అసెంబ్లీ సమావేశాల్ మూడో రోజు కూడా గందరగోళం మధ్యే సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలు, అమరావతి పై మాకు పూర్తిగా మాట్లాడే అవకాసం ఇవ్వకుండా సస్పెండ్ చేసారని, తమకు మాట్లాడే అవకాసం ఇవ్వాలి అంటూ, స్పీకర్ పోడియుం వద్ద నినాదాలు చేసారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ, నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సమయంలో స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. నిన్న కూడా జై అమరావతి అంటూ నినాదాలు చేస్తుంటే, స్పీకర్ అసహానంతో, నేను నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు కూడా స్పీకర్ అసహనంతో, టిడిపి సభ్యులను వారించారు. అయినా టిడిపి సభ్యులు వెనక్కు తగ్గలేదు. ఈ సందర్భంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పై, చంద్రబాబు నాయుడు పై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేసారు. అమరావతి అంటూ చంద్రబాబు రోడ్ల మీద తిరిగి అడుక్కుంటూ, డ్రామాలు ఆడుతున్నారని, ఆ డబ్బు అంతా కొట్టేస్తారని, చందాలకు అలవాటు పడి, ఇలా అడుక్కుంటున్నారు అంటూ నాని అన్నారు.

jagan 22012020 2

అలాగే మొన్న సస్పెండ్ చేసిన సందర్భంలో చంద్రబాబు, మెట్ల మీద కుర్చుని, మెడలో నల్ల కండువా వేసుకున్నారని, అప్పుడు ఆ మార్షల్స్ కి, కొంత చిల్లర ఉంటే పడేయండి, పోతాడు అని చెప్పమని, హేళనగా నాని మాట్లాడారు. ఇదే సందర్భంలో, నాని మాట్లాడుతూ ఉండగానే, జగన్ మోహన్ రెడ్డి సభలోకి వచ్చారు. దీంతో నాని మాటలకు కౌంటర్ గా, ‘ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాలి.. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాలి’ అంటూ నినాదాలు చేసారు. దీంతో అడిగి మరీ తన్నించుకోవటం అంటే ఇదే అనుకున్నారో ఏమో కాని, వెంటనే తేరుకుని, వైసీపీ సభ్యులు అందరూ, టిడిపి ఎమ్మెల్యేల వద్దకు దూసుకోచ్చారు. దీంతో స్పీకర్, ఇక పోయి కోర్చోండి, చల్, చల్ అంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే స్పీకర్ మాట్లాడే సందర్భంలో కూడా వాయిస్ కట్ అవ్వటం గమనార్హం.

jagan 22012020 3

అయితే ఈ తతంగం అంతా చూస్తున్న జగన్, తనను "ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాలి" అంటూ నినాదాలు చెయ్యటంతో, ఆగ్రహంతో ఊగిపోయారు. తెలుగుదేశం సభ్యులు పది మంది కూడా లేరు, మేము 150 మంది ఉన్నాం, తమను రెచ్చగొడుతున్నారు, తమ చేత తన్నించుకుని, సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు, అసలు పోడియం వద్దకు వెళ్ళటం ఏమిటి, వీళ్ళు వీధి రౌడీలు, వీరిని వెంటనే మార్షల్స్ ను పిలిపించి, వారిని కిందకు దించండి, మాట వినకపోతే, ఎత్తి బయట పడేయండి అంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే జగన్ చెప్పినట్టే స్పీకర్, మార్షల్స్ ని పిలిచి, టిడిపి ఎమ్మెల్యేలని, వారి స్థానల్లో కూర్చో పెట్టాలని కోరగా, నిమ్మకాయల చిన రాజప్పని ఎత్తి, అసెంబ్లీ బయటకు తీసుకు వెళ్ళటంతో అందరూ ఆశ్చర్య పోయారు. సస్పెండ్ చెయ్యకుండా ఎలా బయటకు పంపిస్తారు అంటూ అందోళన వ్యక్తం చేసారు.

అందరి ఫోకస్ శాసనమండలిలో, తెలుగుదేశం వ్యూహం ఈ రోజు ఎలా ఉంటుంది అని భావిస్తున్న వేళ, ఈ రోజు టిడిపి ఎమ్మెల్సీలను ముందుకు కదల నివ్వకుండా, చేసిన ఘటనతో, టిడిపి ఎమ్మెల్సీలు అవాక్కయ్యారు. ఈ రోజు శాసనమండలి సమావేశానికి టిడిపి ఎమ్మెల్సీలు బయలుదేరారు. అయితే, వారిని సచివాలయం సమీపంలో ఉన్న, ఫైర్ స్టేషన్ దగ్గర, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకు ఆపారు అని తెలుగుదేశం ఎమ్మెల్సీలు అడగగా, వీరి వాహనాల పై, ఎమ్మెల్సీ స్టిక్కర్‌లు లేవని, అందుకే ఆపామని పోలీసులు చెప్పారు. అయితే దీని పై తెలుగుదేశం ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. కారులోనే ఎమ్మెల్సీలు ఉంటే, ఇంకా స్టికర్ లు ఎందుకని, మండి పడ్డారు. కార్లో ఎమ్మేల్సీ ఉండాలా ! కారుకి ఎమ్మేల్సీ స్టిక్కర్ ఉండాలా ! ఏది ముఖ్యం అంటూ, పోలీసులని నిలదీశారు. తీవ్ర వాగ్వివాదం అనంతరం, ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతించారు.

mlc 220102020 2

తమను మానసికంగా ఇబ్బంది పెట్టటానికి, ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని, మండి పడ్డారు. అయితే ఈ రోజు శాసనమండలిలో, తెలుగుదేశం వ్యూహం ఎలా ఉంటుంది అనే దాని పై, ఉత్కంట నెలకొంది. అలాగే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది కూడా చూడాలి. అయితే, ఈ రోజు కూడా లైవ్ ప్రసారాలు ఇస్తారా ఇవ్వరా అనేది తెలియాల్సి ఉంది. నిన్న శాసన మండలిలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏకంగా మహిళా సభ్యుల పైకి, మంత్రులు దూసుకువెళ్ళటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. ఆ సమయంలో, మంత్రులకు అడ్డు వెళ్ళకపోతే, ఏమి జరిగేదో అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి ప్రసంగించారు. రాజధాని రైతులు చనిపోతే కనీసం పరామర్శించని సీఎం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

mlc 220102020 3

అసెంబ్లీ సమావేశాల కోసం డమ్మీ సీఎం కాన్యాయిని తిప్పారన్న ఎమ్మెల్సీ సంధ్యారాణి. సంధ్యారాణి కామెంట్లపై అధికార పక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ మంత్రులు కామెంట్ చేసారు. అయితే ఈ సందర్భంలో సంధ్యారాణికి అండగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు. మాట మాట పెరగటంతో, ప్రతిపక్ష సభ్యుల వైపు దూసుకొచ్చిన మంత్రులు కొడాలి నాని, అనిల్. ఒక్కసారిగా సభలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత వాతవరణం. ఈ సమయంలో ఉమ్మారెడ్డి సభ్యులను శాంతింప చేసారు . ఇదే సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వ విధనాలను తప్పు పట్టిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. మూడు రాజధానుల విధానం సరి కాదన్న మాధవ్. ల్యాండ్ పూలింగ్ విధానం మంచిదని.. తప్పులను సరిదిద్దాలని మాధవ్ సూచన.

ఎందుకో కాని వైసీపీ ప్రభుత్వం పూర్తి కన్ఫ్యూషన్ లో ఉంది. మొన్నటికి మొన్న, క్యాబినెట్ సమావేశం పై ఎంత గందరగోళం జరిగిందో చూసాం. ముందుగా జనవరి 20న క్యాబినెట్ సమావేశం ఉంటుందని చెప్పారు. అయితే, ఉన్నట్టు ఉండి, కాదు కాదు, జనవరి 18నే క్యాబినెట్ అంటూ ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ ఏమైందో కాని, అందరూ రెడీ అవుతున్న వేళ, రాత్రికి రాత్రి, 18న క్యాబినెట్ సమావేశం కాదు, మళ్ళీ జనవరి 20 వ తేదీనే క్యాబినెట్ అంటూ, మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ కన్ఫ్యూషన్ ఎందుకు, సీనియర్ నేతలు ఏమి చేస్తున్నారు, అధికారులు ఏమి చేస్తున్నారు, లేక కేవలం జగన్ మాట ప్రకరామే ఇలా చేస్తున్నారా అనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే, ఇది మర్చిపోక ముందే, ఇప్పుడు మరో సారి ప్రభుత్వం మాట మార్చిన తీరు, మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మూడు రాజధానులు పెడుతున్నాం అని, విశాఖపట్నంలో సెక్రటేరియట్ పెడుతున్నాం అని చెప్పిన జగన్ ప్రభుత్వం, ఒక్క రోజు కాక ముందే విశాఖపట్నం ప్రజలకు షాక్ ఇచ్చింది.

jagan 21012020 2

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు, విశాఖపట్నంలో జరపాలని, అక్కడ అన్ని ఏర్పాట్లు చెయ్యాలని, జగన్ తో పాటుగా, గవర్నర్, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా వస్తున్నారు అంటూ, ఘనంగా ఏర్పాట్లు చెయ్యాలని, విశాఖ రాజధానిగా అసెంబ్లీలో బిల్ పెట్టిన తరువాత, మొదటి సారి జగన్ వస్తున్నారు కాబట్టి, ఘనంగా ఏర్పాట్లు ఉండాలని, ఆదేశాలు వెళ్ళాయి. దీనికి తగ్గట్టే అక్కడ ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. రామకృష్ణా బీచ్ రోడ్డులో గత వారం రోజులుగా పనులు జోరుగా సాగుతున్నాయి. ఏర్పాట్లన్నింటినీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఉన్నట్టు ఉండి, విశాఖపట్నంలో ఈ సారి రిపబ్లిక్ డే వేడుకుల జరగటం లేదని, పనులు ఆపెయ్యాలని, ఆదేశాలు వెళ్ళాయి.

jagan 21012020 3

అయితే , ఈ సారి కూడా రిపబ్లిక్ డే వేడుకలు, విజయవాడలోనే జరుగుతాయని, జగన్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ న్సిపల్ స్టేడియంలోనే ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మళ్ళీ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. విజయవాడలో ఏర్పాట్లు చెయ్యటానికి రెడీ అయ్యారు. అయితే ఈ నిర్ణయం ఎందుకు మారిందో, ఎందుకు తీసుకున్నారో తెలియదు. వైసీపీ మాత్రం, జగన్ నిర్ణయం మార్చుకున్నారని, విజయవాడ ప్రజల్లో అభద్రతా భావం నెలకొనకుండా, ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ లీకులు ఇస్తున్నారు. మరి ఇది నిజమో కాదో కాని, మరోసారి ప్రభుత్వం ఎంత కన్ఫ్యూషన్ లో ఉందొ, నిర్ణయాలు ఎన్ని సార్లు మారుస్తుందో, ప్రజలు గమనిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రూల్ 71 మీద చర్చ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నోటీస్ పై, ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. చర్చ రాత్రి 11 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. బిల్లుల మీద చర్చ రేపటికి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బిల్లులు పాస్ అవుతాయా ? లేదా అనే ఉత్కంట కొనసాగుతుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే యోచనలో టీడీపీ ఉంది. సెలక్ట్ కమిటీలో నిర్ణయానికి గరిష్టంగా 3 నెలలు సమయం పట్టే ఛాన్స్ ఉంటుంది. మరో పక్క వైసీపీ మాత్రం, బిల్ ఆమోదం పొందటానికి, తన తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. మండలిలోనే విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి ఉన్నారు. గ్యాలరీలో వీళ్ళు ఉన్నారు. మరో పక్క, సవరణల కోసం బిల్లు అసెంబ్లీకి వెళ్లినా ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశం ఉంది. మరో పక్క ఈ చర్చ సందర్బంగా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ మధ్య చర్చ సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకుంది. చూసుకుందాం రా అంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఇరువురినీ శాంతింప చేసే పని చేసారు.

madnali 21012020 2

మరో పక్క ఉదయం నుంచి శాసనమండలిలో, అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాసనమండలి చైర్మన్ షరీఫ్ తనదైన ముద్ర వేసి, నిబంధలకే జై కొట్టడంతో వికేంద్రీకరణ బిల్లు మండలిలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మండలిలో మెజారిటీ ఉన్న టిడిపి అకస్మాత్తుగా రూల్ 71ను తెరపైకి తీసుకురావడంతో వైసీపీ ఖంగుతినాల్సి వచ్చింది. ఫలితంగా సర్కారు తలపెట్టిన వికేంద్రకరణ బిల్లు వెనక్కివెళ్లే పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వికేంద్రీకరణ బిల్లును నెగ్గించుకున్న వైసీపీ, మండలిలోనూ తన ఆధిపత్యం చూపించేందుకు చేసిన ప్రయత్నాలు ైచె ర్మన్ షరీఫ్ నిర్ణయం వల్ల నీరుగాయిపోయాయి. దీనితో మంత్రులు సహనం కోల్పోయి వారే చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన అరుదైన దృశ్యాలకు మండలి వేదిక కావడం విశేషం.

madnali 21012020 3

మండలిలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురయింది. బిల్లుపై చర్చకు అనుమతిస్తే వ్యవహారం వైసీపీ సర్కారు చేతిలోకి వెళుతుందని, ముందే ఊహించిన టిడిపి పక్ష నేత యనమల రామకృష్ణుడు.. ఎవరూ ఊహించని రీతిలో రూల్ 71ను తెరపైకి తెచ్చారు. ముందుగానే రూల్ 71పై నోటీసు ఇవ్వడం, దానిని చైర్మన్ షరీఫ్ నిబంధనల ప్రకారం అనుమతించడం జరిగిపోయాయి. ఈవిధంగా రూల్ 71పై నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే, దీనిపై మంత్రులు బొత్స, బుగ్గన చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. చైర్మన్ రాజకీయ కోణంలో నిర్ణయాలు తీసుకోకూడదని, ఇలాగైతే ప్రభుత్వ నిర్ణయాలు ఆగిపోతాయని, అది మంచి సంప్రదాయం కాదని చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టే ప్రమయత్నం చేశారు.

Advertisements

Latest Articles

Most Read