జగన్ ప్రభుత్వం పై, మరోసారి కేంద్రం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే చురకలు అంటించారు. ఇప్పటికే పోలవరం, పీపీఏల విషయంలో జగన్ మోహన్ రెడ్డి పై, కేంద్రం బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విధ్యత్ పీపీఏల పునఃసమీక్ష విషయం, ఇప్పటికీ కేంద్రాన్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఫ్రాన్స్, జపాన్ దేశాలు కేంద్రానికి, ఈ పీపీఏల సమీక్ష పై, ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. మరో పక్క దావోస్ లో జరిగిన, పెట్టుబడులు సదస్సులో కూడా, చాలా మంది పారిశ్రామిక వేత్తలు, ఇలా ఒక ప్రభుత్వం మారగానే, మరో ప్రభుత్వం వచ్చి ఒప్పందాలు సమీక్ష చేస్తాం, రద్దు చేస్తాం అని బెదిరిస్తుంటే, మేము మీ దేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి, మాకు భరోసా ఏది అంటూ, కేంద్రం మత్న్రి, పీయూష్ గోయల్ ని నిలదీశారు అనే విషయం వార్తల్లో కూడా వచ్చింది. ఇదే విషయం పై, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, మొన్న జగన్ ని కలిసిన సమయంలో, వివరణ కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

piyush 27022020 2

అయితే ఇప్పుడు మరోసారి కేంద్రం, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, జగన్ ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జగన్ ప్రభుత్వం పై నేరుగా ఆరోపణలు చెయ్యకుండా, దక్షిణాదిన ఒక రాష్ట్రం అంటూ, అందరికీ అర్ధం అయ్యేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒక సదస్సులో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దక్షిణాదిన ఒక రాష్ట్రం తీసుకున్న పీపీఏల పునఃసమీక్ష వల్ల, దేశం పరువు కూడా పోతుంది అంటూ, పియూష్ గోయాల్ వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంలో మీకు ఎవరైనా అక్కడ వాళ్ళు తెలిస్తే, మీరైనా వారికి, ఈ నష్టం గురించి చెప్పండి అంటూ, తన నిస్సహాయతను కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేసారు అంటే, ఇటు వైపు ఎంత మొండిగా ఉన్నారో, దాని వల్ల దేశం కూడా ఎలా నష్టపోతుంది అనేది అర్ధం అవుతుంది.

piyush 27022020 3

కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ దేశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చెయ్యాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇలాగే ఒప్పందాలు సమీక్ష చేసి, పెట్టుబడి పెట్టే కంపెనీలను నష్ట పరిచే విధంగా చేస్తే, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులు, రిజర్వ్ బ్యాంక్ తో మాట్లాడి, ఆ నిధులు కట్ చేస్తాం అంటూ, పియూష్ గోయల్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇలా పీపీఏల సమీక్షలు చేసుకుంటూ పొతే, దేశం పరువు కూడా పోతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి అంటూ, నిర్మోహమాటంగా కేంద్రమంత్రి చెప్పారు. పీపీఏ ల విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష పడేలా ఉండాలని, కాని దేశం పరువు తీస్తే ఎలా అంటూ, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సెహ్సారు. సీఐఐ లాంటి సంస్థలు, ఈ సమస్య ఎలా పరిష్కారం చెయ్యాలో సూచనలు ఇవ్వాలి అంటూ కోరారు.

 

విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును అడ్డుకుని ప్రభుత్వం సాగించిన దారుణ కాండను ప్రజలంతా చూశారని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కక్షపూరితంగా అడ్డుకోవడం క్షమించరాని నేరమని టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రమయ్య మండిపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై జరిగిన దాడి ప్రభుత్వం చేయించిన దాడేనని, అందుకు శ్రీకారం జగన్మోహన్ రెడ్డి ఇంటిలోనే జరిగిందని రామయ్య తెలిపారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 10 రోజుల క్రితమే తాను విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఆయన హోదాకు, గౌరవానికి తగ్గట్టు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు ఆ విషయాన్ని విస్మరించిందన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని మంత్రులు, వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినా ప్రభుత్వం(పోలీసులు) ఎందుకు పెడచెవిన పెట్టిందని రామయ్య నిలదీశారు. చంద్రబాబు పర్యటన దృష్టా విశాఖలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి, ముందు జాగ్రత్తగా వైసీపీ నేతలు, మంత్రులను గృహ నిర్భందం చేయకుండా ఎందుకు వదిలేశారో చెప్పాలన్నారు. పర్యటనను అడ్డుకుంటామన్నవారిని వదిలేసి ఇరు వర్గాల వారు విమానాశ్రయంలోకి చొచ్చుకొస్తున్నా పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించారో, ఎవరి ఆదేశాలతో అలా వ్యవహరించారో సమాచారం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల హక్కులు కాలరాయబడ్డాయని, ప్రజా స్వామ్యం చచ్చిపోయిందని, రాజ్యాంగం పక్కకు నెట్టబడిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో విఫలమైన అసమర్థ ప్రభుత్వాన్ని, వైసీపీ మూకలను నిరోధించలేని దద్ధమ్మ ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇలానే చేసుంటే, ఆయన జనంలో తిరగగలిగేవాడా అని రామయ్య ప్రశ్నించారు. సిగ్గు, లజ్జ లేని పరిపాలన రాష్ట్రంలో సాగుతోంది కాబట్టే, వైసీపీ ముష్కర మూకలు చంద్రబాబును అడ్డుకున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేని జగన్ పాలనలో ప్రతిపక్ష నేత వాహన శ్రేణిపై చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసరడం దుర్మార్గమన్నారు. జగన్ పాదయాత్రలో ఆయనపై ఏనాడైనా ఇలాంటివి విసరడం జరిగిందా అని రామయ్య ప్రశ్నించారు. పనికిమాలిన పాలనా యంత్రాంగం రాష్ట్రంలో సాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనమేముంటుందన్నారు. పసుపు రంగు చీరలు కట్టుకోమని చెప్పి, రూ.500 ఇచ్చి కిరాయి వ్యక్తులను తీసుకొచ్చి చంద్రబాబు పర్యటనకు వైసీపీ ప్రభుత్వం అవాంతరాలు సృష్టించిందన్నారు.

కోడిగుడ్లు, చెప్పులు, టమాటాలు విసరడం, రోడ్లపై పడుకోవడం, పెద్ద పెద్ద కేకలు వేయడం, నడి రోడ్డుపై రా... తేల్చుకుందామంటూ సవాళ్లు విసరడం, చంద్రబాబును అడ్డగించడం వంటి చర్యలు రాబోయే రోజుల్లో విశాఖ వినాశనానికి సంకేతాలనే విషయాన్నిఆ నగర వాసులు గ్రహించాలన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ముసుగులో జగన్మోహన్ రెడ్డి చూపించబోయే సినిమాకి నేడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంటుందని విశాఖ వాసులు తెలుసుకోవాలన్నారు. జగన్ విశాఖలో అడుగు పెట్టాక నేడు విసరబడిన చెప్పులు, రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు... బాంబులు, కాటా కత్తులుగా మారుతాయని రామయ్య హెచ్చరించారు. జగన్ విశాఖలో ఉంటే ప్రజలు ఎంతటి భయ భ్రాంతులతో జీవించాల్సి ఉంటుందో చెప్పడానికి ఇప్పడు జరిగింది చిన్న ఉదాహరణ మాత్రమేనన్నారు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తన తాత సాంప్రదాయాన్ని పులివెందుల ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని చూపించబోతున్నాడన్నారు. విశాఖలో శాంతి స్థానంలో అశాంతి మొదలైందని, మున్ముందు ప్రజలకు మనశ్శాంతి కరువవడం ఖాయమని వర్ల తెలిపారు.

ముఖ్యమంత్రి చేస్తున్నపాలన మహిళలపై ఇనుపపాదాలు మోపడానికి, ప్రశ్నించినవారిని అరెస్ట్ చేయడానికి, తప్పుడు కేసులుపెట్టడానికి, ప్రతిపక్షనేతను అడ్డుకోవడానికి తప్ప, ప్రజలకు మేలు చేయడానికి పనికిరావడంలేదన్నారు. జగన్ పాలన ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడానికి, దోపిడీలు, కబ్జాలు సాగించడానికి పనికొచ్చేదిగా ఉందన్నారు. జగన్ పాలనపై ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. విశాఖ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తారా అన్న విలేకరులు ప్రశ్నకు సమాధానంగా రామయ్య మాట్లాడుతూ, ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగతే పోలీసులకు చెబుతామని, పోలీసులే ఇబ్బందిపెడితే ఎవరికి చెప్పుకుంటామని, డీజీపీకి ఎన్నిఫిర్యాదులు చేసినా, పరిస్థితి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది తప్ప, మార్పులేదన్నారు. డీజీపీ సమదృష్టితో వ్యవహరించడం లేదని, ఆయన చట్టబద్ధంగా వ్యవహరిస్తే, చంద్రబాబు ఇంటికి తాళ్లెందుకు కట్టాల్సి వస్తుందని రామయ్య నిలదీశారు. విశాఖలో వైసీపీకిరాయి మూకలు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయబోతున్నాయని తెలిసికూడా, డీజీపీ మౌనంగా ఉన్నాడని, అటువంటి వ్యక్తికి ఏం చెప్పినా ఉపయోగమేముంటుందని వర్ల వాపోయారు. రాష్ట్రంలో ఇటువంటి నిస్సహాయ, అసహాయ డీజీపీని తానెప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్రప్రజలను జగన్ ప్రభుత్వం నుంచి దేవుడే కాపాడాలి తప్ప, ఏవ్యవస్థలు కాపాడలేవని వర్ల తేల్చిచెప్పారు.

రాజకీయ నాయకులు ఏదైనా పర్యటన చెయ్యాలి అంటే, ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుంటారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, పర్మిషన్ ఇస్తారు పోలీసులు. ఒక్కోసారి, షరతులు కూడా పెడతారు. ఒకసారి పర్మిషన్ ఇచ్చారు అంటే, ఆ పర్యటన బాధ్యత పోలీసులే తీసుకువాలి. ఈ రోజు చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాలో ప్రజాచైతన్య యాత్ర కోసం, టిడిపి శ్రేణులు, పోలీసులను కలవటం, షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 50 మంది నాయకులు మాత్రమే ఉండాలని షరతు పెట్టారు. ఆ అనుమతి ప్రకారం, చంద్రబాబు గారు, ఈ రోజు వైజాగ్ వచ్చారు. అయితే అనూహ్యంగా అక్కడ వైసీపీ అల్లరి మూకలు వచ్చి, వీరంగం సృష్టించాయి. గుడ్లు, రాళ్ళు, టమాటాలు, చెప్పులు వేసి వీరంగం సృష్టించారు. 50 మందిని మాత్రమే అనుమతి ఇస్తాం అని చెప్పిన పోలీసులు, మరి అంత మంది వైసీపీ నాయకులను ఎలా అనుమతి ఇచ్చారు అంటే, ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న నాయకుడు పట్ల పోలీసులు ఇలా ఎందుకు ప్రవర్తించారో అర్ధం కావటం లేదు.

ఇక తరువాత, నాలుగు గంటల పాటు, వైసీపీ మూకలు, చంద్రబాబుని నిర్బందిచాయి. అయితే అనూహ్యంగా పోలీసులు మాత్రం చోద్యం చేస్తూ కూర్చున్నారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిని నాలుగు గంటల పాటు రోడ్డు పై, వైసీపీ మూకలు అడ్డుకుంటే, వారిని ఏమి అనకుండా, పోలీసులు వచ్చి చంద్రబాబుని అరెస్ట్ చేసారు. దీంతో తెలుగుదేశం నేతలు ఆశ్చర్య పోయారు. పర్మిషన్ ఇచ్చి, ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చేలా చేసి, రోడ్డు మీద అడ్డుకునేలా ప్లాన్ చేస్తే, చంద్రబాబుని అడ్డుకున్న వారిని, అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని ఎదురు ఆరెస్ట్ చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అమరావతిలో రోజాని అడ్డుకున్నారని, ప్రజల పై లాఠీ చార్జ్ చేసి, 400 మంది పై కేసులు పెట్టిన పోలీసులు, చంద్రబాబు విషయంలో రివర్స్ లో చేసారు. మరి ఎవరి ఒత్తిడితో ఇలా చేసారో ?

అంతకు ముందు తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు వాహనం నుంచి కిందకు దించారు. విమానాశ్రయంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. వాహనం దిగిన తర్వాత చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎలా తనను అడ్డుకుంటారని ప్రశ్నించారు. విశాఖ పర్యటనకు వస్తే.. తమపై దారుణంగా ప్రవరిస్తున్నారని తెదేపా అదినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు. విశాఖ పర్యటనలో తమపై వైకాపా శ్రేణులు దాడి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గంట, రెండు గంటలు ఆగితే పంపిస్తామని పోలీసులు చెప్పారని... ఇప్పుడేమో వెనక్కి వెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ చట్టం కింద వెనక్కి వెళ్లాలని చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను చట్టాన్ని ఉల్లంఘించనని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్న చంద్రబాబు.. నిజమో? కాదో? ప్రజలే తేలుస్తారన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని వైజాగ్ లో అరెస్ట్‌ చేయటం పై, తెలుగుదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. హుటాహుటిన, హైకోర్టులో టీడీపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పోలీసులు ముందుగా, చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చారని, మళ్లీ దాన్ని రద్దు చేసి, అరెస్ట్ చెయ్యటం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. చంద్రబాబు వైజాగ్ పర్యటన కొనసాగించేలా చూడాలి అంటూ, టీడీపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 5 గంటలపాటు విశాఖ విమానాశ్రయంలోనే ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్‌ 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు, చంద్రబాబుని ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత భారీ భద్రత మధ్య చంద్రబాబును విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లారు. అరగంట పాటు అక్కడ ఉంచడానికి ఏర్పాట్లు చేశారు.

విశాఖ పర్యటనకు వస్తే, తమపై దారుణంగా ప్రవరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు. విశాఖ పర్యటనలో తమపై వైకాపా శ్రేణులు దాడి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గంట, రెండు గంటలు ఆగితే పంపిస్తామని పోలీసులు చెప్పారని... ఇప్పుడేమో వెనక్కి వెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ చట్టం కింద వెనక్కి వెళ్లాలని చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను చట్టాన్ని ఉల్లంఘించనని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్న చంద్రబాబు.. నిజమో? కాదో? ప్రజలే తేలుస్తారన్నారు. మేము వస్తుంటే, ఎందుకు అంత భయం అని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై వైసీపీ నేతలు ఎందుకంత ఉలికిపాటుకు గురవుతున్నారని, ఆయన ప్రజల్లోకి వెళుతుంటే, ఆంక్షలు, అనుమతులతో అడ్డుకోవడం ఏంటని టీడీపీ సీనియర్ నేత, మాజీ విప్ కూనరవికుమార్ నిలదీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్న తీరుపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరునే, గతంలో చంద్రబాబు అనుసరించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను ఒక్క అంగుళమైనా చేయగలిగి ఉండేవాడా అని రవికుమార్ ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడటం కోసం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంతో లాలూచీపడిన జగన్, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఢిల్లీ వారితో దాగుడుమూతలు ఆడాడన్నారు. మతికోల్పోయి మాట్లాడుతున్న బొత్స, తన వ్యవహారాలు చంద్రదబాబు బయటపెడతాడన్న భయంతోనే ఆయనకు గోబ్యాక్ చెబుతానంటున్నాడని రవికుమార్ తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read