రాష్ట్రంలో, అమరావతి మార్పు తరువాత, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయం,కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలిక బ్రేక్ పడింది. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 25 జిల్లా కేంద్రాలుగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం జగన్ ఆదేశాలకు అనుగుణంగా కొత్త జిల్లాలకు చెందిన ప్రతిపాదనను రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపారు. జగన్ ఢిల్లీ టూర్లో సైతం ఇదే అంశాన్ని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు వివరించారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖరారు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.

దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక జన గణన రూపొందించనున్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో సమస్యలు తలెత్తుతాయని, ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జన గణన ప్రక్రియ 2021 మార్చి 31 వరకు జరుగుతుందని అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది. సరిహద్దుల మార్పుతో పౌరుల వివరాల సేకరణకు ఇబ్బంది కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. జిల్లాలు, మండలాల సరిహద్దులు మారడం వల్ల జనగణన సిబ్బంది పలు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు దాదాపు బ్రేకులు పడినట్లు అయ్యింది.

జనగణన ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఏడాది అనంతరమే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిల్లాలు ఇవే.. నవ్యాంధ్రలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా ప్రభుత్వం మరో 12 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక్కొ జిల్లాగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి పాదించిన దాని ప్రకారం అనకాపల్లి, అరకు, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, నర్సరావుపేట, బాపట్ల, తిరుపతి, రాజంపేట, నంద్యాల, హిందుపురంలను కొత్త జిల్లాలుగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఆయన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోనే నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు గుర్తించి, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. కాపు సామజికవర్గ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. అయినా సరే, మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఆయన కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళిపోయారు. వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడిలో, లేకపోతే మరే కారణమో కాని, ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన దగ్గర నుంచి అనేక అవమానాలు ఎదుర్కుంటునే ఉన్నారు. పోనీ కాపు నాయకుడు అని చెప్పుకుంటూ, కాపులకు జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కాపు రిజర్వేషన్ ఎత్తేసినా నోరు పెగలలేదు. కాపు కార్పొరేషన్ పూర్తిగా సైలెంట్ అయిపోయినా నోరు ఎత్తలేదు. అమ్మ ఓడి కోసం, నిధులు అన్నీ మళ్ళిస్తున్నా, మాట్లాడలేదు. ఇలా కాపులకు ఎంత అన్యాయం జరుగుతున్నా, తోట త్రిమూర్తులు పట్టించుకోలేదు.

పోనీ వైసీపీలో ఆయనకు గుర్తింపు ఉందా అంటే అది కూడా లేదు. ఈ రోజు ఏకంగా చెప్పు దెబ్బలు తిన్నారు, తోట త్రిమూర్తులు. ఈ రోజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో ఆత్మీయ సమావేశం జరిగింది. తోట త్రిమూర్తులు, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు కూడా హాజరు అయ్యారు. అయితే, వైవీ సుబ్బారెడ్డి, తోట త్రిమూర్తులు ఒకే కారులు వచ్చారు. అయితే, తోట త్రిమూర్తులు కారు దిగగానే, తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు వర్గంలోని ఒక వ్యక్తి, తోట త్రిమూర్తుల పై, చెప్పుతో బాదుతూ దాడి చేసారు. ఈ పరిణామంతో అందరూ అవాక్కయ్యారు. సొంత పార్టీలోనే, ఇలా సీనియర్ నాయకుడు, కాపుల్లో మంచి పేరు ఉన్న తోట త్రిమూర్తుల పై, ఏకంగా చెప్పుతో దాడి చెయ్యటం సంచలనంగా మారింది.

మరో పక్క, తోట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వేణు వర్గం, చించి వేసి తగులబెట్టింది. మొత్తంగా, ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త వాతవరణం చోటు చేసుకుంది. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్గానికి చెందిన వారు, వైవీ సుబ్బారెడ్డి కారుని అడ్డుకుని నినాదాలు కూడా చేసారు. తోట త్రిమూర్తులుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ, నినాదాలు చేసారు. ఇదే సందర్భంలో ఫ్లెక్స్ లు తగలు బెట్టటం, చెప్పులతో దాడి చెయ్యటం, అక్కడే ముగ్గురు మంత్రులు, ఒక టిటిడి చైర్మెన్ ఉండటంతో, వైసీపీలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం అవుతుంది అంటూ, క్యాడర్ నిరుత్సాహంతో ఉండి పోయింది. మొత్తంగా టిడిపిలో దర్జాగా బ్రతికిన తోట త్రిమూర్తులు, వైసీపీలో చేరి, చెప్పు దెబ్బలు తిన్నారు.

తెలుగుదేశం పార్టీ, సాక్షి మీడియా పై ఎడిటర్స్ గిల్డ్ తో పాటుగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. ఐటి దాడులకు సంబంధించిన వార్తలను సాక్షి మీడియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, తమ ఇమేజ్ దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శిని సాకుగా చూపి, బురద చల్లింది అంటూ తెలుగుదేశం పార్టీ తన ఫిర్యాదులో పేర్కొంది. “సంబంధం లేని విషయాల్లో చంద్రబాబుని ఇరికించారు. తప్పుడు కథనాలు అల్లుతూ, జర్నలిస్టిక్ విలువలు పూర్తిగా విస్మరించబడ్డాయి ”అని టిడిపి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు లేఖలో ఆరోపించారు. సాక్షి టీవీ న్యూస్, సాక్షి వార్తాపత్రిక క్లిప్పింగులు మరియు వీడియో సిడిలను ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించారు. మరోవైపు, మీడియా సంస్థ పై 500 కోట్ల పరువు నష్టం దావా వేయడానికి టిడిపి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పరువు భంగం కలిగించే వార్తలు వేసారని, ఇప్పటికే సాక్షి మీడియాపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో రాజకీయ వాతావరణ వేడెక్కుతుంది. ఐటి దాడులు కేంద్ర బిందువుగా సాక్షిక్ చేస్తున్న ప్రచారం, దానికి కౌంటర్ గా వచ్చిన పంచనామా రిపోర్ట్ తో జనంలో ఆసక్తిని పెంచుతుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దగ్గర రూ.2000కోట్లు మేరకు ఆదాయపన్ను ఎగవేత పరిధిలో ఆక్రమలావాదేవీలు జరిగినట్లు సాక్షి హడావిడి చేసింది. అధికార పార్టీ నేతలు ఐటి ప్రకటన వక్రీకరించి టిడిపి పై ఎదురుదాడికి దిగారు. నిజానికి ప్రస్తుతం పెండ్యాల శ్రీనివాస్ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర పనిచేయడం లేదు. యిపి సచివాలయంలో తన మాతృసంస్థలో పనిచేస్తున్నారు. ఆయనపై ఐటి దాడుల నిర్వాహణకు సంబంధించి ప్రకటన చేస్తే, అదే విషయాన్ని ప్రస్తావించాల్సి వుంది. మూడు ఇన్ఫ్రా కంపెనీలు నకిలీ బిల్లుల ను గుర్తించామని ఐటి శాఖ తన నోట్లో చెప్పింది.

గతంలో చంద్రబాబుకు పిఎస్ గా పనిచేసినంత మాత్రం చేత పెండ్యాల ఆర్థిక లావాదేవీలకు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఇఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగితే వాటికి తెలుగుదేశంకు ముడిపెట్టడం ఏమిటంటూ ప్రశ్నలు సంధించారు. మాజీ ఎంఎలు బొండా ఉమా, తంగిరాల సౌమ్యలు నేరస్తులకు చిరునామా వైఎస్ కాంగ్రెస్ అంటూ అధికారపార్టీపై ప్రతిదాడి చేసారు. సాక్షి పత్రిక, టీవీతో టిడిపిపై అవినీతి ఆరోపణలను అధికార పార్టీ చేసింది అనే విమర్శలు వచ్చాయి. ఐటి దాడులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారాలోకేష్ అవినీతి భాగోతం బట్టబయలు ఆయిందంటూ , చంద్రబాబు, ఆయన కుమారుడు పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకోవాలంటూ హడావిడి చేసారు. కాని ఐటి శాఖ పంచనామా బయట పడటంతో, సాక్షి చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలిపోయాయి. అయితే, సాక్షిలో వచ్చిన ఈ తప్పుడు కధనాల పై, ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన ఫిర్యాదు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

సీనియర్ ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపి ఇంటెలిజన్స్ చీఫ్ గా నియమించేందుక వైఎస్ జగన్మోహనరెడ్డి తన ప్రయత్నాలను తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర నియామక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాస్తవానికి రవీంద్రను ఏపీ ఇంటెలిజన్స చీఫ్ గా నియమించేందుకు జగన్ గత ఏడాది జూన్ లోనే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల మూలంగా ఈ అంశం వాయిదా పడింది. తాజాగా అమిత్ షాతో భేటీ అనంతరం ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తెలంగాణాలో ఐజిగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర 1999 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలని గత ఏడాది జూన్లో వైఎస్ జగన్ తెలంగాణా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి కళ్లు, ముక్కు, చెవుల మాదిరిగా వ్యవహరించాల్సి ఉన్న ఇంటెలిజన్స్ విభాగానికి ఐజి స్థాయి అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావించి తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎఓసి ఇచ్చింది. 

తదుపరి ఇదే అంశాన్ని కేంద్ర హోంశాఖకు నివేదించారు. అపుడు తనకు ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్ పోస్టు ఖాయమవుతుందని భావించిన స్టీఫెన్ రవీంద్ర సెలవు పెట్టి అమరావతిలో నెల రోజులు మకాం వేశారు. అయినప్పటికి కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో తన సెలవును మరొ 15 రోజులు పొడిగించుకున్నారు. అప్పటికి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెలంగాణా ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి ఆయన తన పోస్టులో జాయిన్ అయ్యారు. అయితే కేంద్రం నుంచి ఇంటర్ క్యాడర్ డిప్యుటేషను అనుమతి లభించక పోవడంతో ఆ ప్రతిపాదనకు తాత్కాలికంగా బ్రేకు పడిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆలిండియా సర్వీసు నిబంధనలను అనుసరించి ఇంటర్ క్యాడర్ బదిలీలను అదే సర్వీసులో ఉండి వేరే రాష్ట్రంలో పనిచేస్తున్న వారితో వివాహం చేసుకునే సందర్భంలోను, అసమాన్య ప్రతిభా పాటవాలు కనబరచిన సమయంలో సంబంధిత ఉన్నతాధికారి నిర్ణయం మేరకు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

కాగా పోలీసు అధికారులు ఎవరైతే సూపర్‌టైం స్కేల్ (ఐజి ర్యాంక్) పొందుతున్నారో వారు ఇంటర్ క్యాడర్ డిప్యుటేషనుకు అనర్హులు. ఈ నిబంధన ప్రకారం రవీంద్ర ఐజి ర్యాంక్ అధికారి కావడంతో ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్ సాధ్యపడలేదు. మరో కోణంలో చూస్తే ఏరాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అతని ప్రా-ణా-ని-కి హా-ని కలిగే అవకాశం ఉన్నట్లయితే ఆ సమయంలో ఇంటర్ క్యాడర్ బదిలీకి అవకాశం ఉంటుంది. అయితే గతంలో రవీంద్ర పోలీసుశాఖలో చేపట్టిన సంస్కరణల దృష్ట్యా ఆయనను ఇంటర్ స్టేట్ బదిలీకి అర్హునిగా పరిగణించి తమ అభ్యర్థనను గౌరవించాల్సిందిగా జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఇందుకా అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే మార్చి మొదటి వారానికి స్టీఫెన్ రవీంద్ర ఏపీలో బాధ్యతలు స్వీకరించే అవకాశం లేకపోలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read