మెఘా కృష్ణ రెడ్డి ఇంట్లో ఐదవ రోజు ఐటీ అధికారుల సోదాలు, విచారణ కొనసాగిస్తున్నారు. ఐదు రోజుల సెర్చ్ వారెంట్ తో వచ్చిన అధికారులు, తమ పని వేగం పెంచారు. ఇలాగే అయుదు రోజులు ఒకే చోట, ఒకే ఇంట్లో ఐటి సోదాలు, విచారణ జరగటం అనేది చాలా అరుదు. ఇక్కడే ఈ కేసు తీవ్రత ఏమిటో అర్ధమవుతుంది. ఈ సోదాల్లో, పలు కీలక డాక్యుమెంట్ లను స్వాదీనం చేసుకున్న అధికారులు, ఆర్ధిక లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. మేఘ కృష్ణా రెడ్డి నివాసంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ తో బాలానగర్ లోని వివిధ బ్యాంక్ లకు తరలించి అక్కడ లాకర్లు తనిఖీ చేసారు. మరో పక్క, ఈ రోజంతా మెఘా కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డిని వేర్వేరుగా విచారించటంతో పాటు, ఉమ్మడిగాను విచారించే అవకాశం కనపడుతోంది. గత నాలుగు రోజుల సోదాల ఆధారంగా ఈ విచారణ ఉండబోతుంది. ముఖ్యంగా మనీలాండరింగ్ జరిగిందని, ఐటీకి బలమైన సాక్ష్యాధారాలు దొరికినట్లు సమాచారం.

megha 15102019 2

ఇక మరో పక్క తెలంగాణా గవర్నర్ ఉన్నట్టు ఉండి ఢిల్లీ వెళ్ళటం ఆసక్తి రేపుతుంది. ఈ కేసులో పెద్ద తలకాయల ప్రమేయం బయట పడిందని, వారి అరెస్ట్ లు ఉంటాయనే ప్రచారం మధ్య, గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మెఘా అరెస్ట్‌ తో పాటు, పలువురు ప్రముఖులు కూడా అరెస్ట్ ఉంటుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో పరిస్థితుల పై కేంద్ర హోంశాఖ గవర్నర్‌ ని పిలిపించుకుని, ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్టీసీ స్ట్రైక్ విషయంలో, ఆమె ఢిల్లీ వెళ్ళారనే ప్రచారం ఉన్నా, అంతకు మించి ఏదో జరుగుతంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ రోజు మధ్యహ్నం 12గంటలకు డిల్లీ బయలుదేరనున్న గవర్నర్, మద్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో, 4గంటలకు బీజేపీ అద్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కాబోతున్నారు.

megha 15102019 3

నాలుగు రోజుల పాటు, సోదాలు, విచారణ జరిపిన ఐటి అధికారులు, నిన్న బ్యాంకులు, లాకర్లను కూడా తెరిపించటంతో, కీలక ఆధారాలు దొరికాయనే ప్రచారం జరుగుతుంది. బాలానగర్ ఆంధ్రబ్యాంక్ , బొల్లారంలోని ఐడీబీఐ బ్యాంక్, కోటాక్ బ్యాంకుల్లోని ఖాతాల వివరాల్ని సేకరించి, లాకర్లలో దొరికిన వివిద పత్రాలను విశ్లేషించే పనిలో ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో, మనీ లాండరింగ్ చుట్టూ తిరుగుతుందని, ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని, రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈడీ కూడా రంగంలోకి దిగితే, మరిన్ని కష్టాలు తప్పవు. ఇక మరో పక్క, మేఘా ఇంటి ముందు, కార్యాలయం ముందు ఉన్న మీడియా పై, మెఘా అనుచరులు, మీడియాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇక్కడ ఏమి షూట్ చెయ్యొద్దు అంటూ దౌర్జన్యం చేస్తున్నారు.

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, వైసిపీ, తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెడుతూ , రాజకీయ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 500 పైగా దాడులు చేసి, 8 మందిని చంపారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇదే విషయం పై చంద్రబాబు చలో పల్నాడు కూడా నిర్వహించారు. అయితే, పోలీసులు మాత్రం, ఇవన్నీ అబద్ధం, అంతా కంట్రోల్ లోనే ఉందని చెప్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం సానుభూతి పరులు కేసులు పెడుతుంటే, ఆ కేసులు తీసుకోకుండా, తిరిగి వారినే ఇబ్బంది పెడుతున్నారు. ఇవి ఒక్కటే కాదు, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా రాస్తే చాలు, కేసు పెట్టి, లోపల వేస్తున్నారు. ఇలా ఇవి ఒక్కటే కాదు, పొలాల్లో చెట్లు నరకటం, కాంట్రాక్టు ఉద్యోగాలు పీకియ్యటం, తెలుగుదేశం సానుభూతి పరులు రేషన్ డీలర్లుగా ఉంటే పీకించటం, రోడ్లు తవ్వేయటం, ఇళ్ళకు అడ్డంగా గోడలు కట్టటం, ఇలా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు.

nhrc 15102019 2

ఇదే విషయం పై చంద్రబాబు కూడా, అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి, తమ గోడు చెప్పుకున్నారు, పోలీసులను హెచ్చరించారు. అయినా మార్పు లేదు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పోలీసులే, తమకు అండగా నిలబడటం లేదని ఆరోపిస్తున్నారు. ఇలా అటు ప్రభుత్వ వేధింపులు, ఇటు రక్షించాల్సిన పోలీసులు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటంతో, తెలుగుదేశం పార్టీ న్యాయ పరంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ముందుగా, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలవాలని నిర్ణయం తీసుకుని, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. వారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరించారు.

nhrc 15102019 3

జాతీయ మానవ హక్కుల సంఘానికి 11 పేజీల లేఖ ఇచ్చారు. ఎన్ హెచ్ ఆర్సీని కలిసిన వారిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, సీతారామలక్ష్మిలు ఉన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని వారు ఫిర్యాదు చేశారు. మా మోర ఆలకించిన జాతీయ మానవ హక్కుల సంఘం, స్పెషల్ టీమ్స్ ని, ఆంధ్రపదేశ్ పంపి, నిజానిజాలు తెలుసుకుని, తగు చర్యలు తీసుకుంటామని, హామీ ఇచ్చారని, ఎంపీలు అన్నారు. తొందరలోనే, జాతీయ మానవ హక్కుల సంఘం టీమ్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన, మేము ఇచ్చిన ఫిర్యాదు పై, నిజ నిర్ధారణ చేస్తారని, తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. కమీషనర్ మేము చెప్పినవి అన్నీ విన్నారని, మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మొదటి సారి స్పందించారు. సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడటం తనను కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షలో మాట్లాడుతూ తెలంగాణాలో జరుగుతున్న కార్మికుల ఆత్మహత్యల పై స్పందించారు. బలవంతంగా చనిపోవటంతో సమస్యలు పరిష్కారం కావన్నారు, జీవితం ఎంతో విలువైనదని,బతికి సాధించాలే తప్ప బలవన్మరణం పరిష్కారం కాదని సూచించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి సాధించాలని చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను కోరారు. కార్మికులంతా సంయమనంతో ఉండాలని చంద్రబాబు అన్నారు. ఇక మరో పక్క ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా కూడా పోస్ట్ చేసారు.

cbn 14102019 2

"తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపంతో బలవన్మరణం చేసుకోవడం నా మనసును కలచివేసింది. జీవితం ఎంతో విలువైనది. దేన్నైనా బతికి సాధించాలి తప్ప బలవన్మరణం అనేది పరిష్కారం కాదు. కార్మికులందరూ మీ కుటుంబాల గురించి ఆలోచించి సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను." అని చంద్రబాబు ట్వీట్ చేసారు. ఇక మరో పక్క, తెలంగాణా ప్రభుత్వం మాత్రం సమ్మె పట్ల మొండి వైఖరి కొనసాగిస్తూనే ఉంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చర్చలు జరిపినట్టు వచ్చిన కథనాల పై తెలంగాణా సీఎంవో స్పందించింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో మేము ఎలాంటి చర్చలు జరపలేదని తేల్చి చెప్పింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని చెప్పింది.

cbn 14102019 3

గత పది రోజులగా తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. తమ ఉద్యోగాలు, భవిష్యత్తు పై నమ్మకం లేక, ప్రభుత్వ వైఖరికి విసుగు చెంది, ఇప్పటికి ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణం చేసుకున్నారు. కార్మికులు ఎంత ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోవడంతో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రోజు రోజుకీ పరిస్తితి అదుపు తప్పుతూ ఉండటంతో, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం మొండిగా, మేము చర్చించేది లేదు, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసాం అని చెప్తూ ఉండటం, ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విషయం పై, చంద్రబాబు తన స్పందన తెలియ చేస్తూ, ధైర్యంగా పోరాడాలని, బలిదానాలు వద్దని, ఆర్టీసీ కార్మికులను కోరారు.

తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. బోటు ప్రమాదం జరిగి సరిగ్గా నెల రోజులుకి, ఈ రోజు అదే తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం టూరిస్టు బస్సు లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మారేడుమల్లి-చింతూర్‌ ఘాట్‌ రోడ్డులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక పర్యాటక బస్సు ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో మొత్తం 20 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తుంది. 10 మంది అక్కడికక్కడే చనిపోగా, 5 గురుకి తీవ్ర గాయాలు అయ్యాయని, వీరి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తుంది. మిగతా వారికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప హాస్పిటల్ కు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

maredumalli 15102019 2

బస్సు మారేడమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది ? డ్రైవర్ నిర్లక్ష్యమా ? లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు అటవీ ప్రాంతంలో జరగటంతో, ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పర్యాటక బస్సు కావటంతో, బస్సులో ఉన్న వారు, ఇక్కడి వారానే, మన రాష్ట్రం వారా, పక్క రాష్ట్రం వారా అనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి వారి కుటుంబాలకు సమాచారం పంపిస్తున్నారు.

maredumalli 15102019 3

నెల రోజుల క్రిందటే, తూర్పు గోదావరిలో ఘోర బోటు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాదపుగా 73 మంది ఉన్న బోటు, గోదావరి నదిలో మునిగిపోయింది. 25 మంది వరకు కాపాడగా, 50 మంది వరకు చనిపోయారు. ఇప్పటికీ 11 మంది మృతదేహాలు బయటకు తియ్యలేదు. ఈ ప్రమాదం పై, తరువాత జరిగిన బోటు వెలికితీత పనుల పై, ప్రభుత్వం పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒక ప్రభుత్వ యంత్రంగా మొత్తం ఉన్నా, నదిలో ఉన్న బోటు బయటకు తీసి, వారి కుటుంబాలకు మృతదేహాలు కూడా ఇవ్వలేకపోయారు అనే విమర్శలు వచ్చాయి. మరో పక్క హర్ష కుమార్ లాంటి వాళ్ళు, కావాలనే బోటు బయటకు తియ్యటం లేదని, అక్రమాలు అన్నీ బయటకు వస్తాయని, బోటు బయటకు తియ్యకుండా నాటకాలు ఆడుతున్నారని, సుప్రీం కోర్ట్ లో కూడా కేసు వేసారు.

Advertisements

Latest Articles

Most Read