ప్రతిపక్షంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి, అప్పటి చంద్రబాబు పరిపాలన పై, పెట్రోల్ డీజిల్ రెట్లు పెంచేస్తున్నారు అంటూ, గొడవ గొడవ చేసేవారు. దేశంలో ఎక్కడా లేని రెట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి అంటూ విమర్శలు చేసేవారు. తన సాక్షి పత్రిక, టీవీలో కూడా, అనేక వ్యతిరేక కధనాలు వేసే వారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు కూడా, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పారు. కాని, ఇప్పుడు నెల రోజుల్లోనే రెండో సారి పెట్రోల్, డీజిల రేట్లు పెంచేసారు. నెల రోజుల క్రితం ఏపిలో పెట్రోల్, డీజిల పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం, అది మర్చిపోక ముందే, ఈ రోజు మరోసారి, రేట్లు పెంచేసింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ పెంచుతూ, ఈ రోజు జీవో ఇచ్చింది. లీటరు పెట్రోల్‌పై ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్‌తోపాటు అదనంగా 2 రూపాయలు తీసుకునే వారు. ఇప్పుడు వ్యాట్‌+రూ.2.76 వసూలు చేసారు. అంటే, పెట్రోల్ పై 76 పైసలు పెంచారు. ఇక డీజిల్ పై, 22.25 వ్యాట్‌+రూ.2 గా ఉండగా, దాన్ని 22.25+3.07కు మార్చారు. అంటే, డీజిల్ రూ.1.07 పెరగనుంది. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.

పెట్రోలు, డీజిల్ ధరలు తక్షణం తగ్గించాలి : కె ఇ కృష్ణ మూర్తి డిమాండ్ ... పెట్రోలు, డీజిల్ ధరలు నెలలో రెండుసార్లు పెంచి గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడంపై జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెదేపా నేత కె ఇ కృష్ణ మూర్తి డిమాండ్ చేశారు. గత నెలలోనే వ్యాట్‌లో సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి, అది మరవక ముందే మరోసారి పెట్రోల్ ధరలు పెంచడం సరికాదని ఆయన సూచించారు. ఇప్పుడు పెట్రోల్ లీటర్‌పై 76 పైసలు, డీజిల్ లీటర్ రూ.1.07 పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం ధరలు పెంచి ప్రజలపై భారం మోపడమే పాలనలా మారిందని ఎద్దేవా చేశారు. మాటలను మార్చడంలో ఘనుడు జగన్ అని మరోసారి రుజువయిందన్నారు. మాట తప్పను మడం తిప్పనన్న జగన్ ఇప్పుడు మాట, మడాన్ని అష్టవంకరలు తిప్పాడని విమర్శించారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచని విధంగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో పెట్రోలు, డీజిలు ధరలు ఉన్నందున తగ్గించాలని అసెంబ్లీలో మాట్లాడి ఆందోళనలు నిర్వహించిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ, విద్యుత్ ధరలు నానాటికీ పెంచడం జగన్ పాలన్ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. జ్ఞాపకశక్తి కోల్పోయి ప్రవర్తించడం జగన్ కే చెల్లుబాటయిందన్నారు. పెంచిన పెట్రోలు, డీజిలు ధరలు తక్షణం తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించే వరకూ ప్రజల పక్షాన పోరాటానికి తెదేపా సిద్ధం అని హెచ్చరించారు.

విశాఖపట్నంలో చంద్రబాబు గారి యాత్రకు పర్మిషన్ ఇచ్చి, ఎక్కవు సంఖ్యలో వైసీపీ అభిమానులు వచ్చేలా చేసి, వారిని అడ్డుకోకుండా చేసినందుకు, వారిని అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేసారు అంటూ, హైకోర్ట్ పోలీసులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, అక్కడ అడ్డుకున్న వైసీపీ నాయకుల ఫోటోలు మీడియాకు విడుదల చేసారు. ఇవే ఫోటోలు, వీడియోలు కోర్ట్ కు కూడా ఇవ్వటానికి సిద్ధం అయ్యారు. దీంతో, పోలీసులకు, ఇక తప్పని పరిస్థితి. రెండో తారీఖు వాయిదా ఉండటంతో, ఈ రోజు, అంటే సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత, వైసీపీ వారిని అరెస్ట్ చేసారు. 32 మంది వైసీపీ కార్యకర్తలతో పాటుగా, 20 మంది టీడీపీ కార్యకర్తల పై కూడా కేసు పెట్టారు. అలాగే ఎయిర్‌పోర్టు దగ్గర ఆ-త్మ-హ-త్య-కు ప్రయత్నం చేసిన రామారావు పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఎస్‌ఐ పై దాడి చేసిన వైసీపీ మహిళా నేత కృపాజ్యోతిపైనా కేసు నమోదు చేసి, ఆమెను కూడా అరెస్ట్ చేసారు.

court 29022020 2

మరో పక్క తెలుగుదేశం నేతలు, జరిగిన ఘటన పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీలోనే కాదు దేశంలో అభివృద్ధి చంద్రబాబుకు మరోపేరుగా కీర్తి గడించారని, అరాచకమే జగన్ కు మారుపేరుగా చెడ్డపేరు తెచ్చుకున్నారని తెదేపా నేతలు అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు విమర్శించారు. 9 నెలల పాలనలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే ప్రజాదరణమిన్నగా ఉన్న చంద్రబాబు పర్యటనకు జగన్ ఈర్ష్యతో అడ్డంకులు సృష్టించడం తగదని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు తగిన రక్షణ కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అరాచాకావాదులను మంత్రులు ప్రోత్సహించి పంపినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం జగన్ ఫ్యాక్షనిస్టు మనస్తత్వానికి నిదర్శమని దుయ్యబట్టారు. అభివృద్ధికి చంద్రబాబు కేరాఫ్ అడ్రసయితే అరాచాకవాదులకు అడ్డగా వైకాపాను పోషించడం జగన్ హేయమైన చర్య అన్నారు. బాధితులపైనే కేసులు పెట్టడం వైకాపా ప్రభుత్వ నైజం మారిందని అనేక సంఘటనలు ఉదహరించారు. అమరావతికి మద్దతు పలకమని కోరిన రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర వైకాపా ఎంపీ నందిగం సురేష్ దని ఆక్షేపించారు. విశాఖలో పర్యటనకు అనుమతి తీసుకుని వెళ్ళిన చంద్రబాబును అడ్డుకోవడమే కాకుండా ఆయనపై 151 కింద అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు.

court 29022020 3

విశాఖలో చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డుపడి అల్లరులు సృష్టించి ఏపీని బీహార్ కంటే ఘోరంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాష్ట్రంగా మార్చాలని జగన్ ప్రయత్నిచడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజల్లో నిర్భయంగా పర్యటన జరిపే సత్తా , దమ్ముకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అన్నారు. ఎవరు అడ్డుకున్నా త్వరలోనే విశాఖలో చంద్రబాబు పర్యటన జరిపి తీరుతారని సవాల్ విసిరారు. అధికారమదంతో చేసిన తప్పులకు ముఖం చూపించలేక తెర చాపల వలల మధ్య జగన్ పలాయనవాదానికి నిదర్శనం ఎద్దేవా చేశారు.
ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిద్రాహారాలుమాని కృషి చేస్తే జగన్ రాష్ట్ర విధ్వంసానికి పాల్పడుతున్నాడని అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు చంద్రబాబు పర్యటనకు పూనుకుంటే సహించలేని జగన్ పోలీసులతో అరాచకానికి సిద్ధపడటం హేయమైన చర్యని విమర్శించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రోజుకు18 గంటలపాటు చంద్రబాబు పని చేసి అనేక పరిశ్రమలు నెలకొనేలా చేశారన్నారు.

గత 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 5 లక్షల ఉద్యోగాలు తెచ్చి పెట్టిన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు.ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తిని నమ్మి జగన్ కు అధికారం ఇచ్చి బంగారు గుడ్డు పెట్టె బాతును చంపుకున్నామని ప్రజలు ఆవేదన భరితులవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని రకాల వైఫల్యాలకు కారణమై ప్రజల్లో తిరగలేని దుస్థితికి జగన్ సిగ్గు పడాలన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం చంద్రబాబు తత్వమని, ప్రజలకు కష్టాలు, ఇబ్బందులు సృష్టించడం జగన్ నైజమని విమర్శించారు. నాడు తండ్రి వైఎస్ అప్పటి ముఖ్యమంత్రులను మార్చడానికి హైదరాబాద్ లో మతకలహాలకు ఆజ్యం పోశాడు... నేడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న ప్రజాస్పందనను తట్టుకోలేక ఆయన పర్యటనను అడ్డుకోడానికి జగన్ పోలీసులతోనే అల్లర్లు, అశాంతికి కారణమవడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతికాముకులైన విశాఖ ప్రజలకు వైసీపీ ఫ్యాక్షన్ రుచి చూపించడం సహించరాని నేరమని విమర్శించారు.

ఫిబ్రవరి 28, 1999న మైక్రోసాఫ్ట్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని, నాటి సీఎం చంద్రబాబునాయుడు, బిల్ గేట్స్ కలిసి ప్రారంభించారని, అది జరిగిసరిగ్గా 21 సంవత్సరాలైందని, నాడు ప్రారంభించిన ఆ కేంద్రం, నేడు కనిపిస్తున్నసైబరాబాద్ నగర నిర్మాణానికి బీజం వేసిందని టీడీపీనేత, ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సైబరాబాద్ ద్వారా నేడు 13లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని, లక్షకోట్ల పైబడి ఐటీ ఎగుమతులను నేడున్న ప్రభుత్వం ఎగుమతి చేస్తోందంటే, అందుకుకారణం నాడు చంద్రబాబు వేసిన బీజమేనని మాల్యాద్రి స్పష్టంచేశారు. సైబరాబాద్ అభివృద్ధి ద్వారానే నేడు తెలంగాణ ప్రభుత్వానికి 60 శాతం వరకు ఆదాయం వస్తోందన్నారు. ఆనాడు చంద్రబాబు నాటిన మైక్రోసాఫ్ట్ డెవలప్ మెంట్ కేంద్రమనే చిన్నమొక్క, నేడు మహావృక్షంగా మారిందని, అందుకు కారణం చంద్రబాబుకు ఉన్న దూరదృష్టేనని టీడీపీనేత కొనియాడారు. దేశంలోనే ఐటీరంగంలో హైదరాబాద్ 4వస్థానంలో ఉండటానికి కూడా చంద్రబాబు దూరదృష్టే కారణమైందన్నారు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ చంద్రబాబు ఘనతేనని, తెలంగాణ ఐటీశాఖామంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ వ్యాఖ్యానించారని, చంద్రబాబునాయుడు తన సర్వశక్తులు ఒడ్డి, ఆ సంస్థను తీసుకొచ్చారనికూడా ఆయన చెప్పడం జరిగిందన్నారు. (కేటీఆర్ వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు). (మైక్రోసాఫ్ట్ సీఈవో నాదెళ్ల సత్య కూడా చంద్రబాబు పడినకష్టాన్ని, రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు తీసుకురావడానికి ఆయన చేసిన కృషిని కొనియాడిన వీడియోనుకూడా చూపడం జరిగింది.)

హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చెందిన సైబరాబాద్ ను చూడటానికి ఇప్పుడు రెండుకళ్లు చాలడంలేదని, ఆనాడు చంద్రబాబు అక్కడ హైటెక్ సిటీని నిర్మిస్తే, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్. దాన్ని తప్పుపడుతూ నోటికొచ్చినట్లుగా విమర్శించాడన్నారు. దూరదృష్టి కలనేతగా చంద్రబాబుచేసిన కృషి ఫలితంగా సైబరాబాద్ సాక్షాత్కరించిందన్నారు. సైబరాబాద్ సృష్టించిన తన అనుభవంతో, అన్యాయంగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు అమరావతికి అంకురార్పణ చేయడం జరిగిందన్నారు. రూపాయి ఖర్చులేకుండా రైతుల త్యాగంతో 34వేల ఎకరాలను సేకరించి, రూ.10వేలకోట్ల వరకు ఖర్చుచేసి, గడచిన ఐదేళ్లలో రాజధానిని నిర్మించడం జరిగిందని మాల్యాద్రి వివరించారు. చంద్రబాబు పాలనలోనే అమరావతి కేంద్రంగా ఎస్ ఆర్ ఎం ‍యూనివర్శిటీ, నిట్, అమృత వంటి విద్యాసంస్థలు ఏర్పడ్డాయన్నారు. సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థను కూడా అమరావతిలో ఏర్పాటుచేసేలా ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలను, జగన్ అధికారంలోకి రాగానే రద్దుచేశాడని, సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థను కూడా సాగనంపాడన్నారు. సింగపూర్ అంకురపరిశ్రమల ఏర్పాటు ఒప్పందం అమలైఉంటే, రాష్ట్రంలోకి రూ.50వేలకోట్ల పెట్టుబడులతోపాటు, 12లక్షల 50వేల ఉద్యోగాలు కూడా వచ్చిఉండేవన్నారు.

అమరావతి అభివృద్ధికి అతిముఖ్యమైన సింగపూర్ అంకురపరిశ్రమల ఒప్పందం ద్వారా, రాష్ట్రానికి 60శాతం వరకు ఆదాయం వచ్చి ఉండేదని, అమరావతి కేంద్రం రూ.2లక్షలకోట్ల ఆస్తి ప్రభుత్వానికి లభించి ఉండేదని, ఇవేవీ ఆలోచించకుండా జగన్ తన అజ్ఙానంతో వాటిని తరిమేశాడని మాల్యాద్రి మండిపడ్డారు. చంద్రబాబు దూరదృష్టితో చేసిన ఆలోచనను, తన స్వార్థంకోసం, విశాఖలో తనకున్న భూములను అమ్ముకోవడం కోసం, బీచ్ శాండ్ వ్యాపారం కోసం జగన్ నాశనం చేశాడన్నారు. జగన్ తరిమేసింది సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థలను కాదని, 13జిల్లాల, 175 నియోజకవర్గాల అభివృద్ధి మూల కేంద్రాన్నని గురజాల తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన 9నెలల్లోనే రూ.లక్షా 80వేలకోట్ల విలువైన పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పడానికి, ఒక ఆంధ్రుడిగా సిగ్గుపడుతున్నానని మాల్యాద్రి చెప్పారు. చంద్రబాబు ఓటమి, జగన్ గెలుపుకారణంగా రాష్ట్రం అనేకవిధాలుగా నష్టపోయిందన్నారు. భావితరాల భవిష్యత్ ను, రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు దూరదృష్టితో చేసిన ఆలోచనలను చిదిమేయడం ద్వారా జగన్ రాష్ట్రానికి దుష్ఫలితాలే మిగిల్చాడన్నారు. రాష్ట్ర యువత, విద్యార్థులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఒకేరాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో ముందుకుసాగాలని, అమరావతిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టాలని మాల్యాద్రి పిలుపునిచ్చారు.

ఉగాదినాటికి 25 లక్షల ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ఆత్రంలో, పేదల ఇళ్లను పీకి పందిరేసే కార్యక్రమాన్ని జగన్ నిరాటంకంగా సాగిస్తున్నాడని, రాష్ట్రవ్యాప్తంగా తరతరాలనుంచీ పేదలహక్కుభుక్తంలో ఉన్న 4వేల ఎకరాలను ఇంటిస్థలాల పేరుతో జగన్ ప్రభుత్వ కాజేసిందని టీడీపీసీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు సాగుచేసుకుంటున్న 350 ఎకరాలను ఇప్పటికే కాజేశారని, నందిగామ నియోజకవర్గంలోని ఐతవరంలో రూ.64లక్షల విలువచేసే భూమిని, ఇళ్లస్థలాలపేరుతో రూ.32 లక్షలకే కొట్టేయడానికి స్థానికంగా ఉండే వైసీపీ నేత దళారీగా మారాడన్నారు. అధికారుల అండతో, రైతులను, మహిళలను దళారులుగా చిత్రీకరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కునే తంతుని జగన్ ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తోందన్నారు. ఉగాదినాటికి 25లక్షల ఇళ్లస్థలాలు ఇచ్చాననే కీర్తికోసం, గ్రామాల్లో కంటికి కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ కబ్జా చేసేక్రతువుని జగన్ ప్రభుత్వం నిర్విఘ్నంగా సాగిస్తోందని దేవినేని మండిపడ్డారు. చెరువులు, పోరంబోకు, అసైన్డ్ భూములు, పాఠశాలల స్థలాలు, శ్మశానాలు, దేవాదాయ, అటవీభూములు సహా వేటినీ వదలడం లేదన్నారు. విశాఖపట్నంలో చంద్రబాబునే అరెస్ట్ చేశాం...మీరెంత అంటూ సామాన్యులను వైసీపీనేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.

తాము అడిగినరేటుకే భూమి అమ్మాలంటూ, పెట్టమన్నచోట సంతకం పెట్టాలంటూ భూములు గుంజుకుంటున్నారని దేవినేని తెలిపారు. 70 గదుల ఇంటిలో, రాజప్రాసాదాల్లో నివాసముండే జగన్మోహన్ రెడ్డి, పేదలకు మాత్రం సెంటు భూమి చాలని చెప్పడం సిగ్గుచేట్టన్నారు. జగన్ ప్రభుత్వం సెంటుప్రభుత్వమని ఎద్దేవాచేసిన దేవినేని, పేదలకిచ్చే సెంటుభూమిలో రాజప్రాసాదాలు ఎలాకట్టాలో చెప్పాలన్నారు. టీడీపీ హయాంలో ఇళ్లస్థలాలకు పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో రెండున్నరసెంట్లవరకు ఇవ్వడం జరిగిందన్నారు. జగన్ చేస్తున్నపనులేమిటో ఆయనకే తెలియడంలేదని, లక్షల, లక్షల జీతాలు తీసుకుంటున్న ఆయన సలహాదారులు ఏం చేస్తున్నారని ఉమా మండిపడ్డారు. జక్కంపూడిలో టీడీపీప్రభుత్వం నిర్మించిన 8,500ఇళ్లు నివాసముండటానికి సిద్ధంగా ఉన్నాయని, వాటికి సున్నమేసి పేదలకు ఇవ్వడానికి జగన్ కు మనసు రావడంలేదన్నారు. నెల్లూరు, తిరుపతి, విశాఖ వంటి ప్రాంతాల్లో కూడాపేదలకోసం ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు. అవన్నీ లబ్దిదారులకు అప్పగిస్తే, వారంతా చంద్రబాబు పేరే చెబుతారన్న, అసూయతోనే జగన్ వాటిని గాలికొదిలేశాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల53వేల173 ఇళ్లను టీడీపీప్రభుత్వం పూర్తిచేసిందని, 6లక్షల15వేల638 వరకు పూర్తికావడానికి సిద్ధంగా ఉన్నాయని, జగన్ అధికారంలోకి వచ్చాక అవన్నీ దయ్యాలకు ఆవాసాలుగా మారాయన్నారు.

అప్ప్పులుచేసి పేదలు నిర్మించుకున్న 4లక్షల 37వేల ఇళ్లను జగన్ సర్కారు రద్దుచేసిందని, ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇవ్వాల్సిన రూ.1100కోట్ల బకాయిలను నిలిపివేసిన జగన్ సర్కారు పేదలను కాల్చుకు తింటోందన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్లను బుద్ధి, జ్ఞానం ఉన్న ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయదన్నారు. ఏపనులు చేసినా వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించాలంటే, అందుకోసం 10 నుంచి 20 శాతం కమీషన్ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకుంటున్నాడన్నారు. పేదలు కమీషన్లు ఇవ్వరనే, వారికివ్వాల్సిన బకాయిలను నిలివేశారా అని ఉమా నిలదీశారు. ఇంతజరుగుతుంటే, బుగ్గన ఏం చేస్తున్నాడని దేవినేని ప్రశ్నించారు. నన్నయ తెలుగువిశ్వవిద్యాలయానికి చెందిన 20 ఎకరాలను మింగేస్తే, తెలుగుని ఉద్దరిస్తామంటున్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, లక్ష్మీపార్వతి ఏం గడ్డి పీకుతున్నారని ఉమా దుయ్యబట్టారు. దేశంలో ఏరాష్ట్రంలో జరగని దుర్మార్గాలన్నీ ఏపీలోనే జరుగుతున్నాయన్నారు. ప్రకాశం (కంచరగుంట), గుంటూరు, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు (అటవీభూములు), పశ్చిమగోదావరి జిల్లాల్లో భూదోపిడీ విచ్చలవిడిగా సాగుతోందన్నారు. ఇష్టరాజ్యంగా గ్రామాల్లో పేదల భూములను లాగేసుకుంటున్నారని, 25లక్షల ఇళ్ల పట్టాల్లో లెక్కకోసం, టీడీపీప్రభుత్వం ఇచ్చిన 5లక్షల పట్టాలను జగన్ ప్రభుత్వం లాగేసుకుందన్నారు.

పోలవరం పనుల్లో నిన్నటివరకు రూ.20వేలకోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేసిన జగన్, సాక్షిమీడియా, ఇప్పుడు రూ.25వేలకోట్లంటూ సరికొత్త రాగం ఆలపిస్తోందని ఉమా ఎద్దేవాచేశారు. రూ.16వేలకోట్ల ప్రాజెక్ట్ అంచనావ్యయాన్ని, రూ.57,940కోట్ల వరకు పెంచారని చేసిన ప్రచారం ఏమైందో చెప్పాలన్నారు. టీడీపీ పాలనలో పోలవరానికి పునాదులే పడలేదని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్, అదే ప్రాజెక్టు పనుల్లో రూ.25వేలకోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలన్నారు. పోలవరం పర్యటనకు జగన్ ఎందుకువెళ్లాడో... 9నెలల్లో ఎంతవరకు పనులు చేశారో.. ఎన్ని మీటర్ల మట్టిపనులు జరిగాయో, ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేశారో ఎందుకు చెప్పడంలేదన్నారు. రూ.25వేలకోట్ల అవినీతిపై పోలవరం పర్యటనకు వెళ్లొచ్చిన జగన్ నోరు తెరవాలని, సాక్షి మీడియా సమాధానం చెప్పాలని తాను ప్రశ్నించి 24 గంటలైనా ఇంతవరకు సమాధానం రాలేదని ఉమా స్పష్టంచేశారు. జగన్ మౌనంవెనుక ఉన్న మర్మమేమిటో చెప్పాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read