చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, ఆయన్ను ఎలా అయినా అవినీతి కేసుల్లో ఇరికించాలని, సోలార్, విండ్ ఎనర్జీ విషయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పై, కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మళ్ళీ సమీక్ష చేస్తాం అంటూ, ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే దీని పై విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు మండి పడ్డాయి. ప్రధానితో ఫిర్యాదు చేసినా, చివరకు కేంద్ర మంత్రి చెప్పిన వినలేదు. చివరకు కోర్ట్ లలో విషయం ఉంది. ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ఇలాంటి చర్యలతో, మా పెట్టుబడులకు ఇబ్బంది అని, మీ దేశంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టం అంటూ హెచ్చరించాయి. ఇదే విషయం పై దావోస్ లో జరిగిన, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కూడా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఈ విషయం పై నిలదీసారు. ఒక ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం, మరో ప్రభుత్వం మారగానే, ఎలా సమీక్ష చేస్తారు, ఇలా అయితే ఎవరూ పెట్టుబడులు పెట్టరు అంటూ నిలదీశారు.

ppa 21022020 2

దీంతో ప్రపంచవ్యాప్తంగా, ఈ రంగం పై, ఇంపాక్ట్ పడింది అని గ్రహించిన కేంద్రం ప్రభుత్వం, మన దేశంలో, విద్యుత్ రంగంలో చేసుకున్న ఒప్పందాలకు, భద్రత కల్పించేలా కీలక అడుగులు వెయ్యటానికి, నిర్ణయం తీసుకుంది. ఒప్పందాలు కనుక ఉల్లంఘన జరిగితే, వారి పై చర్యలు తీసుకునే విధంగా, ప్రత్యెక ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యటానికి నిర్నయం తీసుకుంది. ఢిల్లీ అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, విద్యుత్ రంగంలో, పెట్టుబడి పెట్టే వారికి, అదనంగా చట్ట భద్రత కలిగించేందుకు, ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చెయ్యాలని, కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనశాఖ నిర్ణయం తీసుకునట్టు సమాచారం. ఈ దిశగా ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, దీని పై త్వరలోనే కీలక అడుగులు వేస్తారని సమాచారం.

ppa 21022020 3

రాష్ట్రాలు అన్నీ ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చేలా, 2003 విద్యుత్ చట్టానికి, సవరణలు చేసి, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో, కేంద్రం బిల్లు పెడుతుందని అధికారులు చెప్తున్నారు. రిటైర్డ్ జడ్జి, ఈ ట్రిబ్యునల్ కు సారధ్యం వహిస్తారని, రాష్ట్రాలు అన్నీ ఈ ట్రిబ్యునల్ పరిధిలో పని చేస్తాయని అంటున్నారు. దేశం అంతటా ఈ ట్రిబ్యునల్ కు శాఖలు ఉంటాయి. విద్యుత్ ఒప్పందాలు అన్నీ , ట్రిబ్యునల్ పర్యవేక్షణ చేస్తుంది. ఒప్పందం ప్రకారం, విద్యుత్ కొనేందుకు నిరాకరిస్తే, ఆ రాష్ట్రాల డిస్కమ్‌లు ఆస్థులు జప్తు చేసి, ఒప్పందం విలువకు సరిపడా మొత్తాన్ని రాబట్టగల అధికారులు, ఈ చట్టం ద్వారా, ట్రిబ్యునల్ కు రానుంది. దీంతో, రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు, చెయ్యటం కుదరదు. ఏపిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో, అలెర్ట్ అయిన కేంద్రం, ఈ కొత్త చట్టం తీసుకు రానుంది.పునఃసమీక్షించాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశమయిన సంగతి తెలిసిందే.

జగన్ అక్రమఆస్తుల పై ప్రముఖ వ్యాపారవేత్త ఎన్‌.శ్రీనివాసన్‌ పై, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫైర్ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, సిబిఐ కేసు ఆధారం చేసుకుని, తన పై, ఈడీ పెట్టిన కేసును కొట్టేయలంటూ, శ్రీనివాసన్ హైకోర్ట్ లో కేసు వేసారు. ఈ సందర్భంలో జరిగిన వాదనల్లో, ఈడీ తీవ్రంగా స్పందించింది. హైకోర్ట్ ముందు తమ వాదనలు వినిపించిన ఈడీ, శ్రీనివాసన్ పై ఫైర్ అయ్యింది. అక్రమ ఆస్తుల కేసులో, జగన్ కు చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీగా, ఆ కంపెనీకి వైఎస్ చైర్మెన్ గా, ఎండీగా ఉన్న శ్రీనివాసన్, కంపెనీ తీసుకున్న నిర్ణయాలతో సంబంధం లేదు అని ఎలా చెప్తారని, ఆ కంపెనీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి, శ్రీనివాసన్ బాధ్యత తీసుకోవాల్సిందే అంటూ, ఈడీ హైకోర్ట్ ముందు తన వాదనలు వినిపించింది. ఇది మేము చెప్తుంది కాదని, కంపెనీ డైరెక్టర్ లు గా ఉన్నవారు, కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో, బాధ్యత తీసుకోవాలని, ఫెరా చట్టం సహా పలు చట్టాల్లో స్పష్టంగా ఉందంటూ, ఈడీ హైకోర్ట్ కు నివేదించింది.

ed 21022020 2

దీని ప్రకారం, ఇండియా సిమెంట్స్ తీసుకున్న నిర్ణయాలకు, ఆ కంపెనీ ఎండీగా, వైస్ చైర్మెన్ గా, శ్రీనివాసన్ కు సంబంధలేదు అని చెప్పటం, కరెక్ట్ కాదని, ఈడీ చెప్పింది. నష్టాల్లో ఉన్న కంపెనీలకు, అలాగే ఉత్పత్తి ప్రారంభం కాని కంపెనీల్లో, అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టటం చూస్తే, తనకు వైఎస్ ప్రభుత్వం జరిగిన లబ్ది వల్లే, ఈ విధంగా క్విడ్ ప్రోకో లో, ముడుపులు చెల్లించినట్టు అర్ధం అవుతుందని పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధకి చట్టం కింద నమోదైన కేసులో, ఇంకా వాస్తవాలు తెలకొండానే, కోర్ట్ జోక్యం చేసుకోరాదని, ఈ విషయం తేలే దాకా, మినహయింపు ఇవ్వటం కుదరదని , ఈడీ చెప్పింది. శ్రీనివాస వేసిన పిటీషన్ పై, ఈడీ, హైకోర్ట్ సూచన మేరకు, హైకోర్ట్ లో తన కౌంటర్ దాఖలు చేస్తూ, పై విధంగా స్పందించింది.

ed 21022020 3

కడపలో, ఇండియా సిమెంట్స్ కు నిబంధనలకు వ్యతిరేకంగా, 2.60 ఎకరాల లీజుతో పాటు, టి కేటాయింపులు ఇచ్చినందుకు ప్రతి ఫలంగా, ఇండియా సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ లో రూ.40 కోట్లు, భారతి సిమెంట్స్‌లో రూ.95.32 కోట్లు, కార్మెల్‌ ఏసియాలో రూ.5 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని, అది కూడా అధిక ప్రీమియం చెల్లించి పెట్టారని, తన సొంత కంపెనీలో పురోగతి లేకోయినా, అదే రంగంలో ఉన్న మరో కంపెనీలో పెట్టటం చూస్తే, ఇది క్విడ్ ప్రోకో అని అర్ధం అవుతందని ఈడీ వాదించింది. దీనిలో భాగంగానే, 2010 మార్చిలో మరో రూ.50 కోట్లు అదే ప్రీమియంతో పెట్టుబడి పెట్టిన రెండు నెలల్లోనే ప్రీమియం సగానికి పడిపోయిన సమయంలో, ఫ్రెంచి కంపెనీ నుంచి ఆకర్షణీయమైన ధర వచ్చిందని, విక్రయించాలంటూ విజయసాయిరెడ్డి నుంచి వచ్చిన సూచనతో వాటాలు విక్రయించారని ఈడీ పేర్కొంది. శ్రీనివాస్ పెట్టుకున్న పిటీషన్ కొట్టేయాలని కోర్ట్ ను కోరింది.

జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వి-వే-కా-నం-ద-రె-డ్డి హ-త్య-కే-సు విచారణను గురువారం హైకోర్టు ఈ నెల24కు వాయిదా వేసింది. వి-వే-కా-నం-ద హ-త్య-కే-సును సిబిఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె, భార్యలతో పాటు, బిటెక్ రవి, మాజీమంత్రి ఆది నారాయణరెడ్డిలు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేసారు. వివక్షనేతగా ఉండగా జగన్ కుడా వి-వే-కా కేసును సిబిఐకి అప్పగించాలని పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఆయన ఈ పిటీషన్ ఇటీవల ఉవసంహరించుకున్నారు. ఈ క్రమంలో వి-వే-కా హ-త్య-కే-సు-లో సిట్ విచారణ పూర్తి కావోస్తున్నందున కేసును కీలక సమయంలో సిబిఐకి అప్పగించడం అవసరంలేదని ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సిట్ విచారణ నివేదికను అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి సీల్డ్ కవరులో అందజేసారు. ఈ కేసులో డైరీ, ఇతర కీలక పైల్స్ ను సోమ వారానికి న్యాయస్థానానికి సమర్పించా లని న్యాయస్థానం ఆడ్వోకేట్ జనరలను ఆదేశించింది.

viveka 21022020 2

అయితే ఈ సందర్భంలో, పిటీషన్ తరుపు లాయర్, సంచలన విషయాలు కోర్ట్ కు చెప్పారు. వి-వే-కా కేసులో, రాజకీయ ప్రముఖులు ఉన్నారని, వారిలో ఐదుగురు ముఖ్య నేతలు ఉన్నారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారని, ఏదైనా తారుమారు చేసే అవకాసం ఉందని, అందుకే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి అంటూ, పిటీషన్ తరుపు లాయర్, హైకోర్ట్ ని కోరారు. మొన్నటి దాకా సిబిఐ కావలి అంటూ, గోలగోల చేసిన జగన్, ఇప్పుడు ఎందుకు కోరటం లేదని, అన్నారు. వి-వే-క హత్య కేసులో, ఆయన సమీప బంధువు ఉన్నారని, తమ అనుమానం అని, 9 నెలలు అయినా, ఈ ప్రభుత్వంలో ఒక్క క్లూ కూడా దొరకలేదని, దీని వెనుక శక్తివంతమైన రాజకీయ ప్రముఖుడి హస్తం ఉందంటూ, హైకోర్ట్ ముందు సంచలన వ్యాఖ్యలు చేసారు, పిటీషనర్ తరుపు లాయర్.

viveka 21022020 3

వి-వే-క భార్య, కూతురు, అల్లుడు తరుపు లాయర్, వీరారెడ్డి కూడా, కోర్ట్ ముందు గట్టి వాదనలు వినిపించారు. గతంలో భార్య సౌభాగ్యమ్మ పిటీషన్ వేసినప్పుడు మౌనంగా ఉన్న ప్రభుత్వం, ఆయన కూతురు, అల్లుడు మరో పిటీషన్ వేస్తే మాత్రం, దర్యాప్తులో జాప్యానికి కారణం మేమేనని ప్రభుత్వం నిందమోపుతోంది అంటూ ఆయన వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుపు లాయర్ మాత్రం, సిబిఐ విచారణ అవసరం లేదని వాదిన్కాహారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్ని కలకు ముందు 2019 మార్చి 15న వి-వే-కా-నం-ద-రె-డ్డి పులివెందులలోని తన ఇంట్లో హ-త్య-కు గురయ్యారు. ఈ కేసులో 11నెలలు అవుతున్నా దోషులు ఎవ్వరో తెలియలేదు. దీంతో ఆయన కుమార్తె డాక్టర్ సునీత కేసును సిబిఐకి అప్పగించాలని తాజాగా హైకోర్టును అభ్యర్థించారు. ఇదే అంశంపై దాఖలైన కేసులన్నింటిని హైకోర్టు ఏకకాలంలో విచారిస్తుంది.

జగన్ వెలిగొండ పర్యటన చూస్తుంటే, హాస్యాస్పదంగా ఉందని, ముఖ్యమంత్రి చేసిన సమీక్షలోనే వెలిగొండ ఒకటో టన్నెల్ పనులు 90.96 శాతం పూర్తయ్యాయని, 17.78కిలోమీటర్ల వరకు టన్నెల్ బోరింగ్ పనులుపూర్తయ్యాయని, మొత్తం 18.798 మీటర్లలో 17.78కి.మీటర్ల వరకు పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆయనే స్వయంగా వెలిగొండ టన్నెల్ పూర్తిచేసినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. నిన్నటివరకు హోంమంత్రిగా పనిచేసిన సజ్జల, ఉన్నట్టుండి సరికొత్తగా జలవనరులశాఖ మంత్రి అవతారం ఎప్పుడు ఎత్తాడో తెలియడంలేదని దేవినేని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షంపై, ప్రశ్నించినవారిపై అక్రమకేసులు పెట్టేలా జగన్ ఆదేశిస్తుంటే, సజ్జల వాటిని తూచాతప్పకుండా అమలయ్యేలా చూస్తున్నాడన్నారు. శుక్రవారం సాయంత్రం బెంగుళూరుకు వెళ్లి, సోమవారం ఉదయాన్నే తిరిగొచ్చేసే సజ్జల, పలుమార్గాల్లో అందినకాడికి దండుకుంటున్నాడన్నారు. సజ్జల ఎవరినుంచి ఎంతెంత వసూలుచేస్తున్నాడో, డమ్మీ మంత్రులను అడిగితే మొత్తం చెబుతారని, ఆ కలెక్షన్ పనులేవో సక్రమంగా చేసుకోకుండా, టన్నెల్స్, ప్రాజెక్టులు అంటూ తెలియనివాటి గురించి సజ్జల మాట్లాడటం, జగన్ కామెడీ చేయడం చూస్తుంటే నవ్వోస్తోందని దేవినేని దెప్పిపొడిచారు.

1989 మార్చిలో మహానుభావుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు, అప్పట్లో తన ఓఎస్ డీగా ఉన్న డాక్టర్ శ్రీరామకృష్ణయ్యను ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్టప్రాంతాలన్నీ తిప్పి, వెలిగొండ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 1996లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న, ఆర్థిక ఇబ్బందులను తొలగింపచేసి, నిర్మాణం కొనసాగేలా పరిపాలనా ఉత్తర్వులిచ్చి, పనులు మొదలయ్యేలా చూశారన్నారు. వెలిగొండ టన్నెల్ పనులు త్వరగా పూర్తయితే, తన సొంత జిల్లాకునీళ్లొస్తాయని తెలిసికూడా, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్ట్ పనులు, కాలువల పనులకు గ్రహణం పట్టించాడన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతిని కడగటానికి భయపడి, జీవోనెం 13ని తీసుకొచ్చికూడా ప్రాజెక్ట్ పనులను గాలికొదిలేశారన్నారు. చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులు తిరిగి కొనసాగించడం కోసం, సాగునీటి రంగనిపుణలతో ఒక కమిటీవేసి, జీవోనెం ­­22, జీవోనెం 63లు తీసుకురావడం జరిగిందని దేవినేని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి నిర్ణయాలకారణంగా సాగునీటి ప్రాజెక్ట్ లు ఆనాడు సాగునీటి ప్రాజెక్ట్ లు చేపట్టిన కంపెనీలన్నీ, ఐసీయూలోకి చేరాయన్నారు.

వెలిగొండ ప్రాజెక్ట్ లో, టన్నెల్ 1 లో 4.4 కిలోమీటర్ల పనులను గత ఐదేళ్లలోనే పూర్తి చేశామని, కొత్త ఏజెన్సీ వచ్చాక జరిగిన 2కిలోమీటర్ల పనుల గురించి మాట్లాడుతూ, కేవలం 600 మీటర్ల పనులే టీడీపీ హాయాంలో జరిగాయని చెబుతూ, వైసీపీప్రభుత్వం, సజ్జల వంటి నేతలు అబద్ధాలతోనే బతుకుతున్నారని దేవినేని దుయ్యబట్టారు. వెలిగొండ టన్నెల్ పనులు చేపట్టిన మొదటి ఏజెన్సీ నాలుగన్నరేళ్లలో 3.8కిలోమీటర్ల పనులు చేస్తే, రెండో ఏజెన్సీ పనులు చేపట్టాక 2 కిలోమీటర్ల పనులు చేసిందని, ఈ వాస్తవాలు చెప్పకుండా, టీడీపీ ప్రభుత్వం కేవలం 600 మీటర్లే పనులు చేసిందని సజ్జల ట్వీట్లు పెట్టడం, ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనమన్నారు. జగన్ ఆడిన రివర్స్ డ్రామాలన్నింటిపై కచ్చితంగా సీబీఐ విచారణ జరిగి తీరుతుందని, తప్పుచేసిన అధికారులంతా శ్రీలక్ష్మి మాదిరిగా, కోర్టుల చుట్టూ తిరగడం ఖాయమని ఉమా స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డి తనపార్టీ వారితో రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నట్టు ట్వీట్ కూడా ఇప్పించాడని, ఆమెవరో, ఎందుకొస్తుందో కాలమే సమాధానం చెబుతుందని దేవినేని తెలిపారు. జగన్ , ఆయన బృందం తప్పుడుకూతలను, సాక్షి తప్పుడురాతలను తట్టుకొని, పనులు చేయడంపైనే తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

అచ్చెన్నాయుడిని తట్టుకోలేకనే..... బడుగు, బలహీన వర్గాలకు వెలుగులాంటి వాడైన స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి వచ్చిన కింజరాపు అచ్చెన్నాయుడన్నా, రామ్మోహన్ నాయుడన్నా జగన్ కు భయమని దేవినేని ఎద్దేవాచేశారు. ఆరడుగులు అచ్చెన్నాయుడి రూపం, పదేపదే జగన్ కలలోకి కూడా వస్తోందని, ఆ రూపాన్ని తట్టుకోలేకనే, ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడిని చూసి భయపడే, జగన్ పదేపదే అతని రూపం గురించి మాట్లాడుతుంటాడన్నారు. అసెంబ్లీలో బడుగు, బలహీనవర్గాల గురించి మాట్లాడుతున్నాడన్న అక్కసుతోనే అచ్చెన్నాయుడిపై అవినీతి బురద జల్లాలని చూస్తున్నారన్నారు. ప్రధానమంత్రి ఆదేశాలతో టెలీహెల్త్ సేవలను కొనసాగిస్తే, దాన్ని తప్పపడుతూ, పవిత్రమైన శివరాత్రి పర్వదినాన అచ్చెన్నాయుడిపై బురదజల్లాలని చూడటం, వైసీపీప్రభుత్వానికే చెల్లిందన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను, అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు, జగన్ ప్రభుత్వాన్ని ఒక ఆట అడుకుంటాడన్నారు. లోకేశ్ ఆస్తులు ప్రకటన చేసి, సవాల్ విసిరితే, జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలానే తోకముడిచాడన్నారు.

Advertisements

Latest Articles

Most Read