పచ్చకామెర్ల ఉన్న వ్యక్తికి లోకమంత పచ్చగా కనిపించినట్లు అవినీతి సోమ్ముకు పుట్టిన సాక్షి పత్రికకు, వైసీపీ నాయకులకు ప్రతిది అవినీతిలాగా కనిపిస్తోందని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు ఈఎస్ ఐ ఆసుపత్రుల పరికరాలు, మందుల కోనుగోలు వ్యహారంలో అవినీతి జరిగినట్లు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత మండిపడ్డారు. బీసీల ప్రతినిధిగా వారికి జగరుగుతున్న అన్యాయాన్ని, ఆయా వర్గాలకు జగన్ చేస్తున్న తీరనిమోసాలను అచ్చెన్నాయుడు ప్రశ్నించినందుకే ఆయన పై అక్రమ కేసు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. టెలీ హెల్త్ సర్వీసెస్ కార్యక్రమం తెలంగాణలో అమలు ఉండగా.. అదే పద్ధతిలో మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని అచ్చెన్నాయుడు గారు ఒక నోట్ ను సంబంధిత శాఖకు పంపించడం జరిగిందని ఆయన తెలిపారు.

kollu 21022020 2

బీసీ కార్పోరేషన్ నిధులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కదారి పట్టించిన విషయాన్ని అచ్చెంనాయుడు వేలెత్తి చూపించారని ఆయనపై కక్ష పూరితంగానే అక్రమ కేసు పెట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా జగన్ వైఫల్యాలాను ఏలెత్తి చూపుతున్నారని. అందుకే జగన్.. అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేశారని విమర్శించారు. అచ్చెన్నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హననం చేసి.. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి జగన్ నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్న అవినీతి పత్రికలు వాస్తవాలు గ్రహించాలని కోరారు. ఇందులో భాగంగా 2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలలోని ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖ రాయడం జరిగింది.

వీలైనంత త్వరగా ఆయా రాష్ట్రాలలో టెలీ హెల్త్ సర్వీసెస్ ను అమలు చేయాలన్నది ఆ లేఖ ఉద్దేశమని తెలియజేశారు. బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ మంత్రిత్వశాఖ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేయడానికి నామినేషన్ ద్వారా రూ.1400 కోట్లు ఖర్చు చేశారు. దీనికి పంచాయతీరాజ్ కమిషనర్ లెటర్ నెం. 751 ద్వారా సర్క్యులర్ ఇచ్చారు. ఇందులో సీఎం జగన్ రెడ్డి బొమ్మ గ్రామ సచివాలయాలపైన ముద్రించమని కోరారు. దీనిని హైకోర్టు కూడా తప్పుబట్టింది. వారి బొమ్మలన్నాయి కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి, పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకుంటారని వారు అంగీకరిస్తారని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల అభివృద్ధికి అడ్డుపడితే ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ పై, వైసీపీ తప్పుడు ప్రచారం కొనసాగుతూనే ఉంది. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా, ఒక్క ఆధారం కూడా బయట పెట్టకుండా, కేవలం బురద చల్లి, రాజకీయం చేసి, సొంత మీడియా ఛానల్స్ లో, ఈ మధ్య కొత్తగా చేతులు మారిన కొన్ని మీడియా చానల్స్ పెట్టుకుని, టిడిపి పై బురద చల్లుతూనే ఉన్నారు. మొన్నటి దాకా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. సిఐడి కేసులు అన్నారు. అదిగో ఇదిగో అన్నారు. అది ఏమైందో తెలియదు. పది రోజుల క్రిందట, చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయని, అవన్నీ చంద్రబాబు డబ్బులు అంటూ తప్పుడు ప్రచారం చేసారు. తరువాత పంచనామాలో అక్కడ 2 లక్షలు మాత్రమే ఉన్నాయని, అది కూడా వారికి తిరిగి ఇచ్చేసినట్టు ఉంది. దీంతో, ఈ ఆరోపణ కూడా తప్పుడు ఆరోపణ అని తేలిపోయింది. ఇప్పుడు మరో ఆరోపణతో, బురద చల్లే ప్రయత్నం మొదలు పెట్టారు.అసెంబ్లీ లోపల, బయట వైసిపి పై విరుచుకుపడుతున్న ఫైర్ బ్రాండ్, ప్రముఖ బీసీ నేత అయిన, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని టార్గెట్ చేసారు.

achem 21022020 2

అచ్చెన్నాయుడు, అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. 151 మందికి ధీటుగా సమాధనం ఇస్తూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ఉండటంతో, ఇప్పుడు కక్ష సాధింపులో భాగంగా, అచ్చెన్నాయుడుని టార్గెట్ చేసింది వైసీపీ. అచ్చెన్నాయుడు కార్మిక శాఖా మంత్రిగా పని చేసిన సమయంలో, అయన మందుల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, లీకలు ఇచ్చారు. దానికి సంబంధించి, ఒక ఉత్తరం బయట పెట్టారు. విజిలెన్స్ విచారణలో ఇది బయట పడింది అని, టెండర్ విధానంలో కాకుండా, నామినేషన్ పద్దతిలో కంపెనీలకు కేటాయింపులు జరిపినట్లు, ఇది ఒక పెద్ద స్కాం అని, ఇది మొత్తం, 85 కోట్ల స్కాం అని, మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే కోణంలో వార్తా కధనాలు వండి వార్చుతున్నారు. అయితే తన పై జరుగుతున్న విష ప్రచారం పై, అచ్చెన్నాయుడు వెంటనే స్పందించారు. శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడు, ఒక వీడియో సందేశం రూపంలో, ఈ వార్తను ఖండించారు. తమ కుటుంబానికి, అవినీతి చేసి, డబ్బులు సంపాదించే కర్మ పట్టలేదని, అవసరం అయితే, నలుగురుని అడ్డుకుని, డబ్బులు తెచ్చుకుని బ్రతుకుతాం అని అన్నారు.

achem 21022020 3

తాను ఈ వ్యవహారంలో అంతా నిబంధనలు ప్రకారమే చేసానని అన్నారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు, ఆనాడు, ఈ విషయంలో ముందుకు వెళ్ళామని అన్నారు. అన్ని రాష్ట్రాలను పిలిచిన ప్రధాని, ఈఎస్ఐలో, టెలీ హెల్త్ సర్వీసెస్ ను ప్రారంభించాలని కోరారని, తరువాత ఈ విషయం పై ప్రధాని కార్యాలయం నుంచి లేఖ వచ్చిందని, కేంద్రం నుంచి వచ్చిన లేఖ పై చర్చించి, ఎలా ముందుకు వెళ్ళాలి అని డిస్కస్ చెయ్యగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఈ విధానాన్ని అమలు చేసారని చెప్పటంతో, అదే విధంగా, మనం కూడా చేద్దామని చెప్పానని, అదే విషయం ఆ ఉత్తరంలో కూడా ఉందని ఆయన అన్నారు. తాను తాను మంత్రిగా ఉన్న కాలంలో ప్రతి కొనుగోలు టెండర్ల ద్వారా జరిగింది అని, ఏనాడు నామినేషన్ పద్దతిలో ఇవ్వాలని కోరలేదని అన్నారు. తన దగ్గర అన్ని నోట్ ఫైల్స్ ఉన్నాయని, తన మీద ఏ విచారణ కావాలంటే ఆ విచారణ వేసుకోవచ్చని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడు వివరణతో, ఈ విషయంలో కూడా పస లేదని, ఇది కూడా వైసీపీ చేస్తున్న మరో ప్రచారంగా మిగిలి పోతుందని, చెప్పటంలో సందేహం లేదు.

ఈ రోజు నారా లోకేష్ ప్రెస్ తో మాట్లాడారు. ఐటీ రైడ్స్ జరిగింది చంద్రబాబు మాజీ పీ.ఎస్ శ్రీనివాస్ ఇంటిపై, టీడీపీ రాష్ట్రకార్యదర్శి రాజేశ్ ఇంటిపైనని, శ్రీనివాస్ ఇంటిలో రూ.2లక్షల 68వేలు దొరికితే, అవికూడా తిరిగిచ్చేయడం జరిగిందన్నారు. లోకేశ్ అకౌంట్ నుంచో, లేక ఇతరుల నుంచో డబ్బులు వచ్చినట్లు ఆధారాలుంటే ఐటీ శాఖ ఊరుకునేదా అని లోకేశ్ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈడీ రూ.43వేలకోట్లు జప్తుచేసిందని, వాటి గురించిగానీ, రూ.5ల విలువైనషేర్లను పెద్దఎత్తున ఎలా అమ్మారనేదానిపై ఎందుకు మాట్లాడటం లేదో తెలియడం లేదన్నారు. 1986లో హైదరాబాద్ లో 1100గజాలు కొన్న చంద్రబాబు రూ. 23లక్షల 20వేలు ఖర్చు చేశారని, అప్పటినుంచి ఇప్పటివరకు అక్కడున్నభూములధరలు పెరిగాయి కదా అని చెప్పిన లోకేశ్, మార్కెట్ లోధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయన్నారు. మేం ఎప్పుడు, ఎక్కడ, ఎంత ధరకు కొన్నామో, పూర్తి వివరాలతో సహా వెల్లడిస్తున్నామన్నారు. దొంగలెక్కలు రాసుకునే వైసీపీ బ్యాచ్, దొంగపేపర్, మేం చెప్పకపోయినా ఎలాగూ తప్పడులెక్కలతో రేపు కట్టుకథలన్నీ వండివార్చుతారని లోకేశ్ దెప్పిపొడిచారు.

ఏధరకు భూములు, షేర్లు, ఇతర ఆస్తులు కొన్నామో అదేధరను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. అవే ధరలను వైసీపీవారు కూడా ప్రకటిస్తే సంతోషిస్తామని, 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి తన ఆదాయం రూ.9లక్షలని ప్రకటించారని, అదేవ్యక్తి 2009కి వచ్చేసరికి రూ.43వేలకోట్ల ప్రజాధనాన్ని దోచేశారని లోకేశ్ మండిపడ్డారు. వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబసభ్యులకు ఏవిధమైన ఆస్తులు లేవని, హెరిటేజ్ సంస్థ తరుపున మాత్రమే ఉన్నాయన్నారు. రాజధానిలోని 29గ్రామాల్లో ఎక్కడాకూడా తమకు ఒక్క గజం భూమిలేదన్నారు. రాజధానికి 30కిలోమీటర్ల దూరంలో 2014 మార్చిలో హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాలు కొనుగోలు చేసిందన్నారు. అదేసమయంలో విశాఖలో, తమిళనాడులో కూడా కొనుగోళ్లు చేసిందన్నారు. 2013లో బ్రాహ్మణి రూ.78లక్షల విలువైన షేర్లను కొనుగోలు చేశారని, అదే విలువను ఇప్పుడుకూడా ప్రకటించామన్నారు. దేవాన్ష్ పేరుతో జూబ్లీహిల్స్ లో ప్లాట్ కొన్నామని, 2018లో దానివిలువ రూ.18కోట్లని చెప్పారు. రాజధానిలో భూములు కొన్నవారంతా లోకేశ్ కు బినామీలైతే వారిపై ఎందుకు చర్యలుతీసుకోవడంలేదని లోకేశ్ ప్రశ్నించారు.

వైసీపీ ప్రజాప్రతినిధులు బయటకు వస్తే, ప్రజలు వారిపై తిరగబడే పరిస్థతి ఉందని, తాము తిరుగుతుంటే, వారంతా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో తిరుతుగుతుంటే, పింఛన్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కవార్డులోనే 70 ఫిర్యాదులు వచ్చాయని, వైసీపీపాలన ఎలా ఉందో చెప్పడానికి అదే నిదర్శనమన్నారు. 151 మందిని గెలిపిస్తే పరిపాలన ఎలా ఉండాలో, చివరకు ఎలా ఉందో తెలుసుకోవాలంటే వైసీపీనేతలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. 9రకాల రద్దులు, 9రకాల మోసాలు, 9రకాల భారాలు ప్రజలకు తెలియచేయడానికే ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. జగన్మోహన్ రెడ్డి 30ఏళ్లపాటు అధికారంలో ఉంటాడని చెబుతున్న వైసీపీ బ్యాచ్, ‍యాత్రను చూసి ఎందుకింతలా భయపడుతుందో తెలియడంలేదన్నారు. యాత్ర ఆరంభమైన రోజునే 15మంది మంత్రులు మీడియా ముందుకురావడం చూస్తే, వారెంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్నారు. 9నెలల్లోనే ముఖ్యమంత్రినే ప్రజలంతా తుగ్లక్ అని పిలిచే పరిస్థితికి ఎవరు కారణమో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఉండే నిర్ణయాలు అమలుకాకూడదన్న లక్ష్యంతోనే వైసీపీ పాలన సాగుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం ఏమిటని లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

పీ.ఎస్ గా పనిచేసిన వ్యక్తి దగ్గర ఏముంటాయి... చంద్రబాబు దగ్గర పీ.ఎస్ గా పనిచేసినంత మాత్రాన శ్రీనివాస్ దగ్గర ఏముంటాయో చెప్పాలని, తన బాస్ కుసంబంధించిన రోజువారీ పర్యటనలు, ఇతర కార్యక్రమాల వివరాలు తప్ప వారివద్ద ఏముంటుందో చెప్పాలని విలేకరులు అడిగిన ప్రశ్నకుసమాధానంగా లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రతిశుక్రవారం కోర్టుకు ఎందుకు వెళుతున్నారో, రూ.43వేలకోట్ల సంగతేమిటో, ఇతర కేసుల విచారణ ఏమయిందో చెప్పకుండా, ఇతరులపై నిందలు వేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 9నెలల్లో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచాడని, విలేకరులు తన అసమర్థతను ఎక్కడ ప్రశ్నిస్తారోనన్నభయంతోనే ఆయన వారి ముందుకురావడానికి భయపడుతున్నాడన్నారు. మాజీ పీ.ఎస్ శ్రీనివాస్ ఇంటిలో రూ.2వేలకోట్లు దొరికాయని చెప్పిన ఏ2, దొంగలెక్కలు రాయడంలో మంచిసిద్ధహస్తుడని, ఆపనిలేకపోవడంతో ఇప్పడు దొంగమాటలు చెబుతూ బతికేస్తున్నాడన్నారు. అవినీతిపరులకు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారని, ఈరోజు తాను ప్రకటించిన ఆస్తుల వివరాల కన్నా, ఎక్కడైనా ఒక్కరూపాయిగానీ, ఒక్క గజం భూమిగానీ, ఒక్కషేర్ గానీ ఎక్కువున్నట్లు నిరూపిస్తే, తమకున్న ఆస్తులన్నింటినీ నిరూపించినవారికే రాసిస్తానని, తాను విసిరిన ఈ సవాల్ కు ఏ1, ఏ2లలో ఎవరూ స్పందిస్తారో చెప్పాలన్నారు. ఎక్కడో ఐటీ రైడ్స్ జరిగితే, దానికి తెలుగుదేశానికి సంబంధమేంటని, దేశంలో అనేక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలున్నాయని, వాటన్నింటిని చంద్రబాబుకి, లోకేశ్ కు ముడిపెడితే ఎలా అని మాజీ మంత్రి ప్రశ్నించారు.

ఏపి ప్రభుత్వం, కీలక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులకి ఆర్డినెన్స్ తెస్తారు అని ప్రచారం జరుగుతున్న వేళ, మరో ఆర్డినెన్స్‌ తో ప్రభుత్వం ముందుకు రావటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయంలో, ఇంత తొందరగా హడావిడిగా, ఆర్డినెన్స్‌ ఎందుకు తెచ్చారు ? రేపు ఎలాగూ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదా, అందులో బిల్లు పెట్టుకో వచ్చు కదా అనే సందేహాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. చట్టంలో సవరణలపై గత కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 నుంచి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రచార గడువు 5 రోజులుగా నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచార గడువు 7 రోజులుగా నిర్ణయించిన ప్రభుత్వం... స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అనర్హత వేటు పడేలా ఆర్డినెన్స్ జారీ చేసింది.

govt 20022020 2

స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల జైలు, రూ.10 వేలు జరిమానా విధించేలా నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో పాల్గొనేలా ఆర్డినెన్స్ జారీ అయ్యింది. అయితే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు వెయ్యటం అనే దాని పై, చాలా సందేహాలు వస్తున్నాయి. ఇది ఎవరు నిర్ణయిస్తారు ? రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలీసులు అయితే, ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే అది చేస్తారు కదా ? న్యాయస్థానాల్లో ఇలాంటివి నిర్ణయం తీసుకోవాలి కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే దీని పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా, దీని పై అభ్యంతరం చెప్పారు. ఇలా అయితే ప్రతిపక్షం పై అభాండాలు వేసి, అనర్హత వేటు వేస్తారని అన్నారు.

govt 20022020 3

డబ్బు, మద్యం ఉండ కూడదు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని, కాని ఇలా ఎవరు నిర్ణయం తీసుకుంటారో చెప్పకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలీసులకే అవకాసం ఇస్తే, ఎవరి మీద పడితే వారి మీద, అబద్ధపు ప్రచారం చేసి, అనర్హత వేటు వేసే అవకాసం ఉందని, అంటున్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో, చట్ట సభల్లో చర్చించాలి కాని, ఇలా ఆర్డినెన్స్‌ ఇవ్వటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరో పక్క, ఎన్నికల ప్రక్రియని ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారు అనే దానికి కూడా సమాధానం లేదు. 7 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించేసే విధంగా ఆదేశాలు ఇవ్వటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే, ఇలా హడావిడి పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read