తనకున్న పేరు, ప్రఖ్యాతల ద్వారా చంద్రబాబునాయుడు గారు ఎంతో కష్టపడి, గడ్డాలు పట్టుకుని రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఆయా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు గారిని చూసే రాష్ట్రానికి కియా పరిశ్రమ వచ్చింది. ప్రతి ఐటీ కంపెనీ కూడా చంద్రబాబు గారిని చూసే వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జే ట్యాక్స్ పేరుతో ఐటీ కంపెనీలను బెదిరిస్తున్నారు. జగన్ తన స్వార్థం కోసం ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు గారు నిర్మించిన వంద అంతస్తుల భవనాన్ని నేడు జగన్ తేలికగా కూల్చేస్తున్నారు. ప్రజారాజధాని అమరావతిలో లక్ష కోట్ల విలువైన పెట్టుబడులు తరలివెళ్లాయి. అంతర్జాతీయ బ్యాంకుల రుణాలు వెనక్కి వెళ్లాయి. సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల 50వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయాం.

anil 23022020 2

రాష్ట్రంలో లక్షా 80వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. దీనిద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. కియా పరిశ్రమ ద్వారా 12వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. నేడు జగన్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. అదానీ 70వేల కోట్లు, లులు 2200 కోట్లు, రిలయన్స్ 15వేల కోట్లు, ఒంగోలులో ఏపీపీ పేపర్ మిల్లు 20వేల కోట్లు, బీఆర్ శెట్టి 12వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పోయాయి. జగన్ కు దోచుకోవడం దాచుకోవడం తప్ప.. పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలు చేతకావు. జగన్ కు పరిపాలన చేతగాదని తేలిపోయింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఏపీ గురించే మాట్లాడుకుంటున్నారు. విజయవాడ రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు.

anil 23022020 3

గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు కూడా పడిపోయాయి. పెట్టుబడిదారులకు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదు. చంద్రబాబు గారి మీద కక్షతో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. జగన్ కు పరిపాలన చేతగాకపోతే కుర్చీలో కూర్చోనే అర్హత లేదు. ఏ వర్గం కూడా నేడు సంతృప్తిగా లేదు. అరకొర సంక్షేమ పథకాలతో పేదలు అనేక అవస్థలు పడుతున్నారు. టీడీపీ హయాంలో పథకాలన్నింటిని రద్దు చేశారు. అన్యా క్యాంటీన్లు రద్దు చేసి పేదవారి పొట్టకొట్టారు. జగన్ కు పరిపాలన చేతగాకపోతే వైసీపీలోనే వేరేవారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రిగా పనిచేయాలి కానీ.. జగన్ కు బౌన్సర్ గా పనిచేస్తున్నారు. అందరినీ జైలుకు పంపి శ్మశానాన్ని ఏలుకొంటారా?

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్న ఆనందం, ఆర్టీసీలో ఎక్కువ రోజులు నిలువలేదు. ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతి వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. ప్రైవేటు బస్సులకు అనుమతిచ్చే విషయంలో ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదంటూ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి, ప్రతాప్ స్పష్టం చేసిన 24 గంటల్లోనే పోరుబాటకు సిద్ధమంటూ గుర్తింపు కార్మిక సంఘం నేతలు అల్టిమేటం జారీ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తుం డగా.. ప్రజలకు సేవలు అందించే విషయం లో ఉద్యోగులతో చర్చలు జరపాల్సిన అవసరం లేదంటూ మేనేజింగ్ డైరెక్టర్ ఖరా ఖండీగా చెపుతున్నారు. ఆర్టీసీలో నెలకన్న వివా దాలపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలు, ఎనిమిది కార్పోరేషన్లలో ప్రైవేటు పాఠశాల, కాలేజీ, ఫ్యాక్టరీలకు చెందిన బస్సులను తిప్పేందుకు అనుమతులు ఇవ్వాలని మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ నిర్ణయించారు.

తొలి విడతలో విశాఖపట్టణంలో ప్రైవేటు బస్సు సర్వీసులకు అనుమతులు ఇచ్చిన తర్వాత లోటుపాట్లను సవరించుకొని మిగిలిన చోట్ల అనుమతి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ ఎండీ ఆయా బస్సుల ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ ఎండీ చర్యలను కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించడం అంటే సంస్థను నిర్వీర్యం చేయడమే అనేది కార్మిక సంఘాల వాదన. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరితో చర్చించాల్సి ఉండగా..ఏండీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనేది సంఘాల ప్రధాన వాదన. ఇదే అంశంపై గురువారం ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జగన్మోహన రెడ్డి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగ భద్రత కలిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం తనను ఆర్టీసీ ఎండీగా నియమించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకేననే విషయం గుర్తుంచు కోవాలన్నారు. అలాంటప్పుడు వీరు చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఎవరి కాల్లో పట్టుకొని ఉద్యోగం చేయాల్సిన అవసరం తనకు లేదంటూ ఖరాఖండిగా ఎండీ ప్రతాప్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమై నందున గతంలో మాదిరి వ్యవహరించడం కుదరదని, నిబంధలకు అనుగుణంగా నడుచుకోవాలని ఏండీ హెచ్చరికలు జారీ చేశారు. ఎండీ వ్యాఖ్యలపై ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ఏండీ వ్యాఖ్యలు బెదిరించే ధోరణిలో ఉన్నాయని పేర్కొంటూ రవాణాశాఖ మంత్రి పలుమార్లు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోమని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ రోజు, మరో బాంబు పేల్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రభుత్వోద్యోగుల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని కార్మిక సంఘాలు మీడియా ముందు మాట్లాడకూడదని నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సమ్మెలు, ప్రదర్శనలు చెయ్యకూడదని అన్నారు. అయితే, దీని పై కార్మిక సంఘాలు అవక్కయ్యాయి. ఆర్టీసీని విలీనం చేయలేదని, ఉద్యోగులనే విలీనం చేశారని, అయినా మాకు దీంట్లో ఒరిగింది ఏమి లేదని వాపోతున్నారు.

గత 5 ఏళ్ళులో, ప్రభుత్వ నిర్ణయాలు అన్నిటి పై, సిట్ వేస్తూ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో 10 మంది పోలీస్ సభ్యులతో, ఈ సిట్ వెయ్యటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. గత ప్రభుత్వ నిర్ణయాలు అన్నిటి పై, సిట్‌ ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటి సారి అని, అదీ కాక, పోలీసులతో, ఇలాంటివి విచారణ ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. సిట్ కు అధికారాలు ఇస్తూ, ఎవరిని అయినా ప్రశ్నించే అవకాసం ఇవ్వటం, ఎవరిని అయినా అరెస్ట్ చేసే అధికారం ఇవ్వటం చూస్తుంటే, ఇది కచ్చితంగా కక్ష సాధింపు వ్యవహారమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, సిట్ ఏర్పాటు పై చంద్రబాబు మొదటి సారి స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా, ఈ నిర్ణయం పై స్పందించారు. ఇది చంద్రబాబు ట్వీట్... "ఈ ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద నిన్న వేసిన సిట్ మరో ఉదాహరణ. ఇదేమీ కొత్తకాదు. 9 నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు. ఏకంగా ఏపీనే టార్గెట్ చేసారు. భావితరాలకు తీరని నష్టం చేసారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం... ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. "

"రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారు? ఇప్పుడీ జీవో 344 వైసిపి వేధింపులకు పరాకాష్ట. గత 5ఏళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ 5ఏళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి? వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నా మీద 26 విచారణలు(14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సిబిసిఐడి ఎంక్వైరీ..) చేయించారు. ఏమైంది? ఇదీ అంతే! రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్ చేయడమే వైసీపీ లక్ష్యం. సిట్ నే పోలీస్ స్టేషన్ గా పరిగణిస్తాం అనడం... తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించడం కోసమే. టిడిపి నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు." అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

ఇక మరో పక్క నారా లోకేష్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేసారు.. ఇది లోకేష్ ట్వీట్.. ''మహామేత'' అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించారు. ఏమైంది? గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటికి, ఈడీ కి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది? ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారు. అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి విచారణ చెయ్యాల్సిన పోలీసులతో ? ఇక్కడే అర్ధం అవుతుంది, ''యువమేత'' ఆత్రం. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చెయ్యడమే.

ఈ రోజు ఒక ప్రముఖ జాతీయ ప్రత్రికలో, ఇండియన్ నేవీ, విశాఖపట్నంలోని, మిలీనియం టవర్స్ లో, సెక్రటేరియట్ పెట్టటానికి, వీలు లేదు అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఒక వార్త వచ్చింది. జాతీయ పత్రికలో రావటంతో, ఇదే వార్తను తెలుగు మీడియా కూడా తీసుకుంది. అయితే, ఈ వార్తల పై ఈస్టరన్ నేవల్ కమాండ్ స్పందించింది. ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. మిలీనియం టవర్స్ లో సచివాలయానికి, ఇప్పటి వరకు తాము ఏమి అభ్యంతరం చెప్పలేదని చెప్పింది. అయితే, ఇందులోనే మరో విషయం కూడా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు, ఇలాంటి ప్రతిపాదన ఏమి తమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పింది. పత్రికా సారంశం ప్రకారం, తమ వద్దకు సచివాలయం మిలీనియం టవర్స్ లో పెడుతున్నాం అని ఎలాంటి ప్రతిపాదన రాలేదు, దాన్ని మేము తిరస్కరించ లేదు అంటూ, నేవీ తన ప్రెస్ నోట్ లో విడుదల చేసింది. అయితే, ప్రభుత్వం ఒక వేళ ప్రతిపాదనలు పంపిస్తే, అప్పుడు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

navy 222022020 2

ఉదయం నుంచి వచ్చిన వార్తలు ప్రకారం, ఐఎన్ఎస్ కళింగ కు, దగ్గరగా ఉన్న చోట, మిలీనియం టవర్స్ లో, సచివాలయం నిర్మాణానికి నేవీ అనుమతి ఇవ్వలేదు అని, సచివాలయం అక్కడ వస్తే, రద్దీ ఎక్కువ అవుతుందని, అదే ఐఎన్ఎస్ కళింగ భద్రతకే ముప్పు అని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు నేవీ మాత్రం వార్తలు ఖండించినా, ప్రభుత్వం తమకు మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు చేస్తున్నాం అంటూ చెప్పలేదు అనే విషయాన్ని కూడా చెప్పింది. మరి ప్రభుత్వం, ఆ ప్రతిపాదన పంపిస్తే, అప్పుడు నవీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. నిజానికి ఇలాంటి దేశ భద్రతకు కీలకమైన చోట, సచివాలయం పెట్టేందుకు, నేవీ అనుమతి ఇస్తుందా, అనేది కూడా చూడాల్సి ఉంది.

navy 222022020 3

అయితే, దీని పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు ఏపి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపించలేదు అని నేవీ చెప్తుంది కాబట్టి, ఒక వేళా ఏపి ప్రభుత్వం, మిలీనియం టవర్స్ లో సచివాలయం పెట్టుకుంటాం అంటే, నేవీ ఒప్పుకుంటుందా ? ఆ రకమైన చర్చలు లేకపోతే, జాతీయ పత్రికల్లో ఎందుకు కధనాలు వచ్చాయి, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. అయితే, మరో పక్క రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకుంటున్న వైసీపీ, ఉదయం నుంచి తమ పై బురద చల్లారు అని, ఎల్లో మీడియా అంటూ మరో సారి విరుచుకు పడుతున్నారు. అయితే ఈ ప్రెస్ నోట్ మొదట్లోనే, ఏపి ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన ఇవ్వలేదు అని నేవీ చెప్పిన విషయాన్నీ, మాత్రం పక్కన పెట్టారు. ఈ విషయం ఇంకా ఎన్ని ట్విస్ట్ లు తీసుకుంటుందో.

Advertisements

Latest Articles

Most Read