ్బులు, మద్యం ఇచ్చిమరీ కిరాయి మూకలను పోగుచేసిందని, వారందరినీ చంద్రబాబుపైకి నడిపించడంకోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర కీలకనేతలకు బాధ్యతలు అప్పగించిందన్నారు. చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని, ప్రభుత్వం ఎందుకింతగా శ్రమించిందో, బరితెగించి అడ్డదారులు ఎందుకు తొక్కిందో బహిర్గతం చేయాలని రామయ్య మండిపడ్డారు. చంద్రబాబుని ఆపడానికి డబ్బులు, మద్యం, ఆహరపొట్లాలు పంచేబదులు, పోలీసులే ఆయనకు అనుమతులు నిరాకరించి ఉంటే బాగుండేదన్నారు. ప్రభుత్వం జరిపిన నేరపూరిత కుట్రలోభాగంగానే, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే ఈ తతంగ మంతా నడిపారన్నారు. రాజధాని మహిళలు గులాబీలిచ్చి, జై అమరావతి అనమని కోరినందుకే, వారిని అరెస్ట్ చేసి, ఈడ్చుకెళ్లిన పోలీసులు, చంద్రబాబు పర్యటనలో వీరవిహారం చేసిన వైసీపీనేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదో, చేయకపోతే ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read