అనుకున్నదే అయ్యింది. తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన మండలి ఉండటానికి వీలు లేదు అంటూ, మండలి రద్దుకి దాదపుగా జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం, అసెంబ్లీలో ఈ విషయం పై నిర్ణయం తీసుకుందామని జగన్ అన్నారు. దీనికి స్పీకర్ తమ్మినేని సీతారం కూడా ఒకే చెప్పారు. అంతకు ముందు జగన్ మండలి పై, అసెంబ్లీలో మాట్లాడారు. అసలు ఈ రాష్ట్రానికి మండలే అవసరం లేదని, మనకు అసెంబ్లీలోనే ఎంతో మంది మేధావులు ఉన్నారని, వీళ్ళు మంచి సలహాలు ఇస్తారని అన్నారు. మండలిలో సలహాలు ఇవ్వాల్సింది పోయి, కుట్రలు చేస్తున్నారని మండలి పై మండి పడ్డారు. మండలి కోసం, ఏడాదికి 60 కోట్లు ఖర్చు అవుతుందని, అసలు మండలి ఎందుకు అని జగన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మండలి లేదని, కేవలం 6 రాష్ట్రాలకే ఉందని జగన్ అన్నారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని ప్రలోభ పెట్టారని జగన్ అన్నారు. అలాగే చైర్మెన్ పై కూడా జగన్ వ్యాఖ్యలు చేసారు. ఆయన చట్టం తో కాకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని అన్నారు.

jagan 23012020 2

నిన్న కూడా జగన్ మోహన్ రెడ్డి, మండలిలో ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండలిలో చర్చ జరిగిన బిల్లులపై సెలక్ట్ కమిటీకి వెళ్ళాచ్చా అనే అంశంపై ఆరా తీశారు. బుధవారం రాత్రి ఆయన అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మండలిలో బిల్లును ఆమోదింప చేసుకోవడంలో విఫలమైనప్పటికి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. మండలి వ్యవహారాన్ని ఆషామాషిగా తీసుకోకుడదని ఖచ్చితంగా విపక్షానికి బుద్ధి చెప్పాలని ఆయన ప్రణాళికలు రచించారని లీక్లు ఇచ్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మంత్రులు, అధికార పార్టీ ముఖ్య నాయకులంతా మండలిలో తిష్ట వేసినా విపక్షాన్ని ఎదుర్కొలేక పోయామని ఇటువంటి పరిస్థితు ల్లో మండలిలో బలమున్న టిడిపిని ఎలా బలహీనపరచాలా..? అన్న అంశంపై కూడా సీఎం జగన్ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

jagan 23012020 3

అదే విధంగా ప్రస్తు తం సెలక్ట్ కమిటీకి వెళ్ళిన బిల్లును పరిస్థితి ఏమిటీ..? వాటిని మార్చే అధికారం కమిటీకి ఉంటుందా..? లేక అదే రూపంలో వాటిని ఆమో దించాలంటే ఎంత సమయం పడుతుంది..? గతంలో ఆ రకంగా ఆమోదించిన బిల్లులు ఏమైన ఉన్నాయా..?ఉంటే సెలక్ట్ కమిటీని ఎలా ఎదుర్కో వాలి..? అన్న కోణంలో కూడా ఆయన ఆరా తీశారు. ఒకవేళ మూడు నెలల తర్వాత సెలక్ట్ కమిటీ కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలి..? ఈ లోపు అభివృద్ధి వీకేంద్రీకరణ అంశంపై ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా..? అందుకోసం న్యాయ నిపుణుల సలహా క వాడా తీసుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం వెళుతున్నట్లు తెలుస్తోంది. అసలు మండలి రద్దు ప్రతిపాదన పెడితే ఎలా ఉంటుందన్న ఓ సీనియర్ నేత అభిప్రాయంపై కూడా సీఎం జగన్ లోతుగా ఆలోచన చేసినట్టు తెలిసింది. నిన్న రాత్రి చ్ప్పినట్టే, ఈ రోజు జగన్ మండలి రద్దు ప్రతిపాదన తీసుకొచ్చారు.

సోషల్ మీడియాలో సంచలన ఫోటోలు తిరుగుతున్నాయి. నిన్న శాసనమండలిలో, మంత్రులు, వైసీపీ సభ్యులు, బెంచీలు, కుర్చీలు ఎక్కి, మండలి చైర్మెన్ ను బెదిరుస్తున్న ఫోటోలు ఉన్నాయి. బొత్సా బెంచీ ఎక్కి చైర్మెన్ పై వేలు చూపిస్తూ ఉండగా, కొడాలి నని, కుర్చీ ఎక్కి, మండలి చైర్మెన్ ని బెదిరిస్తున్నట్టు ఆ ఫోటోలలో ఉంది. ఎవరు తీసారో కాని, ఈ ఫోటోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిన్న లోకేష్ ఫోన్ ఉపయోగించి, తమను ఫోటోలు తీస్తున్నారని, మంత్రులు లోకేష్ పై దాడి చెయ్యబొగా, లోకేష్ అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. బహుసా ఇవి లోకేష్ తీసిన ఫోటోలు ఏమో అని, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మొత్తానికి, నిన్నటి నుంచి వైసీపీ మంత్రులు చెపుతున్నని అన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ఈ ఫోటోలను చూస్తే, ఈ రోజు వార్తా పత్రికల్లో, మండలి చైర్మెన్ ను మంత్రులు బెదిరించారు అనే న్యూస్ నిజమే ఏమో అని అనిపిస్తుంది. నిన్న కరెంటు తీసి, వైఫై తీసి, లైవ్ ప్రసారాలు ఆపేసింది ఇందుకేనా అనే అనుమానం కలుగుతుంది.

botsa 23012020 2

నిన్న, రాజధానుల వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఉద్రిక్త పరిస్థి తులో చోటు చేసుకున్నాయి. ఒక దశలో పోడియం వద్దకు కొంత మంది మంత్రులు దూసుకువచ్చారు. పోడియం వద్ద మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మంగళవారం అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లు లపై బుధవారం మండలిలో చర్చ జరిగింది. అనంతరం ఈ బిల్లు లను ఆమోదించాలని మంత్రులు ప్రతిపాదించారు. అయితే దీనిని టీడీపీ సభ్యులు విభేదించించారు. ఈ బిల్లులకు సవరణలు ప్రతిపా దిస్తూ, సెలక్ట్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. మండ లిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రెండు బిల్లులకు వేర్వేరుగా సవరణలతో సెలక్ట్ కమిటీకి పంపాలని సవరణ లను సోమవారమే చైర్మనకు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠపై ప్రభావం చూపించే బిల్లులని, రాజధాని తరలింపు అంటే జోక్ కాదని వ్యాఖ్యానించారు. మండలిలో 22 మంది మంత్రులకు ఏమి పని అని ప్రశ్నించారు. సభ్యులైన ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన వారిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు.

botsa 23012020 3

ఈ దశలో మండలి చైర్మన్ షరీఫ్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ రూల్ 71పై చర్చ సందర్భంగా అసాధారణ నిర్ణయం తాను తీసుకు న్నానని వివరించారు. నోటీపై చర్చ తరువాత రెండు బిల్లులను ప్రవే శపెట్టాలనుకున్నానని తెలిపారు. సెలక్ట్ కమిటీకి సవరణలను ఎమ్మెల్సీ అశోక్ బాబు తనకు ఇచ్చారని తెలిపారు. చైర్మన్ ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోడియంలోకి దూసుకువెళ్లి, చైర్మన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో మిగిలిన మంత్రులు కూడా పోడియం లోకి దూసుకువెళ్లారు. వెలను చుట్టుముట్టి చైర్మన్ పై అధికార పక్ష మంత్రులు ఒత్తిడి తేవడాన్ని గమనించిన టీడీపీ సభ్యులు కూడా పోడియంలోకి వచ్చారు. సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని మంత్రలు నినాదాలు చేయడం ప్రారంభిం చారు. మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స తది తరులు టీడీపీ సభ్యులు బుద్దా వెంకన్న, లోకేష్ తదితరులపైకి దూసుకువచ్చారు. ఈ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

botsa 23012020 4

మంత్రి రంగనాథరాజు, మోపిదేవి జోక్యం చేసుకుని మంత్రులను అడుకుని తోపులాట నుంచి బయటకు తీసుకువచ్చారు. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుం డగా, మంత్రులు, ఇతర వైకాపా సభ్యులు చైర్మనను వాదనకు దిగారు. దీనిని గమనించిన టీడీపీ సభ్యులు చైర్మన్ పై దాడి చేయవ ద్దంటూ నినాదాలు చేశారు. ఈ దశలో యనమల జోక్యం చేసుకుని సభ్యులు కాని వారిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. 22 మంది మంత్రులకు మండలిలో పని ఏమిటని ప్రశ్నించారు. మండలి కార్యకలాపాలు చూసేందుకు చంద్రబాబు వచ్చారని అధికార పక్షం, వైకాపా నేతలూ వచ్చారని ప్రతిపక్షం పరస్పర విమర్శలు చేసుకోవ డంతో సభలో గందరగోళం నెలకొంది. ఎవరు ఏమి మాట్లాడుతు న్నారో తెలియని స్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు బిల్లు లను సెలక్ట్ కమిటీకి పంపాలని, సరైన సమయంలోనే తాము సవర ణలు ఇచ్చామని తెలిపారు. చైర్మన్ తప్పు చేస్తే, తమ తప్పు లేదని తెలిపారు. సెలక్ట్ కమిటీ పంపండంపై ఓటింగ్ నిర్వహించాలని పట్టు బట్టారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు, నినాదాలతో సభలో గంద రగోళం నెలకొంది. సభలో ఆర్డర్ లో లేనందున 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

నిన్న శాసనమండలిలో జరిగిన రణరంగం అందరికీ తెలిసిందే. మండలి చైర్మన్ ను, మతం పేరుతొ, వైసీపీ మంత్రులు బెదిరించారని, బూతులు తిట్టారని, నిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్సీలు బయటకు వచ్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దాని పై చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలోనే, ఇప్పుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. టిడిపి నేతలతో, ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకంగా వైసిపి మంత్రులే, కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ పై దాడి చేశారని చంద్రబాబు అన్నారు. ముస్లిం సమాజాన్ని అవమానపర్చేలా ఛైర్ పర్సన్ షరీఫ్ పై దుర్భాషలాడారని చంద్రబాబు అన్నారు. అసభ్య పదజాలంతో సభాపతిని అవమానించారని చంద్రబాబు అన్నారు. సాయంత్రం వేళ, నమాజు చేయనీకుండా వైసిపి మంత్రులు అడ్డం పడ్డారని చంద్రబాబు అన్నారు. ముందు మాట్లాడాలి, ఆ తర్వాతే నమాజు గిమాజు అని మంత్రి బొత్స అవహేళన చేశారని చంద్రబాబు ఆరోపించారు. మీకూ పిల్లలు, మనవళ్లు ఉన్నారని గుర్తుంచుకోండని బెదిరించారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.

tele conf 23012020 2

ఇక అలాగే నిన్న కౌన్సిల్ లో టిడిపి ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడారని చంద్రబాబు అభినందించారు. ధర్మాన్ని కాపాడారు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు, ప్రజాస్వామ్యాన్ని బతికించారు అంటూ కితాబు ఇచ్చారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారని అన్నారు. యనమల అనుభవం- పరిజ్ఞానంతో ప్రజాస్వామ్యానికి జీవం పోశారని, అన్నారు. టిడిపి యువ కౌన్సిలర్ల ధైర్యం, తెగువ ప్రశంసనీయం అని చంద్రబాబు మెచ్చుకున్నారు. ముగ్గురు మంత్రులు లోకేష్ పై దౌర్జన్యం చేశారని, ఉన్మాదంతో, రాక్షసత్వంతో పోరాడటానికి సర్వశక్తులూ ఒడ్డాల్సిందేనని అన్నారు. భోజనం లేకున్నా, అనారోగ్యంతో ఉన్నా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారని, ఫరూక్, శత్రుచర్ల అనారోగ్యాన్ని కూడా లేక్క చేయలేదని చంద్రబాబు అన్నారు. ఇక అలాగే అసెంబ్లీలో జరిగిన పరిణామాల పై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. శాంతియుతంగా చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేల ఆందోళనను అడ్డుకున్నారని, రింగుదాటి వస్తే బైట పడేయండని సీఎం జగన్ మార్షల్స్ ను ఆదేశించారని, మరి అదే వైసిపి మంత్రులు కౌన్సిల్ లో చేసిందేమిటి..? పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను, వైసిపి ఎమ్మెల్సీలను ఏం చేయాలి..? ప్రజాస్వామ్యాన్ని చెరపట్టాలని వైసిపి చూసిందని చంద్రబాబు అన్నారు.

tele conf 23012020 3

సంఖ్య కాదు ముఖ్యం, స్పూర్తి ముఖ్యం అని రుజువు చేశారని చంద్రబాబు అన్నారు. సభలో వైసిపి ఎన్నో దురాగతాలకు పాల్పడింది. కరెంట్ కట్ చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు..25మంది మంత్రులు కౌన్సిల్ లోనే తిష్ట వేసి వీరంగం చేశారు, అయినా నిలబడ్డారని చంద్రబాబు అన్నారు. 1984ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చారు, అప్పుడూ ఇలాగే సభలోపల, బయటా పోరాటం చేశాం అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గల్లా జయదేవ్ ను శారీరకంగా మానసికంగా హింసించారు, ఎంపిని 15గంటలు పోలీస్ స్టేషన్లన్నీ తిప్పారు, గోళ్లతో రక్కారు, చొక్కా చించారు,జైలుకు పంపించారు, అర్ధరాత్రి గంటల తరబడి నన్ను, ఎమ్మెల్యేలను పోలీసు వాహనంలో తిప్పారని చంద్రబాబు అన్నారు. "ఉద్యమకారులుగా ఉన్నతాశయంతో పోరాడుతున్నారు. చరిత్రలో మీ పోరాటం మిగిలిపోతుంది, మీ త్యాగాలు వృధా కావు. మీ స్ఫూర్తి కలకాలం చరిత్రలో నిలిచిపోతుంది. చట్ట సభ పోరాటంలో ప్రజా ఆకాంక్షలను టిడిపి నిలబెట్టింది. ఇక ఇప్పుడు అంతా ప్రజల చేతుల్లోనే ఉంది. జెఏసి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. అంబేద్కర్ సాక్షిగా నేడు జరిగే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. దీనిని ఒక ప్రజావిజయంగా గ్రామగ్రామానా జరపాలి." అని చంద్రబాబు అన్నారు.

కాసేపట్లో హైకోర్టులో ఏపీ రాజధాని, సీఆర్డీఏ రద్దు పిటిషన్ల విచారణ జరగనుంది. దీంతో ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. పిటిషన్ల విచారణకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. మొత్తం ఐదు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గి వాదించనున్నారు. అయితే ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని, హైకోర్టుకు చేరుకున్నారు. నిన్న హైకోర్ట్ లో, ఏపీలో అమరావతి తరలింపు, 3 రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టిం ది. వికేంద్రీకరణ బిల్లు రైతుల న్యాయబద్ధమైన ప్ర యోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపింది. న్యాయ సమీక్ష విధానంలో సమాజ ప్రయోజనాలకు భంగం కలిగే విధానాలను అడ్డుకునే అధికారం కోర్టుకు ఉందని స్పష్టం చేసింది. వికేంద్రీ కరణ, సీఆర్డీఏ బిల్లులపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని, ఆ బిల్లులపై పూర్తి నివేదిక సమర్పించాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.

court 23012020 2

పిటిషన్‌పై తదుపరి విచారణను గురువారం చేపట్టనున్నట్లు వెల్లడించింది. అంతకుముందు వాదనలు వినిపించిన లాయర్ అశోకభాను.. ప్రభుత్వాలు మారినంత మాత్రాన స్టేక్ హోల్డర్లతో చేసుకున్న ఒప్పందాలు మారవని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రాజధాని వికేం ద్రీకరణ బిల్లు తెచ్చారని, కోర్టుకు వివరించారు. సీఆర్డీఏ చట్టం రద్దును కొట్టివేయాలని కోరారు. చట్టసభల ఆమోదం పొందిన తరువాతే వికేంద్రీక రణ ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం తరఫున ఏజీ కోర్టుకు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు గతప్రభుత్వంలో ఇచ్చిన హామీల కంటే అదనపు ప్రయో జనాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసిందన్నారు. ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును సోమవారం అసెంబ్లీలో పాస్ చేసింది.

court 23012020 3

ఈ బిల్లు ప్రస్తుతం శాసన మండలిలో ఉంది. ఈ లోగా బిల్లు ఆమోదాన్ని సవాల్ చేస్తూ 37 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక, 3 రాజధానుల కేసు వాదనకు ముకుల్ ని మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో దాఖలైన కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభు త్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహల్లిని నియమించింది. ముకుల్ ఫీజు కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తుగా రూ. కోటి అడ్వాన్స్ గా చెల్లించేందుకు అనుమతిలిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అమరావతి తరలింపు కేసులను ముకుల్ పర్యవేక్షణలో ఎదుర్కొవాలని ఏజీకి సర్కారు స్పష్టం చేసింది. మొత్తానికి, ఇప్పుడు అందరి దృష్టి, హైకోర్ట్ లో చెప్తారు అనే విషయం పై, ఉత్కంఠ నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read