దేశంలో ఏ రాజకీయ కుటుంబం కూడ 9 ఏళ్ల నుంచి ఆస్తుల ప్రకటన చేయలేదని, తన కుటుంబం మాత్రమే అలా చేసిందని, తుగ్లక్ సీఎం ఆస్తులను సీబీఐ, ఈడీ ప్రకటించాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడించారు. తాము చేస్తున్న ఆస్తుల ప్రకటనపై వైసీపీ బృందం కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా మాట్లాడకుండా వాస్తవాలు తెలుసుకుంటే మంచిదన్నారు. మార్కెట్ వ్యాల్యు అనేది తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందని, ఏ ధరలకైతే ఆస్తులు కొన్నామో అవే వివరాలు ప్రకటిస్తున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మైనింగ్ ద్వారా, మాఫియా ద్వారా క్విడ్ ప్రోకో ద్వారా తమ కుటుంబం ఆస్తులు సంపాదించలేదని, కష్టపడి చెమటోడ్చడం ద్వారానే ఈ స్థాయికి రావటం జరిగిందన్నారు. రాజకీయాలపై ఆధారపడకుండా స్వశక్తితో పైకి రావాలనే సదుద్దేశంతోనే చంద్రబాబునాయుడుగారు 27 ఏళ్ల క్రితం హెరిటేజ్ ను స్థాపించడం జరిగిందన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు పారదర్శకంగానే ఆ సంస్థ వ్యాపారాన్ని నిర్వహిస్తోందన్నారు. పోయిన ఏడాది 2,500 కోట్ల టర్నోవర్ వస్తే రూ.83 కోట్ల ఆదాయం హెరిటేజ్ కు వచ్చిందని ఆ సంస్థ 3 రాష్ట్రాల్లో 9 వేల మంది రైతులతో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు.

పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు 15 రాష్ట్రాల్లో అమ్ముతున్నారని, దాదాపు 3వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. వరుసగా రెండేళ్లపాటు ఆ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చిందన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలైతే ఎంతటి అద్భుతాలు సాధించగలరో చెప్పడానికి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లే నిదర్శనమన్నారు. హెరిటేజ్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అని, మూడు నెలలకు ఒకసారి చట్టం ప్రకారం అకౌంట్స్ ప్రకటించడం జరుగుతుందన్నారు. 23 ఏళ్ల క్రితం ఎన్ టీ ఆర్ ట్రస్ట్ ను స్థాపించిన చంద్రబాబు సామాన్య ప్రజానీకంతోపాటు, కార్యకర్తల కుటుంబాలను కూడా దాని ద్వారా ఆదుకుంటున్నారని లోకేశ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని తెలుగువారికి ఏ కష్టమొచ్చినా స్పందించేది ఎన్ టీ ఆర్ ట్రస్టేనన్నారు. స్వర్గీయ ఎన్ టీ ఆర్ సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన చూపిన బాటలోనే చంద్రబాబునాయుడు నడుస్తూ రాజకీయాలను పారదర్శకతగా నిర్వహించారని, అదే దారిలో తాను కూడా నడుస్తున్నానని లోకేశ్ స్పష్టం చేశారు. 2012లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ నీడలో కార్యకర్తలకు మేలు చేసేలా, వారి సంక్షేమానికి పాటు పడేలా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. సభ్యత్వం ద్వారా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా అందిస్తున్నామని, 4,300 కుటుంబాలను ప్రమాద బీమా ద్వారా ఆదుకోవటం జరిగిందన్నారు. భారత దేశంలో ఏపార్టీలోనూ ఇటువంటి విధానం లేదన్నారు. రాజకీయాలైనా, వ్యాపారమైనా, సంక్షేమమైనా విలువలకు కట్టుబడి చేయటమే తమకు తెలుసునని లోకేష్ పేర్కొన్నారు.

కోడిగుడ్డు మీద ఈకలు పీకే వైసీపీ బృందానికి సవాల్ : తొమ్మిదేళ్లుగా ఆస్తుల ప్రకటన చేస్తున్న తమపై విమర్శలు చేస్తూ, కోడిగుడ్డుపై ఈకలు పీకే కార్య్ క్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న వైసీపీ అధినేతగానీ, అతని బృందంగానీ వారికి సంబంధించిన ఆస్తులను తక్షణమే ప్రకటించాలన్న లోకేశ్, ముందుగా వారు తమ ఆస్తులను ప్రకటించి, ఎదుటివారి తప్పులను చూపిస్తే సంతోషిస్తామని తేల్చిచెప్పారు. ఈఏడాదితో కలిపి వరుసగా 9ఏళ్ల నుంచి తమ కుటుంబఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నామన్న లోకేశ్, తాము ప్రకటించినవాటికంటే ఒక్కరూపాయి ఎక్కువున్నా, ఒక్క గజం భూమి ఎక్కువున్నా దాన్ని ప్రకటించినవారికే ఇచ్చేస్తామని మరోసారి స్పష్టంచేశారు. తమపై ఆరోపణలు చేస్తున్నవారి ఆస్తులను ఇప్పటికే సీబీఐ, ఈడీలుప్రకటించాయని, అసలు వ్యక్తులు మాత్రం నోరు విప్పడంలేదన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని, బినామీ భూములని చెబుతున్నారు తప్ప, అవి ఎక్కడున్నాయో నిరూపించలేకపోతున్నారన్నారు. మండలిలో కూడా ఇదే అంశంపై తాను సవాల్ చేస్తే ఒక్కరుకూడా స్పందించలేదన్నారు. కావాలని ఆరోపణలు చేయడంతప్ప, ఎక్కడాఆధారాలు చూపే పరిస్థితులు లేవన్నారు. జగన్ తాను అవినీతిపరుడు కాబట్టి, ఇతరులను కూడా అలానే చిత్రీకరించాలని చూస్తున్నాడన్నారు. లోకేష్ ప్రెస్ మీట్ తో ఇక బాల్ జగన్ కోర్ట్ లో పడింది. అధికారం జగన్ ది కావటంతో, లోకేష్ చెప్పిన దాంట్లో తప్పు ఏమైనా ఉంటే, జగనే బయట పెట్టాలి.

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి మాట తప్పడు.. అంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో గత ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని జగన్ వమ్ము చెయ్యకుండా పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చెయ్యాలని లేకుండా జాతి సైతం క్షమించదని ఉండవల్లి ధ్వజమెత్తారు. స్థానిక వై జంక్షన్లోని ఆనంరోటరీ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రంతో తాను డిమాండ్ చేశానన్నారు. అయితే వెబ్ సైట్లో వివరాలు చూసుకోవాలని ఆనాటి ప్రభుత్వ ప్రతినిధులు తనకు సూచించారన్నారు. అయితే 2019 జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆ వెబ్ సైట్లో ఎలాంటి అప్ డేట్స్ లేవన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో కూడా అనుకున్నంత రీతిగా పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిమిత్తం రూ.1800 కోట్లు విడుదల చేసిందన్నారు.

దానిని ఆరోగ్యశ్రీ ఇతర ఖర్చుల నిమిత్తం వినియోగించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అయతే ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిన దాని నిమిత్తం కేంద్రం చెల్లించిన నిధులను మాత్రమే ఈ సర్కార్ ఇతర ఖర్చులకు నియోగించిందని తెలిపారన్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.700 కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం చెబుతుంటే.. సకాలంలో ప్రాజెక్టు పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సకాలంలో ప్రారంభించకపోతే చాలా నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన హామీ ఇవ్వడం లేదని, ఇటీవల ఈ అంశంపై తెదేపాకు చెందిన ఎంపి రామ్మోహన నాయుడు, వైకాపు చెందిన రాజమహేంద్రి ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడారన్నారు. ప్రాజెక్టు పూర్తిచేసిన ఆర్ఎంఆర్ ప్యాకేజీ ఇవ్వకపోతే ఫలితం ఉండదన్నారు. ఇటీవల ప్రాజెక్టును పరిశీలించిన సెంట్రల్ వాటర్ కమీషన్ ప్రతినిధులు ఒక నివేదిక సమర్పించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 222 గ్రామాల్లో లక్షా 5వేల 601 కుటుంబాలు నిరాశ్రయులవుతు న్నారన్నారు. వారిలో 3,922 కుటుంబాలను మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు. ఇంకా లక్షా ఒక వెయ్యి 679 కుటుంబాలకు వునరావాసం కల్పించాల్సి ఉందన్నారు.

అందుకు రూ.35వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంపై తీవ్ర సాయిలో ఒత్తిడి తేవాలని, కేసుల కోసం భయపడకుండా పోరాడితే జనబలం కల్లిన సీఎం జగన్‌ను కేంద్రం ఏమీ చెయ్యలేదన్నారు. రాజమహేంద్రవరంలో పోలీస్ స్టేషన్ ప్రారంభించిన క్రమంలో మీడియాను వరిమితం చెయ్యడం సరికాదన్నారు. ఇంత గొప్ప విషయాన్ని అన్ని మీడియా సంస్థలను పిలిచి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పెన్షన్ లు ఎత్తేయటం అనేది, జగన్ పతనానికి నాంది అని అన్నారు. తక్షణమే నిలిపివేసిన మీడియా చానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు. ఇది ఇలా ఉంటే, మొన్నటి దాకా, ఉండవల్లి, జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు ఇలా అన్ని విషయాల్లో విమర్శలు చెయ్యటం పై, వైసీపీ క్యాడర్ కూడా ఆలోచనలో పడింది. తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది అంటే, అది రాజకీయ విమర్శలు అనుకోవచ్చు, అలాంటిది, సొంత మనిషి అనుకున్నవాడే ఇలా ఎక్కి తొక్కుతుంటే, వైసీపీ క్యాడర్ కు ఏమి అర్ధం కావటం లేదు.

అటు ప్రభుత్వం, ఇటు కోర్ట్ ల మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఈ విషయం పై, ఇప్పటికే హెచ్చరించారు కూడా. ఏ నిర్ణయం అమలు చేసినా, జగన్ మోహన్ రెడ్డికి ఏమి అవ్వదు, అధికారులే బాధ్యత తీసుకోవాలి అంటూ, ఆయన ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది నిజం అని ఇప్పుడు తేలుతుంది కూడా. పంచాయతీ ఆఫీస్ కి వైసీపీ రంగుల విషయంలో, అధికారులనే కోర్ట్ తప్పు బట్టింది. అలాగే, ఒక రేషన్ డీలర్ ని అకారణంగా రద్దు చేసిన విషయంలో కూడా అధికారులనే కోర్ట్ బాధ్యులను చేసింది. అలాగే కృష్ణ కిషోర్ కు జీతం ఇవ్వకుండా ఆపటం పై, క్యాట్ ట్రిబ్యునల్, చీఫ్ సెక్రటరీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్నటి మొన్న, డీజీపీ ఒక కేసు విషయంలో, హైకోర్ట్ కు వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది. ఇలా ప్రతి విషయంలో, వెనుక వైసీపీ ప్రభుత్వం ఉన్నా, దానికి బాధ్యులు మాత్రం, అధికారులే అవుతున్నారు. ఇప్పుడు తాజాగా విధ్యత్ బకాయల విషయంలో, మళ్ళీ అధికారులనే తప్ప బట్టింది హైకోర్ట్.

court 2002020 2

సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి, వైరం ఏర్పడింది. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీల పై కక్ష కట్టి, వాటి ఒప్పందాలు సమీక్షిస్తాం అని చెప్పటం, అలాగే తక్కువ రేటుకు ఇవ్వాలని ఒత్తిడి చెయ్యటం, వారు కోర్ట్ కు వెళ్ళటం, వారికి ఇవ్వాల్సిన బకాయాలు ఆపేయటం, వారి నుంచి విద్యుత్ కొనకపోవటం, ఇలా రకరకాలుగా వారిని ఇబ్బంది పెడుతూ వచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ నేపధ్యంలోనే, తమకు ఇవ్వాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించాలి అంటూ వారు కోర్ట్ కు వెళ్లారు. దీంతో, హైకోర్ట్, వారి బకాయాలు వెంటనే ఇవ్వాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. కోర్ట్ ఆదేశాలు తప్పక పాటించాల్సి రావటంతో, కొంత మేర ప్రభుత్వం చెల్లింపులు చెల్లించింది.

court 2002020 3

అయితే మిగతా బకాయిలు, 4 వారాల్లో చెల్లిస్తాం అని హామీ ఇచ్చారు. అయితే, 4 వారలు అయినా చెల్లింపులు చెల్లించకపోవటంతో, కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. మీ మీద కోర్ట్ ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించి, ఎవరయితే బాధ్యులు అయిన అధికారులు ఉన్నారో, వారిని జైలుకు పంపుతాం అంటూ హైకోర్ట్ తీవ్రంగా హెచ్చరించింది. ఏ సంస్థకు ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలి అంటూ, తమకు కౌంటర్ దాఖలు చెయ్యాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో, కోర్ట్ కు ఇచ్చిన హమీ మేరకు, తాము చెల్లింపులు చెయ్యలేదని, క్షమాపణలు కోరుతున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌, ఏపీఈపీడీసీఎల్‌ తరఫున ఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజరు హైకోర్ట్ లో అఫిడవిట్ వేసారు. మొత్తంగా, ప్రభుత్వ పెద్దల పంతానికి, ఇప్పుడు అధికారులు బోనులో నుంచోవాల్సి వచ్చింది. చూద్దాం, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో.

సాధారణంగా పెద్దలంతా మనం మంచిపనులతో కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని, అలా వచ్చేఖ్యాతీ ఖండాంతరాలు దాటాలని ఆశీర్వదిస్తుంటారని, కానీ రాష్ట్ర నాయకుడైన జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, నిర్వాకాలు, పరిపాలనా విధానాలు, తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, చేస్తున్న దౌర్జన్యాల గురించిన చర్చ ఖండాంతరాల్లో జరుగుతోందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రపంచమంతా ఏపీ వైపు చూసేదని, చంద్రబాబు నాయుడి నిర్ణయాలు, విధానాలపై ఆసక్తి కరమైన చర్చ జరిగేదని, కానీ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. జగన్ అవినీతి వల్ల తాము నష్టపోయామని వివిధ దేశాలు, భారతదేశానికి ఫిర్యాదులు చేస్తున్నాయన్నారు. అమెరికాకు చెందిన వాల్ స్ర్టీట్ జర్నల్ పత్రిక సోలార్ పవర్ ఉత్పత్తిపై 17-02-2020 న ఒక వ్యాసాన్ని ప్రచురించిందని, దానిలో ప్రత్యేకంగా రాష్ట్రం గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో సోలార్ పవర్ కు సంబంధించిన ఒప్పందాలను అక్కడి ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని, సోలార్ పవర్ ఉత్పత్తి చేసే కంపెనీలు, పెట్టుబడుల పెట్టినవారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని చెప్పడం జరిగిందన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై బిజినెస్ లైన్, ఎకనమిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయపత్రికలు దుమ్మెత్తి పోశాయని, తాజాగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వాల్ స్ట్రీట్ జర్నల్ ఏపీని గురించి ప్రస్తావిస్తూ జగన్ చర్యలను తప్పు పట్టిందన్నారు. రాష్ట్రంలో ఎవరూ పెట్టబడులు పెట్టకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చర్యలను సింగపూర్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణకొరియా, జర్మనీ దేశాలు భారతదేశానికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ రాసిన కథనం చూస్తే, పారిశ్రామికవేత్తలెవరూ రాష్ట్రంవైపు కన్నెత్తి చూసేపరిస్థితి కనిపించడం లేదని పట్టాభి ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ తుగ్లక్ చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ట మంటగలిసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారో జగన్ చెప్పాలని పట్టాభి నిలదీశారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఉపాధి సృష్టి, ఉద్యోగాల కల్పన ఎలాసాధ్యమవుతుందో జగన్ చెప్పాలన్నారు. గతంలో ఇదే వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక చంద్రబాబు నాయుడి పనితీరుని, రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంశిస్తూ అనేక కథనాలు ప్రచురించిన విషయాన్ని జగన్ సర్కారు తెలుసుకోవాలన్నారు. గతంలో ఏ రాష్ట్రం గురించైతే వాల్ స్ట్రీట్ జర్నల్ గొప్పగా రాసిందో, ఇప్పుడు అదే పత్రిక అదే రాష్ట్రం గురించి చెడుగా రాయడానికి జగన్ నిర్ణయాలు కారణం కాదా అని పట్టాభి ప్రశ్నించారు. ( ఈసందర్భంగా గతంలో చంద్రబాబునాయుడు పెట్టుబడుల కోసం వాల్ స్ట్రీట్ లో పర్యటించిన వీడియోను పట్టాభి విలేకరులకు ప్రదర్శించారు)

దేశంలో ఏ ముఖ్యమంత్రికూడా ఇంతవరకు కాలినడకన వాల్ స్ట్రీట్ లో పర్యటించలేదని, చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టబడులు తీసుకురావడం కోసం అలుపులేకుండా పర్యటించారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని అత్యంత సమర్థంగా పూర్తిచేసిన బాబర్ కంపెనీకి చెల్లించకపోవడంతో, జర్మనీకి చెందిన సదరు కంపెనీ ఆదేశంలో జగన్ తీరుపై ఫిర్యాదు చేసిందన్నారు. పీపీఏల రద్దు సమయంలో సోలార్ పవర్ ఉత్పత్తిని తప్పుపట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పడు ఏముఖం పెట్టుకొని సోలార్ పవర్ కు సై అంటున్నాడని పట్టాభి నిలదీశారు. అసెంబ్లీలోపల, బయటా సోలార్ విద్యుత్ ఒప్పందాలను తప్పుపట్టని జగన్ కు ఇప్పుడు వాస్తవాలు బోధపడుతున్నట్టున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ కోతలనేవి లేకుండా చేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అప్రకటతి విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాన్నారు. సోలార్ , విండ్ పవర్ ఉత్పత్తిని నిలిపివేస్తే రాష్ట్రం చీకట్లపాలవుతుందని గతంలోనే చంద్రబాబునాయుడు హెచ్చరించినా జగన్ లెక్కచేయలేదన్నారు. జగన్ నిర్ణయాల కారణంగా రాష్ట్రం పరువు గంగపాలై, ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయి కాబట్టే, చంద్రబాబునాయుడు ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారని, రాష్ట్రం నష్టపోతున్న తీరుని ప్రజలకు వివరించడానికే జనం మధ్యకు వెళ్లారని పట్టాభి స్పష్టంచేశారు.

రాష్ట్రాన్ని బాగుచేయడంకోసం చంద్రబాబు కాలినడకన వాల్ స్ట్రీట్ లో పర్యటిస్తే, జగన్ వచ్చాక కియా, ఆదానీ గ్రూప్, రిలయన్స్, లులూ గ్రూప్ లు వెనక్కు వెళ్లాయన్నారు. చంద్రబాబునాయుడి పాలనలో కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి క్యూకడితే, జగన్ పాలనలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. టీడీపీ హాయంలో 5.50లక్షల ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీలో వైసీపీప్రభుత్వమే ప్రకటించిందన్నారు. దావోస్ లో పెట్టుబడిదారులంతా జగన్ తీరుపై కేంద్రానికి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారని, అయినా కూడా ముఖ్యమంత్రి తనపనితీరు మార్చుకోవడం లేదన్నారు. పోలీసులు లేకుండా ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చేయడంలేదని, పోలీస్ పహారాలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వైసీపీనేతలు, ప్రజలమధ్యకు వెళ్లిన చంద్రబాబునాయుడిపై దుష్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. నవమోసాల పాలనవల్ల రాష్ట్రం ఎంతలా నష్టపోయిందో, జగన్ తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాల కారణంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించడానికే టీడీపీ ప్రజాచైతన్య యాత్రను ఆరంభించిదన్నారు. ప్రజలంతా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని, వైసీపీనేతలకు తగినవిధంగా బుద్ధి చెప్పాలని పట్టాభి సూచించారు.

Advertisements

Latest Articles

Most Read