మా వంశం మాట తప్పదు, మడం తిప్పదు, మేము మాటంటే మాటే అని చెప్పే జగన్, ప్రతి రోజు ఏదో ఒక మాట తప్పుతూనే ఉన్నారు. మొన్నటి దాకా 85 లక్షల మందికి రైతు భరోసా అని చెప్పి, ఇప్పుడు కేవలం 40 లక్షల మందికే కుదించిన సంగతిలో విమర్శలు పాలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి, తాను చెప్పిన మాట తప్పారు జగన్. "ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లకూడదు" అని చెప్పిన జగన్, ఇప్పుడు మాట తప్పారు. ఇది వరకు పదే పదే చంద్రబాబు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళారని, విమర్శలు చేసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలుకే ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లారు. ఆర్భాటంగా ప్రకటించిన రైతు భరోసా పధకానికి డబ్బులు లేకపోవటంతో పటు ఇతర ఖర్చులకు, ఓడీకి వెళ్లి రూ.800 కోట్లు తెచ్చుకున్నారు. ఆర్థికంగా అత్యవసరమై, అష్టకష్టాలు పడుతూ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఓడీకి వెళతారు.

jagan 16102019 2

అయితే గతంలో చంద్రబాబు ఓడీకి వెళ్ళిన ప్రతిసారి, జగన్ మోహన్ రెడ్డి, ఆయన పత్రిక తీవ్ర విమర్శలు చేసే వారు. దీంతో అదే తను చేస్తే, తనకు ఇబ్బంది అవుతుందని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత, "ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లకూడదు" అని చెప్పారు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా పడిపోవటం, ఖర్చులు పెరిగిపోవటంతో, తప్పని పరిస్థితుల్లో, మాట తప్పి, మడం తిప్పల్సి వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా కోసం, డబ్బులు సర్దాల్సిన పరిస్థితి వచ్చింది. మంగళవారం రూ.800 కోట్లు ఆర్‌బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకుని తెచ్చారు. అలాగే, ఆర్‌బీఐలో బాండ్ల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్లు సాధించారు.

jagan 16102019 3

ఈ బండ్ల పై వడ్డీ 7.17 శాతం నమోదైంది. వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా రూ.1510 కోట్లు తెచ్చుకున్నారు. ఓవర్‌ డ్రాఫ్ట్‌ నిధులు రూ.800 కోట్లతో కలిపి మంగళవారం రైతు భరోసా కోసం ఆర్థిక శాఖ రూ.3000 కోట్లను ఆర్టీజీకి విడుదల చేశారు. మరో పక్క, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం, మన రాష్ట్రం రూ.32,000 కోట్ల రుణాలను తెచ్చుకోవచ్చు. 32 వేల కోట్లలో, రూ.29,000 కోట్ల సమీకరణకు కేంద్రం అనుమతించింది. అయితే ఇప్పటికే మన ప్రభుత్వం రూ.23 వేల కోట్ల అప్పు చేసింది. ఈ ఏడాదికి ఇంకా 6 వేల కోట్లు మాత్రమే ఉంది. మరో పక్క గత సంవత్సరంతో పోలిస్తే, ఆదాయం భారీగా తగ్గిపోయింది. దేశమంతా ఆర్ధిక సంక్షోభం ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం, ఇది ఇంకా కొంచెం ఎక్కువే ఉంది. ముఖ్యంగా ఇసుక లేకపోవటంతో, ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసిపీ వేధింపుల పై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల పై దాడులు చెయ్యటం, వేధించటం, పంటలు ధ్వంసం చెయ్యటం, ఇళ్ళల్లోకి వెళ్ళకుండా గోడలు కట్టటం, రోడ్లు తవ్వేయటం, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ లు చెయ్యటం, ఇలా అనేక విధాలుగా హింస పెడుతున్నారని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పుడు మరోసారి, మరో తెలుగుదేశం నేతకు, ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రెస్ మీట్ పెట్టి, ఏమైంది అని అడుగుతూ, కొన్ని సందేహాలు లేవనెత్తినందుకు, ఆయనకు నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరటం సంచలంగా మారింది. మాట్లాడితే కూడా నోటీస్ లు పంపిస్తాం అనే సంకేతం ఇస్తున్నారా అని టిడిపి ప్రశ్నిస్తుంది.

varla 16102019 2

సియం గారి బాబాయ్ అయిన వి--వే--కా--నంద రెడ్డి కేసు విషయంలో, వార్ల రామయ్య విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసారని చెప్తూ, ఆయనకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ నోటీసులు పంపింది. ఆయన ఈ కేసు పై చేసిన వ్యాఖ్యలతో, సాక్ష్యాలతో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలతో కేసు దర్యాప్తు పక్కదారిపట్టే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలుంటే తెలియజేస్తే ఆ మేరకు విచారణ చేస్తామని చెబుతూ సిట్‌ ఎదుట హాజరుకావాలని నోటీసు పంపారు. అయితే అసలు ఈ కేసు మొదలైందే వైసిపీ నేతలు, సాక్షి టీవీ తప్పుదోవ పట్టించి, గుండె నొప్పితో పోయారు అని చిత్రీకరించటం పై అని, ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలి కాని, ప్రశ్నించిన ప్రతిపక్షం పై, ఈ దౌర్జన్యం ఏంటని టిడిపి ఆరోపిస్తుంది.

varla 16102019 3

"ఒక సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుని మరణం పి నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వర్ల రామయ్య ప్రశ్నిస్తే తప్పేంటి.? విచారణపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాద్యత దర్యాప్తు చేస్తున్న సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ఈ విషయంలో పోలీసుల సంక్షేమం కోసం మాత్రమే ఏర్పాటైన పోలీసు అధికారుల సంఘం స్పందించాల్సిన అవసరం ఏమిటి.? పోలీసు అధికారుల సంఘం ఏర్పడింది పోలీసుల కోసమా.. లేక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా వ్యవహరించడం కోసమా.? ఈ వ్యవహారంలో పోలీసు అధికారుల సంఘం ఎందుకు అత్యుత్సాహం చూపిస్తోంది.? వర్ల రామయ్యపై అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. నోటీసులు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి " అని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు.

ఇప్పటికే కరెంటు కూతలతో సతమవుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో, విద్యుత్ పీపీఏల విషయంలో, కేంద్రంతో గొడవ పెట్టుకున్న సందర్భంలో, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో, రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వివిధ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ, వాటికి చెల్లింపులు చెల్లించకుండా, వందల కోట్లుకు బాకాయి పెడుతున్న ప్రభుత్వానికి, కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి డబ్బులు చెల్లిస్తాం అని లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే, విద్యుత్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది వరుకే ఈ ఆదేశాలు ఇవ్వటంతో, దాదాపు వారం పాటు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజగా సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు కూడా ముందస్తు చెల్లింపులకు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వాలని, కేంద్రం ఆదేశించింది. రెండు రోజుల్లో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.

jagan 15102019 2

లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వని సందర్భంలో, జాతీయ విద్యుత్‌ ఎక్స్ఛేంజ్‌ నుంచి బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేయకుండా, ఎక్స్ఛేంజ్‌లో రాష్ట్రంపై నిషేధం విధించే పరిస్థితి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేసిన కంపెనీల దగ్గర నుంచి, విద్యుత్ తీసుకుని, డబ్బులు చెల్లించక పోవటంతో, బకాయిలు పేరుకుపోవడంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు కంపల్సరీ అవ్వటంతో, ముందుగా ఎన్‌టీపీసీకి సంబంధించిన విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం లెటర్ అఫ్ క్రెడిట్ ఇవ్వటం మొదలుపెట్టింది. దీనికి నెలకు సుమారుగా రూ.550 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే ఒక ప్రైవేటు ప్రైవేటు థర్మల్‌ విద్యుత్‌ కంపెనీ దీని పై ఎక్స్ఛేంజ్‌లో రాష్ట్రం పై ఫిర్యాదు చేసింది. దీంతో వారికి కూడా ఎల్‌సీ జారీ చేసారు.

jagan 15102019 3

అయితే ఇప్పుడు సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు ముందస్తు ఎల్‌సీ ఇవ్వాలంటే, ఇప్పుడు మరో 500 కోట్లు దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంత ఇవ్వాలి అంటే ఏమి చెయ్యాలో అని రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తిపోతుంది. దీంతో చీఫ్ సెక్రటరీ వివిధ శాఖలతో సమీక్ష జరిపి, వివిధ శాఖల నుంచి విద్యుత్‌శాఖకు రావాల్సిన పెండింగ్ బిల్లుల పై చర్చించారు. రూ.6 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, జలవనరులశాఖ నుంచే రూ.2 వేల కోట్ల రావాల్సి ఉందని, పెండింగ్ చెల్లింపులు జరపాలని ఆర్ధికశాఖ అధికారులకు సీఎస్ ఆదేశించారు. అయితే అంత డబ్బులు ఇప్పటికిప్పుడు కుదరదు అని చెప్తున్నారు. మరో పక్క, కేంద్రం నిర్ణయం పై, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ కి వెళ్ళింది.సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు ఎల్‌వోసీ ఇవ్వాలన్న ఆదేశాల పై హైకోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ వేసింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎల్‌ఓసీలు సాధ్యంకాదని, కేంద్రం ఉత్తర్వులు రద్దు చెయ్యాలని కోరింది. కేంద్ర ఆదేశాల పై, మూడు వారాలపాటు హైకోర్టు స్టే విధించి, వచ్చే నెల 5కి కేసు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు రోజు రోజుకీ దూరం అవుతున్నాయి. మొన్నటి దాక, మేము తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పిన జగన్, విజయసాయి రెడ్డికి, కేంద్రం నుంచి జర్క్ లు మీద జర్క్ లు వస్తున్నాయి. ముఖ్యంగా పోలవరం, విద్యుత్ పీపీఏల విషయంలో, జగన్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా చంద్రబాబు అవినీతి నిరూపించాలని, విద్యుత్ పీపీఏ ల విషయంలో వేలు పెట్టి, కేంద్రం ఆగ్రహానికి గురయ్యారు. ఒక పక్క కోర్ట్ లు కూడా మొట్టికయాలు వేసాయి. ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి జర్క్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోలు చేసి, వారికి డబ్బులు ఇవ్వకుండా, బకయాలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, షాక్ ఇస్తూ, సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు కూడా లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే ఎక్స్చేంజి నుంచి విద్యుత్ తీసుకునే అవకాసం ఉందని చెప్పారు. ఇది మన ఒక్క రాష్ట్రానికే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది. అయితే మన రాష్ట్రానికి మాత్రం ఇది చాలా కష్టమైన పని.

supreme 16102019 2

ఇప్పటికే ఆర్ధిక పరిస్థితి దారుణం అయిపొయింది. నాలుగు నెలల నుంచి ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఈ పరిస్థితిలో నెల నెలా డబ్బులు ఇచ్చి కొనాలి అంటే, 1500 కోట్లు దాకా అవుతుంది. ఇప్పటి దాకా అవి బకాయలు పెట్టి, ఎప్పుడో ఇచ్చేవారు. ఇప్పుడు అది కుదరదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్ పెట్టటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే ప్రధాని స్థాయిలో మాట్లాడుకుని, వెసులుబాటు తెచ్చుకోవటం పెద్ద ఇబ్బంది కాదు. కాని, ప్రస్తుతం, జగన్ వైఖరితో, బీజేపీ కోపంగా ఉందని, అక్కడకు వెళ్లి అడిగినా, ఏమి జరగదని, చివరకు స్టీఫెన్ రవీంద్ర , శ్రీలక్ష్మిని కూడా డిప్యుటేషన్ పై తెచ్చుకునే పలుకుబడి లేదని, అంటున్నారు. ఈ నేపధ్యంలో, ఇక గత్యంతరం లేక, హైకోర్ట్ లో కేంద్రం పై కేసు వేసారు. దీంతో హైకోర్ట్ మూడు వారాల పాటు, కేంద్ర నిర్ణయం పై స్టే ఇచ్చింది. అయితే, ఈ విషయం పై కేంద్రం కూడా అంతే ధీటుగా రియాక్ట్ అవ్వటానికి సిద్ధమైంది.

supreme 16102019 3

ఇది అన్ని రాష్ట్రాలకు వర్తింపు అయ్యే పాలసీ అని, ఏపి ప్రభుత్వం స్తే తెచ్చుకుంటే, మిగతా రాష్ట్రాలకు కూడా అదే వర్తిస్తుందని, ఇది విద్యుత్ రంగానికే ప్రమాదం అని, హైకోర్ట్ ఉత్తర్వుల పై, సుప్రీం కోర్ట్ కు వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ వైఖరితో, రాష్ట్ర ప్రభుత్వం పై, కేంద్రం మరింత కఠిన వైఖరి అవలంబించడానికి ఇది దోహదం చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. విద్యుత్ కొనుక్కుని, వెంటనే డబ్బులు ఇవ్వమనటం తప్పేమి కాదని, అది వారి హక్కు అని, రాష్ట్రానికి ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు. మరో పక్క తెలంగాణాకు మాత్రం, ఈ ఇబ్బంది లేదు. తమకు సరిపడినంత విద్యుత్‌ ఉందని, ఎక్స్ఛేంజిలో కొనాల్సిన అవసరం లేదని, అందుకే లెటర్ అఫ్ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణా ప్రభుత్వం భావిస్తుంది. కాని ఏపి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్స్ఛేంజి నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయకపోతే తీవ్రమైన కోతలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి మాత్రం హైకోర్ట్ ఉత్తర్వులతో, ఊరట లభించింది.

Advertisements

Latest Articles

Most Read