అవినీతి బురదలో కూరుకుపోయినా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అనేక మంది వైసీపీ నాయకులు వారి పై ఉన్న బురదను సాక్షి దొంగ పత్రికాను చేతిలో పెట్టుకొని ఇతరులపై జల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కోమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నతనంలో అలీబాబా అర డజన్ కథ విన్నాం..అలాగే ఇప్పుడు జగన్ బాబా జగమేరిగినా దోంగల కథ మనం ఇప్పుడు వింటున్నామని ఎద్దేవా చేశారు. లోకేష్ గారు మొన్న ఆస్తుల ప్రకటన చేస్తే దేవాన్ష్ ఆస్తులపై దోంగ ప్రతిక సాక్షి తప్పుడు రాతలు రాసిందని విమర్శించారు. దేవాన్ష్ కు తాత అయిన బాలకృష్ణ, వసుంధర గారు గిఫ్ట్ గా ఇచ్చారని ఆస్తుల ప్రకటనలో చెప్పడం జరిగింది. వాటిని దోంగ పత్రిక సాక్షి బాలకృష్ణ గారి ఎన్నికల అఫిడవిట్ లో లేవని రాయడం జరిగింది. అగస్టు 2 2018 ఇచ్చిన షేర్స్ అఫిడవిట్ ఎలా పొందుపరుస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఆస్తులపై ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వచ్చే దమ్ము ఉందా? మొదటి కథలో ఏటోరో ఫార్మ, అరవిందో ఫార్మ, వీళ్లకు ఎసీ జే పేరుతో ల్యాండ్స్ జండర్ల, శ్యామవరం అనే ప్రాంతంలో 150ఎకరాలు అడ్డుగోలుగా క్విట్ ప్రో కో ద్వారా వేల కోట్లు దోచుకున్నారు.

రెండోవ కథలో జగతి పబ్లికేషన్ సీపీ-9 2012 ప్రకారం సెక్షన్ 420, 409,468 అనేక కేసులు పెట్టారు. మూడోవ కథలో సీసీ-10 2012లో రాంకీ గ్రూప్ కు భూములు కట్టబెట్టి క్విట్ ప్రోకో ద్వారా వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. నాలుగోవ కథలో నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ 28వేల ఎకరాలు కట్టబెట్టినందు రూ.854కోట్లు దోంగ పత్రికకు పెట్టుబడి పెట్టారని అన్నారు. ఐదోవ కథలో దాల్మియా సిమెంట్ భూములు కట్టబెట్టినందకు రూ.205 కోట్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు జరిగాయని అన్నారు. ఆరోవ కథలో ఇండియా సిమెంట్ కంపెనీ భూమి కేటాయింపు, నీటి సౌకర్యాలు కల్పించినందకు రూ.140కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి చేరాయని చెప్పారు. ఏడోవ కథలో భారత సిమెంట్ దీనికి 2,37.532 ఎకరాలు కడప జిల్లాలో కట్టబెట్టారని అన్నారు. ఎనిమిదో కథలో పెన్నా సిమెంట్ కు సంబంధించి 231 ఎకరాలు అనంతపురం, 304 హెక్టారు కర్నూలు, 821 ఎకరాలు రంగారెడ్డి జల్లాలో కట్టబెట్టినందకు దాదాపు రూ.200 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో చేరయని అన్నారు. తొమ్మిది, పదోవ కథలో జాతీయకోర్టు ఫిర్యాదు చేయడానికి ప్రధాన కారణం హిందు టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జి హాబ్ పేరాట 8,844 ఎకరాలను అనంతపురంలో భూములు తసుకున్నందకు జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

పదకొండువ కథలో హౌసింగ్ కు సంబంధించి హిందు గ్రూప్ అనేక అక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పై కేసులు పెట్టారని అన్నారు. వారిని కాపడం కోసమే అనేక డ్రామాలాడుతున్నారని అన్నారు. ఈ 11 చార్జీషీట్ పై బహిరంగ చర్చకు వైసీపీ నాయకులు రావాలి. జనవరి 17, 2020 కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గేజిట్ ను చూసి వైసీప గుండెల్లో రైలు పరుగైతున్నాయని అన్నారు. జీవో నెం:51 ప్రకారం ఈఎస్ఐ మందుల కోనుగోలు విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగిందన్నారు. ఈఎస్ఐ కోనుగోలు విషయంలో కూడా అచ్చెన్నాయుడి ప్రమేయంలేదని చెప్పారని అన్నారు. ఈఎస్ఐ పూర్తిగా కేంద్రం ప్రభుత్వంలో అధీనంలో ఉన్న వ్యవస్థ మరి మీరు ఏరకంగా అచ్చెన్నాయుడిపై అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ లోపల, బయట బీసీలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వలనే అచ్చెన్నాయుడిపై అక్రమ అరోపణలు చేస్తున్నారు. ముందు ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలని అన్నారు. మీ సొంత చెల్లే సిట్ విచారణను నమ్మడం లేదని చెబుతుంటే మీ ఎలా వేస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. ఏ సీట్ కమిటీలు వేసిన మేము భయపడాల్సిన అవసరం లేదన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి అనేకమైన జిమ్మిక్కులు చేస్తోందని టీడీపీ నేత, బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 9నెలల క్రితం ప్రతిపక్షంలో ఉన్న వైపీపీ తెలుగుదేశంపార్టీ రూ.2లక్షల కోట్లు అవినీతి చేసిందని పుస్తకం వేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్ అధికారులతో మాపై కమిటీ వేస్తే మేము సిట్టింగ్ జడ్జితో కమిటీ విచారణ చేయమని తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే తోక ముడిసి మంత్రులతో సబ్ కమిటీ వేశారని వివరించారు. ఇప్పటికి కమిటీ వేసి 9 నెలలు అవుతున్న కొండను తొవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని పిటర్ కమిటీ వేశారు.. పిటర్ పీకింది ఏమి లేదన్నారు. ఇప్పుడు సీట్ అంటున్నారు. ఈ 9నెలల్లో విశాఖలో అక్రమం కొట్టివేసిన భూములను, ఇసుక మాఫీయా, మద్యంలో జే ట్యాక్స్ పై కూడా సీట్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దోచేసినా రూ.21వేల కోట్లపై కూడా సీట్ విచారణ వేయాలి. గతంలో మీరు చేసిన అవినీతి వలన ఉన్నత అధికారులు జైలు పాలైన సందర్భం ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మిలీనియం టవర్స్ కు కేబినేట్ లో రూ.19 కోట్లు కేటాయించి హడవిడి చేశారు.

విశాఖ నేవీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం జరిగిందన్నారు. 9నెలల్లో రాష్ట్రంలో అభివృద్ది చేసిన పని ఒకటి లేకపోగ నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి తరలింపు, విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్, ఇన్ సైడ్ ట్రేడింగ్ ఇవన్ని కూడా ప్రజల దృష్ట మళ్లించడం కోసమేనని అన్నారు. రస్ అల్ ఖైమా ప్రాజెక్టులో వాన్ పిక్ కు సంబంధించిన నిమ్మగడ్డ ప్రసాద్ రూ.870కోట్లు కొట్టివేయడం జరిగిందన్నారు. 14మందితో సీబీఐ విచారణ జరగడం జరిగిందన్నారు. ఆ కుంభకోణంలో మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి, ధర్మాణ ప్రసాద్ వీరందరూ 16నెలలు జైలు లో ఉండి వచ్చిన వ్యక్తులు. సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్, జగన్మోహన్ రెడ్డి జైలుమేట్ గురించి ఎందుకు దాని గురించి మాట్లాడారు. రస్ అల్ ఖైమాలో 2012లోనే కేసులు నమోదు అయిందని తప్పించుకొని తిరుగుతున్నారని సెర్బియా లో అరెస్టు చేయడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా అంతర్జాతీయ కోర్టులో రూ.50వేల కోట్లుకు సంబంధించి నిమ్మగడ్డను అరెస్టు చేయడం జరిగిందన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు..ప్రధాని మంత్రి, అమిత్ షాను కలిశారు..కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజానాల కోసం కలిశానని ఒక్క కూడా మాట్లాడలేదు. యునిటేడ్ అరబ్ కు మన దేశానికి ఉన్న పరస్పర సహకార పూర్వ భూభాగం ఒప్పదం ప్రకారం నేరస్తులను అప్పజేప్పుకోవడం జరుగుతున్నాయి. హిందు సంస్థలకు చెందిన శ్యామ్ ప్రసాద్ కూడా జగన్ కు జైలుమేటేనన్నారు. ఆ కేసులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అందువలనే జగన్మోహన్ రెడ్డి ప్రధాని కల వడం జరుగుతోందన్నారు. చరిత్రలో ముఖ్యమంత్రిపై అంతర్జాతీయ కోర్టు నోటీసులు ఇచ్చిన సందర్భం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజిట్ నోటీఫికేషన్ లో యుఐఐ కోర్టు ఉత్తర్వులకు భారతదేశం ప్రభుత్వం అంగీకారం తెలిపారని తెలియజేశారు. కోర్టు ఆఫ్ ఇంటర్ నేషనల్ ఫైనాల్స్, కోర్టు ఆఫ్ అబిదబీ గ్లోబల్, అబిదబీ జ్యూడిషియల్, దుబాయ్ కోర్టులు, రస్ అల్ ఖైమా జ్యూడిషియల్ డిపార్ట్ మెంట్ సంబంధించి అక్కడ అమలు చేసే శిక్షలకు అంగీకరం తెలిపారు.
వాటిని దృష్టి మళ్లిండం కోసమే సీట్ కమిటీ వేశారని విమర్శించారు.

నిమ్మగడ్డ ప్రసాద్ ను విడిపించడ కోసమే జగన్మోహన్ రెడ్డి ఒక టీమ్ ను రస్ అల్ ఖైమా పంపించారని అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ జీవితం సెర్బియా కే పరిమితి అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజిట్ నోటీసు వైసీప నాయకుల్లో వణుకు పుడుతుందన్నారు. వైసీపీ నాయకులు చేసిన పాపాలు తుది దశకు వచ్చాయని అన్నారు. వాన్ పిక్, దిహిందు పేరుతో మా దేశానికి వచ్చి రూ.50వేల కోట్లు దోచుకున్నారని రస్ ఆల్ ఖైమా 2013లోనే కేసులు పెట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ కేసు నుంచి తప్పించుకోవడం కుదరదన్నారు. జగన్మోహన్ రెడ్డి రస్ ఆల్ ఖైమా పై సమాధానం చెప్పి సిట్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో డ్రోన్ ఉపయోగించడం మరియు మహిళలు చేస్తున్న బంద్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బెదింపులకు భయపడేది లేదని హెచ్చరించారు.

గత అయుదు ఏళ్ళ కాలంలో, చంద్రబాబు పై, ఆయన ప్రభుత్వం పై ఎలాంటి ఆరోపణలు, వైసీపీ, తన సొంత పత్రిక, ఛానల్ చేసాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ చేతకానితనంతో, అవే ఆరోపణలు నిజం అని ప్రజలు నమ్మారు కూడా. ఆరు లక్షల కోట్లు అవినీతి చంద్రబాబు చేసారని, వైసీపీ పుస్తకాలు వేస్తె, అమ్మో చంద్రబాబు ఇంత తిన్నాడా అని నమ్మిన వారు ఉన్నారు అంటే ఆశ్చర్యం కాదు. ఇక ఇంకీముంది జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు, అవినీతి పై యుద్ధం అంటున్నాడు, చంద్రబాబు జైలుకు వెళ్ళటం ఖాయం, 6 లక్షల కోట్లు కాకపోయినా, 6 కోట్లు అవినీతి దొరికినా చంద్రబాబు జైలుకు వెళ్ళటం ఖాయం అంటూ, వైసీపీ శ్రేణులు సంబర పడ్డాయి. నెల అయ్యింది, మూడు నెలలు అయ్యింది, ఆరు నెలలు అయ్యింది, ఇప్పుడు తొమ్మిదో నెల. చివరకు ఏమైనా తెల్చారా అంటే, కొండను తవ్వుతూనే ఉన్నారు కాని, ఎలక తోక కూడా దొరకలేదు. ఈ చిరాకులో తప్పుల మీద తప్పులు చేస్తూ, చంద్రబాబుకి మేలు చేస్తున్నారు అనే విషయం జగన్ మర్చిపోతున్నారు.

తన ప్రభుత్వం చేతే అనేక ఎంక్వయిరీలు వేయించి, ఇప్పటి వరకు ఏమి తేల్చలేదు అంటే, చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇస్తున్నట్టే కాదా. మొదటగా సెక్రటేరియట్ కు వెళ్ళిన సమయంలో, అక్కడ ఉద్యోగులకు జగన బంపర్ ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చెప్తే, బహుమతులు ఇస్తాం అన్నారు. తరువాత, మంత్రుల కమిటీలు అన్నారు. తరువాత అధికారుల కమిటీతో విచారణ అన్నారు. తరువాత విజిలెన్స్ విచారణ అన్నారు, తరువాత సిఐడి విచారణ అన్నారు, తరువాత ఐటి, ఈడీకి విచారణ చెయ్యమని ఉత్తరాలు రాసారు. మరి ఈ విచారణలు అన్నీ ఏమయ్యాయి ? చివరకు చంద్రబాబు రూపాయి కూడా అవినీతి చెయ్యలేదు అని తేల్చాల్సిన పరిస్థితి. ఇక ఇవన్నీ కాదని, పోలీసులతో నిన్న రాత్రి సిట్ వేయిస్తున్నట్టు, జీవో ఇచ్చారు.

అయితే ఈ జీవో పై, తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద నవ్వు నవ్వి ఊరుకుంది. పోలీసులు క్రైమ్ కేసులు విచారణ చేస్తారు కాని, ప్రభుత్వంలో జరిగే ఫైల్స్ చూసి విచారణ చేసే అంత ఉంటుందా ? వారికి ఆ సామర్ధ్యం ఉంటుందా అని టిడిపి ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణ పేరుతొ, ఈ పోలీసుల దగ్గరకు, టిడిపి నాయకులను, చంద్రబాబుని తీసుకొచ్చి, పైశాచిక ఆనందం పొందటానికి తప్ప, జగన్ చేసేది ఏమి లేదు అంటూ టిడిపి తేల్చేసింది. ఒక దానిపై ఇంకొక‌టి వేస్తున్నావంటే ఏమీ దొర‌క‌లేద‌నే క‌దా! అంటూ టిడిపి ఒక్క ముక్కలో తేల్చేసింది. గతంలో రాజశేఖర్ రెడ్డి 26 పైగా విచారణలు వేసి, రూపాయి కూడా నిరూపించ లేక చేతులు కాల్చుకున్నారని, ఇప్పుడు కొడుకు కూడా 9 నెలలు నుంచి ఏమి తేల్చలేక, ఇప్పుడు పోలీసులతో అవినీతి పై విచారణ అంటూ కామెడీ చేస్తున్నారని అంటున్నారు. మరి సిట్ ఏమి తెల్చుతుందో, ఇది అయిపోయిన తరువాత, మళ్ళీ ఏ విచారణ అంటూ టైం పాస్ చేస్తారో చూడాలి.

అమరావతి మీద ముందు నుంచి ద్వేషంతో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలో రాగానే, అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా, అమరావతి నిర్మాణాలు అన్నీ ఆపేసారు. తరువాత, అమరావతి రాజధానిగా ఉండదని, మూడు ముక్కలు చేస్తున్నాం అని, గుండెకాయి లాంటి సెక్రటేరియట్ వైజాగ్ తీసుకు వెళ్తున్నాం అని చెప్పారు. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని అన్నారు. దీని పై అసెంబ్లీలో తీర్మానం చెయ్యటం, తరువాత శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ పేరుతొ దీనికి బ్రేక్ పడింది. ఒకసారి నిర్ణయం జరిగి, ఆక్కడ 1500 కోట్లు రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చి, స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో, రాజధాని మారుస్తుంటే, కేంద్రం మాత్రం చూస్తూ కూర్చుంది. కేవలం కోర్ట్ లు మాత్రమే, ఈ అంశం పై గట్టిగా ఉన్నాయి. రేపు 26 వ తేదీన ఈ విషయం పై హైకోర్ట్ కూడా స్పష్టత ఇవ్వనుంది. అయినా విషయం కోర్ట్ లో ఉన్నా సరే, వైజాగ్ తరలింపు మాత్రం గుట్టుగా జరిగిపోతుందని అంటున్నారు.

navy 22022020 2

సెక్రటేరియట్, వైజాగ్ లో ని మిలీనియం టవర్స్ లో వస్తుందని, ప్రచారం చేసారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వ చర్యలు కూడా ఉండటంతో, విశాఖ మిలీనియం టవర్స్ లో, నిర్మాణం తధ్యం అని అందరూ అనుకున్నారు. అయితే, సరిగ్గా ఇలాంటి టైంలో, జగన్ కు షాక్ ఇచ్చింది ఇండిన నేవీ. మిలీనియం టవర్స్ లో, సచివాలయం ఏర్పాటు చెయ్యాలి అంటూ, ఏపి ప్రభుత్వం అడుగులు వేస్తున్న వార్తలు తెలుసుకున్న ఇండిన నేవీ, తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఇండియన్ నేవీని చెప్పటంతో, ఇక మిలీనియం టవర్స్ లో, సచివాలయం పెట్టే సాహసం చెయ్యలేక పోవచ్చని అంటున్నారు. ఇదే విషయం పై, జగన్ ఢిల్లీ వెళ్లి ఉంటారని, అందుకనే అమిత్ షా తో కూడా భేటీ అయ్యి, నేవీని ఒప్పించి మని ఉంటారని అనుకుంటున్నారు.

navy 22022020 3

ఇప్పటికే ఇండియన్ నేవీ ఈ విషయం పై, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు, ఈ రోజు ప్రముఖ జాతీయ పత్రికలో వార్తా కధనం వచ్చింది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు, దగ్గరలో ఉన్న మిలీనియం టవర్స్ లో, నిత్యం రద్దీగా ఉండే సచివాలయం లాంటి శాఖలను పెట్టుకోవటానికి, ఒప్పుకోం అని చెప్పినట్టు సమాచారం. శత్రు దేశాలకు, విశాఖపట్నం, ప్రాధాన లక్ష్యం అని, ఇక్కడ ఎన్నో ప్రముఖ పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని, దేశ భద్రత దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాంతాన్ని ఎంచుకోక పోవటమే మంచింది అని, నేవీ అధికారులు చెప్పారు. ఇక్కడ సచివాలయం పెరిగితే, ఆక్టివిటీ ఎక్కువ అయ్యి, చాలా సమస్యలు వస్తాయని, ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని, 734 ఎకరాలల్లో విస్తిరించి కీలక ప్రాంతం అని, చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read