ఈ రోజుల్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రోనిక్ మీడియా ఎలా పని చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఎక్కడో ఒకటి, రెండు తప్పితే, అన్ని సంస్థలు, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయటం, వారి అజెండా మాత్రమే ప్రమోట్ చెయ్యటం, ఇలా అయిపొయింది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోనే ఇలా ఉంది. అయితే, ఈ ధోరణి ఇక్కడితో ఆగితే పరవాలేదు. ఎందుకంటే, ఒక పార్టీ లైన్ తీసుకుని వారికి అనుకూలంగా వార్తలు రాయటం వల్ల, ప్రజలకు ఒరిగింది ఏమి ఉండదు. ప్రజలకు కూడా అర్ధమవుతుంది. కాని, ఫేక్ న్యూస్ రాయటం, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, ప్రజలను నమ్మిస్తూ, కధనాలు రాయటం,మాత్రం సమాజానికి హానికరమే. కొంత మంది ఆ తప్పుడు వార్త నిజం అని నమ్మినా, అపార నష్టం జరుగుతుంది. కన్ని సార్లు, కొంత మంది మానం, అభిమానం, ఉన్న వ్యక్తులు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఆ సంఘటనలు కూడా చూసాం. ఒక వ్యక్తీ పై, పదే పదే తప్పుడు కధనాలు రాసి, మానసికంగా ఇబ్బంది పెట్టి, బలవంమరరానికి కూడా వీళ్ళు కారకులు అవుతారు. అయితే, మన రాష్ట్రంలో ఇలాంటి వార్తల వల్ల తెలుగుదేశం బాగా నష్టపోయింది. ఎన్నికల తరువాత కూడా ఇలాంటి వార్తలే వస్తూ ఉండటంతో, ఇక వాటి పై న్యాయ పరంగా వెళ్లేందుకు సిద్ధమవుతుంది.

తెలుగుదిన‌ప‌త్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లైంది. ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో దాఖ‌లైన వ్యాజ్యంలో త‌న వ్య‌క్తిగ‌త ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే దురుద్దేశంతో సాక్షి ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చురించార‌ని దావాలో పేర్కొన్నారు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో 2019 అక్టోబ‌ర్ 22న ``చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి`` శీర్షిక‌తో ఓ క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది. అయితే ఆ క‌థ‌నంలో ప్ర‌చురితమైన అంశాల‌న్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని, దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019 అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు. దీనికి సంబంధించి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి నుంచి తిరుగుస‌మాధానం వ‌చ్చింది.

దీనిపై సంతృప్తి చెంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌లో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నాన‌ని అయినప్ప‌టికీ త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో పేర్కొన్నారు. ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని అందులో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా శాసన మండలి పై వైఎస్ జగన్మోహన రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. శాసనసభలో సోమవారం ఏమి జరగబోతోందనే చర్చ సర్వత్రా నెలకొన్నది. అన్ని రాజకీయ పక్షాల్లో ఇప్పుడదే చర్చనీ యాంశంగా మారింది. మండలి రద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారనే దానిపై ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేక దృష్టిసారించిన నేపధ్యంలో బీజేపీ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. మండలి రద్దుపై శనివారం పార్టీలో సమగ్రంగా చర్చించేందుకు బీజేపీ నేతలు నిర్ణయించి నట్లు తెలిసింది. అప్పటి వరకు నేతలు ఎవరూ శాసనమండలి రద్దుపై అనుకూల, వ్యతిరేక ప్రకటనలు చేయవద్దంటూ పార్టీపరంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూడు రాజధానులపై ప్రభుత్వ వైఖరిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసా గించాలనేది బీజేపీడిమాండ్. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము సుముఖమే తప్ప పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకమంటూ తొలి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెపుతున్నారు.

mlc 25012020 2

తెదేపా, వామపక్షాలు సహా అన్ని పార్టీలు మండలి రద్దుపై బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ... ఇప్పటి వరకు బీజేపీ నేతలు మాత్రం స్పందించ లేదు. బీజేపీ తరుపున ఎమ్మెల్సీ లుగా సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్ ఉన్నారు. ఇటీవల తెదేపా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలం మూడుకు చేరింది. ఢిల్లీలో కీలక నేతలు రానున్న రోజుల్లో జనసేనతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళనా కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇరుపార్టీలకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉన్నారు.గత మూడు రోజులుగా వీరు బీజేపీ అగ్రనేతలతో భవిష్యత్ ఉమ్మడి వ్యూహాలపై చర్చించడంతో పాటు కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తొలి కార్యక్రమంగా ఫిబ్రవరి 2న గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి విజయవాడ లోని స్వరాజ్య మైదానం వరకు రాజధాని మార్పును వ్యతి రేకిస్తూ 'లాంగ్ మార్చ' ప్రకటిం చారు.

mlc 25012020 3 style=

జగన్ ప్రకటన చేసిన సమయంలో ఢిల్లీలో ఉన్న నేతలు బీజేపీ పెద్దలతో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. వీరంతా శుక్రవారం రాత్రికి విజయవాడ చేరుకోనున్నారు. కీలక నేతలు వచ్చిన వెంటనే కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో భేటీ కానున్నారు. ముఖ్య నేతలతో పాటు పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చ నున్నారు. ఆ తర్వాత పార్టీ పరంగా ఓ నిర్ణయానికి వచ్చి మండలి రద్దు అంశంపై స్పందించనున్నారు. విపక్ష ఎమ్మెల్సీలను బెదిరించేందుకే మండలి రద్దు అస్త్రం ముఖ్యమంత్రి జగన్ ప్రయోగించారనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మండలిలో వికేంద్రీకరణ బిల్లు వీగిపోవడంతో రద్దు అంశాన్ని ప్రయోగించడం ద్వారా అనుకూల వైఖరికి వచ్చే విధంగా పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీ పరంగా స్పష్టమైన వైఖరి తీసుకోనున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.

మండలిలో జరిగిన పరిణామాల పై, తాను గ్యాలరీలో కూర్చున్న సమయంలో జరిగిన అంశాల పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఈ రోజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు.. "ఒక రాష్ట్రం-ఒకే రాజధాని’’ అంశంపై రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో ఘోషిస్తున్నా వైసిపి ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరం. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం, ఎదురుదాడి చేయడం శోచనీయం. ఉదయం 9గం కు కేబినెట్, 10గం బిల్లు పెట్టడం, 11గం కు చర్చ అనడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఎప్పుడు బిల్లు పెట్టినా 2రోజులు ముందు పెట్టి, అవగాహన కల్పించడం, ఆ తరువాత చర్చ కు అవకాశం ఇవ్వడం చేస్తారు. అలాంటిది బిల్లు పెట్టడానికి స్పీకర్ విచక్షణాధికారాన్ని వాడటం ఇప్పుడే చూశాం. రాజధాని బిల్లుపై సర్వత్రా ఉత్వంఠ..సిఆర్ డిఏ రద్దు చేస్తారా, రాజధాని మారుస్తారా ఏం చేస్తారా అని..ఇంత సీరియస్ బిల్లుపై కనీసం సమయం ఇవ్వకుండా, మా డిప్యూటి లీడర్ అచ్చెన్నాయుడు 2గం సమయం అడిగినా ఇవ్వకుండా ఏకపక్షంగా బిల్లు తెచ్చారు. అధికార పార్టీ బిల్లులు తెస్తుంది...సవరణలు చేయడం, సెలెక్ట్ కమిటికి పంపడం ప్రతిపక్షం బాధ్యత. బిల్లుపై మాట్లాడటానికి సాయంత్రం దాకా మాకు అవకాశం ఇవ్వకపోవడం, రామానాయుడు లేకుండా చూసి అప్పుడు మైకు ఇవ్వడం(అవకాశం ఇవ్వాలని స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లి అడిగేటప్పుడు).. ఎంత నీచ రాజకీయం చేస్తున్నారు.. సీరియస్ బిల్లుపై చర్చకు...పోరాడితే, పోరాడితే రాత్రి అయ్యాక మైక్ ఇచ్చారు నాకు.. బిల్లులో ఏం ఉందో, లాభనష్టాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని లేదు వైసిపి వాళ్లకు..పూర్తి సమయం నన్ను తిట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. మార్షల్స్ తో మమ్మల్ని బైటకు నెట్టేశారు. అర్ధరాత్రి నన్ను పుట్టలమ్మటా, గుట్టలమ్మటా, డొంకరోడ్లపై 3గంటలు అర్ధరాత్రిదాకా తిప్పారు. కడాన మంగళగిరిలో మారూమూల వదిలేశారు, పోలీస్ స్టేషన్ దగ్గర నిలదీస్తే సమాధానం చెప్పరు. మాజీ సిఎంను, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా అర్ధరాత్రి అంతా తిప్పుతారా..? "

"రాజధానిని ఎందుకు మారుస్తున్నారంటే 60మంది మాపై దాడి చేస్తారు. వీళ్లను బైటపడేయండి అని మార్షల్స్ కు ముఖ్యమంత్రే ఆదేశాలిస్తారు, రింగు ఒకటి పెట్టండి, దాటితే బైటపడేయండని అంటారు. అప్పుడు స్పీకర్ మార్షల్స్ ను పిలుస్తారు, వీళ్లను సీట్లలో కూర్చోపెట్టండి లేదా బైట పడేయండని అంటారు. ప్రజా సమస్యల తీవ్రతను బట్టి ప్రతిపక్షంలో సుందరయ్య అంతటి వ్యక్తే బెంచి ఎక్కారు. సర్వవిధాలా పోరాడే హక్కు ప్రతిపక్షానికి ఉంది. విభజన చట్టం వచ్చినప్పుడు రెండేళ్లు పార్లమెంటులో పోరాడారు. అభ్యంతరాలు చెప్పేందుకు రైతులకు జనవరి 20 సాయంత్రం 3గం దాకా టైమ్ ఇస్తే, ఉదయం 10గంటలకే బిల్లు ఎలా టేబుల్ చేస్తారు..? ఇక కౌన్సిల్ లో తంతు విషయానికి వస్తే..కరెంట్ కట్ చేస్తారు, ప్రసారాలు నిలిపేస్తారు, 3చానళ్లను అనుమతించరు, ఇంటర్నెట్ కూడా కట్ చేస్తారు. రూమ్ లో కూర్చున్న మాకు ప్రసారాలు ఇవ్వరు. ఛైర్ పర్సన్ ఆదేశిస్తే ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ కట్ చేస్తారు. శాసన మండలి సభాపతి ఆదేశాలంటే మీకు లెక్కే లేదా..? పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, గౌతు లచ్చన్న, భాట్టం శ్రీరామ మూర్తిలతో కలిసి పనిచేశాం. 11మంది ముఖ్యమంత్రులను నేను చూశాను. ఇంత అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు. సీఎంగా నేను ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి మైకు ఇచ్చేవాళ్లం, ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు మైక్ ఇచ్చేవారు. కానీ ఈ అరాచక పరిస్థితి ఎప్పుడూ చూడలేదు."

"కౌన్సిల్ ఛైర్ పర్సన్ ఛాంబర్ లోనే 22మంది మంత్రులు తిష్ట వేయడం, ఆయనను గుక్క తిప్పుకోకుండా చేశారు. ఏ 2, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి గ్యాలరీలోనే 2రోజులు మకాం వేశారు. ఎమ్మెల్సీలకు ప్రలోభాలు పెట్టారు. పోతుల సునీతకు పార్టీ ఎంతో చేసింది, ఉద్యమం నుంచి బైటకు వచ్చిన సీతక్కతో పాటు సీటు ఇచ్చాం. పరిటాల రవి అనుచరుడని ఆమె భర్తను ఆదరించాం. అన్నివిధాలా ఆదుకుంటే ఆమెను ప్రలోభపెట్టారు. ఆదినారాయణ రెడ్డిని రాజీనామా చేయించి, శివనాధ రెడ్డిని ఎమ్మెల్సీ చేస్తే ఆయనను లాక్కున్నారు. రూల్ 71పై చర్చ అంటే ఈ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన చర్చ అది. కౌన్సిల్ గొడవల్లో మేము ఇచ్చిన లేఖ ఛెయిర్ పర్సన్ చదవలేక పోయారు. అయినా 9మంది సభ్యులతో కౌన్సిల్ లో మీరు ఎలా ఆమోదించుకోగలరు..? కౌన్సిల్ సభాపతిని పట్టుకుని, ‘‘సాయిబుకే పుట్టావా..? నీ అంతు చూస్తాం’’ అని బొత్స అంటారా..? "

"నేను గ్యాలరీలోనే ఉన్నాను. ఈ పరిస్థితుల్లో రూమ్ లో కూర్చోవడం సరైందికాదనే గ్యాలరీలోకి వచ్చాను. 14ఏళ్ల సీఎంనైన నన్ను అడ్వయిజర్ వచ్చి వెళ్లిపొమ్మంటాడా..? మార్షల్ వచ్చి వెళ్లిపొమ్మంటారా..? కౌన్సిల్ ఛెయిర్ పర్సన్ ను చెప్పమనండి వెళ్లిపోతా అని చెప్పాను. నిబంధనలు పాటించే తొలి పౌరుడిగా నేను ఉంటాననేది అందరికీ తెలుసు..అందుకే అడగ్గానే సెల్ ఫోన్ ఇచ్చేశాను. అలాంటిది కిందనుంచి పైకి వాటర్ బాటిల్స్ విసురుతారా..? పైనుంచి కిందకు కాగితాలు విసిరేస్తారా..? నాకు అడ్డంగా ఒకరు నించుంటారా..? నన్ను మానసికంగా హింసించాలని చూస్తారా..? మీరు కొడితే నేను గమ్మున ఉండాల్నా..? నా ముందే కులం పేరుతో ఛెయిర్ పర్సన్ ను పట్టుకుని బూతులు తిడతారా... ఆయన తల్లిని, తండ్రిని, కులాన్ని, మతాన్ని తిడతారా..? బజారు రౌడీల మాదిరి వ్యవహరిస్తారా..? ఆయన చేసిన తప్పేంటి..? ధర్మాన్ని, చట్టాన్ని కాపాడటం ఆయన చేసిన తప్పా..? రూమ్ లో ఆయనను మీ మంత్రులు కొట్టబోతే బచ్చుల అర్జునుడు కాపాడి క్షేమంగా తీసుకెళ్లాడు. మీరేం దున్నపోతులా..? ఆర్టికల్ 169పై తప్ప ఎప్పుడూ మండలి గురించి శాసన సభలో చర్చించకూడదు. ఇవి రెండూ స్వయం ప్రతిపత్తిగల సంస్థలు. రాజ్యాంగం చెప్పింది అదే. ఒక సభలో చర్చను మరో సభలో వక్రీకరించి మాట్లాడటం, అనుమతి లేకుండా తెరపై ప్రదర్శించడం రాజ్యాంగ విరుద్దం కాదా..?

"బిల్లులపై సెలెక్ట్ కమిటి వేశారు, అవుట్ కమ్ రావాల్సివుందని మీ ఏజినే కోర్టులో అఫిడవిట్ వేశారు. అదివచ్చేదాకా కార్యాలయాల తరలించరాదని అంటున్నారు. అమ్మవడి, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కమిషన్ బిల్లులను సాధారణ బిల్లుగా వస్తే సవరణలు చేసి పంపితే పాత బిల్లునే ద్రవ్యబిల్లుగా మార్చి మళ్లీ పంపిస్తారా..? అది జరగలేదని కౌన్సిల్ పై ఉక్రోషమా..? అందరినీ కొనేయాలని హార్స్ ట్రేడింగ్ చేస్తారా..? నేను ఎవరినీ పార్టీలోకి తీసుకోను,విలువలతో రాజకీయం చేస్తాను గప్పాలు కొట్టి ఇప్పుడు చేస్తున్నదేంటి..? నీ సహ నిందితులందరికీ ప్రభుత్వంలో పదవులిస్తారా..? టిటిడి పదవులా..? అడ్వయిజర్ పదవులా..? ఇక సాక్షులకు ఇంకెన్ని ఇస్తారో..? ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బౌన్సెస్ ఉంటాయి. 3వ్యవస్థలు పట్టుకొమ్మలు ప్రజాస్వామ్యానికి. లెజిస్లేచర్, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్..మీడియా ఫోర్త్ ఎస్టేట్. అలాంటి మీడియాను చంపేస్తున్నారు. ఈ ఉన్మాద ప్రభుత్వాన్ని ఏం చేయాలో అదే చేస్తాం. తదుపరి కార్యాచరణ ఆదివారం టిడిఎల్ పిలో నిర్ణయిస్తాం’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు."

నిన్నటి నుంచి మండలి చైర్మెన్ పై, ఎలాంటి దాడి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, ఆయన వీడియో వేసి, మండలి చైర్మెన్ వైఖరిని తప్పు బట్టారు. ఇలా అనేక మంది వైసీపీ నేతలు కూడా, ఆయన్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. తొత్తులు అన్నారు. అర్హత లేదు అన్నారు. ప్రలోభపెట్టరన్నారు. ఇలా అనేక ఆరోపణలు చేసారు. అయితే, అన్ని ఆరోపణలు చేస్తున్నా మండలి చైర్మెన్ షరీఫ్ ఒక్క మాట కూడా తిరిగి ఎదురు అనలేదు. అయితే, ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారం పై మాత్రం, ఆయన స్పందిస్తూ, వెంటనే ఖండించారు. శాసనమండలిలో, సీఆర్డీయే రద్దు, ఏపీ రాజధానుల వికేంద్రీకరణ బిల్లులను, సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని ఉదయం నుంచి ప్రచారం జరుగుతుంది. అన్ని మీడియా చానల్స్ లో కూడా ఇది రావటంతో, ఇది నిజమేనెమో అని అందరూ అనుకున్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్లకపొతే, మండలి రద్దు చేస్తే, ఆ బిల్లుని మళ్ళీ అసెంబ్లీకి పంపించి ఆమోదించవచ్చు అనే ఉద్దేశంతో, కొట్న మంది ఇలా ప్రచారం చేస్తున్నారని, టిడిపి ఆరోపించింది.

sharif 24012020 2

టిడిపి ఎమ్మెల్సీలు ఈ ప్రచారం పై స్పందిస్తూ, ఇది అవాస్తవం అని చెప్పారు. అయితే, ఈ విషయం పై క్లారిటీ లేకపోవటంతో, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటూ, మళ్ళీ కన్ఫ్యూషన్ లో పడేయటంతో, మండలి చైర్మెన్, ఈ విషయం పై వెంటనే స్పందించారు. సీఆర్డీయే రద్దు, ఏపీ రాజధానుల వికేంద్రీకరణ బిల్లులు, సెలెక్ట్ కమిటీ వెళ్ళలేదు అనేది అవాస్తవం అని అన్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోయిందని ఆయన చెప్పారు. ఇక తరువాత ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. సెలెక్ట్ కమిటీ సభ్యుల ఎంపిక మాత్రమే మిగిలి ఉందని మండలి చైర్మన్ షరీఫ్ తెలిపారు. సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లులు వెళ్ళలేదు అంటూ, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని , చైర్మన్ షరీఫ్ స్పష్టం చేసారు.

sharif 24012020 3

చైర్మన్ షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు, చర్చకు దారి తీసాయి. అసలు ఈ ప్రచారం చేస్తుంది ఎవరూ అనే చర్చ కూడా జరుగుతుంది. బిల్లు ప్రాసెస్ లేట్ అవుతుందని, విచక్షణాధికారాలతో వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతునట్టు, ఆయన ప్రకటన చెయ్యటం, దాని పై వైసీపీ మంత్రులు గోల గోల చెయ్యటం చూసాం. అయినా, సరే ఈ ప్రచారం ఎందుకు చేసారు ? అన్ని మీడియా హౌస్లని ఎందుకు తప్పు దోవ పట్టించారు ? అసలు ఎవరికీ అసవరం అనే చర్చ జరుగుతంది. అయితే ఈ ప్రచారం మొత్తం, అవాస్తవం అని చైర్మెన్ చెప్పారు. శుక్రవారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్ షరీఫ్, ఈ వ్యాఖ్యలు చేసారు. దీంతో, ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read