కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్, ది హిందూ పత్రికలో రాసిన ఎడిటోరియల్ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ విధానాల పై, పరకాల ధ్వజమెత్తారు. పతనమైపోతున్న దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే ఎలాంటి చర్యలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవటం లేదని అన్నారు. హిందూ పత్రికలో రాసిన ఎడిటోరియల్ లో, కేంద్ర ఆర్థిక మంత్రి భర్త, కేంద్ర విధానాలను తప్పు పట్టటం సంచలనంగా మారింది. దేశ ఆర్ధిక పరిస్థితి, తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని, జరుగుతున్న వాస్తవాలను కేంద్రం అంగీకరించే పరిస్థితిలో లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్ విధానాలే బాగున్నాయని, నెహ్రు విధానాలను విమర్శించటం మాని, ఇప్పటి కేంద్రం ప్రభుత్వం, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్ ఎకనామిక్ మోడల్ ని ముందుకు తీసుకువెళ్తేనే, దేశం పుంజుకుంటుందని అన్నారు.

parakala 14102019 2

ఒక పక్క ప్రభుత్వం వాస్తవాలు అంగీరించని ధోరణిలో ఉంటే, ప్రతి రోజు వస్తున్న వార్తలు, డేట్ తో, దేశంలోని ప్రతి రంగం, ఎలా కుదేలు అయిపోతుందో కనిపిస్తుందని అని ఆయాన అన్నారు. వాస్తవాలు అంగీకరించి, దిద్దుబాటు చర్యలు తీసుకోకపొతే, మరింత నష్టపోతాం అని పరకాల అన్నారు. నెహ్రు నెహ్రు అని ప్రతిది అటు వైపు తోయ్యకుండా, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి భర్త, ఈ వ్యాఖ్యలు చెయ్యటంతో, పెద్ద రాజకీయ దుమారం రేగే అవకాసం ఉంది. ప్రతిపక్ష పార్టీలు, ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అంతే కాక, నరేంద్ర మోడీ ఆర్ధిక విధానాల కంటే, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్ విధానాలే బాగా ఉండేవని పరకాల ప్రభాకర్‌ కొనియాడటం విశేషం.

parakala 14102019 3

ఆర్ధిక మాంద్యంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు, కార్పొరేట్‌ పన్నుని తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిణామాలతో, అంతర్జాతీయ సంస్థలు కూడా భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) నమోదైన 6.8 శాతంతో పోల్చి నా ఇది 0.8 శాతం తక్కువ. వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టం చేసింది.

ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని కలవటానికి మేగాస్తార్ట్ చిరంజీవి, తాడేపల్లి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ కోసం, చిరంజీవి, సతీ సమేతంగా, హైదరాబాద్ నుంచి ప్రత్యెక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి జగన్ వద్దకు వెళ్తారు అని అందరూ అనుకుంటే, జగన్ తో భేటీ కంటే ముందు, చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. చిరంజీవి రాకతో, పవన్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. అయితే జగన్ తో భేటీ కంటే ముందే, చిరంజీవి, పవన్ ని కలవటం వెనుక ఉన్న కారణం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. చిరంజీవి, జగన్ ను కలవటం, పవన్ కు ఇష్టం లేదు అనే ప్రచారం జరుగుతుంది. తనని రాజకీయంగా కాకుండా, వ్యక్తిగతంగా, నలుగురు నలుగురు పెళ్ళాలు అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన జగన్ పై, పవన్ గుర్రుగా ఉన్నారు. రాజకీయంగా ప్యాకేజ్ తీసుకున్నారని, ఇలా ఎన్ని మాటలు అన్నా, అవన్నీ రాజకీయంగా భాగం అని, కాని వ్యక్తిగతంగా తనని టార్గెట్ చెయ్యటం పై, పవన్, జగన్ పై గుర్రుగా ఉన్నారు.

chiranjeevi 14102019 2

మరో పక్క పవన్ కళ్యాణ్, కూడా జగన్ పరిపాలన పై, విమర్శలు చేస్తున్నారు. జగన్ వంద రోజుల పరిపాలన పై కూడా, ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి, జగన్ ప్రభుత్వం అన్నిట్లో విఫలం అయ్యిందని, జగన్ చెప్పే దానికి, చేసే దానికి, అసలు పొంతనే లేదని అన్నారు. ఇక మరో పక్క, జనసేన ఎమ్మెల్యే పై పెట్టిన కేసు విషయంలో కూడా, పవన్ కళ్యాణ్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. వీటి అన్నిటి నేపధ్యంలో, ఇప్పుడు చిరంజీవి వెళ్లి, జగన్ ను కలిస్తే, తనకు రాజకీయంగా ఇబ్బంది అని పవన్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, జగన్ తో కంటే భేటీ ముందే, చిరంజీవి, పవన్ ని కలిసి ఎందుకు జగన్ ని కలుస్తున్నామో వివరణ ఇచ్చి, పవన్ ని కూల్ చేసే ప్రయత్నం కోసం, పవన్ ఇంటికి వచ్చి, కలిసినట్టు చెప్తున్నారు.

chiranjeevi 14102019 3

ఈ పరిణామంతో, జనసేన కార్యకర్తలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం, ఇలా లంచ్ కు వచ్చి మరీ కలవటం ఎందుకు, అందరూ కలిసినట్టే సియంవో లో కలవచ్చు కదా అనే అభిప్రాయంతోనే ఉన్నారు. అయితే చిరంజీవి, జగన్ భేటీ, కేవలం సినిమా వరుకే పరిమితం అని చెప్తున్నారు. ఇందులో రాజకీయం అంశాలు ఉండవని అంటున్నారు. సాహో సినిమా స్పెషల్ షో కి పర్మిషన్ ఇవ్వకుండా, సైరాకి మాత్రమే స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు, జగన్ కు కృతజ్ఞతలు చెప్పి, తన సినిమా చూడామని కోరటానికే చిరంజీవి కలుస్తున్నారని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని జగన్ తెలివిగా రాజకీయంగా వాడుకుని, పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేసేలా మంత్రాంగం నడిపారు. రాజకీయంగా ఈ భేటీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో, కాలమే నిర్ణయిస్తుంది.

ఇరు తెలుగు రాష్ట్రాలకి తెలిసిన ప్రముఖ కాంట్రాక్టర్‌ మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఐటి సోదాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. భారీగా అక్రమాలు చేసారనే అనుమానాలు రావడంతోనే ఐటి అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఐటి సోదాలు పూర్తిగా ఢిల్లీ నుంచి వచ్చిన ఐటి బృందాల ఆధీనంలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ అధికారులు హైదరాబాద్‌ చేరుకున్న తరువాతే సోదాల విషయమై హైదరాబాద్ లో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దగ్గరి సంబంధాలు ఉండటంతోనే, ఐటి అధికారులు వచ్చే దాకా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ఐటి వర్గాలు చెబుతున్నాయి. మేఘా కంపెనీ చేపట్టిన కాంట్రాక్టులు, రెండు ప్రభుత్వాల నుంచి వచ్చిన కాంట్రాక్టుల్లో ఉన్న బిల్లుల వివరాలు తెలుసుకుని మరీ ఐటి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

megha 13102019 2

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టు పనులు దక్కించుకున్న మేఘా కంపెనీ, ఇతర చోట్ల కూడా కొన్ని కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. ఫోర్బ్స్ మాగజైన్ ప్రచురించే కుబేరుల్లో ఒకరుగా మేఘా ఎదిగారు. అయితే, అతి తక్కువగాబ ఈ కంపెనీ, ముందస్తు పన్నులు చెల్లించింది. భారీ కాంట్రాక్టులు చేస్తున్న ఈ కంపెనీ ఇంత తక్కువగా ఎలా పన్నులు చెల్లిస్తుందనే అనుమానాలతో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో, పలు కీలక లావాదేవీల ఆధారాలు దొరకడంతో పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియా సంస్థలు, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీల్లో మేఘా కష్ణారెడ్డి పెట్టుబడులు పెట్టారు. టివి 9 కొనుగోలు వ్యవహారం, పోలవరం రివర్స్‌ టెండర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటి లావాదేవీలపైనా ఐటి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

megha 13102019 3

మేఘా ఇంటి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్ తదితర వస్తువులను అధికారులు బయటకు తీసుకు వెళ్లారు. ఇక మరో పక్క, ఐటి సోదాల్లో హవాలా రూపంలో వచ్చిన డబ్బులతో లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తుండటంతో, రేపు ఈడీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో పక్క, ఈ ఐటి దాడులు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి ఇంటికి రావడం సంచలనంగా మారింది. మీడియాకు కనపడకుండా మంత్రి జాగ్రత్త పడినా, మీడియా కవర్ చేసింది. ఇక మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా, అక్కడే మకాం వేసారు. కృష్ణారెడ్డి ఇంటి పక్కనే మకాం వేసి, ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి, జరుగుతున్న విషయాల పై ఆరా తీసినట్లు తెలిసింది. మేఘా కృష్ణారెడ్డి ఇంటి వద్ద కేంద్ర బలగాలు మోహరించడం విశేషం. తెలంగాణా రాష్ట్ర పోలీసులను సైతం మేఘా ఇంట్లోకి అనుమతించలేదు.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ లో కొత్త వివాదం రేగింది. ఎస్వీబీసీ ఛానల్‌ ఛైర్మన్‌ గా ఉన్న పృధ్వీరాజ్ బాలిరెడ్డికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో తెలియకుండా విడుదల చెయ్యటం, అది ట్రోల్ కావటం ఇందుకు కారణమైంది. మొన్న జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలలోని చివరి ఘట్టంగా చక్రస్నానం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, పుష్కరిణిలో స్నానం చెయ్యటానికి, భక్తులు ఒకేసారి వచ్చి, అక్కడ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ఆ రోజు మొత్తం 24 గంటల వ్యవధిలో ఎప్పుడు స్నానం చేసినా స్వామి వారు అనుగ్రహిస్తారని, పుణ్యం వస్తుందని ఒక ప్రోమో చెయ్యాలని ఎస్వీబీసీ ఛానెల్ నిర్ణయం తీసుకుని. ఇందు కోసం వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే పెద్ద ఆక్టర్ కదా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని, ఎస్వీబీసీ చైర్మెన్ గా ఉన్న పృధ్వీరాజ్ బాలిరెడ్డి తానే స్వయంగా రంగంలోకి దిగి, ఆ వీడియో చెయ్యాలని నిర్నయం తీసుకున్నారు.

prudvhi 14102019 2

ఈ ప్రోమో కోసం, ప్రజలకు సమాచారం ఇవ్వటానికి, తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో పుష్కరిణి నుంచి రికార్డింగ్ మొదలు పెట్టారు పృథ్వి. అయితే వివిధ భాషల్లో మాట్లాడే సమయంలో, పృథ్వి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక సార్లు చెప్పాల్సి వచ్చింది. ఉచ్ఛారణలో పొరపాట్లు దొర్లాయి. కొద్దిగా కామెడీగా కూడా చూసిన వారికి అనిపించింది. ఇంత ఇబ్బంది పడే బదులు, భాష తెలిసిన వారితో చెప్పించవచ్చు కదా, ఇంత పబ్లిసిటీ పిచ్చి ఏంటి అని ప్రజలు అనుకున్నారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు, పృధ్వీ నటించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ సీన్ గుర్తుకువచ్చింది. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసి పృధ్వీరాజ్ బాలిరెడ్డిని నవ్వులపాలు చేశారని, ఇది కావాలనే చేసారని భావిస్తున్నారు.

prudvhi 14102019 3

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో పై పృధ్వీరాజ్ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన పై కావాలని కుట్ర చేస్తున్నారని, తనను నవ్వులు పాలు చేస్తున్నారని, ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఈ వీడియోని రికార్డు చేసిన తర్వాత వీడియోను ఓఎఫ్‌సీ ద్వారా స్టూడియోకు పంపించారు. ఆ సమయంలో లేదా ఎడిటింగ్‌ చేసేటప్పుడు వీడియో బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టిటిడిలోని, విజిలెన్స్‌ లేదా పోలీసుశాఖ పరిధిలోని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ వీడియోని లీక్ చేసిన లీకువీరులను గుర్తించాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే జరగబోయే ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పృధ్వీరాజ్ బాలిరెడ్డి కూడా విదేశాల్లో ఉన్నందున తిరిగి వచ్చిన తరువాత, ఈ విషయం పై చర్యలు తీసుకోనున్నారు.

Advertisements

Latest Articles

Most Read