ప్రభుత్వానికి మచ్చ తెచ్చే కధనాలు రాస్తే, 24 గంటల్లో కోర్ట్ కు వెళ్ళండి, అంటూ మీడియాని, సోషల్ మీడియాని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది జగన్ ప్రభుత్వం. అంటే దీని ప్రకారం, ప్రభుత్వానికి భజన చేసే కధనాలే కాని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలు పై, ఎలాంటి కధనాలు రాయటానికి వీలు లేదు. అలా రాస్తే కేసులు పెట్టేస్తారు. అది ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా. ఇది అమలు లోకి వస్తే, ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేస్తున్నా చూస్తూ కుర్చువాలి. ఎందుకంటె, ఏ ప్రభుత్వం మేము తప్పు చేస్తున్నాం అని ఒప్పుకోదు. మీడియా వేసిన ప్రతి వ్యతిరేక కధనం పై కోర్ట్ కు వెళ్తుంది. ఇలాంటి జీవోనే నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఒకే చేసారు. పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో ప్రభుత్వ పరువుకి భంగం కలిగించే కద్భాలు రాస్తే, వాటి పై 24 గంటల్లోగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి అంట.

jagan 17102019 2

సంబధిత శాఖల అధికారులు, 24 గంటల్లో కేసు పెట్టాలని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా సంబంధిత కోర్టులో కేసులు వేయాలని సూచించారు. అయితే ఇదే జీవో 2007 ఫిబ్రవరి 20న అప్పట్లో రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే ఇది జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ విమర్శలకు వెనక్కు తగ్గింది. ఆ జీవో రద్దు చేస్తునట్టు అసెంబ్లీలో కూడా చెప్పారు. అయితే అప్పట్లో రద్దు చేసాం అని చెప్పిన జీవోని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ తేవటం చర్చనీయంసం అయ్యింది. తప్పుడు వార్తలు అయితే ఒక పధ్ధతి. నిరాధార, పరువుకు భంగం కలిగించే వార్తలు పై కూడా కేసులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం మాత్రం, అందిరకీ షాక్ కలిగించే అంశం.

jagan 17102019 3

అయితే మొన్నటి దాక, సాక్షి వేసిన కధనాలు అన్నీ ఇన్నీ కావు. మొన్నటి శేఖర్ రెడ్డి కధనాలే ఉదాహరణ. శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని ఊదరగొట్టి, ఇప్పుడు టిటిడి ఇచ్చారు అంటే, ఎలాంటి విషం సాక్షి చిమ్మిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం, ఇలాంటి జీవో ఇచ్చింది. అయితే, ఈ జీవో పై జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లు నుంచి విమర్శలు వస్తున్నాయి. "Andhra Pradesh CM @ysjagan trying to ‘muzzle’ media? " అంటూ టైమ్స్ నౌ ట్వీట్ చేసింది. "CM @ysjagan ’s attempt to ‘gag’ the media reminds me of the Emergency situation of 1975" అంటూ R. RAJAGOPALAN అనే సీనియర్ జర్నలిస్ట్ అన్నారు. "If this information of alleged media gag and punishing those who don't put out "reports favourable to govt" then it's a big setback to the reputation of @AndhraPradeshCM Stiffling media voice not in favour of a healthy democracy @ysjagan Garu" అంటూ మరో సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చని ఛానెల్స్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దాదపుగా నెల రోజులుకు పైగా, మన రాష్ట్రంలోని సిటి కేబుల్ తో పాటు, ప్రభుత్వానికి చెందిన ఏపి ఫైబర్ నెట్ లో, ఏబీఎన్ ఛానెల్ తో పాటుగా, టీవీ5 ఛానెల్ ప్రసారాలు కూడా ఆగిపోయాయి. అయితే దీని పై ప్రభుత్వం డైరెక్ట్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. పలానా కారణంతో ఆపమని ఆదేశాలు ఇచ్చామని చెప్పలేదు. ఈ అనధికార బ్యాన్ పై, ఏబీఎన్, టీవీ5 ట్రిబ్యునల్ కు వెళ్ళాయి. టెలికాం వివాదాలు పరిష్కరించే అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీశాట్) వద్ద, ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ, ఈ రెండు ఛానెల్స్ ఫిర్యాదు చేసాయి. అయితే ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. గతంలో జరిగిన విచారణలో టీడీశాట్‌ బాగా సీరియస్ అయిన విషయం తెలిసిందే. వెంటనే ఛానెల్స్ విడుదల చెయ్యాలని, అలా చెయ్యకపోతే, రోజుకు రెండు లక్షల ఫైన్ కట్టాల్సి ఉంటుందని, ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

ban 17102019 2

అయితే, ఈ రోజు మరోసారి ఈ కేసు టీడీశాట్‌ లో విచారణకు వచ్చింది. టీడీశాట్‌ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో, ఏపీ ఫైబర్‌ నెట్‌ కోర్టు ధిక్కారణకు పాల్పడిందని టీడీశాట్‌ నిర్ధారిణకు వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం బలే వింత వాదనతో ముందుకు వచ్చింది. ఈ రెండు ఛానెల్స్ మేము కావాలని ఆపలేడని, సాంకేతిక కారణంగానే ఛానల్‌ ప్రసారాలు నిలిచిపోయాయని ఏపీ ఫైబర్‌ నెట్‌ వివరణ ఇచ్చింది. ఈనెల 22 లోపు ప్రసారాలు పునరుద్ధరిస్తామని టీడీశాట్‌‌కు, ఏపి ఫైబర్ నెట్ తెలిపింది. అయితే, ఏబిఎన్ ఛానెల్ విషయంలో, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో, ఏపీ ఫైబర్‌ నెట్‌కు జరిమానా విధింపును 22న నిర్ణయిస్తామని టీడీశాట్‌ పేర్కొంటూ, తదుపరి విచారణను అక్టోబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.

ban 17102019 3

ఇక మరో పక్క, టీవీ5 విషయంలో, ఇప్పటికే ప్రభుత్వం పై ఫైన్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ నేటికి రూ.32 లక్షలు జమ చేయాల్సిందిగా టీడీశాట్‌, ఏపీ ఫైబర్‌ నెట్‌ కు చెప్పింది. అయితే ఈ జరిమానా పై, ఏపి ఫైబర్ నెట్ వివరణ ఇచ్చింది. ఇప్పటికే సంవత్సరానికి రూ.150 కోట్లు నష్టాల్లో ఉన్నామని ఏపీ ఫైబర్ నెట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. జరిమానా చెల్లింపులో కొంత ఇబ్బందులు ఉన్నాయంటూ తప్పించుకునేందుకు చేసిన యత్నాన్ని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఇక మరో పక్క, ఫైబర్‌ నెట్‌ చెబుతున్నట్టుగా సాంకేతిక సమస్య నిజమా కాదా అని..తేల్చడానికి టీడీశాట్‌ కమిటీని నియమించింది. ఈనెల 22 తర్వాత కూడా చానళ్ల పునరుద్ధరణ జరగకపోతే.. ఏపీ ఫైబర్‌ నెట్‌లో తనిఖీ చేయాలని కమిటీకి టీడీశాట్‌ చైర్మన్‌ ఆదేశించారు.

 

ఎవరి ప్రాధాన్యత ఏమిటి అని చెప్పే చక్కటి ఉదాహరణ ఇది. గతంలో పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఎలాగైనా పోలవరం పూర్తి చేసి, రాష్ట్రంలో ప్రతి మూలకు నీళ్ళు తీసుకువెళ్ళి, పోలవరం పూర్తీ చెయ్యాలని, ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్ వల్ల కాదని, కేంద్రంతో పోరాడి, నవయుగ కంపెనీని తీసుకువచ్చారు చంద్రబాబు. నవయుగ రావటంతోనే, పోలవరం పనులు పరుగులు పెట్టాయి. కాంక్రీట్ పనుల్లో చైనా రికార్డు ని కూడా తిరగరాసి, పోలవరం ప్రాజెక్ట్ ను గిన్నిస్ బుక్ లో ఎక్కించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది అనే నమ్మకం కలిగించారు. అసలు అవ్వదు ఎనుకున్న పోలవరం, 73 శాతం పూర్తయింది అంటే, చంద్రబాబు ఆనాడు, నవయుగని తీసుకు రావటమే కారణం. కేంద్రం కూడా నవయుగ స్పీడ్ ని మెచ్చుకుంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది.

navayuga 17102019 2

గత నాలుగు నెలలుగా, పోలవరం ప్రాజెక్ట్ లో ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు. పైగా చంద్రబాబు తీసుకొచ్చిన నవయుగ కంపెనీ మాకు వద్దు, వాళ్ళు అవినీతి చేసారు, మేము రివర్స్ టెండరింగ్ వేసి, నిజాయితీకి మారు పేరైన, మేఘా కంపెనీని తీసుకోవచ్చాం అని జగన్ ప్రభుత్వం చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాత్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఒప్పుకోలేదు. ఇది ఇలా సాగుతూ ఉండగానే, జగన్ ప్రభుత్వం తీసుకోచ్చిన, నిజాయతీకి మారు పేరైన మేఘా కంపెనీ పై, గత వారం రోజులుగా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇన్ని రోజుల పాటు, ఒక కంపెనీలో, ఒక ఇంట్లో ఐటి దాడులు జరుగుతున్నాయి అంటే, ఎన్ని లొసుగులు ఉండకపోతే జరుగుతాయి ?

navayuga 17102019 3

ఒక పక్క మేఘా పై ఐటి దాడులు జరుగుతుంటే, మరో పక్క ఇదే పోలవరం ప్రాజెక్ట్ సూపర్ స్పీడ్ లో చేసినందుకు, నిన్న నవయుగ కంపెనీకి ప్రతిష్టాత్మిక అవార్డు వచ్చింది. Construction World Global Awards-2019 ఇచ్చిన అవార్డుల్లో, బెస్ట్ కనస్ట్రక్షన్ కంపెనిగా, పోలవరం ప్రాజెక్ట్ కి గాను, నవయుగ కంపెనీ ఎంపిక అయ్యింది. ఈ అవార్డులు నిన్న ఢిల్లీలో ఇచ్చారు. నవయుగ ఎండీ శ్రీధర్, ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా, నవయుగ యాజమాన్యం, తన కార్మికులు అందరికీ ఈ అవార్డును అంకితం చేసింది. అయితే, ఎవరు ఎలా ఉన్నా, మన పోలవరం విషయంలో మాత్రం, ఇలా అవార్డులు వచ్చిన కంపెనీని కాదాని, వారం రోజులుగా ఐటి దాడులు చేస్తున్న కంపెనీకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో, ప్రజలే అర్ధం చేసుకోవాలి.

తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారి పై, జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వారిని వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూనే ఉంది, మరో పక్క ప్రతి రోజు ఇలాంటి ఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకుల పై ఏదో ఒక రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు తాజగా అనంతపురం మాజీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్‌ రెడ్డికి షాక్ ఇచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి దూకుడుగా జగన్ పై ఆరోపణలు చేస్తూ ఉంటారు. మా వాడు మా వాడు అంటూ, చురకలు అంటిస్తూ ఉంటారు. అయితే జేసీ మాటలకు జగన్ పార్టీ మాత్రం హర్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు అధికారంలోకి రావటంతో, జేసీ దివాకర్ రెడ్డి వ్యాపారాలను టార్గెట్ చేసారు. ముఖ్యంగా ఆయనకు ట్రావెల్స్ బస్సులు ఉండటంతో, వాటి పై ఫోకస్ చేసారు. నిన్న రవాణా శాఖ ఆధ్వర్యంలో, అనంతపురంలో ఒకేసారి బస్సుల పై రైడ్ చేసారు.

diwakar 17102019 2

అన్ని పత్రాలు అడిగి, ఏవైతే తేడా ఉన్నాయో, వాటి పై ఆక్షన్ తీసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయి అంటూ, 9 బస్సులను సీజ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకే బస్సులు సీజ్ చేసి, కేసులు పెట్టమని, విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు వెల్లడించారు. అయితే దివాకర్ ట్రావెల్స్ మాత్రం, ఈ చర్యను ఖండించింది. అన్ని అనుమతులు ఉన్నాయని, చట్ట పరంగా తేల్చుకుంటామని అంటుంది. 30 ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నామని, ప్రతిది పక్కగా చేసుకుంటున్నామని, మాకు ఈ వేధింపులు కొత్త కాదని, చట్ట పరంగా తేల్చుకుంటామని అంటున్నారు.

diwakar 17102019 3

అయితే దీనికి ఒక్క రోజు ముందే, దివాకర్ రెడ్డి జగన్ పై ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏపీలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వెనుక మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తంత్రం వుందని చెప్పారు. వైసీపీకి చెందిన అభ్యర్ధులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించలేదన్నారు. ఒక్కో అభ్యర్ధి వేలాది ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం వెనుక మోడీ తంత్రం ఉందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు మంచి వ్యూహాకర్తలుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ఇదే కోవలోకి వస్తారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో జగన్ గొప్ప ఏమి లేదని, అనుకుంటున్నానని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read